koodali

Wednesday, September 16, 2026

ఒక్క వ్యక్తి ఒక నదినే శుభ్రం చేయగలిగినప్పుడు, అందరూ గట్టిగా అనుకుని చేస్తే..



ఆ మధ్య ఒకే అబ్బాయి ఒక్కడే ఒక నదిని శుభ్రం చేశాడని వార్తల ద్వారా తెలిసింది. నిజంగా ఎంతో గొప్ప వ్యక్తి.అతని జన్మ ధన్యము. అలాంటి మనుషులుంటే చాలు.

ఒక్క మనిషి అంత చేశాడంటే అందరూ తలచుకుంటే ఏదైనా చేయొచ్చు కదా..

నేను కూడా ఆ అబ్బాయిలా చెయ్యలేను. నా పరిధిలో నేను ప్లాస్టిక్ విచ్చలవిడిగా పడెయ్యకుండా రోజు వచ్చే ప్లాస్టిక్ ఒకపెద్ద ప్లాస్టిక్ బాగ్ లో వేసి, అది నిండాక గట్టిగా కట్టి బయట పెడతాను.  కొంతవరకు నేను చేయగలిగింది చేస్తున్నాను.

అందరూ ఆ అబ్బాయిలా శుభ్రం చేయలేరు కాని, ఎవరి పరిధిలో వారు శుభ్రతను పాటిస్తే సమాజం దానికదే బాగుపడుతుంది.

 ..............................

ప్రాచీనకాలం నుంచి ఎంతో గొప్పదైన భారతదేశం, ఇప్పుడు కూడా గొప్పవ్యక్తిత్వం కల ప్రజలతో గొప్పగా ఉండాలని, శుచి,శుభ్రతతో,సిరిసంపదలతో, తులతూగాలని అనిపిస్తుంది.

.........................

భారతీయులు చాలామంది ఎందుకు విపరీతంగా ప్రవర్తిస్తున్నారో తెలియటం లేదు. స్వార్ధం, ఎలాగైనా డబ్బు సంపాదించాలనే అత్యాశ, అశుభ్రత, ఒక పద్ధతి లేకుండా ప్రవర్తిస్తున్నారు.  క్యూలైన్లలో వెళ్ళటం పాటించరు.

దేశంలో కొందరు తమకు డబ్బు, అధికారం కొరకు సాటిమనుషులను పట్టించుకోవటం లేదు. చచ్చాక ఏమవుతారో తెలియదు. చేసిన పాపాలకు మరుజన్మలో ఎన్ని కష్టాలు పడతారో తెలియదు.  తరతరాలకు కూడబెట్టి ఏం లాభం?
 

భారతదేశంలో చాలా స్వేచ్చ ఉన్నట్లుంది. చాలామంది,మా మనోభావాలు అంటూ..ఎవరి ఇష్టానికి వాళ్లు ప్రవర్తిస్తున్నట్లుంది.

వీధుల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త పోయటం, కిళ్లీలు ఊయటం, ఇలా ఎన్నో ఎన్నెన్నో..రైల్వేస్టేషన్, బస్సుస్టాండ్లు..పబ్లిక్ ప్లేసెస్ అశుభ్రత చూస్తే వాంతి వస్తుంది.  పబ్లిక్ టాయ్లెట్లు సంగతి ఇక చెప్పనక్కరలేదు.
 

............................

సినిమావాళ్లు కనిపిస్తే వేలంవెర్రిగా నెట్టుకుని కొందరు చనిపోయే పరిస్థితి కూడా ఉంటుంది.

 విదేశాలకు వెళ్ళి వాళ్లు కొందరు ,  రోడ్లపైన సినిమాడాన్సులు వేస్తూ... గొప్ప అనుకుంటున్నారు.

  స్వదేశంలోనైనా,విదేశాల్లో అయినా భారతీయులు గొప్పగా, పద్ధతిగా ఉండాలి. వెకిలిగా రోడ్లపైన సినిమాడాన్సులు వేయటం ఏమిటో? 

అయినా, నిజజీవితంలో స్త్రీలుపురుషులు ఎవరైనా చెట్ల చుట్టూ  తిరుగుతూ ఒకరినొకరు పట్టుకుని పాటలు పాడుతూ డ్యాన్సులు వేయరు కదా. అలా సినిమావాళ్లు చూపిస్తే, జనాలు నోరెళ్లబెట్టి ఆహా,ఓహో అని చూస్తున్నారు.

