koodali

Sunday, July 19, 2026

ఇంట్లో శివలింగాకారం అని నలుగురికి చూపిస్తే, మూఢనమ్మకాలు ప్రచారం చేస్తున్నట్లు కొందరు మాట్లాడుతున్నారు...

 

మా ఫ్రిజ్లో కూడా చాలాకాలం క్రిందట  శివలింగాకారంలా ఏర్పడింది. ఆ చిత్రాలను బ్లాగులో పోస్ట్ చేసాను. 
 
 link..

 ఫ్రిజ్లో శివలింగం ఆకారంలా ఏర్పడటం చూసి నాకు ఆశ్చర్యంగా, ఆనందంగా..అనిపించింది. పెద్దసైజులో అలా ఆకారం ఏర్పడటం నేను ఎప్పుడూ గమనించలేదు.
 
 అది ఐస్ వల్లే ఏర్పడినా, శివలింగంగా భావించి..ఆ విషయాన్ని చూపించాలనిపించి చూపించాను. మూఢనమ్మకాలు ప్రచారం చేయాలని కాదు. నేను మూఢనమ్మకాలకు వ్యతిరేకం.

అప్పట్లో మా ఫ్రిజ్లో శివలింగాకారాన్ని నేను మా చుట్టుపక్కల ఎక్కువమందికి చూపించడానికి భయపడ్దాను. 
 
నేనే అలా ఏర్పాటు చేసానని అనుకుంటారేమో అని, ఇంకా ఎవరు ఏమంటారోనని సందేహాలు కలిగాయి.

 మరికొందరు కూడా వాళ్ల ఫ్రిజ్లో ఇలా ఏర్పడినట్లు చూపించిన ఫోటోస్ చూశాను.
 
ఎవరైనా, ఫ్రిజ్లో శివలింగాన్ని చూపించి, గుడికట్టి భక్తులను పిలిచి, ఇక్కడ మొక్కుకుని హుండిలో డబ్బులు సమర్పిస్తే కష్టాలు, కోరికలు తీరుతాయని.. చెప్పారా ?

మూఢాచారాల పట్ల కొందరి ఆవేదన నేను అర్ధంచేసుకోగలను.

సమాజంలో కొందరు దైవము పేరుతో కూడా ప్రజలను మోసం చేస్తున్నారు. అయితే, అందరూ అలా మోసం చేసేవాళ్ళే ఉండరు.

 దైవము పేరుతో వ్యాపారంలా చేసి, డబ్బు సంపాదించేవారు కూడా ఉండవచ్చు. ఈ రోజుల్లో ఎవరు ఎటువంటివాళ్ళో తెలియదు కాబట్టి, జాగ్రత్తగానే ఉండాలి.

  ఎవరు ఏం అనుకున్నా, మా ఇంట్లో ఫ్రిజ్లో శివలింగాకారంలా ఏర్పడటం విషయం గురించి నేను గొప్పగా, ఆనందంగా భావిస్తాను.
................

చాలామంది.. ప్రకృతిలో, రాయిలో, రప్పలో, చెట్టులో, పుట్టలో దైవాన్ని చూస్తారు. మట్టితో, ఇసుకతో ..దైవరూపాన్ని తయారుచేసి పూజిస్తారు. 
 
పూజామందిరంలో పూజించే పటాల్లోని చిత్రాలను మనుషులే గీచినా, ఆ చిత్రంలో దైవాన్ని ఆరాధిస్తారు.


ఒక పాతసినిమాలో ఒక వ్యక్తి తనకు శివపూజకు సమయం మించిపోతోందని దగ్గరలో శివలింగం లేదని, తను ప్రేమించిన స్త్రీ యొక్క స్తనం శివలింగాకారంలో ఉన్నదని భావించి, దానినే పూజించినట్లు  సినిమాలో చూసినట్లు గుర్తుంది. అలా  చూపిస్తే,  జనాలు బాగా చూసారు. మరి సినిమాల్లో ఇలా చూపిస్తే ఏమంటారు?

కొందరు దైవము పేరుతో వ్యాపారం చేస్తున్నారనిపిస్తోంది.  మూఢనమ్మకాలు పెంచే సీరియల్స్, సినిమాలను  అందరూ వ్యతిరేకించాలి.

సృష్టి అంతటా దైవము ఉన్నారు. అలాగని ప్రతిరాయిని రప్పను, చెట్టును, ప్రతిదానిని పూజించాలంటే కుదిరే పనికాదు.  అలా అతిగా చేస్తే ఆ వ్యక్తి అతిగా తయారయ్యే పరిస్థితి రావచ్చు. 
 
