koodali

Sunday, September 6, 2026

భారతీయులు బలవంతులే...ఉదాహరణ చూడండి..

 

ఈమధ్య కొందరు ఏమంటున్నారంటే, భారతీయులు 
కొంత పెద్ద వయస్సు  వచ్చేసరికి  బలహీనంగా ఉంటారని, విదేశాల వాళ్ళు పెద్ద వయస్సు లో కూడా బలంగా ఉంటారని అంటున్నారు. 

విదేశాల్లో కూడా జబ్బులతో ఉండేవారు ఉంటారు. 

ఈ క్రింద వీడియో చూడండి.  
కొంతపెద్దవయస్సు స్త్రీలు(భారతీయులు) ఎంత బలంగా ఉన్నారో. ఈ రోజుల్లో ఎంతమంది ఇలా చేయగలరు?

భారతీయులు బలవంతులే...ఉదాహరణ చూడండి..ఇక్కడ లింక్ వద్ద క్లిక్ చేసి ..

link..
https://youtube.com/shorts/fQdBxeQKfBQ?si=dUByrolHLztRWU86 

ఇలాంటివి తెలియజేసిన వారికి ధన్యవాదములండి.

 ఈ లింక్ ఇవ్వటం గురించి ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పగలరు. 

 నాకు తెలిసినంతలో,ఈ డాన్స్ ను మహారాష్ట్ర..గోవా లో చేస్తారట. ఆధునికకాలంలో ఎక్కువమంది, ఈ డాన్స్ లో కొన్ని కఠినమైన విన్యాసాలు చేయలేకపోవచ్చు.

 .....................................
పాతకాలంలో చాలామంది చాలాదూరం నడిచివెళ్లటం, బోలెడు పని చేసుకునేవారు.ఇప్పుడు ఎంతతిన్నా నీరసమే అంటారు చాలామంది.

పాతకాలంలో స్త్రీలు  తిరగలి తిప్పటం, రోట్లో పిండి కొట్టటం, పిండి రుబ్బటం..ఇవన్నీ చేసేవారు. ఇంకా ఇలా డాన్సులు కూడా చేసేవారంటే వాళ్ల ఓపికకు మెచ్చుకోవాలి.

పాతకాలం వాళ్లు దేశవాళి పంటలు , పురుగుమందులు వేయని పంటలు తినటం, ప్రతిపనికి యంత్రాలు కాకుండా స్వయంగా చేయటం, ప్రతిదానికి వాహనాలు కాకుండా నడవటం, నాలుగుగోడలమధ్య యంత్రాలతో పనిచేయటం కాకుండా, ఆరుబయట సూర్యరశ్మిలో తిరిగి పనిచేసుకోవటం ఉండేది.

వాతావరణకాలుష్యం తక్కువగా ఉండి, సరైనవిధంగా ఆహారం తీసుకోవటం, శరీరానికి పనిచేయటం..వంటివి చేస్తే భారతీయులైనా, విదేశీయులైనా ఆరోగ్యంగా ఉండే అవకాశాలుంటాయి.

పాతకాలంలో ఇంటి చుట్టూ చాలా స్థలం ఉండేది. స్త్రీలు పనులు చేస్తూ తిరిగితే,  వాకింగ్ అయ్యేది.

 ఇప్పుడు చాలామంది ఆఫీసుల్లో గంటలతరబడి కూర్చుని పనిచేయటం, ఇంట్లో సెల్ఫోన్లు, టీవీలు చూస్తూ ఉంటారు.

 టెన్షన్ వల్ల కూడా ఎక్కువ జబ్బులొస్తాయి.

 చిన్నతనం నుంచి పిల్లల్ని రుద్ది చదివించటంతో చదువుల టెన్షన్, ఉద్యోగాల్లో టెన్షన్, కుటుంబాల్లో పాతతరానికి కొత్తతరాలకు మధ్య గొడవల టెన్షన్....ఇలా  చాలా కారణాలుంటాయి...వీటన్నింటివల్ల పెద్దవయస్సు వచ్చేసరికి జబ్బులు వస్తాయి.

పాతకాలంలో కూడా టెన్షన్లు ఉండేవి. టెన్షన్ ఉన్నప్పుడు నడవటం, ఏదైనా పనిచేయటం చేస్తే టెన్షన్ ప్రభావం కొంత తగ్గే అవకాశముంది.  నడిచేటప్పుడు దైవస్మరణకూడా చేయవచ్చు. 
...................
ఇప్పుడు చాలామంది భారతీయులకు డబ్బువ్యామోహం, స్వార్ధం, అసూయ..ఇలాంటివి ఎక్కువయ్యాయి. వీటివల్ల కూడా జబ్బులొస్తాయి.
..............
పాతకాలంలో చాలామంది భారతీయులు ఇప్పటిలా ఎక్కువసార్లు మాంసాహారం తినేవారు కాదు. ఈ రోజుల్లో చాలామంది మాంసాహారం బలం అని, విపరీతంగా తింటున్నారు. 
 మాం
సాహారం బాగా తినే వాళ్లలో కూడా కిలోమీటర్ సరిగ్గా నడవలేనివారున్నారు. 

