ఓం
శ్రీరామమందిరము ప్రారంభమవుతోంది.
సీతారాములకు వందనములు.
ఈ శుభ సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు.
శ్రీరామమందిరం కొరకు ఎందరో కలలు కన్నారు. ఎందరో ఎన్నో త్యాగాలు చేసారు. కష్టాలు అనుభవించారు.
దైవం దయవల్ల కల నిజమయ్యింది.
లోకం అంతా సుఖసంతోషాలతో ఉండాలి.
........................
ఈ క్రింద విషయాలను కొంతకాలం తరువాత వేరే పోస్ట్ నుంచి తీసి, ఇక్కడ ప్రచురించటం జరిగింది.
నాకు వచ్చిన మరికొన్ని ఆలోచనలు.......
మరికొన్ని విషయాలు..
సమాజంలో, గొడవలు..నేరాలు..ఘోరాలు ఎక్కువయ్యాయి. సమాజంలో కొందరు మనుషులు విపరీతంగా ప్రవర్తిస్తున్నారు.
ఇప్పడు ప్రపంచంలో మనుషులు ఎన్నో పాపాలు చేస్తున్నారు.
మతం పేరుతో కూడా కొందరు హింస చేయటం, మూఢనమ్మకాలు ఎక్కువయ్యాయి.
కొన్ని విషయాలను, సంఘటనలను గమనిస్తే, ఏది ఎందుకు జరుగుతుందో అర్ధం కావటం లేదు.
ప్రపంచంలో జరుగుతున్న ఉపద్రవాలు, ప్రకృతి విపత్తులు తగ్గాలంటే, మనుషులు పాపాలు చేయటం.. సాటిజీవులను హింసించటం వంటివి మానాలి.
అంతా మంచిగా ఉండాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను. దైవమే దిక్కు.
..........
దైవము జీవులకు అవసరమైనవి ఎన్నో ఇస్తున్నారు. జీవులకు అవసరమైన..గాలి, నీరు, ఆహారానికి ఎన్నో మొక్కలు..ఇలా ఎన్నో ఉన్నాయి. ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలు కూడా ఉన్నాయి.
దైవ సృష్టిలో ఎన్నో అద్భుతమైనవి ఉన్నాయి. ఉదా.. ఆహారం దానికి అదే అరగటం, శ్వాస తీసుకోవటం ఎలా ఎన్నో ఉన్నాయి.
దైవానికి అనేక కృతజ్ఞతలు.
మనుషులు కొందరు తమ స్వార్ధం, అత్యాశ..వంటి గుణాలతో ప్రపంచంలో బాధలకు కారణమవుతున్నారు. మనుషులు మంచిగా ప్రవర్తిస్తే బాగుంటుంది.
********************
మన గతజన్మలలో ఉన్నవాటి గురించి ఇప్పుడు కూడా తెలిస్తే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది కొన్నిసార్లు. గతజన్మలలో మనకు తెలిసినవి ఏమైనా ఇప్పుడు కూడా ఉంటే బాగుండనిపిస్తుంది.
గతజన్మలలో మనతో ఉన్న వారు ఇప్పుడు మనతో ఉండవచ్చు..లేకపోవచ్చు. ఇప్పుడు ఉన్నా కూడా మనము వారిని గుర్తించలేకపోవచ్చు. అయితే, దైవము ఎప్పుడూ ఉంటారు..సూర్యుడు, చంద్రుడు, భూమి..గతజన్మలలో కూడా మనతో ఉన్నారు.
గత
జన్మలలో మనతో ఉన్న అప్పటి సూర్యుడు, చంద్రుడు, భూమి..ఇప్పుడు కూడా
ఉన్నారు. మనము వాటిని గుర్తించగలము. ఇది ఎంతో ఆశ్చర్యకరము, ఆనందకరమైన
విషయము.
దైవము జీవులకు జన్మజన్మల బంధువు, శాశ్వతమైన వారు.