koodali

Friday, July 26, 2013

గీత ( భక్తి యోగము ) లోని కొంత భాగము మరియు కొన్ని విషయములు.


 ఏ  మతమూ  చెడ్డ  విషయాలను  బోధించదు.    గ్రంధాలలోని  విషయాలను  సరిగ్గా  అర్ధం  చేసుకోని  వారి  వల్ల  మరియు  కొందరు  స్వార్ధపరుల   వల్ల   తరతరాలుగా సమాజంలో  అపార్ధాలు  ఏర్పడ్దాయి.


ఆధునిక విజ్ఞానాన్ని కొందరు తమ స్వార్ధానికి వాడుకుంటున్నట్లే , ఆధ్యాత్మికతను కూడా కొందరు తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.

కొందరు స్వార్ధం వల్ల ,  మరి కొందరు తెలిసీతెలియనితనం వల్ల సమాజంలో కొన్ని మూఢాచారాలను వ్యాపింపచేశారు.


 ప్రాచీన  గ్రంధాలను  సరైన  తీరులో  అర్ధం  చేసుకుంటే  సమాజం  ఎంతో  బాగుంటుంది.

.......................
ఓం.

శ్రీ  కృష్ణ  పరమాత్మ  బోధించిన  భక్తి యోగములో   కొంత భాగము.....

వివేకముతో గూడని అభ్యాసము కంటె , ( శాస్త్రజన్య ) జ్ఞానము శ్రేష్ఠమైనదై కదా !( శాస్త్రజన్య ) జ్ఞానము కంటె , ధ్యానము శ్రేష్ఠమగుచున్నది.ధ్యానము ( ధ్యానకాలమందు మాత్రము నిర్విషయముగ నుండు మనఃస్థితి ) కంటె కర్మఫలమును విడుచుట ( ప్రవృతి యందును విషయదోషము లేకుండుట ) శ్రేష్ఠమై యున్నది. అట్టికర్మఫలత్యాగముచే శీఘ్రముగ
( చిత్త ) శాంతి లభించుచున్నది.

సమస్తప్రాణులయెడల ద్వేషములేనివాడును, మైత్రి, కరుణగలవాడును, అహంకారమమకారములు లేనివాడును, సుఖ దుఃఖములందు సమభావము గలవాడును, ఓర్పు గలవాడును, ఎల్లప్పుడు సంతృప్తితో గూడియుండువాడును, యోగయుక్తుడును, మనస్సును స్వాధీనపఱచు కొనినవాడును, దృఢమైన నిశ్చయము గలవాడును, నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు గలవాడును, నాయందు భక్తిగలవాడును ఎవడు కలడో, అతడు నాకు ఇష్టుడు.



ఎవని వలన ప్రపంచము ( జనులు ) భయమును బొందదో,  లోకము వలన ఎవడు భయమును బొందడో
ఎవడు సంతోషము , క్రోధము, భయము, మనోవ్యాకులత - మున్నగునవి లేకుండునో అట్టివాడు నాకు ఇష్టుడు.

.....................................................

గీత  మరియు  
ప్రాచీన  గ్రంధాల  ద్వారా  మనము  ఎన్నో  చక్కటి  విషయాలను  తెలుసుకోగలము.  తెలుసుకున్న  విషయాలను  ఆచరణకు  ప్రయత్నించాలి.  

అప్పుడు,   అత్యాశ,  అవినీతి,  ఇతరులతో  అనవసరంగా  పోటీపడటం, ఇతరుల  సొమ్మును  అపహరించటం,  వంటి  దుర్లక్షణాలు  తగ్గిపోతాయి.  నైతికవిలువలతో  జీవించటం  అలవాటవుతుంది.
  లోకం  ప్రశాంతంగా  ఉంటుంది. 

 
ఈ  రోజుల్లో  నైతికవిలువలకు  ప్రాధాన్యత  తగ్గి,  ఎలాగైనా  సరే  డబ్బును  సంపాదించి  విలాసంగా  జీవించాలి . అనుకునే   వారి  సంఖ్య  పెరిగింది.  


అత్యాశ,  అనవసరపు  పోటీ  , అధికారదాహం  వల్ల    అణ్వాయుధాల  పోటీ     పెరుగుతుంది.  



 అందువల్ల , సమాజంలోని  ఎంతో  సొమ్మును  ఆయుధ  పోటీకే  ఖర్చు  చేయవలసి  వస్తోంది. 


అందువల్ల ,  పేదరిక  నిర్మూలన  కార్యక్రమాల  కోసం    డబ్బు  సరిపోవటం  లేదు.

పరస్పర  అపనమ్మకాల  వల్ల   ఇప్పుడు  ప్రపంచదేశాల  వద్ద  అణ్వాస్త్రాలు  గుట్టలుగా  పడి  ఉన్నాయి. 


  ఆయుధాల  గుట్టల  మధ్య   ప్రపంచం  ఇంకా  క్షేమంగా  ఉందంటే  దైవం  దయ   వల్లనే.  



 ఈ  ఆయుధాలు  చెడ్డవారి  చేతిలో  పడకూడదని  దైవాన్ని  ప్రార్ధించటం  మినహా  సామాన్య  ప్రజలు  ఏం  చేయగలరు  ?


ఆధునిక  విజ్ఞానాన్ని కూడా  కొందరు  వ్యక్తులు   మితిమీరి  ఉపయోగిస్తున్నారు. 

 ఈ  ప్రపంచంలో  మనుషులే  మాత్రమే  కాదు.  ఇతర  జీవులు  ఎన్నో  ఉన్నాయి.   

కొందరు  తమ అత్యాశ ,అంతులేని  కోరికల  కోసం  పర్యావరణాన్ని  పాడుచేస్తూ , ఇతరజీవులకు  ముప్పును  కలిగిస్తున్నారు.


మితిమీరిన   పారిశ్రామీకరణ  వల్లే   ఆమ్ల  వర్షాలు  పడుతున్నాయట.

  ఇలాంటి  ఎన్నో  పెను  ప్రమాదసూచికలు  కనిపిస్తున్నా  కూడా  ప్రజలు  సరిగ్గా  పట్టించుకోవటంలేదు.  నిమ్మకు  నీరెత్తినట్లు    ఉంటున్నారు.  
 
