koodali

Saturday, December 29, 2012

క్షమించండి..శ్రీ దత్తాత్రేయ జయంతి..

*   శ్రీ  దత్తాత్రేయ జయంతి.. మార్గశిర  శుక్ల పౌర్ణిమ  నాడు  జరుపుకుంటారు.

*  అయితే , నేను  క్రితం  టపాలో  శ్రీ  దత్తాత్రేయ జయంతి   మార్గశిర శుక్ల చతుర్దశి  నాడు ... అని  వ్రాయటం  జరిగింది. ( కొన్ని  కారణాల  వల్ల నేను  ఇలా  భావించటం  జరిగింది.  )

*  క్రితం  టపాలో   శ్రీ  దత్తాత్రేయ జయంతి  మార్గశిర శుక్ల చతుర్దశి  నాడు....అని  నేను   వ్రాసినది  పొరపాటైతే ,  దైవం  దయచేసి  క్షమించాలని  ప్రార్ధిస్తున్నాను.   

............................

* శ్రీ  అనఘాదేవీ శ్రీ  దత్తాత్రేయస్వామి  వార్లకు  నమస్కారములు.

*  శ్రీపాదశ్రీవల్లభ  స్వామి  వారికి  నమస్కారములు.

   *  దిగంబర  !  దిగంబర !!  శ్రీ  పాదవల్లభ  దిగంబర !!!
              * శ్రీ  పాదరాజం  శరణం  ప్రపద్యే .




Thursday, December 27, 2012

ఓం.....అత్యంత శక్తివంతమైన సిద్ధమంగళ స్తోత్రము .



ఈ  రోజు  శ్రీ  దత్తాత్రేయ  జయంతి  సందర్భంగా....

శ్రీ  అనఘాదేవీ శ్రీ  దత్తాత్రేయస్వామి  వార్లకు  నమస్కారములు.



శ్రీపాదశ్రీవల్లభ  స్వామి  వారికి  నమస్కారములు.

    దిగంబర  !  దిగంబర !!  శ్రీ  పాదవల్లభ  దిగంబర !!!
               శ్రీ  పాదరాజం  శరణం  ప్రపద్యే .



     శ్రీపాద శ్రీ వల్లభస్వామివారి  దివ్య  సిద్ధమంగళ  స్తోత్రము  ఎంతో  శక్తివంతమైనది.  శ్రీపాద  శ్రీవల్లభ స్వామి  వారి  గురించిన  ఎన్నో  వివరములు   మరియు  ఎంతో  శక్తివంతమైన  సిద్ధమంగళ  స్తోత్రము .....



 ఈ  లింకులో  ఉన్నాయి....1.Sripada Charitamrutam - Sripada Sri Vallabha - 1 - Webs
Siddhamangala Stotram - Sripada Sri Vallabha - 1 - Webs


        

........Sripada Sri Vallabha - 1 - Webs.

     

     Sripada Sri Vallabha Siddha Mangala Stotram.wmv - YouTube



  Dattatreya - Siddha Mangala Stotram.mp4 - YouTube. 

 

 

 


Wednesday, December 26, 2012

ఓం..


శ్రీరామరామరామేతి  రమేరామే  మనోరమే
సహస్రనామతస్తుల్యం  రామనామ  వరాననే .


సీతారాముల వార్లకు అనేక నమస్కారములు. 
 ......................

ఆంజనేయ  స్తుతి......


ఆంజనేయ  మతిపాటలాననం
కాంచనాద్రి  కమనీయ విగ్రహమ్ 

పారిజాత  తరుమూలవాసినం
భావయామి  పవమాననందనమ్ .

మనోజవం  మారుతతుల్య  వేగం
జితేంద్రియం  బుద్ధిమతాం వరి
ష్ఠమ్ 

 వాతాత్మజం  వానరయూధముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి.


సువర్చలాదేవి ఆంజనేయస్వామి వార్లకు  అనేక నమస్కారములు.





Monday, December 24, 2012

పండుగల సందర్భంగా అందరికి శుభాకాంక్షలు.


* నిన్న,ఈ రోజు .... వైకుంఠ ఏకాదశి, ద్వాదశి  సందర్భంగా  అందరికి  శుభాకాంక్షలండి.

* రేపు  క్రిస్మస్  సందర్భంగా  అందరికి  శుభాకాంక్షలండి.
................................


* శ్రీ  సీతారామ  స్తోత్రము.

అయోధ్యాపుర నేతారం మిధిలాపుర నాయికాం
రాఘవాణా మలంకారం వై దేహానా  మలంక్రియాం      1

రఘూణాం  కులదీపం చ నిమీనాం  కులదీపికాం
సూర్యవంశసముద్భూతం  సోమవంశసముద్భవాం    2

పుత్రందశరధస్యాపి  పుత్రీంజనకభూపతేః
వశిష్టానుమతాచారం శతానంద మతానుగాం            3

కౌసల్య గర్భసంభూతం  వేదగర్భోదితాం స్వయం
పుండరీక  విశాలాక్షం  స్ఫురది  దీవరేక్షణాం              4

మత్తమాతంగ గమనం మత్తసారసగామినీం
చందనార్ద్రభుజామధ్యం కుంకుమాంక భుజాంతరాం    5

చాపాలంకృత హస్తాబ్జాం పద్మాలంకృత పాణికాం
సర్వలోక విధాతారం సర్వలోక విధాయినీం                6

లోకాభిరామం శ్రీరామ మభిరామాం చ మైధిలీం
దివ్యసింహాసనారూఢం  దివ్యస్రగ్వస్త్ర భూషణాం           7

అనుక్షణం కటాక్షాభ్యాం  అన్యోన్యేక్షణ కాంక్షిణౌ
అన్యోన్య సదృశావేతౌ  త్రైలోక్య  గృహాదంపతీం             8

ఇమౌ యువాం  ప్రణమామ్యహం భజామ్యతికృతార్ధ తాం
అనయాస్తౌతియ స్తుత్యా రామం సీతాం చ భక్తితః          9

తస్యతౌ తను తాం  ప్రీతౌ సంపద స్సకలా  అపి
ఇతీదం రామచంద్రస్య జానక్యాశ్చ విశేషితః                 10

కృతం  హనుమతాం  పుణ్యం  స్తోత్రం  సద్యోవిముక్తిదం
యః పఠేత్ప్రాతరుత్ధాయ సర్వాన్ కామా నవాప్నుయాత్ 11

య ఇదం పఠతిస్తోత్రమ్  మైధిలీ  రామచంద్రయోః
శ్రీ వైకుంఠమవాప్నోతి న నరో హతకిల్బిషః                  12

* ఇతి  శ్రీమత్  హనుమద్విరచితం  సీతారామస్తోత్రమ్ సంపూర్ణ ఫలం : శ్రీ సీతారామాంజనేయుల సంరక్షణ.

* పైన  వ్రాసినవిషయాలలో  అచ్చుతప్పుల  వంటి  పొరపాట్లు ఉన్నచో,  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.

 

Friday, December 21, 2012

భక్తి ముఖ్యం.



  జీవితంలో  చిత్రమైన  అయోమయ పరిస్థితులు  ఏర్పడినప్పుడు, మానసికంగా  క్రుంగిపోయి  ఆత్మహత్యలు  వంటి  నిర్ణయాలను  తీసుకోకుండా ,  తీర్ధయాత్రలు,  దైవపూజలు,  దానధర్మాల వంటి  సత్కర్మలను  ఆచరించటం  వల్ల  పరిస్థితులు  చక్కపడే  అవకాశం  ఉంది.

అయితే  పరిస్థితి  తీవ్రతను  బట్టి ,  పుణ్యకార్యాలను  మిక్కుటంగా  చేస్తేనే  మంచి ఫలితాలు  లభిస్తాయి.

తీర్ధయాత్రలు  చేసే  శక్తి  లేకపోయినా  భక్తి  ఉంటే  చాలు .  దైవం  తానే  దర్శనమిస్తారు. ( కలలో  కావచ్చు, ఇలలో  కావచ్చు.)  భక్తి  ముఖ్యం.

భక్తి  అంటే,  పాపాలు  చేస్తూ  భగవంతునికి  పాపపుసొమ్మును  కానుకగా  సమర్పించే  నాటకీయమైన  భక్తి  కాదు.  స్వచ్చమైన  ప్రేమ  భక్తి.


భగవంతునికి  జీవులంటే  ఎంతో  ప్రేమ.  ఎన్నో  తప్పులను  చేసిన  వారికి   కూడా   మంచిగా  మారటానికి  మళ్ళీమళ్ళీ  అవకాశాలను  కల్పిస్తారు.

  ఎన్ని  అవకాశాలను  కల్పించినా  పట్టించుకోకుండా  పాపాలను  చేస్తూ  ఉంటే  అప్పుడు  లోకహితం  కొరకు,   దైవం    పాపాత్ములను   శిక్షిస్తారు.

  పాపాలు  చేసిన  వారు  కూడా   చేసిన  తప్పులు   తెలుసుకుని  పశ్చాత్తాపపడి  మంచిగా  మారితే   దైవానుగ్రహానికి  పాత్రులే.



Wednesday, December 19, 2012

కొన్ని యాత్రా విశేషాలు ...ఐదవ భాగము.



*  వైష్ణవీదేవి యాత్రకు  వెళ్ళే  మార్గంలో   జై మాతా  దీ  ! అంటూ  వెళ్ళే   భక్తుల   నినాదాలు  వినిపిస్తాయి.  దైవ దర్శనానికి  చాలా  క్యూ  ఉంటుంది.

