సోషల్మీడియాలో కొందరు రకరకాలవిషయాలను చెబుతూ అవన్నీ పాటించకపోతే కష్టాలొస్తాయంటూ చెబుతున్నారు.
సమాజం సరిగ్గా నడవాలంటే ఎన్నో వృత్తులు అవసరం. అందరూ పనిచేస్తేనే సమాజం సరిగ్గా నడుస్తుంది. కుటుంబంలో స్త్రీలుపురుషులు తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తిస్తేనే కుటుంబవ్యవస్థ బాగుంటుంది.
ఉదయాన్నే చద్దన్నం తిని పొలానికి వెళ్ళే రైతులు చాలా నియమాలను పాటించలేరు.
కుటుంబానికి దూరంగా మంచుకొండలలో ప్రాణాలకు తెగించి శత్రువులతో పోరాడే సైనికులు ఉపవాసాలు వంటి అనేక నియమాలను పాటించలేరు.
ఎవ్వరైనా అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండటం ఆరోగ్యానికి మంచిదే కానీ, ఎప్పుడూ ఏదో ఒక విశేషం అంటూ అస్తమానం ఉపవాసాలు ఉంటే నీరసం వస్తుంది, అనారోగ్యం వచ్చే అవకాశముంది.
కొన్ని వృత్తుల వారు పెద్దగా పూజలు చేయకపోయినా, వారి పనులను వారు చక్కగా చేస్తే చాలు పుణ్యం లభిస్తుందని ప్రాచీనులు తెలియజేసారు. అందరూ పనులన్నీ ఆపేసి ఉపవాసాలు ఉంటూ కూర్చుని తపస్సు చేస్తూ ఉండమని ప్రాచీనులు చెప్పలేదు.
అందరూ అన్నీ పనులు మాని విరక్తులైతే సమాజం ఏమవుతుంది. చెడ్డవారైన శత్రువుల చేతిలోకి పోతుంది. అలా జరగకుండా ఉండాలంటే, మంచివారు తమ బాధ్యతలను తాము నిర్వర్తించాలి.
శ్రీకృష్ణులవారు యుద్ధరంగంలో అర్జునునితో ..అప్పుడు యుద్ధం చేయడము అర్జునుని కర్తవ్యమని బోధించారు..ఇంకా ఎన్నో విషయములను కూడా బోధించారు.
జీవితంలో మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ కూడా దైవాన్ని స్మరించుకోవచ్చు..ఎవరైనా ఒకదగ్గర కూర్చుని పూజ చేయవచ్చు.. ఇంకా, ధర్మబద్ధంగా తమ బాధ్యతలను నిర్వర్తించటం కూడా పూజయే.
జీవితంలో ఏ పని చేయాలన్నా అనేక సందేహాలతో అనేకనియమాలు ముందుకాళ్ళకు బంధాలుగా తయారయ్యాయి. ఇలాంటి పరిస్థితి వల్ల ప్రజలు నిరాశావాదులుగా, నిస్తేజంగా తయారవుతారు. విసుగుతో నియమాలను పాటించడమూ మానేస్తారు.
సోషల్మీడియాలో ఏదో ఒకటి చెప్పాలని కొందరు.. ప్రతిదీ అలా చేయకూడదు, ఇలా చేయాలి..అంటూ చెపుతూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు.
కలికాలంలో ప్రజలు శారీరికంగా, మానసికంగా బలహీనంగా ఉంటారని తెలిసిన ప్రాచీనులు, కలికాలంలో సులభంగా పూజ దైవస్మరణ చేసినా చాలని తెలియజేసారు.
అయితే, కొందరు అనేక పూజలు, అనేక నియమాల గురించి చెబుతూ అందరూ అలా పాటించాలని ..పాటించకపోతే కష్టాలు వస్తాయని చెబుతూ భయపెడుతున్నారు. ఇలా చేయటం ప్రాచీనులు తెలియజేసినవాటికి విరుద్ధం.
సనాతనధర్మం మూఢాచారాలను పాటించమని చెప్పలేదు. కొందరు ప్రజలే వాటిని ప్రవేశపెట్టారు. ఇలా అతిగా చేయటం సరైనది కాదు. పాతకాలంలో హిందువులలోనే కొందరు తమలో తాము గొడవలు పడ్దారు.వైష్ణవులు శైవులు అని కూడా గొడవలు జరిగాయి.