 
   ఇక   ప్రపంచాన్ని  దైవమే  రక్షించాలి.


Wednesday, July 24, 2013

మూడు విధాలైన టెక్నాలజీ................



కొందరు ఏమంటారంటే............టెక్నాలజీని శాంతియుత ప్రయోజనాలకు కూడా వినియోగించవచ్చు కదా......... అని .......

ఉదా....కత్తిని శాంతియుత ప్రయోజనాలకూ వాడొచ్చు,......అశాంతిని కలిగించే విధంగానూ వాడొచ్చు కదా అని........ కానీ కత్తి వేరు........ అణు శక్తి వేరు........... రెండిటికి ఎంతో తేడా ఉంది.

కత్తి వల్ల కొందరినే చంపగలరు. కానీ అణుశక్తివల్ల కొద్ది సమయంలోనే కొన్ని లక్షలమందిని చంపే అవకాశం ఉంది.

ఇంకా, కొన్ని వేలసంవత్సరాల వరకూ అణుధార్మికత యొక్క దుష్ప్రభావం రాబోయే తరాలను పీడించే అవకాశం ఉంది. అణుబాంబులకు ఎంతో వినాశనాన్ని కలగచేసే శక్తి ఉంటుందట.

*  కత్తివల్ల ఎక్కువ లాభాలు....తక్కువ నష్టాలు ఉన్నాయి.
అదే అణుశక్తి వల్ల తక్కువ లాభాలు........చెప్పలేనన్ని నష్టాలు ఉన్నాయి. 


ఈ తేడాను జాగ్రత్తగా గమనించాలి.

అందువల్ల అణుశక్తిని పూర్తిగా వదిలిపెట్టటమే ఏకైక పరిష్కారం.

నా అభిప్రాయంలో......టెక్నాలజీని మూడువిధాలుగా చెప్పుకుంటే....

1.
ఈ    రకమైన టెక్నాలజీ మనకు నిత్యావసరాలకు ఉపయోగపడే టెక్నాలజీ...................

దీని వల్ల ఎన్నో లాభాలున్నాయి. ప్రాచీన కాలం వాళ్ళు తాము కష్ట పడిపనిచేసి పర్యావరణానికి ఎటువంటి హాని కలగని వస్తువులను వాడుతూ, హానిలేని పధ్ధతులను పాటించేవారు.
ఆ విధంగా వారు కూడా ఆరోగ్యంగా ఉండేవారు.


ఆ రోజుల్లో కూడా గొప్ప గొప్ప నాగరికతలు విలసిల్లాయి. అప్పట్లో కూడా ఖగోళశాస్త్రం, ఆయుర్వేదం, ఎన్నోరకాల వృత్తివిద్యలు, ఆర్ధికశాస్త్రం, గణితం ఇలా నిత్యావసరాలకు ఉపయోగపడే విజ్ఞానం వారికి తెలుసు.

ఇంకా, ప్రాచీనుల విజ్ఞానాన్ని తలుచుకుంటే ఆశ్చర్యమేస్తుంది. ఇప్పటి వాళ్ళు కలలు కంటున్న ( టెలి పోర్టేషన్ ) వంటి ఎంతో విజ్ఞానం వారికి తెలుసు.

మనిషి మాయమయి తిరిగి ప్రత్యక్షమవటం, అణిమ, గరిమ వంటి సిధ్ధులు, పరకాయప్రవేశం , టెలిపతి ఇవన్నీ నేటి శాస్త్రజ్ఞులు భౌతికశాస్త్ర పధ్ధతులలో సాధించటానికి ప్రయత్నిస్తున్నారు.

కానీ ప్రాచీనులు వీటిని దైవసహాయంతో ఆధ్యాత్మికయోగశక్తి ద్వారా సాధించారు.

కానీ ....ఇప్పటి కాలపు భౌతికశాస్త్ర టెక్నాలజీతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి.



ఎక్కువగా పర్యావరణానికి హానికలగని ........... విధంగా   ఆ నాటి వారి జీవితం ఉండేది.
అంతే కానీ,   అభివృధ్ధి పేరుతో వస్తువులను విపరీతంగా ఉత్పత్తి చేసి గుట్టలుగా పోయటం వారికి అలవాటు లేదు..


ఇంకా,   వారు తమ నిత్య జీవితంలో అవసరమైన వస్తువులకు ........ ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చేవారు. ఉదా..... కత్తి చూడండి.   మనకు దీని అవసరం ఎంతో ఉంది.

పంటలు పండించటానికి , కూరగాయలను తరగటానికి, వైద్యులు శస్త్రచికిత్సలు చేయటానికి, అలాగే యుధ్ధంలోశత్రువులనుచంపటానికి ............. ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.

కానీ ఒకోసారి దుర్మార్గుల చేతిలో పడితే హత్యలు లాంటివి చేయటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి కొద్ది నష్టాలు తప్పితే ..............
దీనివల్ల పర్యావరణానికి పెద్దగా హాని లేదు.

.
ఈ రకమైన టెక్నాలజీ వల్ల నష్టాల కన్నా లాభాలే ఎన్నో రెట్లు ఎక్కువ అని చెప్పుకోవచ్చు.

*  దుర్మార్గుల చేతిలో ఉన్న కత్తి వల్ల ..........జరిగే నష్టం కొద్దిగానే ఉంటుంది. దుర్మార్గుల చేతిలో ఉన్న అణుశక్తి వల్ల ........... జరిగే నష్టం ఎంతో ఎక్కువగా
ఉంటుంది.

అందువల్ల అణుశక్తిని పూర్తిగా వదిలిపెట్టటమే ఏకైక పరిష్కారం.

2.   ఈ   రెండో  రకమైన టెక్నాలజీ వల్ల ..... లాభమా.....నష్టమా ? అన్నది ఎవరికీ సరిగ్గా తెలియదు. దానిని మనం వాడుకునే విధానం బట్టి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చేమో !

మానవులకు కష్టాన్ని తగ్గించే యంత్రాలు, వాహనాలు, టివీలు, సినిమాలు, ఎలెక్ట్రానిక్ వస్తువులు, ఇలా చెప్పుకోవచ్చు. ఈ కోవలోకి వచ్చే వస్తువులు ఉన్నాలేకపోయినా మనిషి బ్రతకగలడు.