* వైష్ణవీదేవి  దర్శనానికి   వెళ్ళటానికి   సన్నటి  గుహ  మార్గం  నుండి  వెళ్ళాలేమో  అనిపించి,   నాకు  భయం  వేసింది. ( దైవదర్శనానికి  వెళ్ళటానికి  కూడా  భయమేమిటి ? అని  మీకనిపించవచ్చు.   భక్తిలో  పరిపూర్ణత్వం  రాని  నాలాంటి  భక్తుల  పరిస్థితి  ఇలాగే  ఉంటుంది.  పరిపూర్ణమైన  భక్తులకు  భయం  వంటివి  ఉండవు.  వారు  దైవం  మీద  పూర్తి  భారం  వేసి ,  నిష్కామంగా  తమ  స్వధర్మాన్ని  నిర్వర్తిస్తూ  జీవితాన్ని  గడుపుతారు.   అలాంటి  స్థితప్రజ్ఞత  రావాలన్నా  దైవకృప  ఉండాలి.  దైవకృపను  పొందాలంటే  సత్కర్మలను  చేస్తూ  భక్తితో   జీవితాన్ని  గడపాలి. )


* పూర్వపురోజుల్లో  వైష్ణవీదేవి  దర్శనానికి  వెళ్ళటానికి  సన్నటి  మార్గం  ద్వారా  గుహలోకి  వెళ్ళి  దర్శనం  చేసుకునేవారట. ఇప్పుడు  కూడా  అదంతా  ఉంది  కానీ,  అలా  వెళ్ళాలంటే  ఒక్కొక్కరే  వెళ్ళాలంట.    భక్తుల  రష్  వల్ల  సమయం  సరిపోదు  కాబట్టి,   కొంతకాలం  క్రిందట  దేవస్థానం  వారు  వేరే  దారిని  నిర్మించారు.  


* ఈ నూతన  మార్గం  ద్వారా  సులభంగా  వెళ్ళి  దైవదర్శనం  చేసుకోవచ్చు.  ఈ  నూతన  మార్గానికి  దగ్గరలోనే  పూర్వపు  మార్గం  కూడా  ఉంటుందట . అయితే,  ముఖ్యమైన  పండుగలప్పుడు,  కొన్ని  ప్రత్యేకమైన  సందర్భాలలో  మాత్రం  ఈ  ట్రెడిషనల్ మార్గం  ద్వారా  వెళ్ళి  దర్శించుకోవటానికి   భక్తులను  అనుమతిస్తారట.


  ( ఈ  ట్రెడిషనల్  మార్గం  ద్వారా  గుహలోకి  వెళ్ళి  దైవదర్శనం  చేసుకుంటే,  ఆ  మార్గంలో  మరెన్నో  దైవమూర్తులు  దర్శనమిస్తారట.  నూతనంగా  ఏర్పరిచిన  మార్గం  ద్వారా  వెళ్ళిన  వారికి  అవన్నీ కనిపించవు.  ) 

* వైష్ణవీదేవి  దర్శనానికి  మొదటిసారి  వెళ్ళిన  వారు  మరింత  శ్రద్ధగా   చూడాలి.   అమ్మవారు  పెద్ద  విగ్రహ మూర్తిగా  కాకుండా ,  మూడు  చిన్న  పిండీల రూపాలలో  ఉంటారు.  పిండీలంటే  చిన్న  శివలింగాల  మాదిరిగా అనిపిస్తాయి. వైష్ణవీదేవి .....సరస్వతీ  దేవి,  లక్ష్మీదేవి,  కాళికాదేవి(  గౌరీదేవి  ) గా  దర్శనమిస్తారు. 


* భక్తుల  రద్దీ  ఎక్కువగా  ఉండి,  వారిని   త్వరత్వరగా  క్యూలో  పంపించినప్పుడు  ఎక్కువసేపు  దైవాన్ని  దర్శించటం   కుదరదు  కాబట్టి,  ఆ  కొద్దిసేపులోనే  జాగ్రత్తగా  చూడాలి. 


* అమరనాధ్ లో  అయితే, క్యూలైన్లో  వెళ్తూ  ఎక్కువసేపు   దైవాన్ని  దర్శించుకోలేకపోయినా , పక్కకు  వచ్చి  నిలుచుని  దైవదర్శనం  చేసుకోవచ్చు. 

 (  గుహ  లోపల  కూడా  విశాలంగా  ఉంటుంది   కాబట్టి  చాలా  స్థలం  ఉంటుంది. ) 

* వైష్ణవీదేవి  గుహ  లోపల  భక్తులను  త్వరత్వరగా  పంపించారు. ( రద్దీవల్ల ). నేను  సరిగ్గా  చూడలేకపోయాను  అనిపించింది.  భక్తులు  దర్శనానికి  వెళ్ళటానికి  ముందే , బయట  టీవీ స్క్రీన్లలో, అమ్మవార్లను  స్పష్టంగా  చూపిస్తూ,   దర్శనం   చేసుకునేటప్పుడు  సరిగ్గా  చూడమని  తెలియజేస్తుంటారు.  


* క్యూలైన్  లో త్వరపెడుతుంటే,  గుహలో  ఉన్న ఆ   కొద్దిసమయంలో ,  కనిపించే  అలంకరణ  మధ్య  దేవతామూర్తులను సరిగ్గా  దర్శించుకోవాలి. ( లేకపోతే  సరిగ్గా  చూడలేము. ) 


* ముగ్గురు దేవతామూర్తులపైన  మూడు  పెద్ద   కిరీటాలు  ఉంటాయి.  ఆ  కిరీటాలను,  పుష్పాలంకరణను  మాత్రమే  కాకుండా,  కిరీటాల క్రింద  ఉన్న పిండీలను  
 (  దేవతా మూర్తులను  ) స్పష్టంగా  దర్శించుకోవాలి.  వెళ్ళేముందే  ఇవన్నీ  చక్కగా  తెలుసుకుని  వెళ్తే  ,  ప్రాప్తాన్ని  బట్టి  దర్శనం  ఉంటుంది. 

* దర్శనం  చేసుకుని  బయటకు  వచ్చిన  తరువాత , ప్రక్కనే  చరణామృతం  స్వీకరించాలి. (  పాద  తీర్ధం  ). ఈ  చరణామృతం  మూడు  ధారలుగా  పంపులనుంచి  వస్తూంటుంది. ఒక్క  ధారనుమాత్రమే  కాకుండా,   మూడు  ధారలలోని  నీటినీ  ముగ్గురు మూర్తుల  పాదతీర్ధంగా  స్వీకరించాలి. భక్తులు  కొంత  నీటిని  త్రాగి,  మరికొంత  నీటిని  తాము  తీసుకువెళ్ళిన  బాటిల్లో  పట్టుకుని , ఇంటికి  తీసుకువెళ్ళవచ్చు. 


* వైష్ణవీదేవి అమ్మవారి   దర్శనం  తరువాత  , అమ్మవారి  చేతిలో  సంహరించబడ్డ  రాక్షసుడైన  భైరన్  ఆలయానికి  కూడా  వెళ్ళి  దర్శించుకుంటేనే  యాత్ర  సంపూర్ణమైనట్లని  అంటారు.  


* అయితే,  భైరన్  దర్శనం  గురించి  తెలియనివాళ్ళు,  సమయం  సరిపోని  వాళ్ళు   కొందరు   భైరన్  దర్శనం  చేసుకోకుండానే  తిరిగివస్తారట. . భైరన్ అనే  రాక్షసుడు ,  అమ్మవారికి  హాని  కలిగించే  ఉద్దేశంతో  అమ్మవారిని  వెంబడించగా,    అమ్మవారు  అతనిని సంహరించారు.  అప్పుడు  అతని  తల  దూరంగా  ఎగిరిపడింది.  ఆ  శిరస్సు  పడిన  ప్రదేశమే భైరన్   ఆలయం  ఉన్న  ప్రదేశం  అంటారు.  మరణించే  ముందు  ఆ  రాక్షసుడు  మంచిగా  మారి,   అమ్మను  వరం  అడిగాడట.  అమ్మను  దర్శించుకున్న  వారు  తనను  కూడా  దర్శించుకోవాలని   అడగగా  ,  దయామయి  అయిన  అమ్మ  వరమిచ్చారట.  


* ఈ  భైరన్  ఆలయం  సుమారు  రెండు  కిలోమీటర్ల  దూరం  ఉంటుంది.  మేము  వెళ్ళేటప్పటికి  చీకటి  పడవస్తోంది.  అయితే, అక్కడ  లైట్స్  బాగా  ఉన్నాయి.  భైరన్  దర్శనం  చేసుకున్నాము. 


 * మేము  తిరిగి  కట్రాకు  వచ్చి,  మరునాడు  బయలుదేరి  మళ్ళీ  డిల్లీ,...  హైదరాబాద్,....తరువాత  మేము  ఉంటున్నఊరు..ఇంటికి  తిరిగివచ్చాము.  అంతా  దైవం  దయ.


 *  వైష్ణవీదేవి  యాత్రకు  సంబంధించిన   వివరాలన్నీ   వైష్ణవీదేవి  దేవస్థాన్  వారి  వెబ్సైట్  లో  స్పష్టంగా  ఉన్నాయి. యాత్రకు   వెళ్ళేముందు   ఇవన్నీ  తెలుసుకుని  వెళ్తే  బాగుంటుంది.  లేకపోతే  ఇంతకు  ముందు  వెళ్ళివచ్చిన  వారిని  తోడు  తీసుకువెళ్ళినా   బాగుంటుంది. లేక  ట్రావెల్స్  వాళ్ళ  ద్వారా  కూడా   వెళ్ళిరావచ్చు.

........................................... 

 *  వైష్ణవీదేవి  యాత్రకు  సంబంధించిన   వివరాలను  ఈ  లింక్  ద్వారా  చూడవచ్చు.

SHRI MATA VAISHNO DEVI SHRINE BOARD | Official Website


* వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దైవం  దయచేసి  క్షమించాలని  కోరుకుంటున్నాను.