కొన్నిమూఢాచారాల వల్ల ఎందరో ఇబ్బందులుపడ్దారు. ఏ కర్మల ఫలితమో కానీ, కారణాలేమైనా భారతదేశం చాలా సంవత్సరాలు విదేశీదాడుల వల్ల బాధలు పడింది.
అయితే, అనేకమంది పుణ్యాత్ముల ధర్మనిరతి వల్ల, పూజలు.. దైవం దయవల్ల అనేకదాడుల తరువాత కూడా భారతదేశం ఇంకా నిలబడింది. ఇప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి. ఇప్పటికైనా మనం కొన్ని విషయాలలో సరిదిద్దుకుంటే మంచిది.
సనాతనధర్మంలో చక్కటి జీవన విధానాన్ని తెలియజేసారు. చతురాశ్రమ ధర్మాలను, ఇంకా ఎన్నో గొప్ప విషయాల గురించి తెలియజేసారు. అయితే, కాలక్రమేణా గ్రంధాలలో ఎన్నో ప్రక్షిప్తాలు ప్రవేశించాయి. అందువల్ల, మూఢత్వంతో కాకుండా విచక్షణతో, ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి.
వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే , దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్దిస్తున్నాను.
........................
కొంతకాలం క్రితం వరకూ నాకు తెలిసినంతలో శూద్రులు కొన్ని వర్గాల వారు దైవాన్ని సులభంగా కొన్ని నియమాలతో హాయిగా ఆరాధించుకునేవారు.
ఇప్పుడేమో సోషల్మీడియా ద్వారా చాలా వింటుంటే.. చాలా సందేహాలు కలుగుతున్నాయి.
కొన్ని వర్గాలవారు(udaa..శూద్రులు) బోలెడు పూజలు చేయకున్నా, కొన్ని పూజలు చేసుకుని స్వధర్మాన్ని చక్కగా ఆచరిస్తే చాలు బోలెడు పూజలు చేసిన ఫలితం వస్తుందని ప్రాచీనులు తెలియజేసారు.
అయితే కొందరు శూద్రులు మేమెందుకు బోలెడు పూజలు చేయకూడదంటూ అవన్నీ మొదలుపెట్టారు. సులభమైన వెసులుబాటు ఉండగా కఠినమైన మార్గాలు పట్టుకోవటం ఎందుకు?
అయితే కొందరు శూద్రులు మేమెందుకు బోలెడు పూజలు చేయకూడదంటూ అవన్నీ మొదలుపెట్టారు. సులభమైన వెసులుబాటు ఉండగా కఠినమైన మార్గాలు పట్టుకోవటం ఎందుకు?
కొందరు బ్రాహ్మణులు కూడా అన్ని వర్గాలవారు అన్ని పూజలు చేయవచ్చంటూ చెప్పటం మొదలెట్టారు.
కలికాలంలో దైవనామస్మరణ చేసినా తరించవచ్చని ప్రాచీనులు చెప్పినఫ్పుడు వారి మాటల పట్ల నమ్మకం ఉండాలి కదా..తాము నమ్మే దైవస్మరణ..దైవనామ స్మరణ ఎంతో గొప్పదని నమ్మకం ఉంచాలికదా..
కలికాలంలో దైవనామస్మరణ చేసినా తరించవచ్చని ప్రాచీనులు చెప్పినఫ్పుడు వారి మాటల పట్ల నమ్మకం ఉండాలి కదా..తాము నమ్మే దైవస్మరణ..దైవనామ స్మరణ ఎంతో గొప్పదని నమ్మకం ఉంచాలికదా..
అవన్నీ వద్దని కఠినమైన శ్లోకాలు, మంత్రాలు పట్టుకుని అవే చదవాలని తాపత్రయం ఎందుకు? సులభమైన మార్గాలను వదిలి కఠినమైన మార్గాలు కావాలని కష్టాలు పడటం ఎందుకు?
సంస్కృతంలో ఒక్క అక్షరం తప్పు చదివినా అర్ధాలు మారిపోయి, వేరే అర్ధం వచ్చే పరిస్థితి ఉంటుందట. అలా వచ్చీరాక చదివి కష్టాలు కొని తెచ్చుకోవటం ఎందుకు? హాయిగా దైవస్మరణ, దైవనామస్మరణ, భజనలు, భక్తిగీతాలు తో తరించవచ్చు కదా.
