koodali

Tuesday, March 24, 2020

కరోనా.... కొన్ని విషయాలు...



 ప్రజలు నిత్యావసర సరుకులకు బైటకు రాకుండా.. ప్రభుత్వాలు కొన్ని షాప్స్ వాళ్ళకు  అనుమతి ఇచ్చి, వారు మాత్రం సరుకులను వాహనాల ద్వారా వీధుల వెంట తిరుగుతూ,  ప్రతి ఇంటికి అందుబాటులో సరుకులను విక్రయించే విధానాన్ని అమలుచేయవచ్చు. 

 (అయితే  ప్రజలు  గుమికూడకుండా  పోలీసుల సహాయం తీసుకోవటం మంచిది. ప్రజలు సరుకులను పెద్దమొత్తంలో కొనుగోలు చేసి నిల్వ చేయకుండా చూసుకోవాలి.)

ఫోన్ చేస్తే నిత్యావసర సరుకులను ఇంటికి తెచ్చే  విధానాన్ని పాటించవచ్చు.

అయితే, భారతదేశంలో చాలామంది  ప్రజలకు  షాప్స్ వారికి ఫోన్ చేసి  సరుకులను తెప్పించుకునే పరిస్థితి లేదు. తక్కువ ఆదాయ వర్గాల వారికి ఇంటికే సరుకులను అందుబాటులోకి తెస్తే బాగుంటుంది.

*********************
 మాస్కులు దొరకనప్పుడు , మాస్కులు లేవని కంగారుపడకుండా, కర్చీఫ్ను మడిచి మాస్క్ తయారుచేసి వాడుకుని, ఉతుక్కుంటే మంచిది.

How to make easy handkerchief mask Without stitching at home? - YouTube

www.youtube.com

**************
శానిటైజెర్  లేకపోతె  ఉప్పు నీరు  వాడవచ్చు.

కూరగాయలు, పండ్లను  మార్కెట్లో ఎందరో చేతులతో తాకుతారు. వాటిని  తెచ్చిన వెంటనే ఫ్రిజ్లో పెట్టకుండా , ఒక బకెట్ నీళ్ళలో రెండు స్పూన్ల ఉప్పు వేసి ఆ నీటిలో కూరగాయలను వేసి 5 నిముషాలు ఉంచి, క్రింద న్యూస్ పేపర్ గాని, పాత టవల్ కానీ వేసి దానిపైన కూరగాయలను పరిచి, తడి ఆరిన కొన్ని గంటల తర్వాత ఫ్రిజ్లో పెడితే వైరస్ ఫ్రిజ్లోకి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు.లేదంటే బయటే కూరగాయలను ఉంచుకోవచ్చు.

సరుకులను తెచ్చిన ప్లాస్టిక్ పాకెట్ల పైన కూడా ఉప్పునీటితో తడిపిన  క్లాత్ తో తుడిచి పెట్టుకోవచ్చు.

ఉప్పునీటిలో అదేపనిగా చేతులు కడిగితే చేతులు కొద్దిగా నల్లబడే అవకాశం ఉండవచ్చు కాబట్టి, ఉప్పునీటితో చేతులు కడుక్కున్న వెంటనే మంచినీటితో కూడా కడుక్కోవాలి.

ఇల్లు తుడిచేటప్పుడు ఆ నీటిలో ఒక స్పూన్ ఉప్పువేసి తుడిస్తే మంచిది.
.................................

డబ్బున్న వాళ్ళు సరుకులను ఎక్కువగా కొని నిల్వ ఉంచుకోగలరు. ఏ రోజు కారోజు సంపాదనతో జీవించే వారికి  నిత్యావసరాలవిషయంలో ఇబ్బందులు లేకుండా  ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయాలి.ధనవంతులు కూడా సహాయం చేయవచ్చు.

ఇంట్లోనే ఉన్నాం కదాని బోలెడు సరుకులు కొనేసి, రకరకాల వంటలు చేసుకుని తింటే అజీర్తి కలిగే అవకాశం ఉంది.

  భవిష్యత్తులో నిత్యావసర సరుకుల కొరత వచ్చినా రావచ్చు. అందువల్ల తగుమాత్రం వంటలు వండుకుని తినటం మంచిది.

**********
కొన్ని చోట్ల..   చదువుకునే పిల్లలను, వివాహం కాకుండా ఉద్యోగం చేస్తున్న వారిని  హాస్టల్స్  ఖాళీ చేసి వెళ్లమంటున్నారట. 