Monday, December 17, 2012

కొన్ని యాత్రా విశేషాలు....నాలుగవ భాగం...మరియు...


ఇప్పుడు ధనుర్మాసం  ప్రవేశించింది. 
 నెలరోజులు  తమిళనాడులోని  శ్రీరంగం శ్రీవిల్లిపుత్తూర్  మరియు  కొన్ని  దేవాలయాలలో ఆండాళ్  అమ్మవారు  రచించిన  తిరుప్పావైని  వినిపిస్తారు.
..................................

కొన్ని  యాత్రా  విశేషాలు....నాలుగవ భాగం.

 మేము  అమర్ నాధ్  నుంచి  తిరిగి  పహల్గాం  వచ్చాము. అక్కడ  నుంచి  వైష్ణవీ  దేవి  యాత్రకు  బయలుదేరాము. ఈ  సారి  టాక్సీలో వెళ్ళకుండా బస్సులో  వెళ్ళాము. అమరనాధ్  యాత్రికులు  ప్రయాణించే  బస్సులకు  రక్షణగా  మిలటరీ  వాళ్ళు  తమ  వాహనాలలో  వస్తారు.



తరువాత,  వైష్ణవీదేవి  యాత్రకు  కట్రా  అనే  ఊరు  వెళ్ళి  అక్కడ  రూం  తీసుకున్నాము. కట్రా  తిరుపతి లాగా  జనంతో  బాగా రద్దీగా ఉంది.


 వైష్ణవీదేవి  త్రికూట  పర్వతంపై  కొలువై ఉన్నారు.  ముగ్గురమ్మలైన మహాకాళి(మహా గౌరి), మహాలక్ష్మి,  మహాసరస్వతి  కొలువైన  అద్భుతమైన ప్రదేశం. 


   కట్రా  నుంచి  చూస్తే   కొండపైని  దేవాలయ  పరిసరాలు  రాత్రిసమయంలో  లైట్లతో  ధగధగా  వెలుగుతూ కనిపిస్తాయి.  కట్రా  నుంచి  ఎప్పుడైనా  బయలుదేరి  దేవాలయానికి  వెళ్ళవచ్చట. అంటే  రాత్రి  సమయంలో కూడా యాత్రికులు 
వెళ్తూనే ఉంటారని అక్కడి  వాళ్ళు  చెప్పారు.

కత్రా నుంచి వైష్ణవీదేవి  గుడికి  వెళ్ళటానికి  కొద్దిదూరం  ఆటోలో వెళ్ళాము. అక్కడ ఆటో  దిగిన తరువాత,  కొద్ది  దూరంలో బన   గంగాప్రవాహం ఉంటుంది. అక్కడ   కొందరు  యాత్రికులు  స్నానం  చేస్తారట.


 దేవాలయానికి వెళ్ళే  దారిలో  కొన్ని ఉపాలయాలు   ఉన్నాయి.  పూజాసామాను  అమ్మే  షాప్స్   కూడా   ఉన్నాయి. వైష్ణవీదేవి  దేవాలయానికి  వెళ్ళాలంటే  సుమారు   12  కిలోమీటర్లు  దూరం  ఉంటుందంటారు. నడిచి  లేక  గుర్రాలమీద కానీ, డోలీలలో గానీ  వెళ్ళవచ్చు. హెలికాప్టర్  సదుపాయం  కూడా  ఉంది.  


అమరనాధ్  వద్దకు   కూడా  హెలికాప్టర్  సౌకర్యం   ఉంది,   హెలికాప్టర్స్ వాళ్ళు అమరనాధ్  గుహకు  దగ్గరలోనే  యాత్రికులను  దింపుతారు..అయితే, కొందరు  ఏమంటున్నారంటే, ఈ హెలికాప్టర్స్ రాకపోకల వల్ల  గుహవద్ద  వేడి పెరుగుతోంది అని  అంటున్నారు.  



 అమరనాధ్ గుహకు నడవలేకపోయాము  కదా!  వైష్ణవీదేవి వద్దకు  అయినా నడిచి వెళ్దామని  బయలుదేరాము. అక్కడకు  ఒకటి కన్నా ఎక్కువదారులే ఉన్నట్లున్నాయి.

  మేము  వెళ్ళినప్పుడు( జులైలో) వైష్ణవీదేవి వద్ద  మంచు లేదు  కానీ,  చలికాలంలో  దేవాలయం  వద్ద  చాలా  మంచు  ఉంటుందట.

కొండను  ఎక్కేటప్పుడు  అక్కడక్కడా   దారికి  ఇరువైపులా  షాప్స్  ఉన్నాయి.  అక్కడ పళ్ళరసాలు, కూల్ డ్రింక్స్  , సమోసాలు..వంటివి  కూడా  అమ్ముతున్నారు. 


 అమరనాధ్ లో లానే , వైష్ణవీదేవి పరిసరాలలో కూడా  వర్షాలు  వచ్చినప్పుడు అప్పుడప్పుడు  కొండచరియలు  విరిగి  పడతాయట. 


 ( విజయవాడ  దుర్గమ్మ  గుడి సమీపంలో  కూడా  కొన్నిసార్లు   కొండచరియలు  విరిగిపడటం జరిగిందని వార్తలలో  విన్నాను ..) 

వైష్ణవీదేవి  యాత్రకు  మేము  వెళ్ళినప్పుడు , ముందు రోజు  పడిన  వర్షానికి  కొన్ని చోట్ల  కొండలమీది నుంచి  మట్టిపెళ్ళలు పడితే వాటిని  తొలగిస్తున్నారు. 

వైష్ణవీ  దేవి  దేవాలయానికి  వెళ్ళే మధ్య  దారిలో  అదుక్ వరి అని  ఒక  గుహ  ఉంటుందట. ఆ గుహలో  అమ్మవారు  తొమ్మిదినెలలు  తపస్సు  చేసారట.  భక్తులు  ఈ గుహలోకి  వెళ్ళటానికి, ఒకవ్యక్తి  మాత్రమే  వెళ్ళగలిగే  విధంగా  సన్నటి  దారి ఉంటుందట. అయితే, ఆశ్చర్యమేమిటంటే, లావుగా  ఉన్న  వ్యక్తి  కూడా  ఆ దారినుంచి  వెళ్ళగలరంట.


 ఆర్ధ్కువరిని  గర్భ్ ఝూన్  అని  కూడా  అంటారట.  వైష్ణవీదేవి మెయిన్  టెంపుల్ కు  వెళ్ళే  మధ్య  దారిలో  ఈ గుహ  ఉంటుంది.. అయితే,  మేము ఈ  గుహను  దర్శించుకోలేదు. ఈ  గుహను  దర్శించుకుంటే  ఎంతో మంచిదంటారు.

వైష్ణవీదేవి    దేవాలయానికి  వెళ్ళే  దారికి  ఇరువైపులా  కొండలు,  గుట్టలు,  లోయలు,  చెట్లతో   అక్కడ  ప్రకృతి  చాలా  బాగుంది. వెళ్ళేటప్పుడు  అక్కడక్కడా  ఆగుతూ , కొద్దిసేపు  కూర్చుని  విశ్రాంతి  తీసుకుని,  నిదానంగా  వెళ్ళాము. తిరుమల  చాలామంది  నడిచి  వెళ్తారు కదా  !  అలాగే ..


  మొత్తానికి   భగవంతుని  దయవల్ల   వైష్ణవీదేవి దేవాలయం  వద్దకు  చేరుకున్నాము.


 వైష్ణవీదేవి  గుహ వద్ద  దేవాలయ  పరిసరాలను  భవన్  అంటారు. అక్కడ  రిజిస్ట్రేషన్  కౌంటర్    వద్ద   రిజిస్ట్రేషన్   పేపర్స్ తీసుకుని  భద్రపరచుకోవాలి. దైవదర్శనానికి  ఈ  రిజిస్ట్రేషన్  పత్రాలు  ఎంతో  అవసరం.


ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.సెక్యురిటి వాళ్ళు  అందరినీ  పరీక్షించి దేవాలయం లోపలికి  పంపుతారు. వైద్య  సదుపాయాలు,  వసతికి  గదులు,  చక్కటి  ఆహారం,..ఇలా  ఎన్నో  సదుపాయాలున్నాయి. బాంక్, ఫోన్  సౌకర్యం..కూడా  అందుబాటులో  ఉన్నాయి.  అక్కడంతా   ఒక  ఊరిలాగే  ఉన్నది....(  ఇంకా ఉంది..)



Thursday, December 13, 2012

శంకరాచార్యుల వారికి స్త్రీలంటే ఎంతో గౌరవం .....


*  ఆదిశంకరాచార్యుల వారి  ప్రశ్నోత్తర రత్న మాలికలోని   కొన్ని  విషయాలను  గురించి,  కొందరు  ఏమనుకుంటారంటే,  శంకరాచార్యుల  వారికి  స్త్రీలంటే  చిన్నచూపు  ఉన్నదేమో  ? అని  అపోహపడతారు.


*ఈ  విషయాల  గురించి  నాకు  తెలిసింది  చాలా  తక్కువ.  నాకు  తెలిసినంతలో , నా  అభిప్రాయాలను  వ్రాయాలనిపించి  వ్రాస్తున్నాను. 


* ఆదిపరాశక్తిని  ఎంతగానో  ఆరాధించిన   శంకరాచార్యులవారికి  స్త్రీలంటే  చిన్నచూపు  ఉండదు.


* ఆదిశంకరాచార్యుల  వారు శిష్యులకు  బోధించినది   ఈ “ ప్రశ్నోత్తరీ మణిరత్నమాల ” అనుకుంటున్నాను.