బ్రాహ్మణులు కొందరు కొన్ని సంవత్సరాలు కఠినమైన నియమాలను పాటిస్తూ వేదములు మొదలైన వాటిని నేర్చుకుంటారు. ప్రత్యేకమైన పూజలు చేయించుకోవాలంటే, అలాంటి వారిని పిలచి పూజలు చేయించుకోవచ్చు.
సంస్కృతంలో ఒక్క అక్షరం తప్పు చదివినా అర్ధాలు మారిపోయి, వేరే అర్ధం వచ్చే పరిస్థితి ఉంటుందట. అలా వచ్చీరాక చదివి కష్టాలు కొని తెచ్చుకోవటం ఎందుకు? హాయిగా దైవస్మరణ, దైవనామస్మరణ, భజనలు, భక్తిగీతాలు తో తరించవచ్చు కదా.
బ్రాహ్మణులు కొందరు కొన్ని సంవత్సరాలు కఠినమైన నియమాలను పాటిస్తూ వేదములు మొదలైన వాటిని నేర్చుకుంటారు. ప్రత్యేకమైన పూజలు చేయించుకోవాలంటే, అలాంటి వారిని పిలచి పూజలు చేయించుకోవచ్చు.
అంతేకానీ, రకరకాల పూజలలో పొరపాట్లు చేసి కష్టాలు తెచ్చుకోకుంటే మంచిది.
**********
దళితులను అణచివేసారని, అందువల్లే వారు మతాన్ని మారుతున్నారని కొందరు అంటున్నారు. మరి అగ్రవర్ణాలుగా చెప్పబడేవారిలో కూడా కొందరు ఎందుకు మతాన్ని మారుతున్నారు? ఇలా ఎందుకు జరుగుతోందని అందరూ ఆలోచించాలి. ఇందుకు అనేక కారణాలుంటాయి.
ఒక కారణం ఏమిటంటే, హిందువులకు ఆచారవ్యవహారాల పేరుతో అనేక నియమాలు ఎక్కువయ్యాయి. వందలనియమాలు చెబుతారు. శుక్ర, మంగళవారాల్లో గోళ్ళు తియ్యకూడదు, బూజు దులపకూడదు, ఇంకా ప్రతిదానికి ఎన్నో నియమాలు చెబుతారు.
ఒక కారణం ఏమిటంటే, హిందువులకు ఆచారవ్యవహారాల పేరుతో అనేక నియమాలు ఎక్కువయ్యాయి. వందలనియమాలు చెబుతారు. శుక్ర, మంగళవారాల్లో గోళ్ళు తియ్యకూడదు, బూజు దులపకూడదు, ఇంకా ప్రతిదానికి ఎన్నో నియమాలు చెబుతారు.
మన పరిసరాలు శుచిగా.. శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పాలి. రోడ్లకు ఇరువైపులా చక్కగా మొక్కలను, చెట్లను పెంచాలి.ఇప్పుడు మన డేశంలో చాలామంది జనం చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేస్తున్నారు. చాలా చోట్ల వీధులు(రోడ్లు) మురికిగా అసహ్యంగా ఉన్నాయి. ప్రజలు శుచి..శుభ్రతను పాటించాలి. శుచి..శుభ్రత ఉన్న చోట లక్ష్మిదేవి నివాసం ఉంటారని గ్రంధాల ద్వారా తెలుస్తోంది.
స్థానికంగా
ఉన్న పండుగలతో పాటు, ఇతర రాష్ట్రాల పండుగల గురించి కూడా చెబుతున్నారు.
స్థానికంగా ఉండేవాటిని సరిగ్గా పాటించటమే గొప్ప, ఇక చాలా పాటించాలంటే?
ఈ రోజుల్లో పండుగంటే..
ఇల్లు శుభ్రం చేసుకోవటం, పూజకు అవసరమైనవి తెచ్చుకుని సర్దుకోవటం, అశుచి లేకుండా
జాగ్రత్తగా వంటలు చేయటం, అంటుముట్టు వస్తుందో? అని భయపడటం, తప్పుల్లేకుండా
విధివిధానాలు పాటించటం గురించి టెన్షన్ పడటం, ఫలానా సమయానికి ముందు లేక
తరువాత పూజ చేసేయటం ( అలా చేయలేకపోతే సరైన ఫలితం వస్తుందో రాదో?) ఇలా
ఉంటుంది. ఇక, చక్కగా దైవస్మరణ ఏముంటుంది? ఇంకా చాలా విషయాలున్నాయి.అవన్నీ
వ్రాయలేదు.