ఇవన్నీ వచ్చాకే పార్కుల్లో కొందరు జంటలు చెట్ల చాటున కూర్చుంటున్నారు. సినిమాల్లో డ్యూయట్లు వంటివి బాన్ చెయ్యాలి. బయట ఎవరూ గెంతుకుంటూ అలా డాన్సులు వేయనప్పుడు, అలా ఎందుకు చూపిస్తారో?

 భవిష్యత్తులో ఈ సినిమాలు చూసి భారతదేశంలో ప్రేమికులు, అలా ఆరుబయట ఒకరివెనకాల ఒకరు పడి పాటలు పాడుతూ డాన్సులు చేసేవారు కాబోలని అనుకుని, చరిత్రలో వ్రాసే ప్రమాదముంది. 

..........................................

ఇక, పండుగల్లో రసాయనాలరంగులేసిన విగ్రహాల్ని నీటిలో నిమజ్జనం చేయటం స్వదేశంలో అయినా, విదేశాల్లో అయినా తప్పే. రసాయనాలు, ప్లాస్టిక్..నీటిలో వేస్తే నీరు కలుషితం అవుతుంది.

పాతకాలంలో రసాయన రంగులు వేయని మట్టివిగ్రహాలే నీటిలో నిమజ్జనం చేసేవారు.కొత్తగా రసాయనాలు, ప్లాస్టిక్ వాడుతూ అవన్ని ప్రాచీన సాంప్రదాయాలు అనటం తప్పు.

....................................................

కొన్ని  విదేశాల్లో పెద్దపెద్దశబ్దాలు చేస్తే ఊరుకోరు. భారతదేశంలో ఎన్ని శబ్దాలు చేసినా, విపరీతమైన శబ్దంతో మైకు పెట్టినా పట్టించుకునే వాళ్ళులేరు. 

 
కొన్ని జనాభా ఎక్కువున్న దేశాల వాళ్ళు కూడా,  తమ దేశాన్ని శుభ్రంగా ఉంచుకుంటున్నారు.  పువ్వులమొక్కలు, రోడ్లపక్కన చెట్లు ఎంతో అందంగా ఉంటాయి.  వీటికి ఎక్కువ డబ్బు ఖర్చు ఉండదు.

 మనదేశంలో ఎవరైనా చెట్లు పెట్టినా కూడా, రకరకాల కారణాలు చెప్పి కొట్టేయటం ఎక్కువ. 

ఏం చెయ్యాలన్నా కొందరు, ఎక్కువ డబ్బు లేదంటారు. ఆ అబ్బాయి దగ్గర బోలెడు డబ్బు, సాయం చేసే వాళ్లు లేకపోయినా,  గట్టి సంకల్పబలం ఉంది. 

అందరూ ప్రయత్నిస్తే కొంతకాలంలోనే శుభ్రంగా మార్చుకోవచ్చు. మొక్కలు, చెట్లు పెరగటానికి మరికొంత సమయం పడుతుంది. అవి పెరిగితే ఇంకా బాగుంటుంది. 

...............................

సనాతనసాంప్రదాయంలో శుభ్రతకు ఎంతో విలువుంది.  అశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవికి నచ్చదంటారు. 

పరమపూజ్యమైన దైవచిత్రాలను ఎన్నోచోట్ల  ముద్రించి, చెత్తకుప్పల్లో వేసే వాళ్లకు  ఏం చెబుతాం..?

నదులను  చక్కగా ఉంచాలని ప్రాచీనులు తెలియజేసారు.  నదుల్లో ప్లాస్టిక్, నగరాల మురికి, పరిశ్రమల వ్యర్ధాలు వదిలే వాళ్లకు శుభ్రత గురించి ఏం అర్ధమవుతుంది? 
.......................................

ఎంతమంది తిడుతున్నా..సినిమాలు, క్రికెట్ చూడటం, చెత్తను రోడ్ల పక్కన పడేసి, పట్టించుకోకుండా ఆ రోడ్లపైన తిరగటం..ఇంకా ఎన్నో ఉన్నాయి...

సినిమాహాల్లో పేపర్లు చింపి పొయ్యటం, రోడ్లపైన పేపర్లు చింపిపొయ్యటం, ఎవరు ఎత్తుతారు అవన్నీ?

  పరీక్షలు అయిపోతే రోడ్లపైన పేపర్లు వెయ్యకూడదని పిల్లలకు  తల్లితండ్రి, స్కూల్లో టీచర్లు చెప్పాలి. పెద్దవాళ్ళే శుభ్రత పాటించనప్పుడు ఇక పిల్లలకేం చెబుతారులే.