దైవపూజలు అయినా, లౌకికవ్యవహారాలైనా, ఏదైనా..  అతిగా కాకుండా  చేస్తే మంచిది. దైవపూజలు పేరుతో మూఢత్వంగా ప్రవర్తించకూడదు.

...................
సమాజంలో ప్రచారంలో ఉన్న కొన్ని మూఢనమ్మకాలవల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.. 
చాలా మూఢనమ్మకాలున్నాయి.
....................

  ప్రజలకు దైవము అంటే భక్తి ఉండాలి, పాపాలు చేయకూడదని భయం ఉండాలి. 
 
అంతేకానీ, పాపభీతి లేకుండా, ఎన్ని పాపాలు చేసినా పరిహారాలు చేస్తే సరిపోతుందనే విధంగా పరిస్థితి తయారయ్యిందనిపిస్తుంది.

 .......................

సోషల్మీడియా వచ్చాక ఎందరో ఎన్నో చెప్పటం, ప్రతిదానికి ఇలాగే చెయ్యాలి, ఇలా చెయ్యకూడదంటూ చెప్పి ప్రజలను భయాందోళనకు, అయోమయానికి గురిచేస్తున్నారు. 
 
హిందుగ్రంధాలలో కూడా ప్రక్షిప్తాలైన మూఢనమ్మకాలు చాలాఉన్నాయి. వాటిని తొలగించాలి, వాటిని ఎవరూ ప్రచారం చేయకూడదు.

సమాజంలో ఎప్పటినుంచో ప్రజలలో ఏర్పడిన మూఢనమ్మకాలకు కారణాల గురించి ఆలోచించి సరిదిద్దుకోవాలి.

నే
ను కూడా  చాలామందిలా చాలా విషయాల గురించి భయపడుతూ చాలాకాలం కొన్నింటిని పాటించాను. అయితే, ఇప్పుడు నేను చేయగలిగినంతంలో మాత్రమే చేయడానికి ప్రయత్నిస్తున్నాను. 
 
మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా బ్లాగులో ఎన్నో విషయాలను వ్రాసాను. అయినా కొన్ని సెంటిమెంట్స్, భయాలు..ఉన్నాయి.
..............................

ప్రపంచంలో మతాల పేరుతో జరుగుతున్న రాజకీయాలు,వ్యాపారం, మారణకాండ..గమనిస్తే, మతాలు అనేవి లేకుండా దైవాన్ని సులభంగా ఆరాధించుకుంటే బాగుండని కూడా అనిపిస్తోంది.
.............................

 ఈ పోస్ట్ కొన్ని రోజుల తరువాత ఇక్కడ డిలిట్ చేసి వేరే దగ్గర పోస్ట్ చేద్దామనుకుంటున్నానండి.

 

Sunday, February 8, 2026

కొన్ని విషయములు..

 

శ్రీపరమాత్మనే నమః 

 (శ్రీమాత్రే నమః శ్రీ పరమాత్మనే నమః).....ఇలాగ ఏ దేవతా రూపాన్ని అయినా ..నిరాకారదైవముగా అయినా అనుకోవచ్చు. ఇంకా తేలికగా మాతా అని పరమాత్మా అని అనుకోవచ్చు.

 దైవము శాశ్వత పరమానంద స్వరూపులు. అత్యంత శక్తిమంతులు. 

దైవము, సృష్టిలో జీవులకు అవసరమైనటువంటివెన్నో సృష్టించి ఇచ్చారు. చక్కటి వాతావరణం, ఆహారానికి అవసరమైన ఎన్నో మొక్కలు, ఎన్నో పువ్వులతో కూడిన మొక్కలు, ఎన్నో సుందరదృశ్యాలను..  ఇచ్చారు. 

దైవానికి అనేక కృతజ్ఞతలు. 
....................

 దైవపూజలు చేసినప్పుడు ప్రజలు , ప్రపంచంలో అందరికి తమతో సహా బుద్ధి సరిగ్గా ఉండాలని కూడా దైవాన్ని ప్రార్ధించుకుంటే మంచిది. 

బుద్ధి సరిగ్గా ఉంటే అంతా మంచిగా ఉంటుంది. 

..............................

లోకంలో కొందరు దుర్మార్గులు దారుణాలు చేసినప్పుడు  మనకు ఏమనిపిస్తుందంటే,   దైవం లోకంలోని చెడ్డవారిని అందర్నీ చంపేయవచ్చు కదా.. అనిపిస్తుంది. 