ఇవన్నీ మనిషి జీవితాన్ని సుఖమయం చేస్తాయి. వీటిని తగిన పరిమితిలో వాడుకోవాలి.

మరీ ఎక్కువగా వాడితే పర్యావరణానికి ముప్పు, సహజ వనరులు ఖాళీ అయిపోవటం, రాబోయే తరాలకు సహజ వనరులు లేని ఖాళీ భూగోళాన్ని ఇవ్వటం ,.... ఇప్పుడు ఉన్నవాళ్ళకి పనిలేకపోవటం వల్ల నిరుద్యోగ సమస్య, శారీరిక శ్రమ లేకపోవటం వల్ల శరీరం బలహీనపడటం , జబ్బులు రావటం ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది.

అందుకని ఈ టెక్నాలజీ వల్ల లాభం ఎక్కువా ? నష్టం ఎక్కువా ? అన్నది ఇతమిధ్ధంగా చెప్పలేము. అది మనం వాడే దాన్ని బట్టి ఉంటుంది.

అయితే ఇందులో మనకు ఏది ఎంతవరకు మంచిదో, అవసరమో అంతవరకూ మాత్రమే ఉపయోగించుకుంటే ఈ టెక్నాలజీ వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి.

3.    ఈ  మూడో  రకమైన టెక్నాలజీ వల్ల లాభాలు ఉంటాయని జనం ( ఎండమావి లాంటి ) భ్రాంతిలో మునిగిపోతారు దానివల్ల ......... అంతా నష్టమే తప్ప లాభం అస్సలు ఉండదు.


ఉదా........అణుశక్తి. దీని సంగతి ఇప్పుడు చాలామందికి తెలుసు. తాత్కాలిక ప్రయోజనాల కొరకు ఆశపడితే ........ వేలసంవత్సరాలు భూమిని పీల్చిపిప్పిచేసే దుష్ప్రభావాలు ఉంటాయి కాబట్టి , అణుశక్తిని వాడటం పూర్తిగా విడిచిపెట్టెయ్యటమే ఏకైక మార్గం.

ఇలా టెక్నాలజీని వాడుకోవటంలో ....... ప్రపంచం పైన వాటి ప్రభావాన్ని బేరీజు వేసుకుని మాత్రమే ఉపయోగించుకోవాలి... ....
.......
.......................
ఇంకా నాకు ఏమనిపిస్తుందంటేనండి,......అణుశక్తి విషయంలో ప్రమాదాలను నివారించటం అసాధ్యం. ఇంకా, వైద్యరంగంలో దీని సహాయంతో చికిత్సను అందించేవారికి కూడా రేడియేషన్ ప్రభావం వల్ల మొండివ్యాదులు త్వరగా వచ్చే అవకాశముందట.

కొద్ది లాభం కోసం ఎంతో వినాశనాన్ని కలిగించే ప్రమాదం గల దాన్ని ఎవరైనా కోరుకుంటారా ? అందుకే నాకు అనిపిస్తుంది......ఈ అణుశక్తిని కనిపెట్టకుండా ఉంటే బాగుండేది అని....
 ఈ  టపా  పాతదే .  మరల    వ్యాఖ్యలతో   వేసాను.

2 comments:

  1. అణు శక్తిని జబ్బులు నయం చెయ్యటానికి ఉపయోగిస్తారు. దానిని Nuclear Medicine అంటారు. అల్లాగే లాబోరేటరీల్లో సైనైడు, వైరసుల దగ్గరనుండీ అన్నీ ఉంటాయి. అవి బయటకి వస్తే ఎందర్నైనా నాశనం చెయ్యగలవు.మనవాళ్ళు చెప్పినట్లు మనం మన పరిమితులు తెలుసుకుని జీవించాలి. ఇష్టం కదా అని కనపడినంతా తినలేము కదా కడుపు నిండిన తరువాత. అల్లాగే అన్నిట్లోనూ సంయమనం పాటిస్తే అందరికీ బాగానే ఉంటుంది.

    మీరు చెప్పినట్లు:
    అయితే ఇందులో మనకు ఏది ఎంతవరకు మంచిదో, అవసరమో అంతవరకూ మాత్రమే ఉపయోగించుకుంటే ఈ టెక్నాలజీ వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి.
    ReplyDelete
  2. కృతజ్ఞతలండి.
    మీరు చెప్పినట్లు సైనైడ్, వైరస్ లు ఎంతోమందిని నాశనం చెయ్యగల శక్తి కలవే కావచ్చు. అంటే వాటిని చిన్నపాటి భూతాలుగా చెప్పుకోవచ్చు.

    అణుశక్తిని పెద్దభూతంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సైనైడ్, వైరస్ ల దుష్ప్రభావాలతో పోల్చితే ............... అణుశక్తి విషయంలో జరిగే పొరపాట్ల వల్ల ................. కలిగే దుష్ప్రభావాలు, వినాశనం ........................ ఊహకందనంత ఉంటాయట.

    వాటి ప్రభావం .........వేల సంవత్సరాలు భూమిపై ఉంటుందని చెబుతున్నారు కదండి. దానివల్ల ఎన్నో తరాల వరకు రకరకాల జబ్బులతో బాధపడే అవకాశం ఉందట.

    అలాంటి ప్రమాదాలు జరిగిన  చోట్ల ఇప్పటికీ చిన్నమొక్కలు కూడా మొలవలేదట. మొలిచినా ఆ మొక్కలలో, అక్కడి నీటిలో, గాలిలో కొన్ని వందల సంవత్సరాలు అణుధార్మికత నిండి ఉంటుందట.

    ఇలాంటి అణుశక్తిని వైద్యంకొరకు ఉపయోగించటం కూడా కొరివితో తల గోక్కోటంలా వుతుందేమో అనిపిస్తోంది. అందుకని దాన్ని ఏ విధంగానూ ఉపయోగించకుండా ఉండటమే శ్రేయస్కరమేమోనని ఒకోసారి అనిపిస్తుంది.