ఆహారం సరిగ్గా వండుకోవటం, ప్రశాంతంగా తినటం తగ్గింది. సమయం లేదని ఇంట్లో ఆదరాబాదరా వండటం, జంక్ఫుడ్ తినటం, బయట కొని తినటం ఎక్కువయ్యింది. 

 ఎన్ని పాటించినా, వాతావరణ కాలుష్యం వల్ల వచ్చే అనారోగ్యాలు కొన్ని ఉంటాయి.
...............................
 

ఇలాంటి డాన్సులు చేసేవారిలో అసలు మాంసాహారం తిననివాళ్లు కూడా ఎక్కువమంది ఉంటారు.

........................ 

 ఇవన్నీ ఏఐ  అని కొందరంటున్నారు. ఇవి ఏఐ  కాదు. ఇలాంటివి నిజంగానే చేస్తారు. నేను మరికొన్ని దగ్గర కూడా చూశాను. 

ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు ఇలా డాన్సులు చేయలేకపోవచ్చు. అందువల్ల మనకు తెలియక ఏఐ  అంటున్నారు.

మనకు తెలియనంతమాత్రాన అన్నీ అబద్ధాలని అనుకోకూడదు. భారతీయుల పధ్ధతులు సరిగ్గా లేవన్నట్లు అనుకోవటం సరైనది కాదు.
.................................
 

కొన్ని కారణాలవల్ల కొన్ని విదేశదేశాలు ధనికదేశాలయ్యాయి. భారతదేశంలో పేదరికం ఉన్నది. అందువల్ల కూడా భారతదేశంలో చాలామందికి సరైన ఆహారం లభించటం లేదు. విదేశాల్లో పేదలు తక్కువున్నారు.

........................... 

అయితే, భారతీయులు బలహీనంగా ఉన్నారని చెప్పిన వాళ్ళు , భారతదేశం మంచిగా ఉండాలని ఎన్నో విషయాలు చెప్పినవాళ్లే. ఆధునిక యువత జంక్ ఫుడ్ తగ్గించి, పుష్టికరమైన ఆహారం తినాలని, మంచిగా వ్యాయామం చెయ్యాలని చెప్పటం కూడా వాళ్ల అభిప్రాయం అయి ఉంటుంది.  

వాళ్ళుచెప్పిన మరికొన్ని విషయాలను గమనించి, భారతీయులు తమనుతాము సరిదిద్దుకోవాలి.

కొందరు విదేశీయులు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటారు. కొందరు ఇష్టం వచ్చినట్లు తింటారు. విదేశీయులు కొందరు నడకకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కొంత సమయం ఉంటే ప్రకృతి సందర్శనకు వెళ్తారు.చాలామంది విడేశీయులు తమ రోడ్లను శుభ్రంగా ఉంచుతున్నారు.

 భారతీయులు నడక తగ్గించారు. ప్రకృతిసందర్శనకు వెళ్లటమూ తక్కువే. పాతకాలంలో తీర్ధయాత్రలకు నడిచి వెళ్లేవారు. ఇప్పుడు వాహనాలు వచ్చాయి. భయం వల్లో భక్తివల్లో కొందరైనా దైవదర్శనానికి నడిచి వెళ్తారు. అదీ మంచిదే. 

ఎవరైనా నడవలేని పరిస్థితిలో ఉంటే, కుర్చిలో కూర్చుని కొన్ని వ్యాయామాలు చేయవచ్చు.

ఈ రోజుల్లో, చాలామంది భారతీయులు ఆహారాన్ని ఇంట్లో వండటం తగ్గించి బయట ఎక్కువ తింటున్నారు. 
  ఇంటి ఆహారంలో కూడా మైదాబ్రెడ్, మైదానూడుల్స్, బయట తెచ్చిన చిప్స్ పిల్లలకు ఎక్కువగా పెట్టేవాళ్ళున్నారు. 

మైదాతో  బ్రెడ్డులు, బిస్కెట్స్,పిజ్జాలు, నూడుల్స్ విదేశాలనుంచి  వచ్చినవే కదా. నూడుల్స్ మైదాతో కాకుండా బియ్యం, జొన్నలు తో చేస్తే ఫరవాలేదు. బయట అమ్మేవి ఎలా చేస్తారో తెలియదు.

ఈ రోజుల్లో, చాలామంది భారతీయులు రోడ్లను శుభ్రంగా ఉంచటం లేదు. పరిసరాలు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. 
..........................
ఆ డాన్స్ కు సంబంధించి మరికొన్ని వివరాలను క్రింద చూడవచ్చు.

నేను ఇక్కడ వీటికి డైరెక్ట్ లింక్ ఇవ్వటం లేదు. కాపి..పేస్ట్..క్లిక్ చేసి చూడవచ్చండి.