అన్నీ దైవమే చేస్తే మనుషులు ఏం చేస్తారు? టెక్నాలజీ పేరుతో ప్రకృతిని ధ్వంసం  చేయటం, పశుపక్ష్యాదులను చంపి తింటూ, మద్యం, మత్తుపదార్ధాల మత్తులో నేరాలు..ఘోరాలు చేయటం , పాపాలు చేసి అయినా ఆస్తులు పెంచుకుంటూ విలాసాలలో మునిగి ఉంటారా? 
 

 దైవం జీవులకొరకు మంచి వాతావరణం, ఆహారం కొరకు ఎన్నో మొక్కలను, ఆహ్లాదకరంగా ఎన్నో సుందర ప్రకృతిదృశ్యాలను..ఇంకా ఎన్నింటినో ప్రసాదించినా కూడా,   సంతోషంగా ఉండటం చేతకాక... అంతులేని కోరికలతో, అసూయాద్వేషాలతో కొట్టుకు పోతున్నారు.
 

మనం ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ మన ప్రయత్నాలు మనం చేస్తూ.. కాపాడమని దైవాన్ని ప్రార్ధిస్తే కలికాలంలోనైనా కూడా , అమాయకులు, మంచివారైన వారికి బాధలు గణనీయంగా తగ్గే అవకాశముంది. అంతా దైవము దయ.

................................ 

ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో శుభాలు జరిగాయి. అశుభాలు కూడా జరిగాయి.

 ప్రపంచంలో మతాల పేరిట, అధికారం గురించి, సంపదల గురించి ఎన్నో పోరాటాలు, రక్తపాతాలు,
 హింస.. జరిగాయి. ఇదంతా ఎంతో బాధాకరమైన విషయం.

 ఆధునికకాలంలో చాలామందిలో అత్యాశ,  పాపాలు చేసి  అయినా డబ్బు సంపాదించాలనే తత్వం పెరిగాయి. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు. 

డబ్బు, అధికారం..కొరకు ఎన్నో పాపాలు చేస్తున్నారు. సామాన్యజనం కూడా తమ వంతు పాపాలు చేస్తున్నారు. వీటి ఫలితాలే ప్రస్తుతం ప్రపంచం అనుభవిస్తోంది.

మద్యపానం, మత్తుపదార్ధాల వల్ల సమాజానికి చాలా నష్టం జరుగుతోంది. 

సోషల్మీడియాలో హింసాత్మక దృశ్యాలు, చెడ్ద విషయాలు వల్లకూడా చాలామంది ప్రభావితులవుతున్నారు. 

    ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా,  నీతినియమాలను పాటించనివారిని మనం ఏం చేయగలం?  వారి సంగతి దైవం చూసుకుంటారు.

 కొందరైనా నీతినియమాలతో దైవభక్తి కలిగి.. ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ ..దైవాన్ని ప్రార్ధిస్తే.. ఆ ఫలితం వల్ల దైవకృప కలిగి.. సమాజంలో శాంతి నెలకొనే అవకాశముంది.
......................

ఆ మధ్య ఒక పేరుపొందిన వారు  చెప్పినదాన్ని బట్టి.... ఆధునిక కాలంలో జీవ హింస చేయటం బాగా పెరిగింది. పశుపక్ష్యాదులను చంపి తినటం విపరీతంగా పెరిగింది... 

అలా చనిపోయిన జీవుల ఉసురు తగిలి కూడా ప్రపంచంలో కష్టాలు వస్తున్నాయని వారు తెలియజేసారు. 

మనుషులకు జరుగుతున్న హింస పట్ల మనకు ఇంత బాధ ఉన్నప్పుడు, జంతువుల పట్ల మనం చేస్తున్న హింస గురించి కూడా మనము ఆలోచించాలి.

కారణాలేమైనా కూడా, ప్రపంచంలో జరుగుతున్న  ఘోరాలు వింటుంటే చాలా బాధగా ఉంది. రాక్షసప్రవృత్తి కలవారి పట్ల సౌమ్యత, సహనం పనికిరాదు. ఎలాగైనా ఈ ఘోరాలు ఆగాలి. 

అయితే, అంతా దైవం మీదే భారం వేసి కూర్చోవటం కాకుండా, దారుణాలు ఆగడానికి అందరూ తమవంతు ప్రయత్నం చేయాలి. 

************** 

ప్రపంచంలో  ఎన్నో సమస్యలున్నాయి. ఎవరికి ఏం చెప్పినా వినే వాళ్ళెంతమంది? పాటించేవాళ్లెంతమంది? 

మనుషులు చేస్తున్న పాపాల వల్ల ఎవరి కర్మ వారిదని దైవము ఊరుకుంటున్నారేమో? 