    నిజమే అణుశక్తిని వైద్యంలో కూడా ఉపయోగిస్తున్నారు. దానివల్ల జబ్బు ఉన్న సెల్స్ నాశనం అవుతాయి గానీ, ప్రక్కనున్న మంచి సెల్స్ రేడియేషన్ కు గురయ్యి దెబ్బతిని ............... మళ్ళీ వాటికి ట్రీట్మెంట్ ............. ఇలా అంతులేని కధలా సాగే అవకాశం కూడా ఒకోసారి ఉందట.

    అసలు ఈ మధ్య కాలంలో మనం వాడుతున్న వస్తువుల ద్వారా వెలువడుతున్న రేడియేషన్ వల్లనే జనానికి మొండి జబ్బులు రావటం ఎక్కువయ్యిందని అంటున్నారు .


    కొన్ని మొండి జబ్బులు ఆయుర్వేదం , హోమియో లాంటి వాటికి తగ్గటం జరుగుతోంది. ఈ రకమైన మొండిజబ్బులను తగ్గించటానికి ప్రాచీన వైద్యగ్రంధాలను శోధించితే తప్పక మంచి పరిష్కారం దొరుకుతుందని నా అభిప్రాయమండి.

    అప్పటివరకూ,వేరేదారిలేక ఇప్పుడున్న విధానాలను వాడుతూనే ఉంటారేమో ప్రజలు ?

    ప్రతి సమస్యకు చక్కటి పరిష్కారముంటుందట......... శోధించగలిగితే..............( దైవానుగ్రహం తోడయితే.).


Monday, July 22, 2013

గురుపూర్ణిమ.

గురుపూర్ణిమ.

ఓం,
 ఎందరో  గురువులు.  అందరికి  అనేక  వందనములు.



Friday, July 19, 2013

షిర్డి సాయి అంటే మాకు ఎంతో ఇష్టం. మరియు కొన్ని విషయములు..

ఓం,
ఈ  రోజు   ఆషాఢ  ఏకాదశి  ఉత్సవాలు  జరుగుతున్నాయి.

దైవం సర్వాంతర్యామి. దైవాన్ని ఏ రూపంతోనయినా, ఏ నామంతోనయినా ఆరాధించుకోవచ్చు.
( నిరాకారంగా కూడా ఆరాధించుకోవచ్చు.)

నేను  దైవాన్ని  తోచిన  విధంగా  ఆరాధిస్తాను.  
 
వినాయకుడు,   అమ్మవారుఅయ్యవారు,   షిర్డిసాయి. .ఇలా   ఏ పేరుతో ,  ఏ  రూపంతో   ఆరాధించుకున్నా మన ఆరాధనలు చేరేది సర్వాంతర్యామి అయిన దైవానికే.

నాకు వీలుకుదిరినప్పుడు సాయిసాయి అని అనుకుంటూ ఉంటాను.

 షిర్డి సాయి   మహిమలు  ఎన్నో  నా  జీవితంలో  అనుభవానికొచ్చాయి.    మమ్మల్ని  ఎన్నో సార్లు  కష్టాల  నుండి  కాపాడారు.

బీజాక్షరాలతో కూడిన నామములను శుచిగా లేనప్పుడు, ఎప్పుడుపడితే అప్పుడు స్మరించుకోవాలంటే కొంచెం బెరుకుగా ఉంటుంది.

సాయి నామాన్ని ఎప్పుడైనా బెరుకు లేకుండా స్మరించుకోవచ్చు కదా ! అని నాకు తెలిసినంతలో అనిపించింది.

శ్రీపాద శ్రీవల్లభస్వామి సంపూర్ణ చరితామృతము… గ్రంధములో షిర్డి సాయి గురించిన ఎన్నో వివరములు ఉన్నాయి. ఆ వివరాలు చదివితే షిర్డి సాయి గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి.

శిరిడి  సాయి  ఎవరో ? ఏమిటో ? సాయికి   సంబంధించిన  
ఎన్నో వివరములు  ...  శ్రీపాద శ్రీవల్లభస్వామి సంపూర్ణ చరితామృతము… గ్రంధములో  ఉన్నవి.


9 వ  అధ్యాయము,  మరియు  45  వ  అధ్యాయములో  ఈ  వివరములు  ఉన్నాయి. 

 ఈ  విషయాలను  తెలుసుకుంటే  షిర్డిసాయిని  గురించి  అనేక  సందేహాలకు ,  ప్రశ్నలకు  సమాధానాలు  లభిస్తాయి. 


 షిరిడి  సాయి  వద్దకు  సందేహంతో  వచ్చిన  కొందరు  వ్యక్తులు , సాయిలో  తాము  ఆరాధించే  దైవరూపాలను  దర్శించి  సాయికి  భక్తులవటం  జరిగింది.

 సాయిని  కొందరు  భక్తులు   పరబ్రహ్మగా  భావించి  ఆరాధించారు,   కొందరు  భక్తులు  ఆదిపరాశక్తి గా  భావించి  ఆరాధించారు, కొందరు  భక్తులు  శివునిగా  భావించి  ఆరాధించారు,  కొందరు భక్తులు కృష్ణుని గా   భావించి  ఆరాధించారు.


 
పాపవిమోచన పొందుట….
మనుష్యుడు దుర్మార్గ మార్గమునుండి బుద్ధిని మరలించనప్పుడు , తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సును చలింపకుండ నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వార కూడ ఆత్మ సాక్షాత్కారమును పొందలేడు………షిర్డి సాయిబాబా వారు ఇలాంటి ఎన్నో అపురూపమైన విషయాలను తెలియజేశారు.



 ఈ రోజుల్లో ఎందరో భక్తులు విపరీతమైన కోరికలతో భక్తిమార్గాన్ని ఆశ్రయిస్తున్నారు.  కష్టాలలో ఉన్నప్పుడు లేక కొన్నిసార్లు కోరికలు కోరుకోవటం మానవనైజం.

అయితే  తమ   పిల్లలు   అదేపనిగా స్వార్ధపరమైన   కోరికలతో   విసిగిస్తే   తల్లితండ్రులకైనా   విసుగు వస్తుంది  కదా  !

కోరికలు కోరేముందు అందుకు తగ్గ అర్హతను సంపాదించుకోవాలని ఒక బోధకులు   తెలియజేశారు. 