 ................
Fugdi Stage Dance Performance 2026 | Traditional Fugdi of Goa | Ganesh Chaturthi Special
********************
Prudent Media Chavath Fugdi Part 1 17sept15 Part 2
240K views 10y ago
Goa Network
.***************

 You
@KKLandge
kathvat kana mangalagaur #viralvideo #trending #mangalagaur #mangalagauri

............................ 

 ఈ పోస్ట్ కొంతకాలం తర్వాత ఇక్కడ డిలిట్ చేసి, వేరే దగ్గర వేస్తాను.

 

 

Friday, August 7, 2026

ఎప్పుడొస్తుందో ?

 
 
ఊరు వెళ్ళి ఈ మధ్యే వచ్చాము. ఊళ్ళు వెళ్ళినప్పుడు అనేక ప్రాంతాలు చూస్తుంటాము. ఇలాంటప్పుడు కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే,  స్వాతంత్య్రం  వచ్చి ఇన్నేళ్ళయినా మనదేశంలో పేదరికం వంటి సమస్యలు   ఇంకా ఎందుకున్నాయో ? అనిపిస్తుంది.

ప్రజలు తలచుకుంటే ఏమైనా చేయగలరు. అయితే, చాలామంది ప్రజలలో దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన అంతగా లేదు.

తమ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోలనే తాపత్రయం తప్ప దేశం బాగుపడాలనే తాపత్రయం తగ్గిపోయింది.

ఇతర దేశాలు చక్కగా అభివృద్ధి అయినప్పుడు  మన దేశం  ఎందుకు అభివృద్ధి చెందలేదు ?   
అయితే, ఇక్కడ చాలామందిలో బాధ్యత, చిత్తశుద్ధి వంటివి లేవు.

ఎవరైనా  ఏదైనా మాజిక్  చేసి దేశాన్ని బాగుచేస్తే  ఎంజాయ్ చేయటానికి మాత్రం చాలామంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు.  అంతేకానీ,  దేశం అభివృద్ధి చెందాలంటే అందరూ కృషిచేయాలని చాలామంది అనుకోవటం లేదు. 

ప్రతి ఒక్కరు తమ పనినితాము నీతిగా, చిత్తశుద్దిగా చేస్తే చాలు దేశం దానికదే బాగుపడుతుంది. అయితే, అలాంటి పరిస్థితి  ఎప్పుడొస్తుందో  తెలియటం లేదు. 

అభివృద్ధి చెందిన విదేశాలను చూసి నిట్టూర్చటం తప్పా,  మన దేశాన్ని మనం బాగుచేసుకోలేక పోతున్నాం. మన దేశాన్ని  బాగుచేసుకోలేని  దద్దమ్మలమా మనం?

స్వాతంత్రోద్యమ కాలపు ప్రజలలో చాలమందికి పౌరుషం, దేశాన్ని బాగుచేసుకోవాలనే తపనా ఉండేవి.  
 
   ఇప్పటి కాలంలో చాలామందికి ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలనే తాపత్రయం తప్ప ఇంకేమీ  ఫీలింగ్స్   లేవు.
 
 మనుషులు మంచిగా ఉంటే ప్రపంచంలో మంచి ఉంటుంది.
 
 చాలామంది  అవినీతి..అత్యాశ..స్వార్ధం..చెడ్డ కోరికలతో ప్రపంచంలో చెడును పెంచుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో  మార్పు ఎప్పుడొస్తుందో ? 
..................
దైవభక్తులము అనుకునేవారు, చెడ్డపనులు చేసి ప్రపంచంలో చెడును పెంచకూడదు..ప్రపంచాన్ని కష్టపెట్టకూడదు కదా..మనస్సును అదుపులో ఉంచుకుని మంచిగా ప్రవర్తించేలా గట్టిగా ప్రయత్నించాలి.
 ..............................
 ప్రపంచంలో అందరూ మంచిబుద్ధితో ఉండేలా దయచూడమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

అందరూ మంచిగా జీవించటానికి గట్టిగా ప్రయత్నించాలి.
 
 దైవమే దిక్కు.
..................................
 
 లోకంలో కొందరు దుర్మార్గులు దారుణాలు చేసినప్పుడు  మనకు ఏమనిపిస్తుందంటే,   దైవం లోకంలోని చెడ్డవారిని అందర్నీ చంపేయవచ్చు కదా.. అనిపిస్తుంది. 

అన్నీ దైవమే చేస్తే మనుషులు ఏం చేస్తారు? టెక్నాలజీ పేరుతో ప్రకృతిని ధ్వంసం  చేయటం, పశుపక్ష్యాదులను చంపి తింటూ, మద్యం, మత్తుపదార్ధాల మత్తులో నేరాలు..ఘోరాలు చేయటం , పాపాలు చేసి అయినా ఆస్తులు పెంచుకుంటూ విలాసాలలో మునిగి ఉంటారా? 
 