   యుద్ధాలు, హృదయవిదారకమైన ఘటనలు, యాక్సిడెంట్లు, రక్తపాతాలు జరిగినప్పుడు... అమాయకులైన 
చిన్నపిల్లలు, మంచివాళ్లు, మూగజీవులు .. కష్టాలు పడినప్పుడు ఎంతో బాధనిపిస్తుంది. 

దైవం చెడ్డవారిని శిక్షించి, ఆ దారుణాలను ఆపితే బాగుంటుంది కదా ..అనిపిస్తుంది. 
.......................

గ్రంధాల ద్వారా దైవం.. రాక్షసులను చంపివేసి లోకాన్ని రక్షించిన సంఘటనలు గురించి మనం తెలుసుకోవచ్చు.

 అయితే, ఏది ఎందుకు జరుగుతుందో చాలాసార్లు అర్ధం కాదు. మహాభారతంలో శ్రీకృష్ణులవారు..తమ గురువుయొక్క మరణించిన పుత్రులను తీసుకువచ్చి ఇచ్చారు. 

కానీ, యుద్ధంలో అభిమన్యుని రక్షించలేదు. అలా జరగడానికి గల కారణాలు మనకు తెలియకపోవచ్చు. లోకంలో కూడా చాలా విషయాలు మనకు అర్ధం కావు. దైవానికి అన్నీ తెలుస్తాయి.

  మనలో చాలామంది జీవితంలో...దైవం ఉన్నారని చక్కగా అనుభవంలోకి వచ్చిన సంఘటనలు ఉంటాయి.  దైవాన్ని నమ్మి.. ధర్మబద్ధంగా జీవించాలి.

...............

 ప్రపంచంలో శాంతి నెలకొనాలని , అంతా బాగుండాలని ...అందరూ మనస్పూర్తిగా దృఢంగా దైవాన్ని ప్రార్ధించాలి.  దైవాన్ని, దైవనామాన్ని అందరూ స్మరించుకోవాలి.

.................

 నైతికవిలువలను పాటించే మనుషులున్న సమాజం ప్రశాంతంగా ఉంటుంది. నేరాలు..ఘోరాలు ఉండవు. అందరికి  దైవభక్తి.. ధర్మబుద్ధి ఉండాలని గట్టిగా కోరుకుందాము.
 ..................

 దైవము దయ.

 


ఈ రోజుల్లో ..వచ్చాక ...


ఈ రోజుల్లో టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు..వచ్చాక ఎన్నో ప్రోగ్రాంలు ప్రపంచమంతటా ప్రసారమవుతున్నాయి. 
 
మంచి ప్రోగ్రాంస్ తో పాటు హారర్ ప్రోగ్రాంస్ కూడా ఉంటాయి.
 
  ఈ తరంగాలు వాతావరణంలో ఉండి, వాటి ప్రభావం మనుషుల మీద ఉంటుందనిపిస్తుంది.

చెడుప్రసారాల వల్ల మనుషుల్లో చెడ్డతనం పెరుగుతుందనిపిస్తుంది. అయితే, చెడుప్రసారాలను ఎంతకని ఆపగలం?

మంత్రాలను పఠిస్తే, ఆ తరంగాల వల్ల వాతావరణం శుద్ధి అవుతుందంటారు. మంత్రాలను మనస్సులో కూడా అనుకోవచ్చు.
  
దేవాలయాల్లో పూజాకార్యక్రమాలు జరుగుతాయి. అందువల్ల, వాతావరణం కూడా శుద్ది అవుతుంది.  
 
ధ్యానం ఎంతో శక్తివంతమైనదని అంటారు. ధ్యానము పైకి అందరికి వినిపించేలా చేయకపోయినా కూడా, ధ్యానము శక్తివంతమైనది.
 
 ఇళ్ళలో వీలున్నప్పుడు కొద్దిసేపయినా  భక్తిగీతాలు..పెట్టుకుంటే మంచిది. తక్కువ సౌండుతో తప్పుల్లేకుండా ఉన్న మంత్రాల కాసెట్ పెడితే మంచిది. 

 వాటిని వింటూ పనులు మాని అక్కడే కూర్చోవాలని ఏమీ లేదు.
  మన పనులు మనం చేసుకుంటూనే అవి వాతావరణంలో ప్రసారమవుతాయి. 

(ఇళ్ళలో నెలసరి సమయంలో మంత్రాలు పెట్టకూడదు కావచ్చు.)