అర్హత ఏమీ లేకుండానే   తేరగా   పెద్దపెద్ద   కోరికలు   కోరే స్వార్ధపరులైన భక్తుల సంఖ్య   ఈ  రోజుల్లో  బాగా  పెరిగిన మాట వాస్తవం.

అయితే మొదట కోరికల కోసం భక్తి మార్గాన్ని ఆశ్రయించినా క్రమంగా కోరికలను తగ్గించుకునే స్థాయికి వచ్చే అవకాశమూ ఉంది.

అంతా  దైవం  దయ.


ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న  అందరికి  అనేక  ధన్యవాదాలండి.
 
వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.

..............................................
 
సాయిబాబా పుట్టుకతో ఏ మతస్తులో ఎవరికీ తెలియదు. సాయిబాబాను గత కొన్ని సంవత్సరాలుగా ఎందరో పూజిస్తున్నారు. కొందరు హిందువులు కూడా బాబా వారి గురించి ప్రజలలో ప్రచారం చేసారు. బాబావారి విధానాలు తేలికగా ఉండి హిందువులను ఆకర్షించాయి.

 చాలామంది హిందువులు తమ దేవతలతోపాటు బాబావారినీ ప్రార్ధించుకోవటం జరిగింది. అలాంటప్పుడు బాబాను పూజించకూడదు.. అంటే చాలామందికి ఏంచేయాలో తెలియక ఇబ్బందిగా  ఉంటుంది. ఎందుకంటే జీవితంలో ఎన్నో కష్టసుఖాలలో హిందూ దేవతలతోపాటే బాబాకు కూడా తమ కష్టసుఖాలను చెప్పుకునేవారు.

కొందరు హిందువులలో కూడా చాలా గొడవలున్నాయి. శైవులు, వైష్ణవుల మధ్య అనేక గొడవలు జరిగాయి. శివుడు గొప్ప అంటే కొందరు వైష్ణవులు ఒప్పుకోరు. విష్ణువు గొప్ప అంటే కొందరు శైవులు ఒప్పుకోరు. అమ్మవారు గొప్ప అంటే కొందరు ఒప్పుకోరు. కొందరు హిందువులు మాత్రం ..అమ్మవారు శివుడు విష్ణువు..అని తేడాలు లేకుండా చక్కగా దైవాన్ని ఆరాధించుకుంటారు.

అయితే, సాయిబాబా విగ్రహం పాదాల వద్ద శివుడు, విష్ణువు వంటి దేవతల విగ్రహాలను పెట్టకూడదు. పక్కన పెట్టుకోవచ్చు. హిందూ దేవాలయాల్లో కూడా ఏ దేవత పాదాల వద్ద కూడా ఇంకో దేవతల విగ్రహాలను పెట్టకూడదు.

Thursday, July 18, 2013

మన ప్రాచీన గ్రంధాలలో ఎంతో విజ్ఞానం.........

 
మన  ప్రాచీన  గ్రంధాలలో  ఎంతో  విజ్ఞానం  మరెన్నో  విశేషాలు ఉన్నాయి  కాబట్టే  విదేశీయులు ఎన్నో  గ్రంధాలను   తమ  దేశాలకు తీసుకువెళ్ళి , సంస్కృతం  నేర్చుకుని వాటిని  పరిశోధిస్తున్నారు.
............................


  భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ ఇలా అన్నారు..  


ఒక  సూత్రంలో మణులు కూర్చినట్లు  ఈ జగత్తంతా నాలో  ఇమిడి  ఉన్నది. 

శ్రీ కృష్ణ  భగవానుడు  చెప్పినట్లు  అనంతం  నుంచి  అణువు  వరకూ  జగత్తంతా ఒక  సూత్రంలో  బంధింపబడింది. దీనినే  ఆధునిక  శాస్త్రవేత్తలు  Super  String   అంటున్నారు.

.......................


భూమి  గుండ్రంగా  ఉన్నదని  వేదకాలం  నుంచే  మనకు  తెలుసు.

  గోళం  అంటే  గుండ్రనిది అని  అర్ధం కదా! భూమి  గుండ్రంగా ఉన్నదని భారతీయులకు తెలుసు.

ఋగ్వేదంలో  1.33.8  మంత్రంలో ఇలా ఉంది...

"  చక్రాణాసః పరీణహం  పృధివ్యా...

భూమి  యొక్క  వృత్తపు  అంచున  ఉన్నవారు  అని  భావం.

భూమి  తన  కక్ష్యలో  తాను  తిరుగుటకు  23  గంటల  56  నిమిషాల  4.1  సెకన్ల  కాలము   పడుతుందని  ఆనాడే  చెప్పారు. 


 ఇది  ఆధునిక  కాలగణనకు ఖచ్చితంగా సరిపోతుంది కదా!
................


పురాతనమైన  వేదవిజ్ఞానంలోనే సూర్యకిరణాలలో  ఏడురంగులున్నాయని  చక్కగా  వివరింపబడింది.

అశ్వం అంటే  కిరణం  అని  కూడా  అర్ధం. సూర్యుని  కిరణాలలో  పలురంగులు  దాగి  ఉన్నాయని  ప్రాచీనులు  తెలియజేశారు.
....................


కాంతి  వేగమును  లెక్కించిన  ప్రాచీనులు........

"యోజనానాం సహస్రం ద్వే ద్వేశతే ద్వే చ యోజనే!
ఏకేన  నిమిషార్ధేన క్రమమాణ  నమోస్తుతే  !! "



అనగా  అర  నిమిషానికి  2202  యోజనాల  దూరం  ప్రయాణించు  ఓ  కాంతికిరణమా  నీకు  నమస్కారము.  అని  భావం. 


 యోజనం=  9  మైళ్ళ  160  గజాలు. 

ఇవన్నీ  ఆధునికులు  కనుగొన్న  కాంతివేగానికి  దాదాపు  సమీపంగానే  ఉన్నవి.


(  ఇక్కడ  నేను  గ్రంధము  లోని  చాలా  వివరాలను   వ్రాయలేదు.  )

......................


గురుత్వాకర్షణ  సిద్ధాంతం........... 

