సోషల్మీడియాలో కొందరు రకరకాలవిషయాలను చెబుతూ అవన్నీ పాటించకపోతే కష్టాలొస్తాయంటూ చెబుతున్నారు.
సమాజం సరిగ్గా నడవాలంటే ఎన్నో వృత్తులు అవసరం. అందరూ పనిచేస్తేనే సమాజం సరిగ్గా నడుస్తుంది.
కుటుంబంలో కూడా స్త్రీలుపురుషులు తమ బాధ్యతఇవన్నీ తెలిసిన ప్రాచీనులులను సరిగ్గా నిర్వర్తిస్తేనే కుటుంబవ్యవస్థ బాగుంటుంది.
ఉదయాన్నే చద్దన్నం తిని పొలానికి వెళ్ళే రైతులు చాలా నియమాలను పాటించలేరు.
కుటుంబానికి దూరంగా మంచుకొండలలో ప్రాణాలకు తెగించి శత్రువులతో పోరాడే సైనికులు ఉపవాసాలు వంటి అనేక నియమాలను పాటించలేరు.
ఎవ్వరైనా అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండటం ఆరోగ్యానికి మంచిదే కానీ, ఎప్పుడూ ఏదో ఒక విశేషం అంటూ అస్తమానం ఉపవాసాలు ఉంటే నీరసం వస్తుంది, అనారోగ్యం వచ్చే అవకాశముంది.
కొన్ని వృత్తుల వారు పెద్దగా పూజలు చేయకపోయినా వారి పనులను వారు చక్కగా చేస్తే చాలు పుణ్యం లభిస్తుందని ప్రాచీనులు తెలియజేసారు.
అందరూ పనులన్నీ ఆపేసి ఉపవాసాలు ఉంటూ కూర్చుని తపస్సు చేస్తూ ఉండమని ప్రాచీనులు చెప్పలేదు.
అందరూ అన్నీ పనులు మాని విరక్తులైతే సమాజం ఏమవుతుంది. చెడ్డవారైన శత్రువుల చేతిలోకి పోతుంది.
అలా జరగకుండా ఉండాలంటే, మంచివారు తమ బాధ్యతలను తాము నిర్వర్తించాలి.
శ్రీకృష్ణులవారు యుద్ధరంగంలో అర్జునునితో ..అప్పుడు యుద్ధం చేయడము అర్జునుని కర్తవ్యమని బోధించారు..ఇంకా ఎన్నో విషయములను కూడా బోధించారు.
జీవితంలో మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ కూడా దైవాన్ని స్మరించుకోవచ్చు..
ఎవరైనా ఒకదగ్గర కూర్చుని పూజ చేయవచ్చు.. ఇంకా, ధర్మబద్ధంగా తమ బాధ్యతలను నిర్వర్తించటం కూడా పూజయే.
జీవితంలో ఏ పని చేయాలన్నా అనేక సందేహాలతో అనేకనియమాలు ముందుకాళ్ళకు బంధాలుగా తయారయ్యాయి.
ఇలాంటి పరిస్థితి వల్ల ప్రజలు నిరాశావాదులుగా, నిస్తేజంగా తయారవుతారు. విసుగుతో నియమాలను పాటించడమూ మానేస్తారు.
సోషల్మీడియాలో ఏదో ఒకటి చెప్పాలని కొందరు.. ప్రతిదీ అలా చేయకూడదు, ఇలా చేయాలి..అంటూ చెపుతూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు.
కలికాలంలో ప్రజలు శారీరికంగా, మానసికంగా బలహీనంగా ఉంటారని తెలిసిన ప్రాచీనులు, కలికాలంలో సులభంగా పూజ దైవస్మరణ చేసినా చాలని తెలియజేసారు.
అయితే, కొందరు అనేక పూజలు, అనేక నియమాల గురించి చెబుతూ అందరూ అలా పాటించాలని ..పాటించకపోతే కష్టాలు వస్తాయని చెబుతూ భయపెడుతున్నారు. ఇలా చేయటం ప్రాచీనులు తెలియజేసినవాటికి విరుద్ధం.
సనాతనధర్మం మూఢాచారాలను పాటించమని చెప్పలేదు. కొందరు ప్రజలే వాటిని ప్రవేశపెట్టారు. ఇలా అతిగా చేయటం సరైనది కాదు.
పాతకాలంలో హిందువులలోనే కొందరు తమలో తాము గొడవలు పడ్దారు.వైష్ణవులు శైవులు అని కూడా గొడవలు జరిగాయి.
కొన్నిమూఢాచారాల వల్ల ఎందరో ఇబ్బందులుపడ్దారు. ఏ కర్మల ఫలితమో కానీ, కారణాలేమైనా భారతదేశం చాలా సంవత్సరాలు విదేశీదాడుల వల్ల బాధలు పడింది.