చాలామందికి వినిపించాలని పెద్దశబ్దంతో పెట్టనవసరం లేదు.. 
 పెద్ద సౌండ్ వల్ల చుట్టుపక్కల వారికి  సమస్యలు ఉంటాయి.     చిన్న శబ్దంతో పెట్టినా కూడా, ఆ మంత్రశక్తి వాతావరణంలో వ్యాపించి, మంచిమార్పు వచ్చే అవకాశముంది.
 
కొన్ని దేవాలయాల్లో మైకుద్వారా వినిపించేలా కాసెట్ పెట్టి మంత్రాలను, భక్తిగీతాలను వినిపిస్తారు.  
 
మైకులో పెద్దశబ్దం పెడితే, కొన్ని విషయాలు ఆలోచించాలి. పెద్దశబ్దంతో పెట్టే మైకులకు సమీపంలో ఉండే ఇళ్లల్లో ఉండే వారికి కొన్ని సమస్యలుంటాయి....

 ఒకరిమాట ఒకరికి సరిగ్గా  వినిపించదు. ఫోన్లో మాట్లాడలేము. ఇంట్లో సరిగ్గా పూజ చేయలేము. కొందరికి తలతిరిగే పరిస్థితి కూడా ఉంటుంది. అందువల్ల చిన్నశబ్దంతో ఉంటే హాయిగా ఉంటుంది.

*********************
  ఈ రోజుల్లో టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు..ద్వారా  ప్రసారమవుతున్న వాటిలో, మంచి ప్రోగ్రాంస్ తో పాటు హింసతో కూడిన ప్రోగ్రాంస్ కూడా ఉంటాయి. 
 
చాలామంది పిల్లలు, పెద్దవాళ్లు హారర్ ప్రోగ్రాంస్ భయపడుతూ కూడా చూస్తారు. 

సీరియల్స్ చూస్తే,  ఇళ్లలో ఒకరితో ఒకరు కొట్లాడుకోవటమే ఎక్కువవుంటుంది. 

అస్తమానం హింసతో కూడిన ప్రోగ్రాంస్, గొడవలు కాకుండా,కామెడీ ఎక్కువ ఉండే ప్రోగ్రాంస్ ఎక్కువ రావాలి. 

కొన్ని వీడియోగేంస్ కూడా ఒకరితోఒకరు కొట్టుకోవటం వంటివి ఉంటాయి. అవి ఆడినవారికి ఇరిటేషన్ పెరిగే పరిస్థితి రావచ్చు.

చాలాసమయం సెల్ఫోన్లు చూస్తే ఇరిటేషన్ వస్తుంది. చేతులు, మెడ నొప్పులు వస్తాయి. ఇంకా కొన్ని శారీరిక, మానసిక సమస్యలు వచ్చే అవకాశముంది.

 ఆరుబయట ఆడుకోవటం, నడవటం, ఇరుగుపొరుగు వారు కబుర్లు చెప్పుకోవటం, తోటపని, బాల్కనీలో కూర్చుని మంచిపాటలు వినటం.. చేయవచ్చు. 

సెల్ఫోన్లు పట్టుకుని చూడటం తగ్గించి, ఫోన్ పక్కన పెట్టి రేడియోలా వినవచ్చు.
.......................
 
ఇంకా, మనుషుల్లో, దైవభక్తి..మంచితనం ఉన్నాయి కాబట్టి,  ప్రపంచం ఈ మాత్రం అయినా బాగుంది. 
 .................
oka link..


Monday, December 22, 2025

పగిలిన గాజుముక్కలను....

 

ఎన్నో గాజు సామాన్లను వాడతాం. అవి పగిలినప్పుడు మాత్రం వాటిని ఎక్కడ ఎలా పడెయ్యాలో అనేది కష్టంగా ఉంటుంది.


 పగిలిన గాజుముక్కలను అలాగే బయట పడేస్తే అవి గుచ్చుకుని పారిశుధ్యసిబ్బందికి, బయట ఆహారం కొరకు తిరిగే జంతువులకు గుచ్చుకుని గాయాలు అయ్యే ప్రమాదముంది.

 అందువల్ల గాజు ముక్కలను ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి,  పాతబట్టలను మందంగా వాటికి గట్టిగా చుట్టి,  మరల ప్లాస్టిక్ కవర్లో చుట్టి అప్పుడు వాటిని ప్లాస్టిక్ చెత్త వేసే డబ్బాలలో వేయాలి. 

ఏదైనా పెట్టెలో పెట్టి పడేస్తే ఇంకా మంచిది. ఇంకా ఏమైనా పద్దతులు కూడా ఉండవచ్చు. 