దైవం జీవులకొరకు మంచి వాతావరణం, ఆహారం కొరకు ఎన్నో మొక్కలను, ఆహ్లాదకరంగా ఎన్నో సుందర ప్రకృతిదృశ్యాలను..ఇంకా ఎన్నింటినో ప్రసాదించినా కూడా,   సంతోషంగా ఉండటం చేతకాక... అంతులేని కోరికలతో, అసూయాద్వేషాలతో కొట్టుకు పోతున్నారు.

మనం ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ మన ప్రయత్నాలు మనం చేస్తూ.. కాపాడమని దైవాన్ని ప్రార్ధిస్తే కలికాలంలోనైనా కూడా , అమాయకులు, మంచివారైన వారికి బాధలు గణనీయంగా తగ్గే అవకాశముంది. 
 
అంతా దైవము దయ.
 
 

Sunday, February 8, 2026

కొన్ని విషయములు..

 

శ్రీపరమాత్మనే నమః 

 (శ్రీమాత్రే నమః శ్రీ పరమాత్మనే నమః).....ఇలాగ ఏ దేవతా రూపాన్ని అయినా ..నిరాకారదైవముగా అయినా అనుకోవచ్చు. ఇంకా తేలికగా మాతా అని పరమాత్మా అని అనుకోవచ్చు.

 దైవము శాశ్వత పరమానంద స్వరూపులు. అత్యంత శక్తిమంతులు. 

దైవము, సృష్టిలో జీవులకు అవసరమైనటువంటివెన్నో సృష్టించి ఇచ్చారు. చక్కటి వాతావరణం, ఆహారానికి అవసరమైన ఎన్నో మొక్కలు, ఎన్నో పువ్వులతో కూడిన మొక్కలు, ఎన్నో సుందరదృశ్యాలను..  ఇచ్చారు. 

దైవానికి అనేక కృతజ్ఞతలు. 
....................

 దైవపూజలు చేసినప్పుడు ప్రజలు , ప్రపంచంలో అందరికి తమతో సహా బుద్ధి సరిగ్గా ఉండాలని కూడా దైవాన్ని ప్రార్ధించుకుంటే మంచిది. 

బుద్ధి సరిగ్గా ఉంటే అంతా మంచిగా ఉంటుంది. 

..............................

లోకంలో కొందరు దుర్మార్గులు దారుణాలు చేసినప్పుడు  మనకు ఏమనిపిస్తుందంటే,   దైవం లోకంలోని చెడ్డవారిని అందర్నీ చంపేయవచ్చు కదా.. అనిపిస్తుంది. 

అన్నీ దైవమే చేస్తే మనుషులు ఏం చేస్తారు? టెక్నాలజీ పేరుతో ప్రకృతిని ధ్వంసం  చేయటం, పశుపక్ష్యాదులను చంపి తింటూ, మద్యం, మత్తుపదార్ధాల మత్తులో నేరాలు..ఘోరాలు చేయటం , పాపాలు చేసి అయినా ఆస్తులు పెంచుకుంటూ విలాసాలలో మునిగి ఉంటారా? 
 

 దైవం జీవులకొరకు మంచి వాతావరణం, ఆహారం కొరకు ఎన్నో మొక్కలను, ఆహ్లాదకరంగా ఎన్నో సుందర ప్రకృతిదృశ్యాలను..ఇంకా ఎన్నింటినో ప్రసాదించినా కూడా,   సంతోషంగా ఉండటం చేతకాక... అంతులేని కోరికలతో, అసూయాద్వేషాలతో కొట్టుకు పోతున్నారు.
 

మనం ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ మన ప్రయత్నాలు మనం చేస్తూ.. కాపాడమని దైవాన్ని ప్రార్ధిస్తే కలికాలంలోనైనా కూడా , అమాయకులు, మంచివారైన వారికి బాధలు గణనీయంగా తగ్గే అవకాశముంది. అంతా దైవము దయ.

................................ 

ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో శుభాలు జరిగాయి. అశుభాలు కూడా జరిగాయి.

 ప్రపంచంలో మతాల పేరిట, అధికారం గురించి, సంపదల గురించి ఎన్నో పోరాటాలు, రక్తపాతాలు,
 హింస.. జరిగాయి. ఇదంతా ఎంతో బాధాకరమైన విషయం.

 ఆధునికకాలంలో చాలామందిలో అత్యాశ,  పాపాలు చేసి  అయినా డబ్బు సంపాదించాలనే తత్వం పెరిగాయి. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు. 

డబ్బు, అధికారం..కొరకు ఎన్నో పాపాలు చేస్తున్నారు. సామాన్యజనం కూడా తమ వంతు పాపాలు చేస్తున్నారు. వీటి ఫలితాలే ప్రస్తుతం ప్రపంచం అనుభవిస్తోంది.

మద్యపానం, మత్తుపదార్ధాల వల్ల సమాజానికి చాలా నష్టం జరుగుతోంది. 