కరోనా పేషంట్లకు సేవ చేస్తున్న వైద్యవిద్యార్ధులను కూడా అద్దె  యజమానులు ఖాళీ చేయమంటున్నారట.
( అద్దె ఇంటి యజమానులకు కరోనా వస్తే మాత్రం మళ్ళీ డాక్టర్ల వద్దకే వెళ్తారు.)

కుటుంబానికి దూరంగా చదువుకుంటున్నవారికి, ఉద్యోగస్తులకు భోజనం ఎక్కడ లభిస్తుంది?

విదేశాల్లో ఉండేవారికి కాలేజీలు మూసెయ్యటం మంచిదే కానీ, హాస్టల్స్ ఖాళీ చేయమనకుండా వారిని హాస్టల్స్లో ఉండనిచ్చి ఎప్పటిలాగే భోజనం అందిస్తే , వారి గదుల్లో వారు ఉంటారు కదా!

సడన్ గా వారిని హాస్టల్స్ ఖాళీ చేసి వెళ్లమంటే ఫ్లైట్స్ లేని సమయంలో అప్పటికప్పుడు వారు ఎక్కడికి వెళ్ళగలరు?

కొన్నిరోజుల  తర్వాత,  బాచలర్స్ ను స్వస్థలాలకు పంపాలంటే  వేలాదిమందిని గుంపులుగా ఒకేసారి వదలటం కాకుండా, రోజుకు కొంతమందిని చొప్పున పంపిస్తే  గుంపులుగా గుమికూడటం ఉండదు. అందరికీ వైద్యపరీక్షలు చేయటమూ కొంత సులభమవుతుంది.

................
పర్యావరణాన్ని పాడుచేయకూడదు అని ఎందరు చెప్పినా  చాలామంది  లెక్క చేయలేదు.

మూగజీవాలు ఎన్ని బాధలు పడినా  పట్టించుకోలేదు.

ఇప్పుడు తమ ప్రాణాలమీదకు వచ్చేటప్పటికి  ఎంతగా అల్లాడిపోతున్నారో కదా!
...................
కొరోనా నుండి తప్పించమని కొన్ని దేవాలయాల్లో  పూజలు నిర్వహిస్తున్నారు.

అందరూ దైవనామస్మరణ చేయటం మంచిది. సరైన  విధానాన్ని తెలుసుకుని ప్రాణాయామ, ధ్యానం  చేయటం  మంచిది.

దైవం దయ వల్ల  విపత్తు తగ్గుముఖం పడుతుందని ఆశిద్దాము.

***************
ఈ క్రింద  విషయాలను  తరువాత  వ్రాయటం జరిగింది...

దైవప్రీతి కొరకు యజ్ఞయాగాదులు నిర్వహించాలి.

 లోకక్షేమం కొరకు యజ్ఞాలు చేయటం అవసరం.

 ఎవరైనా నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు కానీ, ఆపత్కాలంలో కానీ  యజ్ఞయాగాదులు నిర్వహించవచ్చు.

కొందరు స్వార్ధపరుల వల్ల పర్యావరణానికి హాని కలిగి జీవజాలానికి ముప్పు వాటిల్లుతోంది. మూగజీవులకు కూడా కష్టాలు వస్తున్నాయి. మూగజీవులు యజ్ఞయాగాదులు చేయలేవు. అందువల్ల సమాజ హితం కొరకు మనుషులు యజ్ఞయాగాదులు నిర్వహించవచ్చు. 

*****************
కోవిద్ జబ్బు అంతరించాలని యజ్ఞాలు నిర్వహించటం అవసరమే. ఇలా చేయటం సరైనదే. అయితే, మనుషులు చేస్తున్న అనేక తప్పుల వల్ల కోవిడ్ వంటి జబ్బులు వస్తున్నాయి. 

ఉదా:పర్యావరణ కాలుష్యం, జీవితంలో అనారోగ్యకరమైన పనులు..వంటి వాటి వల్ల కోవిద్ వంటివి ప్రబలుతున్నాయి. కోవిడ్ వంటివి తగ్గాలంటే యజ్ఞాలు చేయటంతో పాటు తప్పులను సరిదిద్దుకోవాలి. 


మనుషులు తాము చేసే తప్పులను కొనసాగిస్తూనే.. తద్వారా వచ్చే దుష్ఫలితాలను మాత్రం.. యజ్ఞాలు చేసి తగ్గించుకోవాలనుకోవటం వల్ల పూర్తిగా సరైన ఫలితాలు వస్తాయా? 