ప్లాస్టిక్ కాకుండా, చిన్న గోనె సంచి లేక కాటన్ సంచిలో వేసి చుట్టి, తాడుతో కట్టి కూడా పడేయవచ్చు. కొబ్బరి పీచుతో కూడా సంచులను తయారుచేయవచ్చు.

 పగిలిన గ్లాస్ పడెయ్యటానికి విడిగా చెత్తబాక్సులను ఏర్పాటు చేయాలి.

 గాజు సామాను కొనకుండా జాడీలను, మట్టిపాత్రలను కొనవచ్చు.

పాతకాలంలో జాడీలను వాడేవారు. ఇప్పుడు కూడా జాడీలను అమ్ముతున్నారు. అలాగే జాడీలు తయారుచేసే పద్ధతిలో కప్పులు, చిన్న జాడీలు, మగ్గులను కూడా అమ్ముతున్నారు. అవి పగిలినా కూడా గాజుగ్లాసులా పదునుగా గుచ్చుకోవు. 
 

ఈ రోజుల్లో చెత్తను ఎక్కడపడితే అక్కడ కుప్పలుగా పడేసి వదిలేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు సమాజంలో. అలాకాకుండా, సమాజం బాగుండేలా పాటించటానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. 


Monday, November 24, 2025

కొన్ని విషయములు..

 

 link..

ఓం, దైవానికి అనేక వందనములు...

 link..

  • ఓం..
  •  
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. ....4
  •  
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. .3
  •  
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్....2
  •  
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. 1
  •  

  •  

    కొన్ని సందేహాలు..కొన్ని ఆలోచనలు..

     

     నాకు కొన్ని సందేహాలు కలిగాయి. 

    నెలసరిలో ఉన్నప్పుడు దైవస్మరణ.. దైవనామస్మరణ.. చేస్తే దోషం కాదు కాని, మంత్రాలు.. స్తోత్రాలు.. చేయకూడదంటున్నారు కొందరు.

      కార్తికమాసంలో కొన్ని దేవాలయాల్లో ఎవరైనా నెలకు కొంత డబ్బు కడితే, నెలంతా అభిషేకాలు..పూజలు చేస్తున్నారు. ...

    అలాంటప్పుడు ఆ కుటుంబంలో స్త్రీలకు నెలసరి వస్తే అప్పుడు వాళ్ళ పేరు కూడా పూజలో చదువుతారు కదా....అప్పుడు వాళ్లు పూజ చేసినట్లే కదా..

    మరి అలాంటప్పుడు దోషం ఉంటుందా? ఉండదా? అని సందేహం అనిపించింది. 

    అర్చనలు చేయించుకునేటప్పుడు కూడా వేరే ఊళ్లలో ఉండే కుటుంబసభ్యుల పేర్లు కూడా చెప్పి అర్చన చేయిస్తారు. 

    పూజలో పేర్లు ఉన్న వాళ్ళు నెలసరిలో ఉంటే అప్పుడేమిటి?

     ఇలా పూజలు చేయించుకుంటే చేయించుకున్నవాళ్లకు, చేయించిన వాళ్లకు, చేసిన వారికి...కూడా దోషం వస్తుందా? అలా ఏమీ కాదా? 

    పూజకు డబ్బు కట్టిన తరువాత, ఎవరి ఇంట్లో అయినా అకస్మాత్తుగా మైల పాటించే పరిస్థితి వస్తే,  ఆ సంగతి
    ని వాళ్ళు   చెప్పకపోవచ్చు.

    అంటుముట్టు..మైల ఉన్నాకూడా, దేవాలయంలో లేకుండా దూరంగా ఉంటే, వారి పేరుతో ఏ పూజ అయినా  చేయించుకోవచ్చా? అలా చేస్తే ఏమైనా దోషం ఉంటుందా? ఉండదా? తెలియటం లేదు.

     ఇన్ని  సందేహాలు ఎందుకు అంటే, నెలసరి దోషం వల్ల చాలా కష్టాలు వస్తాయంటున్నారు అని.

    స్త్రీల అంటుముట్టు గురించి పబ్లిక్ గా మాట్లాడటం ఏమిటీ అంటున్నారు కొందరు.

     మరి స్త్రీల నెలసరి గురించి అలా చేయకూడదు..ఇలా చేయకూడదు..చేస్తే కష్టాలు వస్తాయని పబ్లిక్ గా కొందరు చెబుతున్నప్పుడు, ఆ సందేహాల గురించి పబ్లిక్ గా మాట్లాడితే తప్పేమిటి?