సోషల్మీడియాలో హింసాత్మక దృశ్యాలు, చెడ్ద విషయాలు వల్లకూడా చాలామంది ప్రభావితులవుతున్నారు. 

    ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా,  నీతినియమాలను పాటించనివారిని మనం ఏం చేయగలం?  వారి సంగతి దైవం చూసుకుంటారు.

 కొందరైనా నీతినియమాలతో దైవభక్తి కలిగి.. ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ ..దైవాన్ని ప్రార్ధిస్తే.. ఆ ఫలితం వల్ల దైవకృప కలిగి.. సమాజంలో శాంతి నెలకొనే అవకాశముంది.
......................

ఆ మధ్య ఒక పేరుపొందిన వారు  చెప్పినదాన్ని బట్టి.... ఆధునిక కాలంలో జీవ హింస చేయటం బాగా పెరిగింది. పశుపక్ష్యాదులను చంపి తినటం విపరీతంగా పెరిగింది... 

అలా చనిపోయిన జీవుల ఉసురు తగిలి కూడా ప్రపంచంలో కష్టాలు వస్తున్నాయని వారు తెలియజేసారు. 

మనుషులకు జరుగుతున్న హింస పట్ల మనకు ఇంత బాధ ఉన్నప్పుడు, జంతువుల పట్ల మనం చేస్తున్న హింస గురించి కూడా మనము ఆలోచించాలి.

కారణాలేమైనా కూడా, ప్రపంచంలో జరుగుతున్న  ఘోరాలు వింటుంటే చాలా బాధగా ఉంది. రాక్షసప్రవృత్తి కలవారి పట్ల సౌమ్యత, సహనం పనికిరాదు. ఎలాగైనా ఈ ఘోరాలు ఆగాలి. 

అయితే, అంతా దైవం మీదే భారం వేసి కూర్చోవటం కాకుండా, దారుణాలు ఆగడానికి అందరూ తమవంతు ప్రయత్నం చేయాలి. 

************** 

ప్రపంచంలో  ఎన్నో సమస్యలున్నాయి. ఎవరికి ఏం చెప్పినా వినే వాళ్ళెంతమంది? పాటించేవాళ్లెంతమంది? 

మనుషులు చేస్తున్న పాపాల వల్ల ఎవరి కర్మ వారిదని దైవము ఊరుకుంటున్నారేమో? 

   యుద్ధాలు, హృదయవిదారకమైన ఘటనలు, యాక్సిడెంట్లు, రక్తపాతాలు జరిగినప్పుడు... అమాయకులైన 
చిన్నపిల్లలు, మంచివాళ్లు, మూగజీవులు .. కష్టాలు పడినప్పుడు ఎంతో బాధనిపిస్తుంది. 

దైవం చెడ్డవారిని శిక్షించి, ఆ దారుణాలను ఆపితే బాగుంటుంది కదా ..అనిపిస్తుంది. 
.......................

గ్రంధాల ద్వారా దైవం.. రాక్షసులను చంపివేసి లోకాన్ని రక్షించిన సంఘటనలు గురించి మనం తెలుసుకోవచ్చు.

 అయితే, ఏది ఎందుకు జరుగుతుందో చాలాసార్లు అర్ధం కాదు. మహాభారతంలో శ్రీకృష్ణులవారు..తమ గురువుయొక్క మరణించిన పుత్రులను తీసుకువచ్చి ఇచ్చారు. 

కానీ, యుద్ధంలో అభిమన్యుని రక్షించలేదు. అలా జరగడానికి గల కారణాలు మనకు తెలియకపోవచ్చు. లోకంలో కూడా చాలా విషయాలు మనకు అర్ధం కావు. దైవానికి అన్నీ తెలుస్తాయి.

  మనలో చాలామంది జీవితంలో...దైవం ఉన్నారని చక్కగా అనుభవంలోకి వచ్చిన సంఘటనలు ఉంటాయి.  దైవాన్ని నమ్మి.. ధర్మబద్ధంగా జీవించాలి.

...............

 ప్రపంచంలో శాంతి నెలకొనాలని , అంతా బాగుండాలని ...అందరూ మనస్పూర్తిగా దృఢంగా దైవాన్ని ప్రార్ధించాలి.  దైవాన్ని, దైవనామాన్ని అందరూ స్మరించుకోవాలి.

.................

 నైతికవిలువలను పాటించే మనుషులున్న సమాజం ప్రశాంతంగా ఉంటుంది. నేరాలు..ఘోరాలు ఉండవు. అందరికి  దైవభక్తి.. ధర్మబుద్ధి ఉండాలని గట్టిగా కోరుకుందాము.
 ..................

 దైవము దయ.

 


ఈ రోజుల్లో ..వచ్చాక ...


ఈ రోజుల్లో టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు..వచ్చాక ఎన్నో ప్రోగ్రాంలు ప్రపంచమంతటా ప్రసారమవుతున్నాయి. 
 