జనం ఎప్పటికి మారుతారో? పట్టించుకోకుండా బతకటం అలవాటయిన వాళ్ళకు..?
 

 ధర్మాన్ని పాటించనప్పుడు మోక్షం వస్తుందా? అయినా, ఎవరికర్మ వారిది. నాకు ఎందుకు తాపత్రయం.

........................... 

 ఎంతచెప్పినా వినకుండా సమాజాన్ని పాడుచేసేవాళ్లు  కొందరు ఉంటారు.  వాళ్లకు తగిన శిక్షలు వేయాలి.

చక్కని పద్ధతితో జీవించే  వారి సంఖ్య పెరిగితే చాలా విషయాలు బాగుంటాయి.


Friday, August 7, 2026

ఎప్పుడొస్తుందో ?

 
 
ఊరు వెళ్ళి ఈ మధ్యే వచ్చాము. ఊళ్ళు వెళ్ళినప్పుడు అనేక ప్రాంతాలు చూస్తుంటాము. ఇలాంటప్పుడు కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే,  స్వాతంత్య్రం  వచ్చి ఇన్నేళ్ళయినా మనదేశంలో పేదరికం వంటి సమస్యలు   ఇంకా ఎందుకున్నాయో ? అనిపిస్తుంది.

ప్రజలు తలచుకుంటే ఏమైనా చేయగలరు. అయితే, చాలామంది ప్రజలలో దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన అంతగా లేదు.

తమ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోలనే తాపత్రయం తప్ప దేశం బాగుపడాలనే తాపత్రయం తగ్గిపోయింది.

ఇతర దేశాలు చక్కగా అభివృద్ధి అయినప్పుడు  మన దేశం  ఎందుకు అభివృద్ధి చెందలేదు ?   
అయితే, ఇక్కడ చాలామందిలో బాధ్యత, చిత్తశుద్ధి వంటివి లేవు.

ఎవరైనా  ఏదైనా మాజిక్  చేసి దేశాన్ని బాగుచేస్తే  ఎంజాయ్ చేయటానికి మాత్రం చాలామంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు.  అంతేకానీ,  దేశం అభివృద్ధి చెందాలంటే అందరూ కృషిచేయాలని చాలామంది అనుకోవటం లేదు. 

ప్రతి ఒక్కరు తమ పనినితాము నీతిగా, చిత్తశుద్దిగా చేస్తే చాలు దేశం దానికదే బాగుపడుతుంది. అయితే, అలాంటి పరిస్థితి  ఎప్పుడొస్తుందో  తెలియటం లేదు. 

అభివృద్ధి చెందిన విదేశాలను చూసి నిట్టూర్చటం తప్పా,  మన దేశాన్ని మనం బాగుచేసుకోలేక పోతున్నాం. మన దేశాన్ని  బాగుచేసుకోలేని  దద్దమ్మలమా మనం?

స్వాతంత్రోద్యమ కాలపు ప్రజలలో చాలమందికి పౌరుషం, దేశాన్ని బాగుచేసుకోవాలనే తపనా ఉండేవి.  
 
   ఇప్పటి కాలంలో చాలామందికి ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలనే తాపత్రయం తప్ప ఇంకేమీ  ఫీలింగ్స్   లేవు.
 
 మనుషులు మంచిగా ఉంటే ప్రపంచంలో మంచి ఉంటుంది.
 
 చాలామంది  అవినీతి..అత్యాశ..స్వార్ధం..చెడ్డ కోరికలతో ప్రపంచంలో చెడును పెంచుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో  మార్పు ఎప్పుడొస్తుందో ? 
..................
దైవభక్తులము అనుకునేవారు, చెడ్డపనులు చేసి ప్రపంచంలో చెడును పెంచకూడదు..ప్రపంచాన్ని కష్టపెట్టకూడదు కదా..మనస్సును అదుపులో ఉంచుకుని మంచిగా ప్రవర్తించేలా గట్టిగా ప్రయత్నించాలి.
 ..............................
 ప్రపంచంలో అందరూ మంచిబుద్ధితో ఉండేలా దయచూడమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

అందరూ మంచిగా జీవించటానికి గట్టిగా ప్రయత్నించాలి.
 
 దైవమే దిక్కు.
..................................
 
 లోకంలో కొందరు దుర్మార్గులు దారుణాలు చేసినప్పుడు  మనకు ఏమనిపిస్తుందంటే,   దైవం లోకంలోని చెడ్డవారిని అందర్నీ చంపేయవచ్చు కదా.. అనిపిస్తుంది. 