*  ప్రశ్నోత్తర రత్న మాలికలోని  ఈ  విషయాలను  గమనించితే,   శంకరులవారికి  స్త్రీలంటే  చిన్నచూపు  ఎంతమాత్రం  లేదని  తెలుస్తుంది.

* Who is  the friend  for  a  family  man  ?
a.  His  wife.


* Who  is  God  whom  we  can  see  ?
a.   Mother. 


* Who  is the  teacher  fit  to  be  worshipped  ?
a.  Father.


* Who  is  a  brahmachari  (  unmarrieD  lad  doing austerities ) ?
a.  He  avoids  contact  with  women  and  is  safe  from  such  contacts.


తల్లిని  కనిపించే  దైవంగా  ,  భర్తకు  జీవితంలో  స్నేహితురాలిగా  భార్యను  చెప్పటం  బాగుంది.

* వారు  స్త్రీల  విషయంలో  జాగ్రత్తగా  ఉండమని  చెప్పినది  వివాహం  కాని బ్రహ్మచారులు,   ..వంటి  కొందరిని   ఉద్దేశించి    చెప్పారని  అనిపిస్తున్నది.
.......................

* పై  విషయాలను  గురించి,    నాకు తోచిన  అభిప్రాయాలను  క్లుప్తంగా  చెప్పుకోవాలంటే,,

* వివాహం  కాని  బ్రహ్మచారులైన  పురుషులు ,  స్త్రీలకు  తగుమాత్రం  దూరంగా  ఉండాలి. లేకపోతే.........వారి  విద్యాభ్యాసం  కుంటుపడి,  వారి  భవిష్యత్తు  అంధకారమయ్యే  ప్రమాదముంది.
 

* తపస్వులైన  పురుషులు  స్త్రీలకు  తగుమాత్రం  దూరంగా  ఉండాలి. లేకపోతే......వారి  తపస్సుకు  భంగం  కలిగి , అప్పటివరకు  సంపాదించుకున్న  తపశ్శక్తిని  కోల్పోవలసివస్తుంది. అప్పుడు   తపస్సు  ద్వారా  వారు  పొందాలనుకున్న ప్రయోజనాలు  నెరవేరవు  కదా  !


*( గృహస్తుల  వంటి వారు   కూడా  కోరికలను  సిద్దింపజేసుకోవటానికి ,  కొన్నిసార్లు  తపస్సులు    చేస్తుంటారు....ఇలాంటివారు  కూడా   దీక్షా  సమయంలో  స్త్రీలకు  కొంతవరకు   దూరంగా  ఉండాలి. అయితే,  దీక్షావిధికి  సంబంధించిన  సహాయం, ఆహారాన్ని  తయారుచేసి అందించటం, అనారోగ్యం  కలుగకుండా  చూసుకోవటం..మొదలైన  సేవల  విషయంలో  భార్య  సహాయాన్ని    పొందవచ్చు  అనుకుంటున్నాను...)
..................................


 * శంకరాచార్యుల  వారు,  తల్లి  మరణించిన  సందర్భంలో,   తానే  వచ్చి   అంత్యక్రియలు  నిర్వహించారని  విన్నాను.  సన్యాసాన్ని  స్వీకరించిన  వ్యక్తి  తన  తల్లికి  అంత్యక్రియలు  చేయకూడదని  అప్పటి  వారు   కొందరు  అన్నారట.

*అయితే,,సన్యాసస్వీకారం  అప్పుడు   గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, "ప్రాత:కాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను" అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారని  అంతర్జాలంలో వ్రాసారండి. . అలా ఇచ్చినమాట  ప్రకారం  వారు   తల్లి  పట్ల  తన  బాధ్యతను  నిర్వర్తించారనిపిస్తుంది. దీనిని  బట్టి  చూస్తే,  తల్లి  అంటే   వారికి  ఎంతో  గౌరవం  అని  మనం  తెలుసుకోవచ్చు.

* ఒక సారి  ఆదిశంకరాచార్యుల  వారు  భిక్షకు  వెళ్ళినప్పుడు , పేదరాలైన  ఒక  స్త్రీ  భిక్ష  వేయటానికి  ఇంట్లో  ఏమీ  లేక,   ఒక  ఉసిరికాయను  భిక్షగా  సమర్పించగా ,  ఆ  ఇల్లాలి  పరిస్థితికి  జాలి  కలిగి  అప్పటికప్పుడు  కనకధారా  స్తోత్రాన్ని  పఠించి   శ్రీ  మహాలక్ష్మి అమ్మవారి   అనుగ్రహాన్ని  పొంది  బంగారు  ఉసిరి పండ్ల  వాననే  కురిపించారంటారు. 

* ఇవన్నీ  గమనిస్తే  వారికి  స్త్రీలంటే  గొప్ప  గౌరవం   అని  తెలుస్తుంది.


....................................
* పూర్వం    కొందరు  తపస్వులు,  మహర్షులు    స్త్రీ  విషయంలో  పొరపాట్లు  చేసి, అప్పటివరకూ   కష్టపడి  సాధించిన  ఎంతో  తపశ్శక్తిని  పోగొట్టుకున్నారు.  ఉదా....విశ్వామిత్రుల  వారు.

* తపస్వులు  తపస్సులు  చేసేటప్పుడు  ఎంతో  నిగ్రహంగా   ఉండాలి.  ఇంద్రుడు  వంటివారు  తపస్వుల   నిగ్రహాన్ని  పరీక్షించటానికి  అప్సరసలను   పంపటం   వంటి   ఎన్నో  పరీక్షలను  పెడతారు. ఈ   పరీక్షలో  నెగ్గినవారికే  తపోఫలం  లభిస్తుంది.

 
* ఇక  గృహస్తుల  విషయంలో ,   వివాహమైన  పురుషుడు  ధర్మపత్నితో  సంసారాన్ని  సాగించటం  వరకూ  ఎవరూ  అభ్యంతరం  చెప్పరు. . భార్యాభర్తలు  అర్ధనారీశ్వరులన్నారు  కదా ! పెద్దలు. 

* అయితే,   ఒక  సంసారాన్ని  నిర్వహించాలంటేనే  కొన్ని  కష్టాలుంటాయి.   ఇక  ఎక్కువమంది  స్త్రీలతో  భాంధవ్యాలను   పెంచుకుంటూ  పోతే  పురుషులకు  బాధ్యతలు,  కష్టాలు    పెరగటం  తప్ప,  సుఖమేమీ  ఉండదు.
* అందుకని  గృహస్తులు  కూడా  పరాయి  స్త్రీల  విషయంలో  జాగ్రత్తగా  ఉండాలి. 


* ఇక  పురాణేతిహాసాల్లో  చూస్తే , కొందరు   స్త్రీలు  అనుకున్నంత  అబలలు  కాదని  తెలుస్తుంది.  శ్రీ  రాముని  వనవాసానికి  పంపించే  విషయంలో  చాడీలు  చెప్పిన  మంధర,  రావణునికి  చాడీలు  చెప్పి  సీతాదేవిని   అపహరించటానికి  కారకురాలైన   శూర్పణఖ  స్త్రీలే.


* పై  విషయాలను  గమనించితే,  పురుషులు  కొన్ని  సార్లు,  స్త్రీల  విషయంలో   తగుమాత్రం  దూరంగా  ఉండాలి  .అని  తెలుస్తుంది..  

*  శంకరాచార్యుల  వారు  స్త్రీల  విషయంలో  జాగ్రత్తగా  ఉండమని  చెప్పినది , వివాహం  కాని బ్రహ్మచారులు,   ..వంటి  కొందరిని   ఉద్దేశించి   చెప్పారని  అనిపిస్తున్నది.


* శంకరాచార్యుల  వారు, 
తల్లిని  కనిపించే   దైవంగా , భర్తకు  చక్కటి  స్నేహితురాలిగా  భార్యను  చెప్పటాన్ని  గమనించితే,  వారికి  స్త్రీలంటే  ఎంతో  గౌరవం  అని  తెలుస్తుంది.
.................................
* ఆదిశంకరాచార్యుల వారి  ప్రశ్నోత్తర రత్న మాలికలోని   కొన్ని  విషయాలను  గురించి,
అంతర్జాలంలో  ఈ  లింక్స్  ద్వారా  తెలుసుకోవచ్చు..........

prasnottara ratna malika of adi sankaracharya - gleanings from ...

Prashnottara Ratna Malika | Vedanta Spiritual Library

Hinduism EBooks: Prasnottara Ratna Malika of Adi Sankaracharya ...


* నేను  పై  విషయాలను  ఎవరితోనూ  పోటీ  కోసం  వ్రాయలేదండి.  ఆదిశంకరాచార్యుల  వారికి  స్త్రీలంటే  ఎంతో  గౌరవం . అని  ప్రజలకు  తెలియజేయాలన్నది  నా  తాపత్రయం.


  * వ్రాసిన  విషయాల్లో  పొరపాట్లు  ఉన్నచో  దయచేసి   క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.
 

Wednesday, December 12, 2012

తులసి మొక్క..



తులసి  మొక్క  గొప్పదనం  గురించి  పూర్వీకులు  మనకు  తెలియజేసారు.

తులసి  ఆరోగ్యానికి  కూడా  ఎంతో సహాయపడుతుంది.

 పువ్వులను,  అమ్మినట్లే   కొందరు    తులసి  పత్రాలను  అమ్ముతారు.  ఇలా  అమ్మే  వారి  వద్ద  తులసి  పత్రాలను  కొని ,  వైద్యానికి  వాడుకోవచ్చు.  లేక  దేవునికి  సమర్పించిన  తరువాత , ఆ  తులసిదళాలను  తీసుకుని  వైద్యానికి  వాడుకోవచ్చు.