మంచి ప్రోగ్రాంస్ తో పాటు హారర్ ప్రోగ్రాంస్ కూడా ఉంటాయి.
 
  ఈ తరంగాలు వాతావరణంలో ఉండి, వాటి ప్రభావం మనుషుల మీద ఉంటుందనిపిస్తుంది.

చెడుప్రసారాల వల్ల మనుషుల్లో చెడ్డతనం పెరుగుతుందనిపిస్తుంది. అయితే, చెడుప్రసారాలను ఎంతకని ఆపగలం?

మంత్రాలను పఠిస్తే, ఆ తరంగాల వల్ల వాతావరణం శుద్ధి అవుతుందంటారు. మంత్రాలను మనస్సులో కూడా అనుకోవచ్చు.
  
దేవాలయాల్లో పూజాకార్యక్రమాలు జరుగుతాయి. అందువల్ల, వాతావరణం కూడా శుద్ది అవుతుంది.  
 
ధ్యానం ఎంతో శక్తివంతమైనదని అంటారు. ధ్యానము పైకి అందరికి వినిపించేలా చేయకపోయినా కూడా, ధ్యానము శక్తివంతమైనది.
 
 ఇళ్ళలో వీలున్నప్పుడు కొద్దిసేపయినా  భక్తిగీతాలు..పెట్టుకుంటే మంచిది. తక్కువ సౌండుతో తప్పుల్లేకుండా ఉన్న మంత్రాల కాసెట్ పెడితే మంచిది. 

 వాటిని వింటూ పనులు మాని అక్కడే కూర్చోవాలని ఏమీ లేదు.
  మన పనులు మనం చేసుకుంటూనే అవి వాతావరణంలో ప్రసారమవుతాయి. 

(ఇళ్ళలో నెలసరి సమయంలో మంత్రాలు పెట్టకూడదు కావచ్చు.)

చాలామందికి వినిపించాలని పెద్దశబ్దంతో పెట్టనవసరం లేదు.. 
 పెద్ద సౌండ్ వల్ల చుట్టుపక్కల వారికి  సమస్యలు ఉంటాయి.     చిన్న శబ్దంతో పెట్టినా కూడా, ఆ మంత్రశక్తి వాతావరణంలో వ్యాపించి, మంచిమార్పు వచ్చే అవకాశముంది.
 
కొన్ని దేవాలయాల్లో మైకుద్వారా వినిపించేలా కాసెట్ పెట్టి మంత్రాలను, భక్తిగీతాలను వినిపిస్తారు.  
 
మైకులో పెద్దశబ్దం పెడితే, కొన్ని విషయాలు ఆలోచించాలి. పెద్దశబ్దంతో పెట్టే మైకులకు సమీపంలో ఉండే ఇళ్లల్లో ఉండే వారికి కొన్ని సమస్యలుంటాయి....

 ఒకరిమాట ఒకరికి సరిగ్గా  వినిపించదు. ఫోన్లో మాట్లాడలేము. ఇంట్లో సరిగ్గా పూజ చేయలేము. కొందరికి తలతిరిగే పరిస్థితి కూడా ఉంటుంది. అందువల్ల చిన్నశబ్దంతో ఉంటే హాయిగా ఉంటుంది.

*********************
  ఈ రోజుల్లో టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు..ద్వారా  ప్రసారమవుతున్న వాటిలో, మంచి ప్రోగ్రాంస్ తో పాటు హింసతో కూడిన ప్రోగ్రాంస్ కూడా ఉంటాయి. 
 
చాలామంది పిల్లలు, పెద్దవాళ్లు హారర్ ప్రోగ్రాంస్ భయపడుతూ కూడా చూస్తారు. 

సీరియల్స్ చూస్తే,  ఇళ్లలో ఒకరితో ఒకరు కొట్లాడుకోవటమే ఎక్కువవుంటుంది. 

అస్తమానం హింసతో కూడిన ప్రోగ్రాంస్, గొడవలు కాకుండా,కామెడీ ఎక్కువ ఉండే ప్రోగ్రాంస్ ఎక్కువ రావాలి. 

కొన్ని వీడియోగేంస్ కూడా ఒకరితోఒకరు కొట్టుకోవటం వంటివి ఉంటాయి. అవి ఆడినవారికి ఇరిటేషన్ పెరిగే పరిస్థితి రావచ్చు.

చాలాసమయం సెల్ఫోన్లు చూస్తే ఇరిటేషన్ వస్తుంది. చేతులు, మెడ నొప్పులు వస్తాయి. ఇంకా కొన్ని శారీరిక, మానసిక సమస్యలు వచ్చే అవకాశముంది.

 ఆరుబయట ఆడుకోవటం, నడవటం, ఇరుగుపొరుగు వారు కబుర్లు చెప్పుకోవటం, తోటపని, బాల్కనీలో కూర్చుని మంచిపాటలు వినటం.. చేయవచ్చు. 