టెన్షన్
వల్ల కొన్నిసార్లు వంటల్లో ఉప్పు వేశామో..లేదో? గుర్తుండదు. దైవానికి
నివేదన చేసే వాటిని ముందు రుచి చూడకూడదంటారు. దైవానికి నివేదించేటప్పుడు
కొంత ఉప్పును చిన్న బౌల్ లో వేసి పక్కన పెట్టవచ్చు. ఇది చదివి, అలా ఉప్పు
పక్కన పెట్టకూడదని
ఎవరైనా చెబుతారేమో? గారెలు వంటి వాటి విషయంలో ఉప్పు కలుపకపోతే ఏం చేయలేం.
పండుగలు లేనప్పుడే పని తగ్గి, కొంత ప్రశాంతంగా దైవస్మరణకు వీలుంటుంది
..అనిపిస్తుంది.
భక్తిఉన్నాకూడా, చాలా విషయాలు ఆచరించాలంటే అందరూ చేయలేరు. పండుగల్లో తప్పులు రాకుండా పనులు చేయటం గురించి టెన్షన్ ఉంటుంది.
అందరూ అన్నీ పాటించలేరు. ఎవరి శక్తి వారిది. కలికాలంలో చాలామందికి శారీరికంగా, మానసికంగా ఎక్కువశక్తి ఉండదని గ్రహించి, దైవస్మరణ.. దైవనామస్మరణ..చేసినాకూడా తరించుతారని ప్రాచీనులే తెలియజేసారు.
పూజల గురించి చెప్పవచ్చు. ఎవరి శక్తిని బట్టి వారు పాటిస్తారు. బ్రాహ్మణులులా శూద్రులు కూడా పాటించాలని లేదు కదా..
అందరూ అన్నీ పాటించలేరు. ఎవరి శక్తి వారిది. కలికాలంలో చాలామందికి శారీరికంగా, మానసికంగా ఎక్కువశక్తి ఉండదని గ్రహించి, దైవస్మరణ.. దైవనామస్మరణ..చేసినాకూడా తరించుతారని ప్రాచీనులే తెలియజేసారు.
పూజల గురించి చెప్పవచ్చు. ఎవరి శక్తిని బట్టి వారు పాటిస్తారు. బ్రాహ్మణులులా శూద్రులు కూడా పాటించాలని లేదు కదా..
శూద్రులు కూడా ఉల్లి, వెల్లుల్లి తినకూడదన్నట్లు చెబుతున్నారు. ఇలాంటప్పుడు ఇళ్లలో గొడవలు వస్తాయి. క్షత్రియులు మాంసాహారాన్ని తినొచ్చని తింటున్నారు. క్షత్రియులు కూడా ..గాయత్రిని ఆచరిస్తారు. గాయత్రిని ఆచరించేవారు మాంసాహారాన్ని తినొచ్చా? మరి, శూద్రులు ఉల్లివెల్లుల్లి తినకూడదా?
శూద్రులకు
అవి పాటించండి, ఇవి పాటించండి అని చెప్పటం ఎలాఉన్నా, అగ్రవర్ణాల వారు గాయత్రిని
ముప్పొద్దులా చక్కగా ఆచరించాలని చెప్పాలి.
...........................
ఈ రోజుల్లో సాంప్రదాయ కుటుంబాలకు చెందిన వారు కొందరు విదేశాలకు వెళ్తున్నారు, అలాంటి కుటుంబానికి చెందిన వారు మద్యాన్ని తీసుకోవటం గురించి విన్నాను....ఇలాంటి పరిస్థితి బాధాకరం.
భారతదేశంలో కూడా, సాంప్రదాయ కుటుంబాలకు చెందిన కొందరు మద్యాన్ని, మాంసాహారాన్నితీసుకోవటం గురించి విన్నాను....ఇలాంటి పరిస్థితి బాధాకరం.
.......................
ఈ రోజుల్లో కొందరు బ్రాహ్మణ అమ్మాయిలు పురోహితులుగా ఉన్న అబ్బాయిలను వివాహం చేసుకోవటానికి ఇష్టపడటం లేదని అంటున్నారు.చాలా ఆచారవ్యవహారాలను పాటించలేం అంటున్నారట.
కొందరు ఇతరకులాల అమ్మాయిలు కూడా వ్యవసాయం చేసే అబ్బాయిలను
వివాహం చేసుకోవటానికి ఇష్టపడటం లేదట. సిటీలో ఉండి ఉద్యోగం చేసేవాళ్ళనే
చేసుకుంటారట.