అన్నీ దైవమే చేస్తే మనుషులు ఏం చేస్తారు? టెక్నాలజీ పేరుతో ప్రకృతిని ధ్వంసం  చేయటం, పశుపక్ష్యాదులను చంపి తింటూ, మద్యం, మత్తుపదార్ధాల మత్తులో నేరాలు..ఘోరాలు చేయటం , పాపాలు చేసి అయినా ఆస్తులు పెంచుకుంటూ విలాసాలలో మునిగి ఉంటారా? 
 
దైవం జీవులకొరకు మంచి వాతావరణం, ఆహారం కొరకు ఎన్నో మొక్కలను, ఆహ్లాదకరంగా ఎన్నో సుందర ప్రకృతిదృశ్యాలను..ఇంకా ఎన్నింటినో ప్రసాదించినా కూడా,   సంతోషంగా ఉండటం చేతకాక... అంతులేని కోరికలతో, అసూయాద్వేషాలతో కొట్టుకు పోతున్నారు.

మనం ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ మన ప్రయత్నాలు మనం చేస్తూ.. కాపాడమని దైవాన్ని ప్రార్ధిస్తే కలికాలంలోనైనా కూడా , అమాయకులు, మంచివారైన వారికి బాధలు గణనీయంగా తగ్గే అవకాశముంది. 
 
అంతా దైవము దయ.
 
 

Sunday, February 8, 2026

ఈ రోజుల్లో ..వచ్చాక ...


ఈ రోజుల్లో టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు..వచ్చాక ఎన్నో ప్రోగ్రాంలు ప్రపంచమంతటా ప్రసారమవుతున్నాయి. 
 
మంచి ప్రోగ్రాంస్ తో పాటు హారర్ ప్రోగ్రాంస్ కూడా ఉంటాయి.
 
  ఈ తరంగాలు వాతావరణంలో ఉండి, వాటి ప్రభావం మనుషుల మీద ఉంటుందనిపిస్తుంది.

చెడుప్రసారాల వల్ల మనుషుల్లో చెడ్డతనం పెరుగుతుందనిపిస్తుంది. అయితే, చెడుప్రసారాలను ఎంతకని ఆపగలం?

మంత్రాలను పఠిస్తే, ఆ తరంగాల వల్ల వాతావరణం శుద్ధి అవుతుందంటారు. మంత్రాలను మనస్సులో కూడా అనుకోవచ్చు.
  
దేవాలయాల్లో పూజాకార్యక్రమాలు జరుగుతాయి. అందువల్ల, వాతావరణం కూడా శుద్ది అవుతుంది.  
 
ధ్యానం ఎంతో శక్తివంతమైనదని అంటారు. ధ్యానము పైకి అందరికి వినిపించేలా చేయకపోయినా కూడా, ధ్యానము శక్తివంతమైనది.
 
 ఇళ్ళలో వీలున్నప్పుడు కొద్దిసేపయినా  భక్తిగీతాలు..పెట్టుకుంటే మంచిది. తక్కువ సౌండుతో తప్పుల్లేకుండా ఉన్న మంత్రాల కాసెట్ పెడితే మంచిది. 

 వాటిని వింటూ పనులు మాని అక్కడే కూర్చోవాలని ఏమీ లేదు.
  మన పనులు మనం చేసుకుంటూనే అవి వాతావరణంలో ప్రసారమవుతాయి. 

(ఇళ్ళలో నెలసరి సమయంలో మంత్రాలు పెట్టకూడదు కావచ్చు.)

చాలామందికి వినిపించాలని పెద్దశబ్దంతో పెట్టనవసరం లేదు.. 
 పెద్ద సౌండ్ వల్ల చుట్టుపక్కల వారికి  సమస్యలు ఉంటాయి.     చిన్న శబ్దంతో పెట్టినా కూడా, ఆ మంత్రశక్తి వాతావరణంలో వ్యాపించి, మంచిమార్పు వచ్చే అవకాశముంది.
 
కొన్ని దేవాలయాల్లో మైకుద్వారా వినిపించేలా కాసెట్ పెట్టి మంత్రాలను, భక్తిగీతాలను వినిపిస్తారు.  
 
మైకులో పెద్దశబ్దం పెడితే, కొన్ని విషయాలు ఆలోచించాలి. పెద్దశబ్దంతో పెట్టే మైకులకు సమీపంలో ఉండే ఇళ్లల్లో ఉండే వారికి కొన్ని సమస్యలుంటాయి....