సెల్ఫోన్లు పట్టుకుని చూడటం తగ్గించి, ఫోన్ పక్కన పెట్టి రేడియోలా వినవచ్చు.
.......................
 
ఇంకా, మనుషుల్లో, దైవభక్తి..మంచితనం ఉన్నాయి కాబట్టి,  ప్రపంచం ఈ మాత్రం అయినా బాగుంది. 
 .................
oka link..


Monday, December 22, 2025

పగిలిన గాజుముక్కలను....

 

ఎన్నో గాజు సామాన్లను వాడతాం. అవి పగిలినప్పుడు మాత్రం వాటిని ఎక్కడ ఎలా పడెయ్యాలో అనేది కష్టంగా ఉంటుంది.


 పగిలిన గాజుముక్కలను అలాగే బయట పడేస్తే అవి గుచ్చుకుని పారిశుధ్యసిబ్బందికి, బయట ఆహారం కొరకు తిరిగే జంతువులకు గుచ్చుకుని గాయాలు అయ్యే ప్రమాదముంది.

 అందువల్ల గాజు ముక్కలను ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి,  పాతబట్టలను మందంగా వాటికి గట్టిగా చుట్టి,  మరల ప్లాస్టిక్ కవర్లో చుట్టి అప్పుడు వాటిని ప్లాస్టిక్ చెత్త వేసే డబ్బాలలో వేయాలి. 

ఏదైనా పెట్టెలో పెట్టి పడేస్తే ఇంకా మంచిది. ఇంకా ఏమైనా పద్దతులు కూడా ఉండవచ్చు. 


ప్లాస్టిక్ కాకుండా, చిన్న గోనె సంచి లేక కాటన్ సంచిలో వేసి చుట్టి, తాడుతో కట్టి కూడా పడేయవచ్చు. కొబ్బరి పీచుతో కూడా సంచులను తయారుచేయవచ్చు.

 పగిలిన గ్లాస్ పడెయ్యటానికి విడిగా చెత్తబాక్సులను ఏర్పాటు చేయాలి.

 గాజు సామాను కొనకుండా జాడీలను, మట్టిపాత్రలను కొనవచ్చు.

పాతకాలంలో జాడీలను వాడేవారు. ఇప్పుడు కూడా జాడీలను అమ్ముతున్నారు. అలాగే జాడీలు తయారుచేసే పద్ధతిలో కప్పులు, చిన్న జాడీలు, మగ్గులను కూడా అమ్ముతున్నారు. అవి పగిలినా కూడా గాజుగ్లాసులా పదునుగా గుచ్చుకోవు. 
 

ఈ రోజుల్లో చెత్తను ఎక్కడపడితే అక్కడ కుప్పలుగా పడేసి వదిలేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు సమాజంలో. అలాకాకుండా, సమాజం బాగుండేలా పాటించటానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. 

................................

marikonni vishayalu..



కొట్టేసిన అరటిచెట్లతో, చెరకు పిప్పితో ఎకో ప్లాస్టిక్ తయారుచేసి ఇళ్ళల్లో చెత్తను పడేసే కవర్లుగా చేయవచ్చు. ఇప్పుడు కూడా ఎకో కవర్లు అమ్ముతున్నారు. తాగిపడేసిన కొబ్బరి బోండాలను ముక్కలుచేసి కోకోపిట్ చేయవచ్చు. 
 
వరిపొట్టును మొక్కలకు ఎరువుగా వాడవచ్చు. పెద్ద పార్కుల్లో రాలిపడిన ఆకులు గుట్టలుగా పోస్తారు. అవి అదే పార్కులో మొక్కలకు మంచి ఎరువుగా ఉపయోగపడతాయి. మిగిలితే బయట కూడా అమ్మవచ్చు.


 

Monday, November 24, 2025

కొన్ని విషయములు..

 

 link..

ఓం, దైవానికి అనేక వందనములు...

 link..

  • ఓం..
  •  
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. ....4
  •  
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. .3
  •  
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్....2
  •  
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. 1
  •  

  •  

    కొన్ని సందేహాలు..కొన్ని ఆలోచనలు..

     

     నాకు కొన్ని సందేహాలు కలిగాయి. 

    నెలసరిలో ఉన్నప్పుడు దైవస్మరణ.. దైవనామస్మరణ.. చేస్తే దోషం కాదు కాని, మంత్రాలు.. స్తోత్రాలు.. చేయకూడదంటున్నారు కొందరు.

      కార్తికమాసంలో కొన్ని దేవాలయాల్లో ఎవరైనా నెలకు కొంత డబ్బు కడితే, నెలంతా అభిషేకాలు..పూజలు చేస్తున్నారు. ...

    అలాంటప్పుడు ఆ కుటుంబంలో స్త్రీలకు నెలసరి వస్తే అప్పుడు వాళ్ళ పేరు కూడా పూజలో చదువుతారు కదా....అప్పుడు వాళ్లు పూజ చేసినట్లే కదా..

    మరి అలాంటప్పుడు దోషం ఉంటుందా? ఉండదా? అని సందేహం అనిపించింది. 