సిద్ధాంత  శిరోమణి  ( భాస్కరాచార్యుడు)  అనే  గ్రంధములో  భువనకోశం  అనే అధ్యాయంలో  6వ  శ్లోకంలో  గురుత్వాకర్షణ  శక్తి  గురించి  చాలా  చక్కగా  వివరించారు.

ఆకృష్టిశక్తిశ్చ మహీతయా  యత్  స్వస్థం / గురు  స్వాభిముఖం స్వశక్త్యా
ఆకృప్యతే తత్పతతీవభాతి/ సమే  సమంతాత్ క్వ పతత్వియం  ఖే 11

భూమి  ఆకాశంలో  ఉన్న  వస్తువులను  సహజంగా  స్వశక్తితో  ..తనవైపుకు  ఆకర్షిస్తుంది.ఈ  ఆకర్షణ  వల్ల  అన్ని  వస్తువులు  భూమిపై  పడతాయి.....అని  తెలియజేశారు. 

జగద్గురువు  ఆదిశంకరుల  వారు  వారి  ప్రశ్నోపనిషత్  భాష్యంలో  అపానశక్తి  గురించి  వ్రాస్తూ...

ఒక  వస్తువును  పైకి  ఎగురవేస్తే  దానిని  భూమి  ఎట్లు  ఆకర్షిస్తుందో ..అటులనే  పైకిలాగబడే  ప్రాణశక్తిని  అపానశక్తి  కిందకు  లాగుతోంది  (  3-8  శ్లో  ) అని  చెప్పారు. 


...............

వేద  రుషులు  ఖగోళ  శాస్త్రానికి  సంబంధించిన  గణనలో....

భూమికి,  చంద్రునికి  మధ్య  దూరం,  చంద్రుని  వ్యాసానికి  108  రెట్లు  ఉందని,

భూమికి  సూర్యునికి  మధ్య  దూరం,  సూర్యుని  వ్యాసానికి  108  రెట్లు  ఉందని,


సూర్యుని  యొక్క  వ్యాసం  భూమి  వ్యాసానికి  108  రెట్లు  ఉందని  తెలియజేశారు.


ఈ వేద గణన  ఆధునిక  సాంకేతిక  విశ్వగణనలో  లభించిన  భూమికీ,  చంద్రునికీ,  భూమికీ  సూర్యునికీ  ఉన్న  దూరంతో  దాదాపు  సరిపోయింది.

.............................


ప్రపంచంలోనే  మొదటి  ఆనకట్ట  భారతదేశంలోనే  నిర్మించబడిందని  మీకు  తెలుసా !

 ఇది  కలవై  ఆనకట్ట  .తమిళనాడులో  కావేరీ  నదిపై  నిర్మించబడింది.  క్రీ.శ. 2 వ  శతాబ్దంలో  చోళరాజు  కరికాలచోళుడు  కాలంలో  నిర్మించబడిందట. 

 దీని  నిర్మాణంలో  సిమెంట్  మొదలైన  బైండింగ్  మెటీరియల్  ఏదీ  ఉపయోగించబడలేదు.

క్రీ. పూ.4వ  శతాబ్దంలోనే  నేటి  గుజరాత్  రాష్ట్రంలో  అతి  పెద్ద  సుదర్శన  జలాశయం  నిర్మించబడింది.  ఇవి  ఆనాటి  విజ్ఞానానికి  నిలిచి  ఉన్న  తార్కాణాలు.

..........................


అతి  ప్రాచీన  ఓడరేవు  లోతల్.....( సింధూ నాగరికత). 

క్రీ,పూ, 2400  సంవత్సరం  నాటికి  సింధూ నాగరికతలో  ప్రాముఖ్యం  కలిగిన  ఓడరేవు.  ఆనాటి  లోతల్  నగరం  చక్కటి  ప్రణాళికతో  నిర్మించబడింది.

దిక్సూచి...
ఇక్కడి  త్రవ్వకాలలో  షెల్ కంపాస్  లోహశాస్త్రానికి  సంబంధించిన  పరికరాలు  లభించాయి. ఇక్కడి నాగరికత  ప్రశస్తమైనది. ఓడల  విశ్రాంతికి  ప్రత్యేక  డాక్ లు  ఉండేవి. 

.......................


జె.పి  బోస్.  ఈయన  గొప్ప  శాస్త్రవేత్త.  మొక్కలు  మానవులలానే  స్పందిస్తాయి,  రోదిస్తాయి,  హర్షిస్తాయి.  అని  ప్రపంచంలో  తొలిసారిగా  నిరూపించిన  శాస్త్రవేత్త.

 ఈయన భౌతిక  శాస్త్రవేత్తే  కాకుండా వృక్షశరీరధర్మశాస్త్రం  మీద  కూడా  పరిశోధనలు  చేసి  150  పరిశోధనా  వ్యాసాలను  ప్రపంచవ్యాప్తంగా  అనేక  సభలలో  సమర్పించారు.

పరిశోధనల  కోసం  ఎన్నో  పరికరాలను  నిర్మించుకున్నారు.  వాటిలో  ముఖ్యమైనది  క్రిస్కోగ్రాఫ్. ఇది  ఒక  వస్తువును  10  మిలియన్ల  రెట్లు  పెద్దది  చేసి  చూపిస్తుంది.

.........................

.......
గణితంలో  దిట్టలు...భారతీయులు....

ప్రసిద్ధ  శాస్త్రవేత్త  ఐన్ స్టీన్  ఏమన్నారంటే, మనం  భారతీయులకు  ఎంతో  రుణపడిఉన్నాం. భారతీయులే  ప్రపంచానికి  గణితంలో  సులభంగా  లెక్కించే  దశాంశపద్ధతిని  కనుగొన్నారు.  అదే  లేకపోతే  ఎన్నో  వైజ్ఞానిక  పరిశోధనలు  సాధింపబడేవి  కాదు.  అన్నారట. 


 సున్నాను  గురించి  ప్రపంచానికి తెలియజేసింది  భారతీయులే. 

.............................


ఈ  టపాలోని  విషయాలను .. వివేకానంద  లైఫ్ స్కిల్స్  అకాడమీ , హైదరాబాద్  వారి  "భారతీయ ప్రతిభా విశేషాలు  108 నిజాలు " అనే  గ్రంధము  నుంచి  సేకరించి  వ్రాయటమైనది.  వారికి  కృతజ్ఞతలు.