 ఒకరిమాట ఒకరికి సరిగ్గా  వినిపించదు. ఫోన్లో మాట్లాడలేము. ఇంట్లో సరిగ్గా పూజ చేయలేము. కొందరికి తలతిరిగే పరిస్థితి కూడా ఉంటుంది. అందువల్ల చిన్నశబ్దంతో ఉంటే హాయిగా ఉంటుంది.

*********************
  ఈ రోజుల్లో టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు..ద్వారా  ప్రసారమవుతున్న వాటిలో, మంచి ప్రోగ్రాంస్ తో పాటు హింసతో కూడిన ప్రోగ్రాంస్ కూడా ఉంటాయి. 
 
చాలామంది పిల్లలు, పెద్దవాళ్లు హారర్ ప్రోగ్రాంస్ భయపడుతూ కూడా చూస్తారు. 

సీరియల్స్ చూస్తే,  ఇళ్లలో ఒకరితో ఒకరు కొట్లాడుకోవటమే ఎక్కువవుంటుంది. 

అస్తమానం హింసతో కూడిన ప్రోగ్రాంస్, గొడవలు కాకుండా,కామెడీ ఎక్కువ ఉండే ప్రోగ్రాంస్ ఎక్కువ రావాలి. 

కొన్ని వీడియోగేంస్ కూడా ఒకరితోఒకరు కొట్టుకోవటం వంటివి ఉంటాయి. అవి ఆడినవారికి ఇరిటేషన్ పెరిగే పరిస్థితి రావచ్చు.

చాలాసమయం సెల్ఫోన్లు చూస్తే ఇరిటేషన్ వస్తుంది. చేతులు, మెడ నొప్పులు వస్తాయి. ఇంకా కొన్ని శారీరిక, మానసిక సమస్యలు వచ్చే అవకాశముంది.

 ఆరుబయట ఆడుకోవటం, నడవటం, ఇరుగుపొరుగు వారు కబుర్లు చెప్పుకోవటం, తోటపని, బాల్కనీలో కూర్చుని మంచిపాటలు వినటం.. చేయవచ్చు. 

సెల్ఫోన్లు పట్టుకుని చూడటం తగ్గించి, ఫోన్ పక్కన పెట్టి రేడియోలా వినవచ్చు.
.......................
 
ఇంకా, మనుషుల్లో, దైవభక్తి..మంచితనం ఉన్నాయి కాబట్టి,  ప్రపంచం ఈ మాత్రం అయినా బాగుంది. 
 .................
oka link..


Monday, December 22, 2025

పగిలిన గాజుముక్కలను....

 

ఎన్నో గాజు సామాన్లను వాడతాం. అవి పగిలినప్పుడు మాత్రం వాటిని ఎక్కడ ఎలా పడెయ్యాలో అనేది కష్టంగా ఉంటుంది.


 పగిలిన గాజుముక్కలను అలాగే బయట పడేస్తే అవి గుచ్చుకుని పారిశుధ్యసిబ్బందికి, బయట ఆహారం కొరకు తిరిగే జంతువులకు గుచ్చుకుని గాయాలు అయ్యే ప్రమాదముంది.

 అందువల్ల గాజు ముక్కలను ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి,  పాతబట్టలను మందంగా వాటికి గట్టిగా చుట్టి,  మరల ప్లాస్టిక్ కవర్లో చుట్టి అప్పుడు వాటిని ప్లాస్టిక్ చెత్త వేసే డబ్బాలలో వేయాలి. 

ఏదైనా పెట్టెలో పెట్టి పడేస్తే ఇంకా మంచిది. ఇంకా ఏమైనా పద్దతులు కూడా ఉండవచ్చు. 


ప్లాస్టిక్ కాకుండా, చిన్న గోనె సంచి లేక కాటన్ సంచిలో వేసి చుట్టి, తాడుతో కట్టి కూడా పడేయవచ్చు. కొబ్బరి పీచుతో కూడా సంచులను తయారుచేయవచ్చు.

 పగిలిన గ్లాస్ పడెయ్యటానికి విడిగా చెత్తబాక్సులను ఏర్పాటు చేయాలి.

 గాజు సామాను కొనకుండా జాడీలను, మట్టిపాత్రలను కొనవచ్చు.

పాతకాలంలో జాడీలను వాడేవారు. ఇప్పుడు కూడా జాడీలను అమ్ముతున్నారు. అలాగే జాడీలు తయారుచేసే పద్ధతిలో కప్పులు, చిన్న జాడీలు, మగ్గులను కూడా అమ్ముతున్నారు. అవి పగిలినా కూడా గాజుగ్లాసులా పదునుగా గుచ్చుకోవు. 
 