    అర్చనలు చేయించుకునేటప్పుడు కూడా వేరే ఊళ్లలో ఉండే కుటుంబసభ్యుల పేర్లు కూడా చెప్పి అర్చన చేయిస్తారు. 

    పూజలో పేర్లు ఉన్న వాళ్ళు నెలసరిలో ఉంటే అప్పుడేమిటి?

     ఇలా పూజలు చేయించుకుంటే చేయించుకున్నవాళ్లకు, చేయించిన వాళ్లకు, చేసిన వారికి...కూడా దోషం వస్తుందా? అలా ఏమీ కాదా? 

    పూజకు డబ్బు కట్టిన తరువాత, ఎవరి ఇంట్లో అయినా అకస్మాత్తుగా మైల పాటించే పరిస్థితి వస్తే,  ఆ సంగతి
    ని వాళ్ళు   చెప్పకపోవచ్చు.

    అంటుముట్టు..మైల ఉన్నాకూడా, దేవాలయంలో లేకుండా దూరంగా ఉంటే, వారి పేరుతో ఏ పూజ అయినా  చేయించుకోవచ్చా? అలా చేస్తే ఏమైనా దోషం ఉంటుందా? ఉండదా? తెలియటం లేదు.

     ఇన్ని  సందేహాలు ఎందుకు అంటే, నెలసరి దోషం వల్ల చాలా కష్టాలు వస్తాయంటున్నారు అని.

    స్త్రీల అంటుముట్టు గురించి పబ్లిక్ గా మాట్లాడటం ఏమిటీ అంటున్నారు కొందరు.

     మరి స్త్రీల నెలసరి గురించి అలా చేయకూడదు..ఇలా చేయకూడదు..చేస్తే కష్టాలు వస్తాయని పబ్లిక్ గా కొందరు చెబుతున్నప్పుడు, ఆ సందేహాల గురించి పబ్లిక్ గా మాట్లాడితే తప్పేమిటి?

    ఇంకా, చాలా విషయాల గురించి కూడా.. ఇలా చేయకూడదు..అలా చేయకూడదు..చేస్తే కష్టాలు వచ్చి మీద పడిపోతాయని చెబుతున్నారు. ఇవన్నీ విని, ఏం చేస్తే ఏం తప్పో? అనే పరిస్థితితో భయం, అయోమయం కలిగి, అనేక సందేహాలతో సతమతమయ్యే పరిస్థితి ఉంటుంది.

      .............................

    లోకకల్యాణం కొరకు పూజలు చేసే సందర్భాలలో.. లోకంలో అంతా బాగుండాలని పూజ చేస్తారు. 

    ఎవరికి వారు పూజలు చేయించుకునే సందర్భాలలో.. అంటుముట్టు, మైలలో ఉన్నవారు కొన్ని రోజులు ప్రత్యేక పూజలు చేయడానికి దూరంగా ఉండాలంటారు.

    నాకు ఏమనిపిస్తోందంటే,  అర్చన, అభిషేకం వంటి సందర్భాలలో..వేరే ఊరిలో ఉన్న కుటుంబసభ్యులందరి పేర్లు చెప్పటం సంగతి ఏమోకానీ..

    అంతా బాగుండాలని, కుటుంబంలో అందరూ బాగుండాలని.. భావిస్తూ పూజ చేయిస్తున్నట్లుగా (పూజారి గారితో) పూజ చేయించవచ్చేమో? అనిపించింది. 

    (వేరే ఊరిలో ఉన్నవారి  పరిస్థితి(అంటుముట్టు..) గురించిన సంగతులు తెలియనప్పుడు, ఇలా కూడా చేయవచ్చేమో?..అనిపించింది.)

    .........................

      ఇంకొక విషయం ఏమిటంటే, కొన్నిసార్లు పూజలలో సుమారు అర్ధగంటకు పైగా  గోత్రనామాలు ..కుటుంబసభ్యుల పేర్లను చదవటంతోనే సరిపోతుంది.

     మేము చెన్నైలో ఉన్నప్పుడు,  అక్కడ దేవాలయంలో ..అర్చన కొరకు గోత్రనామాలు చెప్పకపోయినా కూడా,  స్వామిపేరుతో.. అని చెప్పి అర్చన చేసేవారు. 

    పేర్లు చెప్పకుండా ఈ పద్ధతి సులభంగా అనిపించింది.

    ....................

    గోత్రనామాలు చెప్పినా చెప్పకపోయినా,  దైవప్రీతి కొరకు.. జీవప్రీతి కొరకు ..కష్టాలు తొలగటానికి ..ఇలా దైవానికి ఎవరికి వారు మనస్సులో కూడా చెప్పుకోవచ్చు.

    మన గురించి, మన ఆలోచనల గురించి..అన్నీ దైవానికి తెలుస్తాయి.

     ............................

    వ్రాసినవాటిలో ఏమైనా తప్పులుంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.