చెన్నైలోని  కొన్ని   దేవాలయాల్లో   దేవునికి  సమర్పించిన  తులసి  మాలలను,  పత్రాలను    తరువాత  ప్రక్కన  ఉన్న  బుట్టలో  వేస్తారు.  భక్తులు  ఆ  తులసి  ప్రసాదాన్ని  తెచ్చుకోవచ్చు.

 చాలామంది  ఇళ్ళల్లో  తులసిని  పెంచుకుంటారు.  కొందరు  నేలపై  పెంచుకుంటారు.   నేలలో  పెట్టిన  తులసికి  స్థలం   బాగానే   సరిపోతుంది.

 ఈ రోజుల్లో  అపార్ట్మెంట్  ఇళ్ళు  పెరిగిపోయిన  తరువాత  కొందరు ,  తులసి  మొక్కలను  చిన్నచిన్న   ఇరుకైన   సిమెంట్  కుండీలలో  పెంచుతున్నారు.

ఈ  చిన్న   కుండీలలో  మొక్క  యొక్క  వేర్లు  పెరగటానికి  స్థలం  సరిపోక,  కొన్నాళ్ళకు  కుండీలోని  మట్టి   గట్టిపడి ,  మొక్కకు  పోషకాలు  సరిగ్గా  అందవు.  అప్పుడు  మొక్క  బలహీనంగా  పీలగా  తయారవుతుంది. 

 బలహీనంగా,చిన్నగా  ఉన్న  మొక్కకే   బోల్డు  గాజులు   తొడిగి , పండుగలప్పుడు పూజలు చేస్తుంటారు కొందరు ..
 మొక్క  చాలా  చిన్నగా  బలహీనంగా  ఉంటే ,  రెండు  గాజులను  తొడిగి, మరికొన్ని  గాజులను  తులసి మొక్కకు  ఎదురుగా  ఉంచి   కూడా  సమర్పించుకోవచ్చు  అని   నాకు  అనిపించింది.

   ( ఈ  విధంగా   రాయవచ్చో  రాయకూడదో  నాకు  తెలియదు.  ఒకరు  చాలా  చిన్న  మొక్కకే  బోల్డు  గాజులు  తొడగటం  చూసి, మొక్క  వంగిపోతుందేమోననిపించి  నాకు  కలిగిన  అభిప్రాయాలను  వ్రాసాను.  )

మొక్క వద్ద  ఉంచే  దీపపు వేడి  మొక్కకు తగలకుండా  దీపాన్ని ఉంచాలి  అని కూడా నాకనిపించింది.


తులసికి  పూజలు  చేయటం  మంచిదే    కానీ,  మొక్క   చక్కగా  ఏపుగా   పెరిగే  విధంగా    జాగ్రత్తలు  తీసుకోవటం  కూడా  ముఖ్యమే.

 కుండీకి  ఎండ  కూడా  సరిపడా  తగిలేలా   చూసుకోవాలి.   ఇలా  చక్కగా  పెంచుకుంటే ,  తులసిమొక్క    చక్కగా  పెరుగుతుంది.

ఇరుకు  సిమెంట్  కుండీల  కన్నా,  కొంచెం  పెద్ద  సైజ్  మట్టి కుండీల్లో   తులసిమొక్కను  పెంచుకుంటే  మొక్క  బాగుంటుంది.    మట్టి కుండీల సన్నటి రంధ్రాల  నుంచి  గాలి  బయటకు  ప్రసరించి  మొక్క  చక్కగా పెరుగుతుంది.


వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.

వ్రాసిన  విషయాలలో  తప్పులు  ఉంటే ,  ఎవరైనా  సలహా  చెప్పగలరు.  (  వారికి  అభ్యంతరం  లేకపోతే. .)




Monday, December 10, 2012

. కొన్ని యాత్రా విశేషాలు...మూడవభాగం...మరియు ....ఉమామహేశ్వర స్తోత్రము.

 
* అమర్నాధ్  గుహలో  ప్రధాన  మంచులింగం  మాత్రమే  కాకుండా  ఇంకా  రెండు     చిన్న   మంచుమూర్తులు    కూడా  ఉంటాయి. ఆ  మంచుమూర్తులను    పార్వతీ  దేవి,  వినాయకుడుగా   భావిస్తారు .

* అయితే,  శివలింగం  యొక్క  పానమట్టాన్ని  పార్వతీదేవిగా  భావిస్తారని  పండితులు  చెబుతారు. అమరనాధ్ లో   కూడా  మంచుశివలింగంవద్ద పానమట్టంలా  మంచు  ఉంటుంది.  అందువల్ల  మంచుశివలింగం  యొక్క  పానమట్టాన్ని  కూడా  పార్వతీదేవిలా  భావించవచ్చని  నాకు  అనిపించిందండి.

* గుహలో  కొన్ని  పావురాలు   కనిపిస్తాయి. వాటిని  దర్శించుకుంటే   మంచిదంటారు.  మేము  వెళ్ళినప్పుడు  చూశాం. గుహలోపల  పావురాలు   ఎగురుతూ  తిరుగుతున్నాయి.

* అమర్నాధ్  గుహలో  కాళ్ళ క్రింద  చాలా చల్లగా  ఉంటుంది.  గుహలో అంత చల్లగా ఉన్నా , ఒక రాతి పలక దగ్గర మాత్రం   చాలా చాలా వేడిగా ఉంటుందట. ఈ విషయం  అక్కడి వారికి కూడా చాలామందికి తెలియదని ఒక పుస్తకములో చదివాను.

* కానీ తీరా అక్కడికి వెళ్ళాక , నేను  ఆ విషయమే  మర్చిపోయాను. ఇలాంటప్పుడు ఏమని అనిపిస్తుందంటే,  మనం ఎంత తాపత్రయపడినా మనకు ఎంత ప్రాప్తమో  అంతే ప్రాప్తిస్తుందని   తెలిసివస్తుంది.

* మేము కేవలం దైవ భక్తితో మాత్రమే కాక,  లౌకికపరమైన కోరికలతో కూడా ఈ యాత్రలు  చేశాములెండి.

ఇంకో విషయం చెప్పాలండి .....ఈ రోజుల్లో చాలా దేవాలయాల్లో    రద్దీ  వల్ల,  క్యూ లైన్లలో త్వరత్వరగా   దైవదర్శనం  చేసుకోవలసి  వస్తోంది  కదా ...

* మనలో చాలామందికి ఒక అలవాటుంది. గుడిలో దేవుని వద్దకు వెళ్ళగానే ,  టపీమని  కళ్ళుమూసుకుని దేవునికి నమస్కరించటము చేస్తుంటాము.

* దీనివల్ల  దైవం ముందు ఉన్న ఆ కొద్దిసమయములో దేవుని  సరిగ్గా చూడలేము. అలా కాకుండా ఆ కొద్దిసేపు   దేవుని   చక్కగా  చూడాలి.   కావాలంటే తరువాత ప్రక్కకు వచ్చి  కళ్ళు మూసుకుని  దైవాన్ని ప్రార్దించుకోవచ్చు.


* ఇంకో ముఖ్యమైన విషయం  ఏమిటంటేనండి     ,  దైవదర్శనం చేసుకునేటప్పుడు    వీలైనంతవరకు వేరే  ఆలోచనలు    లేకుండా     దైవదర్శనం చేసుకుంటే , ఆ భగవంతుని చక్కగా చూడగలం.   చూసిన  దైవస్వరూపాన్ని   చక్కగా  గుర్తుపెట్టుకోగలం.

* అమర్నాధ్ యాత్ర కు   చాలామంది ఆడవాళ్ళు,   చిన్నపిల్లలు కూడా వచ్చారండి. కొంతమంది కాళ్ళు సరిగ్గా లేనివాళ్ళు కూడా కర్రల సహాయంతో   లేక  చేతుల  సహాయంతో ఆ మంచులో వెళ్ళటం చూశాక   ఏమనిపించిందంటే ...  ప్రపంచంలో  ఎందరో  గొప్ప  భక్తులున్నారు.  మనమే  గొప్ప  భక్తులం  అనుకోకూడదు. అని.


* అమరనాధ్  యాత్ర  గురించి  అంతర్జాలంలో  ఎన్నో  వివరాలున్నాయి.  వీడియోలు  కూడా  చాలా  ఉన్నాయి.   అందులోని  ఒక  వీడియోను    ఈ  లింక్  ద్వారా  చూడవచ్చు........

Virtual Amarnath Yatra Pilgrimage - YouTube

* లేక  మీరు  ఎంచుకున్న  వీడియో ద్వారా    కూడా   చూడవచ్చు. అంతర్జాలంలో  తక్కువ  సమయం  ఉన్న వీడియోలు  కూడా  ఉన్నాయి.

* ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న  సభ్యులకు  మరియు  అందరికి  అనేక  కృతజ్ఞతలండి.
.......... 

* ఉమామహేశ్వర  స్తోత్రము.

1. నమశ్శివాభ్యాం  నవయౌవనాభ్యాం  పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం

నాగేంద్రకన్యా  కేతనాభ్యాం  నమోనమశ్శంకరపార్వతీభ్యామ్   ....


2. నమశ్శివాభ్యాం  సరసోత్సవాభ్యాం  నమస్కృతాభీష్ట వరప్రదాభ్యాం


సురా
Z సురేంద్రా నార్చిత  పాదుకాభ్యాం
నమోనమశ్శంకరపార్వతీభ్యామ్   ....

3. నమశ్శివాభ్యాం  వృషవాహనాభ్యాం  విరించి  విష్ణ్వింద్ర సురపూజితాభ్యాం


విభూతిపాటీర విలేపనాభ్యాం  నమోనమశ్శంకరపార్వతీ
భ్యామ్  ....