ఆ  గ్రంధములోని  విషయాలను  టపాలో  వ్రాయటం  పట్ల    వారికి  ఏమైనా  అభ్యంతరం  ఉంటే  దయచేసి  తెలియజేయగలరు.

ప్రాచీన యంత్ర  శాస్త్రం, అగస్త్యుని విద్యుత్ ఉత్పత్తి విధానం , వేప, పసుపు కోసం యుద్ధాలు , తులసీ మాహాత్మ్యం ... వంటి  ఎన్నో  విశేషాలున్నాయి.  ఆసక్తి  ఉన్నవారు  
"భారతీయ ప్రతిభా విశేషాలు  108 నిజాలు " అనే గ్రంధమును  చదవగలరు.



Monday, July 15, 2013

సమాజం సజావుగా నడవాలన్నా ఎన్నో వృత్తుల వారి అవసరం ఉంది.


ఒక  సినిమా  తీయాలంటే  దాని  వెనుక  ఎందరో  వ్యక్తుల  అవసరం   ఉంటుంది.   


 కెమెరామెన్, ఎడిటర్, సంగీతాన్ని ,  కధను,  మాటలను  అందించేవారు ,   లైట్  బోయ్స్,  మేకప్  వాళ్ళు,  ఆహారాన్ని , దుస్తులను   సప్లయ్  చేసేవాళ్ళు, వాహనాలను  నడిపేవారు...ఇలా  ఎందరో  సమిష్టిగా  కృషి  చేస్తేనే  సినిమా  ప్రేక్షకుల  ముందుకొస్తుంది. 

(  సమాజం  సజావుగా  నడవాలన్నా  ఎన్నో  వృత్తుల  వారి  అవసరం  ఉంది.  )

 ఇక సినిమాకు  నిర్మాత,  దర్శకుడు ,  ఇతర  నటీనటుల  కృషి  ఎంతో  ఉంటుంది.  అయితే, ప్రేక్షకులు  ఏం  చేస్తారంటే,  


  హీరోహీరోయిన్స్  ను   మాత్రమే  ఆకాశానికి  ఎత్తేసి  గౌరవిస్తారు.   వారికే  ఎక్కువ  పారితోషికమూ  లభిస్తుంది.

  అందరి  కష్టమూ  ఒకటే .  తెర  వెనుక  పనిచేసేవారు  కూడా  ఎంతో  కష్టపడతారు.  అయినా  వారికి  హీరోహీరోయిన్స్ తో  సమానంగా  పేరు  గానీ  డబ్బు  గానీ  రాదు.
......................................

ఒక  పెద్ద  వ్యాపారసంస్థ  ఉంటుంది  అందులో  చైర్మన్   ఆఫీసుకు  రాగానే  అందరూ  నిలబడి  విష్  చేస్తారు.  ఆ  సంస్థలో  చిన్న  ఉద్యోగి  వస్తే   ఎవరూ  విష్  చేయరు.

  ఆఫీస్  సరిగ్గా  నడవాలంటే  చైర్మన్,  క్లర్క్  ఇద్దరూ  అవసరమే ,  ఇద్దరూ  రోజంతా  కష్టపడతారు.  అయితే  ఇద్దరికీ  జనం  ఇచ్చే  మర్యాదల్లో  ఎంతో  తేడా,  ఇద్దరూ  అందుకునే  జీతభత్యాల్లో  విపరీతమైన  అంతరం.

.............................

ఒక  రోడ్  ప్రక్కన  బిచ్చగాడు  అద్భుతంగా  చిత్రాలు  వేస్తాడు.  జనం  చిల్లర  నాణేలు  ఆ  చిత్రం  పై  వేసి  వెళ్తారు.


ఒక  ప్రముఖ  వ్యక్తి  వేసే  చిత్రాలకు  అంతర్జాతీయంగా  గుర్తింపు  లభిస్తుంది.  ఎన్నో  అవార్డులు  లభిస్తాయి. 


  రోడ్డు  ప్రక్కన  చిత్రాలు  వేసే  అతనికి  ఏ  గుర్తింపూ  లభించదు.  ఏ  అవార్డులూ  అతనిని  వరించవు. 
...........................

ఇలా  ప్రపంచంలో  ఎన్నో  అసమానతలు  జరుగుతున్నాయి.  


ఈ  అసమానతలకు  కులంతో  సంబంధం  లేదు.  ఇప్పుడు  డబ్బు, అధికారం ఉన్న వారిదే  రాజ్యంలా  ఉంది.

డబ్బు,
అధికారం ఉన్న వాళ్ళు శూద్ర కులానికి చెందినా అందరూ గౌరవిస్తారు.

డబ్బు, అధికారం  లేనివాళ్ళు బ్రాహ్మణకులానికి చెందినా గౌరవించటం లేదు.

అందరికీ సమానంగా హోదా, జీతభత్యాలు ఉన్నప్పుడే ఈ అసమానతలు తొలగిపోతాయి. మరి ఇలా చేయటానికి ఎందరు ఒప్పుకుంటారు?


అందరూ సమానమే అనే వారు ..... రోజంతా కష్టపడే ఒక కూలీకి, రోజంతా కష్టపడే ఒక ఉన్నత  స్థాయి ఉద్యోగికి ఒకే రకంగా హోదా, జీతభత్యాలు ఇస్తే ఒప్పుకుంటారా ?

.................................................


Saturday, July 13, 2013

పురాణేతిహాసాల గురించి మరికొన్ని అభిప్రాయాలు...

 
 జన్మల బంధం నుండి విముక్తి చెందాలంటే   యుక్తవయస్సులోనే  కుమారుడూ, భార్య, కుటుంబం బంధాలు వదలుకోవాలని కృష్ణుడు   బోధించలేదు  .

 కృష్ణుడు తో  సహా  పెద్దలు  ఏం  చెప్పారంటే,   ఒక  క్రమంలో  చతురాశ్రమ  పద్ధతిలో  చక్కగా  జీవించి  మోక్షాన్ని  పొందమన్నారు.  విద్యార్ధి  దశ,  గృహస్థ  దశ,  వానప్రస్తం,  తరువాతే  సన్యాసాశ్రమం  చెప్పారు.