ఈ రోజుల్లో చెత్తను ఎక్కడపడితే అక్కడ కుప్పలుగా పడేసి వదిలేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు సమాజంలో. అలాకాకుండా, సమాజం బాగుండేలా పాటించటానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. 

................................

marikonni vishayalu..



కొట్టేసిన అరటిచెట్లతో, చెరకు పిప్పితో ఎకో ప్లాస్టిక్ తయారుచేసి ఇళ్ళల్లో చెత్తను పడేసే కవర్లుగా చేయవచ్చు. ఇప్పుడు కూడా ఎకో కవర్లు అమ్ముతున్నారు. తాగిపడేసిన కొబ్బరి బోండాలను ముక్కలుచేసి కోకోపిట్ చేయవచ్చు. 
 
వరిపొట్టును మొక్కలకు ఎరువుగా వాడవచ్చు. పెద్ద పార్కుల్లో రాలిపడిన ఆకులు గుట్టలుగా పోస్తారు. అవి అదే పార్కులో మొక్కలకు మంచి ఎరువుగా ఉపయోగపడతాయి. మిగిలితే బయట కూడా అమ్మవచ్చు.


 

Monday, November 24, 2025

కొన్ని విషయములు..

 

 link..

ఓం, దైవానికి అనేక వందనములు...

 link..

  • ఓం..
  •  
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. ....4
  •  
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. .3
  •  
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్....2
  •  
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. 1
  •  

  •  

    కొన్ని సందేహాలు..కొన్ని ఆలోచనలు..

     

     నాకు కొన్ని సందేహాలు కలిగాయి. 

    నెలసరిలో ఉన్నప్పుడు దైవస్మరణ.. దైవనామస్మరణ.. చేస్తే దోషం కాదు కాని, మంత్రాలు.. స్తోత్రాలు.. చేయకూడదంటున్నారు కొందరు.

      కార్తికమాసంలో కొన్ని దేవాలయాల్లో ఎవరైనా నెలకు కొంత డబ్బు కడితే, నెలంతా అభిషేకాలు..పూజలు చేస్తున్నారు. ...

    అలాంటప్పుడు ఆ కుటుంబంలో స్త్రీలకు నెలసరి వస్తే అప్పుడు వాళ్ళ పేరు కూడా పూజలో చదువుతారు కదా....అప్పుడు వాళ్లు పూజ చేసినట్లే కదా..

    మరి అలాంటప్పుడు దోషం ఉంటుందా? ఉండదా? అని సందేహం అనిపించింది. 

    అర్చనలు చేయించుకునేటప్పుడు కూడా వేరే ఊళ్లలో ఉండే కుటుంబసభ్యుల పేర్లు కూడా చెప్పి అర్చన చేయిస్తారు. 

    పూజలో పేర్లు ఉన్న వాళ్ళు నెలసరిలో ఉంటే అప్పుడేమిటి?

     ఇలా పూజలు చేయించుకుంటే చేయించుకున్నవాళ్లకు, చేయించిన వాళ్లకు, చేసిన వారికి...కూడా దోషం వస్తుందా? అలా ఏమీ కాదా? 

    పూజకు డబ్బు కట్టిన తరువాత, ఎవరి ఇంట్లో అయినా అకస్మాత్తుగా మైల పాటించే పరిస్థితి వస్తే,  ఆ సంగతి
    ని వాళ్ళు   చెప్పకపోవచ్చు.

    అంటుముట్టు..మైల ఉన్నాకూడా, దేవాలయంలో లేకుండా దూరంగా ఉంటే, వారి పేరుతో ఏ పూజ అయినా  చేయించుకోవచ్చా? అలా చేస్తే ఏమైనా దోషం ఉంటుందా? ఉండదా? తెలియటం లేదు.

     ఇన్ని  సందేహాలు ఎందుకు అంటే, నెలసరి దోషం వల్ల చాలా కష్టాలు వస్తాయంటున్నారు అని.

    స్త్రీల అంటుముట్టు గురించి పబ్లిక్ గా మాట్లాడటం ఏమిటీ అంటున్నారు కొందరు.

     మరి స్త్రీల నెలసరి గురించి అలా చేయకూడదు..ఇలా చేయకూడదు..చేస్తే కష్టాలు వస్తాయని పబ్లిక్ గా కొందరు చెబుతున్నప్పుడు, ఆ సందేహాల గురించి పబ్లిక్ గా మాట్లాడితే తప్పేమిటి?