4. నమశ్శివాభ్యాం  జగదీశ్వరాభ్యాం  జగత్పతిభ్యాం  జయవిగ్రహాభ్యాం


జంభారిముఖ్యై  రభివందితాభ్యం  నమోనమశ్శంకరపార్వతీ
భ్యామ్ ....

5. నమశ్శివాభ్యాం  పరమౌషధాభ్యాం  పంచాక్షరీ  పంజర  రంజితాభ్యాం


ప్రపంచసృష్టి స్థితి  సంహృతాభ్యాం    నమోనమశ్శంకరపార్వతీ
భ్యామ్  ....

6. నమశ్శివాభ్యా   మతిసుందరాభ్యాం  అత్యంత  మాసక్తహృదయాంబుజాభ్యాం


అశేషలోకైక  హితంకరాభ్యాం  నమోనమశ్శంకరపార్వతీ
భ్యామ్  ....

7.  నమశ్శివాభ్యాం  కలినాశనాభ్యాం  కంకాళ  కళ్యాణ  వపుర్ధరాభ్యాం


కైలాసశైల  స్థిత దేవతాభ్యాం  నమోనమశ్శంకరపార్వతీ
భ్యామ్  ....

8.  నమశ్శివాభ్యా  మశుభాపహాభ్యాం  అశేషలోకైక విశేషితాభ్యాం


అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం నమోనమశ్శంకరపార్వతీ
భ్యామ్ ....

9. నమశ్శివాభ్యాం  రధవాహనాభ్యాం  రవీందు  వైశ్వానర లోచనాభ్యాం


రాకా శశాం కాభ  ముఖాంబుజాభ్యాం  నమోనమశ్శంకరపార్వతీ
భ్యామ్  ....

10.   నమశ్శివాభ్యాం  జటిలం  ధరాభ్యాం  జరామృతిభ్యాం చ వివర్జితాభ్యాం


జనార్ధ నాబ్జోద్భవ  పూజితాభ్యాం  నమోనమశ్శంకరపార్వతీ
భ్యామ్  ....

11. నమశ్శివాభ్యాం  విషమేక్షణాభ్యాం  బిల్వచ్చ దా మల్లిక దా మభృద్భ్యాం


శోభావతీ  శాంతవతీశ్వరాభ్యాం  నమోనమశ్శంకరపార్వతీ
భ్యామ్  ....

12. నమశ్శివాభ్యాం  పశుపాలకాభ్యాం  జగత్రయీ  రక్షణ  బద్ధహృద్బ్యాం


సమస్తదేవాసుర  పూజితాభ్యాం  నమోనమశ్శంకరపార్వతీ
భ్యామ్  ....

స్తోత్రం  త్రిసంధ్యాం  శివపార్వతీభ్యాం  భక్త్యా  పఠన్  ద్వాదశకం  నరో  యః
స  సర్వసౌభాగ్యాఫలాని  భుం క్తే  శతాయు రంతే  శివలోక  మేతి.


* ఇతి  శ్రీ మత్పరమహంస  పరివ్రాజకాచార్యవర్య   శ్రీ మచ్చంకరాచార్య  విరచితం   శ్రీ  ఉమామహేశ్వర  స్తోత్రము.

ఫలం  : ఎవరైతే  రోజూ  మూడుపూటలా  భక్తితో  ఈ  స్తోత్రాన్ని జపిస్తారో  ..వాళ్ళు  నిండు  నూరేళ్ళూ  బ్రతుకును  పండుగలా  జరుపుకుని...అంత్యంలో  శివసాన్నిధ్యం   పొందుతారు.


* వ్రాసిన  విషయాలలో ఏమైనా  పొరపాట్లు లేక  అచ్చుతప్పుల  వంటివి  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.
 

Friday, December 7, 2012

కొన్ని యాత్రా విశేషాలు...రెండవ భాగం..

ఓం..
జమ్మూ  నుంచి  కొంతదూరం  వెళ్తే   రెండు  దార్లు  వస్తాయట.  ఒక  దారి  నుండి  వెళ్తే    పహల్గాం  వైపు,  ఇంకొక  దారి  నుంచి  వెళ్తే  బాల్టాల్  వైపు  వెళ్ళి  అమర్నాధ్  యాత్ర  చెయ్యవచ్చట.  కొందరు  శ్రీ  నగర్    వెళ్ళి   అక్కడి  శంకరాచార్య  వారి  దేవాలయాన్ని  కూడా  దర్శించుకుంటారట.  ఆ  ఆలయం  ఎంతో  ప్రముఖమైనదట.   మేము  అక్కడకు  వెళ్ళలేకపోయాం. 


పహల్గావ్  ఇప్పుడు  పెద్ద  టూరిస్ట్  ప్లేస్ . అక్కడకు  వింటర్  సీజన్  లో పర్యాటకులు  వచ్చి  ఐస్  స్కేటింగ్   వంటి  ఆటలు  ఆడతారట. 


పార్వతీపరమేశ్వరులు   అమరనాధ్  గుహకు  వెళ్ళేముందు  పెహల్గావ్  వద్ద  నందీశ్వరుని  , చందన్వారి  వద్ద  చంద్రుని  ,   శేష్ నాగ్  వద్ద  నాగులను   , మహాగుణాస్ పర్వతం  వద్ద  గణేశుని  ,  పంచతరణి  వద్ద  పంచభూతాలను  ఉంచారట. 


  పహల్గావ్  నుంచి  వాన్లు  ఉంటాయి.  యాత్రికులు   వాటిలో   బయలుదేరితే  చందన్వారి    వరకు    వెళ్ళొచ్చు. కొందరు .భక్తులు  పహల్గావ్  నుంచే  నడుచుకుంటూ అమరనాధ్  యాత్ర  మొదలుపెడతారు.  అక్కడ నుంచి   అమర్నాధ్  గుహ  చాలాదూరం  ఉంటుంది.

చందన్వారి చేరితే   ఇక  అదంతా  మరో  ప్రపంచం.   ఇక  ఇక్కడనుంచి  సెల్  ఫోన్స్  పనిచెయ్యవు.  మరీ  అర్జంట్  అయితే , అక్కడ  ఉన్న  మిలట్రీ  వాళ్ళను  అడిగితే  వాళ్ళ  వద్ద  ఉన్న  ఫోన్స్  ద్వారా  మాట్లాడవచ్చనుకుంటా.  అయితే,  ఈ  సంవత్సరం  యాత్రికులకు  ఫోన్  సౌకర్యం  కల్పించారని  వార్తలలో  విన్నాను. 



పెహల్గావ్  నుంచి  గుహను  చేరే  వరకు  ఎన్నో  సదుపాయాలను  కల్పించారు.   ఆహారం   చాలా  బాగుంటుంది. ,  వైద్య  సహాయం  
బాగుంటుంది.  వసతికి  మామూలు  టెంట్స్,  రేకులతో  కట్టిన  రూంస్   కూడా   ఉన్నాయి.   తాత్కాలికంగా  ఏర్పాటు  చేసిన  టాయిలెట్స్  సౌకర్యం  కూడా  ఉంది. 

చందన్ వారీ  నుంచి  నడిచి  గానీ,  గుర్రాలపై  గానీ,  డోలీల  ద్వారా  గానీ  అమరనాధ్  గుహకు వెళ్ళవచ్చు. మేము  గుర్రాలపై  ప్రయాణించాము.   గుర్రాలను  నడిపించేవాళ్ళు  యాత్రికులను  ఒకటి  రెండురోజులలో  దైవదర్శనం  చేయించి  తీసుకొస్తామంటారు.
  ( వాతావరణ  పరిస్థితులు  అనుకూలంగా  ఉంటే. )
 
 కానీ,  ఒకేసారి  ఎక్కువ  దూరం  ప్రయాణించటం  వల్ల  యాత్రికులు  అలసిపోతారు.  అందువల్ల   ఒకరోజు  ఆలస్యమైనా  మధ్యలో  ఆగి  విశ్రాంతి  తీసుకుని   ప్రయాణించటం  మంచిది. 

 ( గుర్రపు  యజమానులకు మొదలే  డబ్బులు   ఇవ్వకుండా,   గమ్యస్థానానికి  చేరిన  తరువాతే  వాళ్ళకు  డబ్బు  ఇవ్వటం  మంచిది. ) 


  గుర్రాల   ప్రయాణం  కంటే,  నడిచి వెళ్తే  బాగుంటుందని  నాకనిపించింది.  అయితే  ఓపిక  లేక  గుర్రాలపై  ప్రయాణించాము.  పాపం  ఆ  గుర్రాలు  అలా  కష్టపడుతుంటే  బాధనిపించింది.

కొన్ని   చోట్ల  ప్రయాణించే  మార్గానికి   ఒకవైపు  కొండ  ఉన్నా,  మరో   ప్రక్క   లోయలు  ఉంటాయి.   గుర్రం  యజమానులు  ప్రక్కనే  ఉండి  గుర్రాన్ని  జాగ్రత్తగానే  నడిపిస్తారు.  కొండ    ప్రక్క    లోయలు   చూస్తే   భయమనిపిస్తుంది. 

 నేరకపోయి  గుర్రాన్ని  ఎక్కాము.  దీనికన్నా  నెమ్మదిగా  నడిచి  వెళ్తే  ఎంతో  బాగుండేది  కదా  !  అనిపించింది.   ఇక  దైవం  మీద  భారాన్ని  వేస్తే  అంతా  వారే  చూసుకుంటారు. 

( కొన్ని  దేవాలయాలకు  వెళ్ళే  ఘాట్  రోడ్స్ లో  కూడా  ప్రక్కన   లోయలు  ఉంటాయి  కదా  !  )

గుర్రపు  స్వారీలు  అలవాటు  లేకపోవటం  వల్ల  కాళ్ళు  కీళ్ళు  పట్టేస్తాయి. 