........................
విధివిధానాలంటూ అతిగా పెంచుతుంటే ఎవరికైనా విసుగు వస్తుంది. కలికాలంలో వందల విధానాలు పాటించలేక పెద్దవాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది. పిల్లల వివాహాలు చేయాలంటే, జాతకాలు కలవాలంటే బోలెడు చూడాలి. అలా కొన్నిసార్లు నచ్చిన సంబంధాలు కూడా వదులుకోవలసి వస్తుంది. గ్రంధాలలో తరతరాలుగా కొన్ని ప్రక్షిప్తాలు చేసారు. అందువల్ల ఆలోచించి పాటించాలి.
వ్యవసాయం చేసేవారు రసాయనాలు వాడకుండా, ఆవులను పెంచి పేడతో సేంద్రియ ఎరువులను వాడాలి. రసాయనాల పంటలను తినే ప్రజలకు అనారోగ్యం వచ్చే ప్రమాదముంది. రైతులకు దళారుల వల్ల ఇబ్బందులుంటే రైతులు అందరూ కలసి, తమ సమస్యల గురించి ప్రభుత్వంతో మాట్లాడాలి. ఇదంతా తేలిక కాదుకాని, ఐకమత్యంగా ఉంటే చాలా లాభాలున్నాయి.
ఐటీ రంగాల వారికి బోలెడు డబ్బు వస్తూ జీవితం గొప్పగా కనిపించినా, వారి సమస్యలు వారికున్నాయి. చాలా గంటలు కంప్యూటర్ ముందు కీబోర్డు నొక్కుతూ పనిచేయటం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముంది. వాళ్లకు ఎప్పుడు ఉద్యోగం పోతుందో? అనే పరిస్థితి కూడా ఉంది.
ఈ రోజుల్లో చాలా ఉద్యోగాల్లో కూడా కంప్యూటర్లు వాడుతున్నారు. చాలామంది సెల్ఫోన్లను
అదేపనిగా వాడుతూ జబ్బులు తెచ్చుకుంటున్నారు.
ఈ రోజుల్లో చాలా ఉద్యోగాల్లో కూడా కంప్యూటర్లు వాడుతున్నారు. చాలామంది సెల్ఫోన్లను
అదేపనిగా వాడుతూ జబ్బులు తెచ్చుకుంటున్నారు.
..............................
ఈ రోజుల్లో కొందరు అగ్రకులాల వాళ్ళు కూడా వేరే మతాల్లోకి మారిన వారున్నారు. కేరళలో కొందరు బ్రాహ్మణులు మతం మారారట. చెన్నైలో ఉన్నప్పుడు మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక బ్రాహ్మణ కుటుంబం ఇతరమతంలోకి వెళ్ళటం గురించి ఇంతకుముందు ఒక పోస్టులో వ్రాసాను.
నాకు ఏమనిపిస్తోందంటే, సాంప్రదాయ ఆచారవ్యవహారాలను పాటించే పద్ధతులున్న కుటుంబాల్లోని వారికే కొందరికి పాతకాలంలా ఆచరించలేనప్పుడు, కఠిన ఆచారవ్యవహారాలను పాటించమని చెప్పని శూద్రులను కూడా అవన్నీ పాటించాలన్నట్లు కొందరు చెబుతుంటే, అవన్నీ పాటించలేక, పాటించకుంటే ఏం కష్టాలు వస్తాయో? అని భయంతో కొందరికి మతాన్ని వదిలేయాలనిపించవచ్చు.
ప్రజల బాగుకోసం ఎన్నో ఆచారవ్యవహారాలను
ప్రాచీనులు తెలియజేసారు. కాలక్రమేణా అతి పెరిగింది. ఇవన్నీ
పాటించలేక కొందరు బ్రాహ్మణులే మతాన్ని వీడుతుంటే ఇప్పటికైనా జాగ్రత్త
తీసుకోవాలి.
కాలాన్ని బట్టి కొంత సరళంగా ఉండాలి. అంతే కానీ, అందరూ అన్నీ కఠినంగా పాటించితీరాలని చెప్పే వారి వల్ల
హిందువులకు నష్టం తప్ప లాభం ఉండదు. అస్తమానమూ అతిగా చెబుతూ ప్రజలను
భయపెట్టే వారికి ప్రజల ఉసురు తగిలే అవకాశమూ లేకపోలేదు.