    ఇంకా, చాలా విషయాల గురించి కూడా.. ఇలా చేయకూడదు..అలా చేయకూడదు..చేస్తే కష్టాలు వచ్చి మీద పడిపోతాయని చెబుతున్నారు. ఇవన్నీ విని, ఏం చేస్తే ఏం తప్పో? అనే పరిస్థితితో భయం, అయోమయం కలిగి, అనేక సందేహాలతో సతమతమయ్యే పరిస్థితి ఉంటుంది.

      .............................

    లోకకల్యాణం కొరకు పూజలు చేసే సందర్భాలలో.. లోకంలో అంతా బాగుండాలని పూజ చేస్తారు. 

    ఎవరికి వారు పూజలు చేయించుకునే సందర్భాలలో.. అంటుముట్టు, మైలలో ఉన్నవారు కొన్ని రోజులు ప్రత్యేక పూజలు చేయడానికి దూరంగా ఉండాలంటారు.

    నాకు ఏమనిపిస్తోందంటే,  అర్చన, అభిషేకం వంటి సందర్భాలలో..వేరే ఊరిలో ఉన్న కుటుంబసభ్యులందరి పేర్లు చెప్పటం సంగతి ఏమోకానీ..

    అంతా బాగుండాలని, కుటుంబంలో అందరూ బాగుండాలని.. భావిస్తూ పూజ చేయిస్తున్నట్లుగా (పూజారి గారితో) పూజ చేయించవచ్చేమో? అనిపించింది. 

    (వేరే ఊరిలో ఉన్నవారి  పరిస్థితి(అంటుముట్టు..) గురించిన సంగతులు తెలియనప్పుడు, ఇలా కూడా చేయవచ్చేమో?..అనిపించింది.)

    .........................

      ఇంకొక విషయం ఏమిటంటే, కొన్నిసార్లు పూజలలో సుమారు అర్ధగంటకు పైగా  గోత్రనామాలు ..కుటుంబసభ్యుల పేర్లను చదవటంతోనే సరిపోతుంది.

     మేము చెన్నైలో ఉన్నప్పుడు,  అక్కడ దేవాలయంలో ..అర్చన కొరకు గోత్రనామాలు చెప్పకపోయినా కూడా,  స్వామిపేరుతో.. అని చెప్పి అర్చన చేసేవారు. 

    పేర్లు చెప్పకుండా ఈ పద్ధతి సులభంగా అనిపించింది.

    ....................

    గోత్రనామాలు చెప్పినా చెప్పకపోయినా,  దైవప్రీతి కొరకు.. జీవప్రీతి కొరకు ..కష్టాలు తొలగటానికి ..ఇలా దైవానికి ఎవరికి వారు మనస్సులో కూడా చెప్పుకోవచ్చు.

    మన గురించి, మన ఆలోచనల గురించి..అన్నీ దైవానికి తెలుస్తాయి.

     ............................

    వ్రాసినవాటిలో ఏమైనా తప్పులుంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

     

    Sunday, November 9, 2025

    చక్కగా దైవాన్ని ఆరాధించుకోవచ్చు. ...

     

     సోషల్మీడియాలో చెప్పేవన్నీ పాటించకపోతే కష్టాలొస్తాయేమోననే భయపడనవసరం లేదు.

     అందరూ అన్నింటినీ పాటించలేరు. కలియుగంలో దైవస్మరణ..దైవనామస్మరణతోనే తరించవచ్చని ప్రాచీనులే తెలియజేసారు.

     ఎవరి శక్తికి తగ్గట్లు వారు దైవాన్ని ఆరాధించుకోవచ్చు. 
     

    దైవానికి మన విషయాలను చెప్పుకోవచ్చు. 

    హిందూత్వంలో నిరాకారం, సాకారం..ఇలా ఇంకా ఎన్నో పద్ధతులున్నాయి. మన శక్తికి తగ్గట్లు చక్కగా హాయిగా దైవాన్ని ఆరాధించుకోవచ్చు.

     సరైన విధంగా జీవించే శక్తిని ఇమ్మని దైవాన్ని ప్రార్ధించుకోవచ్చు.

     ...................................

     marikonni vishayamulu..

     దైవ సృష్టి ...

     సృష్టిలో , ఆకాశంలో ఎగిరే పక్షుల శరీరం , ఎగరటానికి తగ్గట్లుగా సృష్టించబడింది. నీటిలో ఈదే చేపలశరీరం అందుకు తగ్గట్లుగా ఉంది. 

    ఇవన్నీ ఇలా ఉండాలంటే ఎంతో ఆలోచనకల శక్తికే సాధ్యం. ఆ మహాశక్తే దైవము.