అయితే,  ఎంతో  వృద్ధులు, పిల్లలు,  అంగవికలురు  కూడా  నడిచి  వెళ్తున్నారు.  వాళ్ళను  చూస్తే  ఆశ్చర్యమనిపించింది. దైవభక్తి  , సంకల్పశక్తి..  ఎంతో  గొప్పవి  కదా  !

( ఇలాంటి  గుర్రపు  ప్రయాణం  భయంగా  అనిపించినా,  భయం  లేనిదెక్కడ  ? ఒక  ఊరి  నుంచి  ఒక  ఊరికి  రాత్రి  సమయంలో  నేషనల్  హైవే  మీద  చేసే  ప్రయాణాలు  కూడా  భయంగానే  అనిపిస్తాయి  కదా  !.  )


గుర్రపు  యజమానులు  ఎన్నో  జాగ్రత్తలు  తీసుకుంటూ  ప్రయాణికులను  ఉత్సాహపరుస్తుంటారు.  ప్రక్కన  లోయల  వైపు  చూడొద్దని , ఎదురుగా  ఉన్న  పర్వతాల  అందాలను  పరికించమని  చెబుతుంటారు.  వాళ్ళు  ముస్లింస్  అయినా  భం  భం  బోలేనాధ్,  జై  మహాదేవ్ శంకర్ .. వంటి  నినాదాలు  చేస్తూ  ప్రయాణీకులను  ఉత్సాహపరుస్తుంటారు. 



  సాయంత్రం  అయ్యేసరికి   ఆగి,  భండారాలలో  భోజన,  ఫలహారాలు  కానిచ్చి   బసకు  చేరితే,  అలసటతో  నిద్ర  వచ్చేస్తుంది.  అక్కడ  భండారాల్లో  చక్కటి  భోజన  వసతి  ఉంది.  అక్కడంతా    మైకులో పాటలు   వినిపిస్తూ  సందడిగా  ఉంటుంది.   రకరకాల  ఆహారపదార్ధాలు  ఉంటాయి.   అజీర్ణం  తగ్గటానికి   ఆయుర్వేద   మందు  పొట్లాలను  కూడా  ఇస్తున్నారు. యాత్రికులు  భోజనం  చేసిన  పళ్ళేలను  వేడి  నీటితో  శుభ్రం  చేస్తున్నారు.  



మరుసటి  రోజు  ఉదయాన్నే  లేచి  ప్రయాణం  మొదలుపెడితే  మన  ఓపికను  బట్టి  అదే  రోజు   గుహ  వద్దకు  వెళ్ళగలుగుతాము.  లేక  ఇంకోరోజు  పడుతుంది.  పోనుపోను  ఎక్కువ  మంచు    ఉంటుంది. ఆ  చలిని  తట్టుకోవటం  చాలా  కష్టమైంది. 



అలా  వెళ్ళగా   అల్లంతదూరంలో  అమరనాధ్  గుహ  కనిపించేసరికి   ఉత్సాహం  వచ్చింది.  ఆ   అనుభూతి  మాటలకందనిది. మమ్మల్ని  తీసుకు  వచ్చిన   గుర్రపు  యజమానులు  మాకు  టెంట్  మాట్లాడారు. . గుహ   పరిసరాల్లో   కూడా  టెంట్స్  ఉన్నాయి  . టెంట్లో   సామాను   ఉంచి ,  దైవ దర్శనానికి  బయలుదేరాము. మేము  తీసుకున్న  టెంట్  గుహకు  కొంచెం  దూరం.



  అప్పటికే  సాయంకాలం  అయ్యింది.   నేలపై  మందంగా  మంచు  పరుచుకుంది.  అక్కడ   మంచులో  నడవటానికి  చేతికర్రలు  అద్దెకు  ఇస్తారు.  ఆ  కర్రల  సాయంతో   ఆ  మంచులో   నిదానంగా  నడుస్తూ  గుహ  దగ్గరకు  చేరుకున్నాము.  చుట్టూ  పూజాద్రవ్యాలను  అమ్మే  షాప్స్  ఉన్నాయి. ముస్లింస్  చక్కగా   ఆ  షాప్స్ ను  నిర్వహిస్తున్నారు.  మాకు అక్కడి   మతసహనం  చూసి  చాలా  ఆనందమనిపించింది.  ఆ  షాప్స్ లో   బిల్వపత్రాలు  కూడా  ఉన్నాయి. మొత్తానికి  గుహకు  చేరుకుని  దైవదర్శనం  చేసుకున్నాం. 
  గుహ  వద్ద  అమర్ గంగ  ప్రవహిస్తుంది.

దైవం  దయవల్ల  యాత్రాకాలంలో  వాతావరణం  ఇబ్బంది  పెట్టలేదు.  వాతావరణం  ఆహ్లాదంగా  ఉంది.  వర్షం పడటం  , మంచు  పడటం  వంటి  ఇబ్బందులు  ఎదురవ్వలేదు.  అంతా  దైవం  దయ.


*  ఇదంతా  పహల్గావ్  నుంచీ  వెళ్తే  ...అదే  బాల్టాల్  నుంచీ  వెళ్తే   చాలా  దగ్గరట.  ఒక్క  రోజులో  దైవదర్శనం  చేసి  తిరిగిరావచ్చట.    ట్రావెల్స్  వాళ్ళు   ఎక్కువగా   బాల్టాల్  నుంచే  తీసుకువెళ్తారు.  పహల్గావ్  యాత్ర  చాలా  దూరం,  మరియు  కొంచెం  రిస్క్  అని  వాళ్ళ  అభిప్రాయమనుకుంటా. కొందరు  యాత్రికులు  అమరనాధ్  వెళ్ళేటప్పుడు  బాల్టాల్  నుంచి  వెళ్ళి,  తిరిగి  వచ్చేటప్పుడు  పెహల్గావ్  నుంచి  వస్తారట.  పెహల్గావ్  నుంచి  అమర్నాధ్  గుహ  40  కిలోమీటర్లు  పైనే  ఉంటుంది.  బాల్టాల్నుంచి  14  కిలోమీటర్లు  మాత్రమే  ఉంటుందట.

  మంచుపర్వతాల  ఫొటోస్  మరియు  కొన్ని  యాత్రా  విశేషాలు  పాతటపాలో   ఉన్నాయండి. . 

*  ఈ  లింకులో... June .


Wednesday, December 5, 2012

కొన్ని యాత్రా విశేషాలు మరియు...


మేము  కొంతకాలం  క్రిందట  అమరనాద్,  వైష్ణవి  దేవి  యాత్రలు  చేసి  వచ్చాము.  అంతా  దైవం  దయ.  

 మేము  అంతర్జాలంలో  ఈ  యాత్రల  గురించి  వివరాలను  సేకరించాము. 


  వైష్ణవి దేవి  యాత్ర  సంవత్సరంలో  ఎప్పుడైనా  చేయవచ్చు.  కానీ,  అమర్నాధ్  యాత్ర    ఆషాఢ ,  శ్రావణ  మాసాల్లో  ఉంటుంది.  అంటే,   అప్పుడు  అక్కడ  యాత్రకు  అనుకూలంగా  ఉంటుంది.


 అమర్నాధ్  వెళ్ళటానికి  పెహల్గావ్  రూట్ ,  బాల్టాల్  రూట్ అని  రెండు  దారులు  ఉన్నాయి.  పెహల్గావ్  రూట్  ఎక్కువదూరం,  బాల్టాల్  రూట్   చాలా   దగ్గరదారి. ఎక్కువమంది  బాల్టాల్  దారి  నుండే  యాత్ర  చేస్తారు.

 మేము  పెహల్గావ్ నుంచి   యాత్ర  చేసాము. యాత్ర  మొదలయ్యే  తేదీ  నిర్ణయం  అయిన  తరువాత  ,  వాళ్ళు  నిర్ణయించిన  తేదీలలో   అప్లికేషన్స్  పూర్తిచేసి  యాత్రీకులు  యాత్రను  బుక్  చేసుకోవాలి. 
 (  అంతర్జాలంలో  కూడా  బుక్  చేసుకోవచ్చు.  ) ఆ  పేపర్స్  జాగ్రత్తగా  దగ్గరుంచుకోవాలి.

 మేము  ఉన్న  ఊరు  నుంచి  హైదరాబాద్ కు  వెళ్ళి ,  అక్కడనుంచి  డిల్లీ  ,   డిల్లీ  నుంచి  జమ్ము    చేరుకున్నాము.  జమ్మూలో   రైల్వే   స్టేషన్ లోనే  అమర్నాధ్  యాత్రికులకు  కావలసిన   ఎన్నో  వివరాలను  తెలియజేస్తారు.  


మేము  జమ్మూలో  ఒక  రూం  తీసుకుని,   జమ్మూలో  ప్రముఖమైన  రఘునాధ్  దేవాలయం  దర్శించుకున్నాము. మేము  తీసుకున్న  రూం  రఘునాధ్  దేవాలయానికి  దగ్గరలోనే  ఉంది. తరువాత   శక్తి అమ్మవారి  దేవాలయాన్ని  దర్శించుకున్నాము.

జమ్మూలో  షాప్స్ లో  బాదాం,  అక్రూట్  వంటి  డ్రై  ఫ్రూట్స్  చాలా  చవక.   కొందరు  యాత్రీకులు  కొన్నికిలోల  చొప్పున  కొనుక్కువెళ్తున్నారు.  



జమ్మూలో  అమర్నాధ్  యాత్రికుల  బేస్  కాప్  ఉంది.  అక్కడ  నుంచి  ప్రతి  రోజు  ఉదయం  అమర్నాధ్  యాత్రికుల  కోసం  బస్సులు  ఉంటాయి.  ప్రభుత్వం  వారే  ఆ  బస్సులను  మిలటరీ  రక్షణతో  పంపిస్తారు.   అయితే  ప్రతిరోజు  బస్సులు  వెళ్తాయో  లేదో  చెప్పలేము.  అమర్నాధ్ లో   వాతావరణ  పరిస్థితిని  బట్టి  యాత్రికులను  అనుమతిస్తారు.  