    ఇంకా, చాలా విషయాల గురించి కూడా.. ఇలా చేయకూడదు..అలా చేయకూడదు..చేస్తే కష్టాలు వచ్చి మీద పడిపోతాయని చెబుతున్నారు. ఇవన్నీ విని, ఏం చేస్తే ఏం తప్పో? అనే పరిస్థితితో భయం, అయోమయం కలిగి, అనేక సందేహాలతో సతమతమయ్యే పరిస్థితి ఉంటుంది.

      .............................

    లోకకల్యాణం కొరకు పూజలు చేసే సందర్భాలలో.. లోకంలో అంతా బాగుండాలని పూజ చేస్తారు. 

    ఎవరికి వారు పూజలు చేయించుకునే సందర్భాలలో.. అంటుముట్టు, మైలలో ఉన్నవారు కొన్ని రోజులు ప్రత్యేక పూజలు చేయడానికి దూరంగా ఉండాలంటారు.

    నాకు ఏమనిపిస్తోందంటే,  అర్చన, అభిషేకం వంటి సందర్భాలలో..వేరే ఊరిలో ఉన్న కుటుంబసభ్యులందరి పేర్లు చెప్పటం సంగతి ఏమోకానీ..

    అంతా బాగుండాలని, కుటుంబంలో అందరూ బాగుండాలని.. భావిస్తూ పూజ చేయిస్తున్నట్లుగా (పూజారి గారితో) పూజ చేయించవచ్చేమో? అనిపించింది. 

    (వేరే ఊరిలో ఉన్నవారి  పరిస్థితి(అంటుముట్టు..) గురించిన సంగతులు తెలియనప్పుడు, ఇలా కూడా చేయవచ్చేమో?..అనిపించింది.)

    .........................

      ఇంకొక విషయం ఏమిటంటే, కొన్నిసార్లు పూజలలో సుమారు అర్ధగంటకు పైగా  గోత్రనామాలు ..కుటుంబసభ్యుల పేర్లను చదవటంతోనే సరిపోతుంది.

     మేము చెన్నైలో ఉన్నప్పుడు,  అక్కడ దేవాలయంలో ..అర్చన కొరకు గోత్రనామాలు చెప్పకపోయినా కూడా,  స్వామిపేరుతో.. అని చెప్పి అర్చన చేసేవారు. 

    పేర్లు చెప్పకుండా ఈ పద్ధతి సులభంగా అనిపించింది.

    ....................

    గోత్రనామాలు చెప్పినా చెప్పకపోయినా,  దైవప్రీతి కొరకు.. జీవప్రీతి కొరకు ..కష్టాలు తొలగటానికి ..ఇలా దైవానికి ఎవరికి వారు మనస్సులో కూడా చెప్పుకోవచ్చు.

    మన గురించి, మన ఆలోచనల గురించి..అన్నీ దైవానికి తెలుస్తాయి.

     ............................

    వ్రాసినవాటిలో ఏమైనా తప్పులుంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

     

    Sunday, November 9, 2025

    చక్కగా దైవాన్ని ఆరాధించుకోవచ్చు. ...

     

     సోషల్మీడియాలో చెప్పేవన్నీ పాటించకపోతే కష్టాలొస్తాయేమోననే భయపడనవసరం లేదు.

     అందరూ అన్నింటినీ పాటించలేరు. కలియుగంలో దైవస్మరణ..దైవనామస్మరణతోనే తరించవచ్చని ప్రాచీనులే తెలియజేసారు.

     ఎవరి శక్తికి తగ్గట్లు వారు దైవాన్ని ఆరాధించుకోవచ్చు. 
     

    దైవానికి మన విషయాలను చెప్పుకోవచ్చు. 

    హిందూత్వంలో నిరాకారం, సాకారం..ఇలా ఇంకా ఎన్నో పద్ధతులున్నాయి. మన శక్తికి తగ్గట్లు చక్కగా హాయిగా దైవాన్ని ఆరాధించుకోవచ్చు.

     సరైన విధంగా జీవించే శక్తిని ఇమ్మని దైవాన్ని ప్రార్ధించుకోవచ్చు.

     ...................................

     marikonni vishayamulu..

     దైవ సృష్టి ...

     సృష్టిలో , ఆకాశంలో ఎగిరే పక్షుల శరీరం , ఎగరటానికి తగ్గట్లుగా సృష్టించబడింది. నీటిలో ఈదే చేపలశరీరం అందుకు తగ్గట్లుగా ఉంది. 

    ఇవన్నీ ఇలా ఉండాలంటే ఎంతో ఆలోచనకల శక్తికే సాధ్యం. ఆ మహాశక్తే దైవము.