    ఆలోచనాశక్తి లేనిదే ఏదైనా పద్ధతిగా ఎలా ఏర్పడుతుంది..ఒకగదిలో నాలుగు చెక్కముక్కలనుపడేసి ఎంతకాలం ఉంచినా అవన్నీ కలసి కుర్చీలా అవవుకదా.

     
    ఇంత పద్దతిగా వైవిధ్యభరితమైన సృష్టిని ఏర్పాటు చేయాలంటే, ఊహాతీతమైన ఆలోచనా శక్తి గల మహాశక్తికే సాధ్యం. ఈ మహాశక్తినే   దైవము.. అని దైవాన్ని నమ్మే వారు(ఆస్తికులు) పిలుచుకుంటున్నారు.

    ఆధ్యాత్మికవాదులు..  దైవానికి   ఆది ,  అంతమూ ..లేవు .  అని తెలియజేసారు. 

    ".Matter and energy cannot be created or destroyed "....... అని ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పే విషయాన్ని బట్టి చూసినా .. పదార్ధం , శక్తి ..యొక్క రూపం మారుతుంది .

     అంతేకానీ, పదార్ధాన్ని, శక్తిని.. సృష్టించలేము, నశింపజెయ్యలేము....అని తెలుస్తుంది.

    ఉదా...నీరు ఆవిరిగా మారుతుంది ... ఆవిరి మరల నీరుగా మారుతుంది, నీరు మంచులానూ మారవచ్చు, ఆ మంచు మరల నీరుగానూ , ఆ నీరు ఆవిరిగానూ మారవచ్చు.

    విశ్వాన్ని దైవం సృష్టించారు అంటే,  మరి దైవం  ఎలా సృష్టించబడింది ? అనే ప్రశ్న వేస్తారు భౌతికవాదులు. 

     మరి , పదార్ధం లేక శక్తి  మొదట ఎలా సృష్టించబడింది ? అనే ప్రశ్నకు భౌతికవాదులు ఏం సమాధానం  చెబుతారు ?

     పదార్ధానికే పుట్టుక , నశించటం అనేవి లేనప్పుడు , పదార్ధాన్ని సృష్టించిన దైవం ఆద్యంతాలు లేని నిత్యశక్తి .... అని పెద్దలు చెప్పిన మాట నిజమని తెలుస్తోంది కదా !
      
    దైవం వద్ద   జీవులకు కలిగే  అన్ని సందేహాలకు  సమాధానాలు ఉంటాయి . 

    అయితే,   విజ్ఞాన రహస్యాలు తెలుసుకోవాలంటే   జీవులు  తగిన అర్హతలు సంపాదించుకోవాలి. 

     దైవకృపను పొందగలిగిన జీవులకు ఆ రహస్యాలు తెలిసే అవకాశం ఉందనిపిస్తుంది. ఉదా.. మోక్షాన్ని పొందిన జీవులకు  విషయాలు తెలుస్తాయి .  అనిపిస్తుంది . 

     విమానం ఎలా ఎగురుతుంది ? అని చిన్న పిల్లవాడు ప్రశ్నిస్తే పెద్దవాళ్ళు ఎంత వివరించినా పిల్లవాడికి అర్ధం కాకపోవచ్చు. 

    అదే పిల్లవాడు పెద్దవాడయి చదువుకుంటే ఆ విషయాలు సులభంగా బోధపడతాయి. 

    విశ్వరహస్యాలు తెలుసుకోవాలన్నా తగిన  అర్హతలను సంపాదించుకోవాలి.
     
    *******
    సృష్టి ఎలా ఏర్పడింది? అనే  ప్రశ్నకు,   దైవం  వల్ల   సృష్టించబడింది.. అని  ఆస్తికులు ఖచ్చితమైన   సమాధానం  చెప్పగలరు.

    సృష్టి ఎలా ఏర్పడింది?  అనే  ప్రశ్నకు, నాస్తికులు ఏమంటారంటే.. సృష్టి దానికదే ఏర్పడిందని అంటారు.

    కొందరు నాస్తికులు  ఏమంటారంటే, దైవం  ఎలా ఏర్పడ్డారని  ప్రశ్నిస్తారు.

    సృష్టి దానికదే ఏర్పడటం సంభవమని  వారు నమ్ముతున్నప్పుడు..  మరి, దైవం తమకు తామే ఏర్పడలేరా
    ఏమిటి ..దైవానికి ఆది అంతములు లేవు. 
    దైవము  ఎప్పుడూ ఉంటారు.
     ......................

    oka link..

    జీవులు పుట్టడం , కష్ట సుఖాలు అనుభవించటం అ...