అమర్నాధ్ లో   వాతావరణం  ఎప్పుడెలా  మారుతుందో  చెప్పలేమట. అంతలోనే  వాన,  అంతలోనే  చలి  అలా  మారుతుందట. కొన్నిసార్లు  కొండచరియలు  విరిగిపడటం  కూడా  జరుగుతుంది.  అలాంటప్పుడు  యాత్రికులను  బేస్  కాంప్  లో   ఆపి,   వాతావరణం  బాగయ్యాక  పంపిస్తారు. 


యాత్రీకులు  బేస్  కాంప్  లో   ఉండవచ్చు.  లేక   జమ్మూలోని  హోటల్స్ లో  ఉండవచ్చు. మేము  రూం  తీసుకున్నాము  కానీ,  బేస్  కాంప్  దగ్గర  కూడా  సౌకర్యాలు   చాలా   బాగున్నాయి.  మేము  ఉన్న  రూం కు  బేస్  కేంప్ కు  చాలా  దూరం. 



 బేస్ కేంప్  వద్ద   కొన్ని  గదులున్న   పెద్ద   బిల్డింగ్  , కొన్ని  టెంట్స్    ఉన్నాయి.  అక్కడే  యాత్రికుల  కోసం  మెడికల్ షాప్స్   కూడా  ఉన్నాయి.  యాత్రకోసం  అవసరం  అయిన  స్వెట్టర్స్, రెయిన్   కోట్స్,  షూస్  అమ్మే  షాప్స్  ఉన్నాయి.  పోలీస్ ,  మిలటరీ  రక్షణ  ఉంది. 
జమ్మూలో   కూడా  ప్రజలు    రాత్రయినా   రోడ్లపై  సంచరిస్తున్నారు.  అక్కడ  త్వరగా  చీకటి  పడలేదు.


మరునాడు , మేము  ఒక  టాక్సీ  మాట్లాడుకుని  పెహల్గాం  బయలుదేరి  వెళ్ళాము. దారిలో  యాపిల్  తోటలు  కనిపించాయి.  యాపిల్స్  పిందెలు  అప్పుడే  మొదలయ్యాయి.  రోడ్డుకు  ఇరువైపులా  దానిమ్మ  చెట్లు  ఎక్కువ  కనిపించాయి. 



జమ్మూలో  ఫ్రూట్  జ్యూస్  అమ్మే  షాప్ లో  జ్యూస్  త్రాగితే  కొంచెం  పుల్లగా  ఉంది.  మేము  పంచదార  వెయ్యలేదు  కాబోలు , అని  అడిగితే  అతను  నవ్వి,  అక్కడి  వాళ్ళు  ఫ్రూట్  జ్యూస్ లో  సుగర్  కలపకుండా  అలాగే  త్రాగుతారని  చెప్పారు.   మన రాష్ట్రంలో  షాప్స్ లో   అయితే    చాల  షుగర్   కలుపుతారు.  

  జమ్మూలో  అయితే  అప్పుడు  వాతావరణం  మనకులానే  ఉంది.  నేను  ఏమనుకున్నానంటే,  అక్కడంతా  ఐసే   ఉంటుంది  కాబోలు  అనుకున్నాను.  అయితే  చలికాలంలో    మంచు  కురుస్తుందట.  

గత  కొన్నేళ్ళ  నుంచి  అక్కడ  ఎండ  పెరుగుతోందని    స్థానికులు  చెప్పారు. గ్లోబల్  వార్మింగ్   సమస్యను    మనం  సీరియస్  గా  పట్టించుకోవటం  లేదు  గానీ,    ప్రపంచవ్యాప్తంగా  వాతావరణం 
నిదానంగా మారుతోంది.
 
జమ్మూ  నుంచి  కశ్మీర్  వెళ్ళేసరికి  వాతావరణం  మారిపోయింది.  కింది  తిరుపతి  నుంచి  తిరుమలకు  వెళ్ళేసరికి  వాతావరణంలో  తేడా   ఉంటుంది  కదా  !  అలాగే  కశ్మీర్ ప్రాంతంలోకి  వెళ్ళేసరికి  చలి  మొదలయ్యింది.  జలజలపారే  సెలయేళ్ళు,  ఎత్తుగా  పెరిగిన  వృక్షాలు,  యాపిల్  తోటలు  ఇవన్నీ చూస్తే,  ఊటీ  వాతావరణం , అక్కడి  చెట్లు  గుర్తొచ్చాయి.   ( అయితే,
ఊటీలో నేను  యాపిల్  తోటలు  చూడలేదు. )

  చాలాదూరం  ప్రయాణించిన  తరువాత,   అల్లంత  దూరంలో  మంచు  కప్పుకున్న  హిమాలయశిఖరాలు  కనిపిస్తుంటే .. ఆ  అనుభూతి   వర్ణణాతీతం.  మొత్తానికి  పెహల్గాం  చేరుకున్నాము.  మా  టాక్సీని  నడిపిన  అతను  పంజాబీ  అతను  అనుకుంటా,  అతను   చుట్టుపక్కల విశేషాలను   తెలియజేసాడు.


పెహల్గాం  కూడా  చాలా  శుభ్రంగా  కనిపించింది.  అక్కడి  ఇళ్ళు  కూడా  బాగున్నాయి. పెహల్గావ్ లో  కూడా  అమర్నాధ్  యాత్రికుల  బేస్  కాంప్  ఉంది.  బేస్  కాంప్ లోనే  భోజన  సదుపాయం  కూడా   ఉంటుంది.  ఉత్తరభారతదేశానికి  చెందిన  కొందరు , 
 ఈ  భండారాలను  ఏర్పాటు  చేస్తారు.ఇక్కడ  భోజనం ఫ్రీ.  అయితే ,  ఎక్కువ  ఆహారాన్ని  తీసుకుంటే  యాత్రలో  అనారోగ్యం  కలుగుతుంది  కాబట్టి,  సరిపడా  ఆహారాన్ని  తీసుకోవాలి. 


పెహల్గావ్ లో   ప్రభుత్వం  నిర్వహించే   గెస్ట్  హౌస్   కూడా   ఉంది. ఇంకా  ప్రైవేట్  హోటల్స్  ఉన్నాయి.  మరుసటి  ఉదయాన్నే   యాత్ర  మొదలయ్యింది. .........

 (  ఇంకా  ఉంది.  ) 
....................................

  మన  రాష్ట్రం  నుంచి  అమరనాధ్ ,  వైష్ణవీదేవి  యాత్రలకు  తీసుకువెళ్ళటానికి  ఎన్నో  టూర్స్...  ట్రావెల్స్  సంస్థలు  ఉన్నాయి.  యాత్రికులు   తమకు  తామే  అన్నీ  వెతుక్కోకుండా,  ఈ  సంస్థల  ద్వారా  వెళ్తే,  అన్నీ  వాళ్ళే  ఏర్పాటు  చేసి,  యాత్ర  చేయించి  తీసుకొస్తారు.



* ఈ  యాత్రల   గురించి  కొన్ని  వివరాలు  ఈ  లింక్  లో   ఉన్నాయి.

   * bhole bhandari charitable trust provides and ... - Amarnath Yatra

...

  *  SHRI MATA VAISHNO DEVI SHRINE BOARD | Official Website

...........................................

ఇప్పుడు  దేశంలో  వర్తకం  గురించి   ముఖ్యమైన  నిర్ణయాలు  తీసుకుంటున్నారు  కదా  ! కొందరి  అభిప్రాయాలు  వింటుంటే  ఆశ్చర్యంగా  ఉంది.  


మనదేశంలో   గిడ్డంగులు  కట్టడానికీ,  వ్యాపారం  చేయటానికీ  ,  తగినంత  సామర్ధ్యం  ఉన్నవారు   ఈ  దేశంలో  లేరన్నట్లు ,  కొందరు  భావిస్తున్నట్లుంది. 

 ఇతరదేశాల  వాళ్ళు  వచ్చి  ఈ  దేశాన్ని  బాగుచేయాలి  తప్ప ,  మనవల్ల  కాదన్నట్లు   ఇక్కడి మేధావులు  ?  కొందరు  నిర్ణయించేస్తుంటే ...  గొర్రెల్లాంటి   ప్రజలు   ఏం  చేయ్యగలరు  లెండి.

  ఇప్పుడు  చాలా  ఇతరదేశాల్లో  ఆర్ధికమాంద్యం,  నిరుద్యోగం  వంటి  సమస్యలు  ఉన్నాయి.  వాళ్ళ  దేశాల్లోని  సమస్యలను  పరిష్కరించుకోకుండా, పాపం ,   వాళ్ళంతా  ఇక్కడికొచ్చి  ఈ  దేశాన్ని  ఉద్ధరించాలనుకోవటం  ఆశ్చర్యకరం..


జరిగేదంతా  చూస్తుంటే,   పూర్వం  కొన్ని  వందల  సంవత్సరాల  క్రిందట  మన  పూర్వీకులు  విదేశీయుల్ని  వర్తకానికి   ఆహ్వానించటం     గుర్తొస్తోంది.  

అయితే  అప్పటి  వాళ్ళకీ,  ఇప్పటి  వాళ్ళకీ    చాలా  తేడా  ఉంది.  అప్పటి  వాళ్ళు  పర్యవసానాలను  ఊహించలేదు. ఒకసారి  దెబ్బతినీ  కూడా,  ఇప్పటి  వాళ్ళు  మళ్ళీ   ..........?