దైవము అందరికీ అవసరమే. అయితే, వందల నియమాలను
పాటించలేక, పాటించకుంటే ఏం కష్టాలు వస్తాయో? అని భయంతో ఉన్నవాళ్లకు, ఎవరైనా
సరళంగా దైవాన్ని ప్రార్ధించుకోవచ్చంటే అటువైపు వెళ్లాలనిపించవచ్చు.
అందువల్ల, కాలాన్ని బట్టి విధానాలను కొంత సరళం చేసుకుంటే, వేరేవైపు వెళ్లటం కొంత తగ్గుతుందేమో.. అనిపిస్తుంది. ధర్మాన్ని తప్పకూడదు. విధానాలను కొంత సరళం చేసుకోవటం అంతే.
అందువల్ల, కాలాన్ని బట్టి విధానాలను కొంత సరళం చేసుకుంటే, వేరేవైపు వెళ్లటం కొంత తగ్గుతుందేమో.. అనిపిస్తుంది. ధర్మాన్ని తప్పకూడదు. విధానాలను కొంత సరళం చేసుకోవటం అంతే.
......................
భారతదేశంలో పరాయిమతాలు వేగంగా విస్తరించే పరిస్థితి ఉంది. స్థానికులు మతాన్ని మారి, హిందువులకు వ్యతిరేకంగా ప్రవర్తించేలా పరిస్థితి ఉంది. హిందువులు మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా నింపాదిగా, ఇంట్లో టీవి ఏ దిక్కున పెడితే కోరికలు తీరతాయి..వంటివి ఆలోచిస్తూ భయపడుతూ సందేహాలతో సతమతమవుతూ బ్రతుకుతున్నారు.
ఈ రోజుల్లో గ్రామాల్లోకి కూడా వచ్చి పెద్ద ఎత్తున మతమార్పిడులకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అగ్రవర్ణాల వారే మతాన్ని మారుతున్నప్పుడు ఇతరకులాలవారు మారటంలో ఆశ్చర్యం లేదు. ఇలాంటప్పుడు ఆచారవ్యవహారాలను మరింతగా చెబుతూ గట్టిగాపాటించాలని చెబితే, విసుగుతో మతాన్ని మారేవాళ్లసంఖ్య పెరిగే పరిస్థితి రావచ్చని ఆందోళనతో వ్రాసాను.
ఇప్పటి పరిస్థితిలో హిందువుల సంఖ్య తగ్గిపోకుండా చర్యలు తీసుకోవటం ఎంతో ముఖ్యం.
...............................
కరోనా సమయంలో ఏదిపడితే అది అంటుకోకూడదు, ముట్టుకోకూడదు, అదేపనిగా కడగటం, తుడవటం, ఏం చేస్తే ఏమవుతుందో? అనే భయం..వీటివల్ల కొందరికి మానసిక సమస్యలు కూడా వచ్చాయట. కొంతకాలం అలా పాటిస్తేనే జనం గందరగోళం అయ్యారు. ఇక జీవితమంతా ఎన్నో పాటించాలంటే కష్టమే.
ఎవరిపని వారు చేయకుండా నిర్లిప్తంగా ఉంటే, దేశం పరాయి వాళ్ళ ఆక్రమణలోకి వెళ్లే ప్రమాదముంది. సమాజం సవ్యంగా సాగాలంటే ఎవరిపని వారు చక్కగా చేయాలి. ప్రాచీనులు చతురాశ్రమాల గురించి తెలియజేసారు. చక్కగా పాటించి దైవకృపను పొందాలి.
ఎవరిపని వారు చేయకుండా నిర్లిప్తంగా ఉంటే, దేశం పరాయి వాళ్ళ ఆక్రమణలోకి వెళ్లే ప్రమాదముంది. సమాజం సవ్యంగా సాగాలంటే ఎవరిపని వారు చక్కగా చేయాలి. ప్రాచీనులు చతురాశ్రమాల గురించి తెలియజేసారు. చక్కగా పాటించి దైవకృపను పొందాలి.
...........................
బోలెడు పూజలు చేయకపోయినా, దైవస్మరణ చేసుకుంటూ, చేతనైనంతలో పశుపక్ష్యాదులకు హానికలగకుండా జీవించటం, ఇతరులకు హాని చేయకుండా జీవించటం, కష్టాలలో ఉన్న జీవులకు చేతనైనంతలో సాయం చేయటం..వంటివి పాటిస్తే దైవకృపను పొందగలరు.
oka link...
No comments:
Post a Comment