అయితే, అనేకమంది పుణ్యాత్ముల ధర్మనిరతి వల్ల, పూజలు.. దైవం దయవల్ల అనేకదాడుల తరువాత కూడా భారతదేశం ఇంకా నిలబడింది.
ఇప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి. ఇప్పటికైనా మనం కొన్ని విషయాలలో సరిదిద్దుకుంటే మంచిది.
సనాతనధర్మంలో చక్కటి జీవన విధానాన్ని తెలియజేసారు. చతురాశ్రమ ధర్మాలను, ఇంకా ఎన్నో గొప్ప విషయాల గురించి తెలియజేసారు.
అయితే, కాలక్రమేణా గ్రంధాలలో ఎన్నో ప్రక్షిప్తాలు ప్రవేశించాయి. అందువల్ల, మూఢత్వంతో కాకుండా విచక్షణతో, ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి.
వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే , దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్దిస్తున్నాను.
........................
కొంతకాలం క్రితం వరకూ నాకు తెలిసినంతలో శూద్రులు కొన్ని వర్గాల వారు దైవాన్ని సులభంగా కొన్ని నియమాలతో హాయిగా ఆరాధించుకునేవారు.
ఇప్పుడేమో సోషల్మీడియా ద్వారా చాలా వింటుంటే.. చాలా సందేహాలు కలుగుతున్నాయి.
కొన్ని వర్గాలవారు(udaa..శూద్రులు) బోలెడు పూజలు చేయకున్నా, కొన్ని పూజలు చేసుకుని స్వధర్మాన్ని చక్కగా ఆచరిస్తే చాలు బోలెడు పూజలు చేసిన ఫలితం వస్తుందని ప్రాచీనులు తెలియజేసారు.
అయితే కొందరు శూద్రులు మేమెందుకు బోలెడు పూజలు చేయకూడదంటూ అవన్నీ మొదలుపెట్టారు.
అయితే కొందరు శూద్రులు మేమెందుకు బోలెడు పూజలు చేయకూడదంటూ అవన్నీ మొదలుపెట్టారు.
సులభమైన వెసులుబాటు ఉండగా కఠినమైన మార్గాలు పట్టుకోవటం ఎందుకు?
కొందరు బ్రాహ్మణులు కూడా అన్ని వర్గాలవారు అన్ని పూజలు చేయవచ్చంటూ చెప్పటం మొదలెట్టారు.
కలికాలంలో దైవనామస్మరణ చేసినా తరించవచ్చని ప్రాచీనులు చెప్పినఫ్పుడు వారి మాటల పట్ల నమ్మకం ఉండాలి కదా..
కలికాలంలో దైవనామస్మరణ చేసినా తరించవచ్చని ప్రాచీనులు చెప్పినఫ్పుడు వారి మాటల పట్ల నమ్మకం ఉండాలి కదా..
తాము నమ్మే దైవస్మరణ..దైవనామ స్మరణ ఎంతో గొప్పదని నమ్మకం ఉంచాలికదా..
అవన్నీ వద్దని కఠినమైన శ్లోకాలు, మంత్రాలు పట్టుకుని అవే చదవాలని తాపత్రయం ఎందుకు?
సులభమైన మార్గాలను వదిలి కఠినమైన మార్గాలు కావాలని కష్టాలు పడటం ఎందుకు?
సంస్కృతంలో ఒక్క అక్షరం తప్పు చదివినా అర్ధాలు మారిపోయి, వేరే అర్ధం వచ్చే పరిస్థితి ఉంటుందట.
సంస్కృతంలో ఒక్క అక్షరం తప్పు చదివినా అర్ధాలు మారిపోయి, వేరే అర్ధం వచ్చే పరిస్థితి ఉంటుందట.
అలా వచ్చీరాక చదివి కష్టాలు కొని తెచ్చుకోవటం ఎందుకు? హాయిగా దైవస్మరణ, దైవనామస్మరణ, భజనలు, భక్తిగీతాలు తో తరించవచ్చు కదా.
బ్రాహ్మణులు కొందరు కొన్ని సంవత్సరాలు కఠినమైన నియమాలను పాటిస్తూ వేదములు మొదలైన వాటిని నేర్చుకుంటారు. ప్రత్యేకమైన పూజలు చేయించుకోవాలంటే, అలాంటి వారిని పిలచి పూజలు చేయించుకోవచ్చు.
బ్రాహ్మణులు కొందరు కొన్ని సంవత్సరాలు కఠినమైన నియమాలను పాటిస్తూ వేదములు మొదలైన వాటిని నేర్చుకుంటారు. ప్రత్యేకమైన పూజలు చేయించుకోవాలంటే, అలాంటి వారిని పిలచి పూజలు చేయించుకోవచ్చు.
అంతేకానీ, రకరకాల పూజలలో పొరపాట్లు చేసి కష్టాలు తెచ్చుకోకుంటే మంచిది.
**********
No comments:
Post a Comment