 తప్పులు చేయటం కొనసాగిస్తూనే.. తమకు  గొప్ప ఫలితాలు రావాలని దైవాన్ని కోరటం ఎంతవరకూ సరైనది?


తాము చేసే తప్పులను కూడా సరిదిద్దుకోవటానికి ప్రయత్నించాలి.


 అయితే, ప్రపంచంలో చెడుచేసేవాళ్ళు మాత్రమే ఉండరు. మంచిపనులు చేసేవారు ఉంటారు.కొంత మంచి, కొంత చెడు పనులు చేసే వాళ్లూ ఉంటారు.ముందు చెడ్డగాఉన్నా,తరువాత మంచిగామారేవారూ ఉంటారు. 


అందరూ మంచిగా ఉండటానికి ప్రయత్నించాలి.అప్పుడే సమాజం అంతా బాగుంటుంది.


**********
గంగానదిలో కలిపిన కాలుష్యం వంటి వాటి విషయంలో గమనిస్తే.. 

 రోజూ పరిశ్రమలనుంచి, నగరాలనుంచి వచ్చే మురుగును గంగలో వదలటం ఆపకుండా ..  గంగానదిలో కలిపిన  కాలుష్యాన్ని  యజ్ఞం చేయటం ద్వారా పోగొట్టాలని ఎవరైనా భావిస్తే  ఎంత మాత్రం సరైనది ?

 గంగా నది లోకి వదిలే మురుగును ఆపటం కూడా ముఖ్యం.


Monday, March 23, 2020

జలుబు, దగ్గు తగ్గటానికి పానకం..........



  ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, సామాన్యమైన జలుబు, దగ్గు మొదలయినా  అది మామూలు జలుబునా?  లేక కరోనానా ? అనే భయం కూడా కలుగుతుంది.

 టెన్షన్ పెరిగితే అనారోగ్యం కలిగి  హాస్పిటల్ కు వెళ్ళే పరిస్థితి రావచ్చు.  

  ఇలాంటి పరిస్థితిలో మామూలు జలుబు, దగ్గు లేకుండా చూసుకోవటం ఎంతో అవసరం. 

 కషాయం వాడుకుంటే  మామూలు జబ్బు, దగ్గు  తగ్గిపోతుంది. 

ఆయుర్వేద మందుల వల్ల రోగనిరోధకశక్తి పెరిగి , కరోనా సోకే ప్రమాదం తగ్గే అవకాశం కూడా ఉంది.

***************

ఈ పానకం జలుబు, దగ్గు తగ్గటానికి బాగా పనిచేస్తుందండి. మేము ఎప్పటినుండో వాడుతున్నాము. మాకు తెలిసిన వారు చెప్పారు ఈ మందు.

ధనియాలు...........750 గ్రాములు.
మిరియాలు...............25 గ్రాములు.
శొంఠి...............25 గ్రాములు.

బెల్లపు ముక్క........ ఒక చిన్న ముక్క. ...... {.తీపికి సరిపడినంత.}


శొంఠిని మెత్తగా దంచుకోవాలి. ధనియాలు, మిరియాలు పచ్చివే, వేయించకూడదు. ... బెల్లము ముక్కలు తప్పమిగతావన్ని మిక్సీలో పొడి చేసుకోవాలి. ..... పొడి మరీ మెత్తగా రాకపోయినా పరవాలేదు. ...


ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక గ్లాస్ చొప్పున నీళ్ళు తీసుకుని  గ్లాస్ నీటిలో రెండు స్పూన్లు పొడి వేసి బాగా కాచాలిఈకషాయం అరగ్లాస్ నీళ్ళు అయ్యేవరకు కాచాలి. 

అప్పుడు బెల్లపు ముక్కలు వేసి కరిగేవరకు మరిగించాలి. ....... అప్పుడుపొయ్యి మీద నుంచి దింపి , ........ విడిగా కాచిన వేడి పాలు ఇందులో గ్లాస్ నిండా పోయాలి.


ఇలా కాచగా వచ్చిన అర గ్లాస్ కషాయాన్ని జల్లెడలో వడపోసి ....అందులో కాగిన పాలు కలుపుకోవాలి........ ఇది ఒక వ్యక్తికి సరిపడిన కొలత మాత్రమే.


ఇలా రోజూ ఉదయమే ఒకగ్లాస్ త్రాగాలి. ఒక  వారం  రోజులు త్రాగాలి.