    ఆలోచనాశక్తి లేనిదే ఏదైనా పద్ధతిగా ఎలా ఏర్పడుతుంది..ఒకగదిలో నాలుగు చెక్కముక్కలనుపడేసి ఎంతకాలం ఉంచినా అవన్నీ కలసి కుర్చీలా అవవుకదా.

     
    ఇంత పద్దతిగా వైవిధ్యభరితమైన సృష్టిని ఏర్పాటు చేయాలంటే, ఊహాతీతమైన ఆలోచనా శక్తి గల మహాశక్తికే సాధ్యం. ఈ మహాశక్తినే   దైవము.. అని దైవాన్ని నమ్మే వారు(ఆస్తికులు) పిలుచుకుంటున్నారు.

    ఆధ్యాత్మికవాదులు..  దైవానికి   ఆది ,  అంతమూ ..లేవు .  అని తెలియజేసారు. 

    ".Matter and energy cannot be created or destroyed "....... అని ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పే విషయాన్ని బట్టి చూసినా .. పదార్ధం , శక్తి ..యొక్క రూపం మారుతుంది .

     అంతేకానీ, పదార్ధాన్ని, శక్తిని.. సృష్టించలేము, నశింపజెయ్యలేము....అని తెలుస్తుంది.

    ఉదా...నీరు ఆవిరిగా మారుతుంది ... ఆవిరి మరల నీరుగా మారుతుంది, నీరు మంచులానూ మారవచ్చు, ఆ మంచు మరల నీరుగానూ , ఆ నీరు ఆవిరిగానూ మారవచ్చు.

    విశ్వాన్ని దైవం సృష్టించారు అంటే,  మరి దైవం  ఎలా సృష్టించబడింది ? అనే ప్రశ్న వేస్తారు భౌతికవాదులు. 

     మరి , పదార్ధం లేక శక్తి  మొదట ఎలా సృష్టించబడింది ? అనే ప్రశ్నకు భౌతికవాదులు ఏం సమాధానం  చెబుతారు ?

     పదార్ధానికే పుట్టుక , నశించటం అనేవి లేనప్పుడు , పదార్ధాన్ని సృష్టించిన దైవం ఆద్యంతాలు లేని నిత్యశక్తి .... అని పెద్దలు చెప్పిన మాట నిజమని తెలుస్తోంది కదా !
      
    దైవం వద్ద   జీవులకు కలిగే  అన్ని సందేహాలకు  సమాధానాలు ఉంటాయి . 

    అయితే,   విజ్ఞాన రహస్యాలు తెలుసుకోవాలంటే   జీవులు  తగిన అర్హతలు సంపాదించుకోవాలి. 

     దైవకృపను పొందగలిగిన జీవులకు ఆ రహస్యాలు తెలిసే అవకాశం ఉందనిపిస్తుంది. ఉదా.. మోక్షాన్ని పొందిన జీవులకు  విషయాలు తెలుస్తాయి .  అనిపిస్తుంది . 

     విమానం ఎలా ఎగురుతుంది ? అని చిన్న పిల్లవాడు ప్రశ్నిస్తే పెద్దవాళ్ళు ఎంత వివరించినా పిల్లవాడికి అర్ధం కాకపోవచ్చు. 

    అదే పిల్లవాడు పెద్దవాడయి చదువుకుంటే ఆ విషయాలు సులభంగా బోధపడతాయి. 

    విశ్వరహస్యాలు తెలుసుకోవాలన్నా తగిన  అర్హతలను సంపాదించుకోవాలి.
     
    *******
    సృష్టి ఎలా ఏర్పడింది? అనే  ప్రశ్నకు,   దైవం  వల్ల   సృష్టించబడింది.. అని  ఆస్తికులు ఖచ్చితమైన   సమాధానం  చెప్పగలరు.

    సృష్టి ఎలా ఏర్పడింది?  అనే  ప్రశ్నకు, నాస్తికులు ఏమంటారంటే.. సృష్టి దానికదే ఏర్పడిందని అంటారు.

    కొందరు నాస్తికులు  ఏమంటారంటే, దైవం  ఎలా ఏర్పడ్డారని  ప్రశ్నిస్తారు.

    సృష్టి దానికదే ఏర్పడటం సంభవమని  వారు నమ్ముతున్నప్పుడు..  మరి, దైవం తమకు తామే ఏర్పడలేరా
    ఏమిటి ..దైవానికి ఆది అంతములు లేవు. 
    దైవము  ఎప్పుడూ ఉంటారు.
     ......................

    oka link..

    జీవులు పుట్టడం , కష్ట సుఖాలు అనుభవించటం అ...