ఈ కషాయం చిన్న మంట పైన కాగాలి. ఎందుకంటే పొడి లోని రసం (సారం) అంతా నీటిలోకి రావాలి.


..... పాలు ముందే కలిపి కాచితే బెల్లం వలన విరిగిపోవచ్చు. పాలు కలిపాక మళ్ళి కాయనవసరంలేదు. 

పాలు ఇష్టం లేనివాళ్ళు పాలు కలపకపోయినా పరవాలేదు. సుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు బెల్లపు ముక్కలు వెయ్యకపోయినా పరవాలేదు. 


కొంతమందికి ఇది వేడిచేయవచ్చు. కాని బాగా పనిచేస్తుంది. ఇలాంటప్పుడు చలువ చేసే పదార్ధములు తినాలి.

ఈ  కషాయం త్రాగిన  తరువాత పావుగంటవరకూ  ఏమీ తినకుండా ఉంటే మంచిది. 


కుటుంబానికి దూరంగా ఉంటూ  చదువుకుంటున్న  పిల్లలకు, ఉద్యోగస్తులకు ఇలాంటి పొడిని కొట్టి పంపవచ్చు. చ్యవనప్రాశ వంటివి ఇచ్చి పంపవచ్చు. వాటిని వాడే విధానాన్ని సరిగ్గా తెలియజేయాలి. 

..............

కొంతమందికి
 జలుబు,దగ్గు అప్పటికప్పుడు తగ్గకపోయినా,  వారం రోజులు వాడి ఆపేసిన తరువాత నెమ్మదిగా పూర్తిగాతగ్గిపోతుంది. మళ్ళి చాలాకాలం వరకు జలుబు,దగ్గు రాదు.

అసలు జలుబు అవి లేకపోయినా ఈ కషాయం ప్రతినెలమొదటి  వారం  రోజులు వాడితే మంచిది.


.కొంచెం చిన్న పిల్లలకయితే ఒక గ్లాస్ నీటికి ఒక స్పూన్ పౌడర్ వేస్తే సరిపోతుంది. పిల్లలు జలుబు ,దగ్గుతో చాలా బాధపడుతుంటారు. పెద్దవాళ్ళు కొంచెం ఓపికగా ఇలా కషాయం చేసి ఇస్తే వాళ్ళకు ఆ బాధ ఉండదు. 


ఇలా కషాయం కాయటం కష్టమనుకుంటే చ్యవన్ ప్రాశ్ కూడా బాగా పనిచేస్తుందండి..త్రిఫల, త్రికటు చూర్ణం..వంటివి కూడా బాగా పనిచేస్తాయి. 

అయితే ఆయుర్వేద మందులను కొంతకాలం వాడి,  కొంతకాలం గ్యాప్ ఇవ్వాలట. వాడే విధానం, డోసెజ్..వంటివి ఆయుర్వేద వైద్యుల సలహా తీసుకుని వాడుకోవాలి. 

************

ఈ కషాయం నెలకు 5 లేక 6 లేక 7  రోజులు వాడాలి. ఎక్కువరోజులు వాడితే వేడి చేస్తుంది.  



ధనియాల కషాయం వాడేరోజుల్లో కూరల్లో ధనియాల వాడకం తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ధనియాలు మందు కాబట్టి,  మోతాదు మరీ పెరగకుండా వాడుకోవాలి.


ధనియాలు, పసుపు, అల్లం, వెల్లుల్లి..వంటివి తగు మోతాదులో వాడుకుంటే ఆరోగ్యం కలుగుతుంది. ఎక్కువమోతాదులో వాడితే అనారోగ్యం కలుగుతుంది. 

మందు అంటే తగుమోతాదులో మాత్రమే వాడాలి.



( నాకు తెలిసినంతలో రాసాను. ఎంతకాలం వాడాలనే విషయం గురించి  మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే  ఆయుర్వేదవైద్యులను సంప్రదించవచ్చు.) 

**************

 ఆయుర్వేదం  రెమెడీల  గురించి ఇతర దేశాలకు కూడా వారి భాషలో సమాచారం ఇవ్వవచ్చు.

కరోనాకు ప్రెవెన్షన్ గా కొందరు హోమియోలో  మందులు ఉన్నాయంటున్నారు.

 కరోనాకు  అల్లోపతిలో ఇప్పటివరకు మందులు లేవు కానీ ప్రయోగాలు చేస్తున్నారట . అయితే మందు రావటానికి కొంతకాలం పడుతుందట.