చిన్న  వయస్సులోనే  శుకుల  వారు  సన్యాసాశ్రమం  స్వీకరిస్తానంటే   వ్యాసులవారు  అభ్యంతరం   చెప్పారు. 

....................

" ఒక  యోగి  ఆత్మ  కధ " గ్రంధములో  ఏం  చెప్పారంటే ,  ఈ  రోజుల్లో   అడవులకు  వెళ్ళటం  వంటివి  అందరికి  కుదరవు  .  కాబట్టి,   ఇంట్లోనే  ఉంటూ  కూడా  మోక్షాన్ని  పొందటానికి    నిష్కామయోగాన్ని  చక్కగా   అవలంబించవచ్చు..   అనే  అర్ధం  వచ్చే  విధంగా 
చెప్పారు.  
.......................................

భారతయుద్ధం   జరగటం  ద్వారా  ఎందరో  దుష్టులైన   వారి    పీడ  ప్రజలకు  వదిలింది.

భూమిపై  పాపాత్ములు  పెరిగిపోయారని  భూదేవి  దేవతల  వద్ద  మొరపెట్టుకోగా ,  మహాభారత  యుద్ధం  జరిగి ,  ఆ  యుద్ధంలో  ఎందరో  దుష్టులైన   రాజులు,  ప్రజలు    ప్రాణాలను  కోల్పోయారు.  


భూదేవి   భాదపడటానికి  ముందే,  భూమిపై  పాపాత్ములు  పెరిగిపోవటం  చూసి  భారత  యుద్ధానికి  చక్కటి   ప్రణాళిక  రచించి  అమలుచేయించిన  వారు  ఆదిపరాశక్తి.

భారతయుద్ధం  జరగకపోతే  భూమికి  పాపాత్ముల  భారం  తగ్గదు.  అందువల్ల  భారతయుద్ధం  జరగాలని  ఆ  యుద్ధంలో  ఎందరో  పాపాత్ములు  చనిపోవాలన్నదే   శ్రీ  కృష్ణునితో  సహా  దేవతల  ప్రణాలిక.  


సంధి కి  దుర్యోధనుడు,  జరాసంధుడు,  వంటి   దుష్టులైన    రాజులు  ఒప్పుకోరని  కృష్ణునికి  ముందే  తెలుసు.  
............................


సృష్టిలోని  ఏ  పదార్ధాన్ని,  శక్తిని  సృష్టించలేము,  నాశనం  చేయలేము  అని  ఆధునిక  శాస్త్రవేత్తలు  కూడా  ఒప్పుకున్నారు.  ఆ  సూత్రం  ప్రకారం  చూసినా  జన్మలు,  పునర్జన్మలు  ఉంటాయి .  


పునర్జన్మలు  ఉన్నాయని  కొందరు  ఆధునిక  శాస్త్రజ్ఞులు  ప్రయోగాల  ద్వారా  నిరూపించారు  కూడా. 

 అయితే  కొందరు  హేతువాదులు  ఆధునిక  శాస్త్రవేత్తలు  చెప్పే  విషయాలలో  తమ  వాదనకు    అనుకూలమైన  వాటినే  స్వీకరిస్తారు. 
.............................

ఎంతో  పని  వత్తిడిలో  ఈ  వ్యాసాన్ని  వ్రాశాను.  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.



Friday, July 12, 2013

ఎవరూ తక్కువ కాదు , కులం కన్నా గుణం ప్రధానం..వంటి ఎన్నో మంచి విషయాలను తెలియజేసిన శ్రీ కృష్ణ పరమాత్ముని,భారతాన్ని,శంకరాచార్యుని విమర్శించటం సరైనది కాదు...


దయచేసి  ఈ  వ్యాసం  చివరి  వరకూ  చదువుతారని  ఆశిస్తున్నానండి.

కొందరు  ఏమంటారంటే ,  ప్రాచీన  గ్రంధాలలో  ఒకే  విషయం  ఎన్నో  విధాలుగా  ఉంటుంది.  అంటారు. 

 ఉదా..  సత్యమే  గొప్పది  కాబట్టి  అసత్యం  పలకకూడదు  అంటారు.


 అయితే,
  ఆపత్కాలంలో  అసత్యం  పలికినా   తప్పుకాదు  అంటారు. 

 ఇదంతా  మాకు  అర్ధం  కావటం  లేదు.  పెద్దలకు  సరైన  పంధా  లేదు  .  అని  కొందరు  విమర్శిస్తుంటారు.

ఆలోచించండి,   ప్రతిదానికి  అసత్యాలు  ఆడటం  వల్ల  సమాజంలో  అస్తవ్యస్థ  పరిస్థితులు  ఏర్పడుతాయి. 


ఎన్నో  ఘోరాలు,  నేరాలు  జరగటానికి  అబద్ధము  ఒక  ముఖ్యమైన  కారణం.  అందువల్ల  సత్యమే  పలకాలి.  అని  పెద్దలు  తెలియజేయటం  జరిగింది. 

అయితే,  అసత్యం  పలకటం  కొన్నిసార్లు  తప్పనిసరి  అవుతుంది. 

ఉదా...కొందరు  ఆకతాయి  కుర్రాళ్ళు   ఒక  సాధు  జంతువును  బాగా  కొడుతూ  వస్తున్నారు.  ఆ  జంతువు  అప్పటికే  బాగా  దెబ్బలు  తిని  ఆయాసంతో  వగరుస్తూ  మీ  ఇంటి  వద్దకు  వచ్చి   చెట్టు  క్రింద  దాక్కుంది.

ఆలస్యంగా   వచ్చిన   కుర్రవాళ్ళు  జంతువు   ఎటు  వెళ్ళిందని  మిమ్మల్ని  అడిగారు. అప్పుడు  మీరు  ఏం  చేస్తారు  ?

జీవితంలో  సత్యమే  పలుకవలెను...అని   ఆ  జంతువు  దాక్కున్న  ప్రదేశాన్ని  చూపించరు  కదా  !

అసత్యం  చెప్పకపోయినా , కుర్రవాళ్ళకు  యుక్తియుక్తంగా  జవాబు  చెప్పి  వాళ్ళను  అక్కడనుంచి   పంపించి  ఆ  జంతువును  రక్షించటానికే  ప్రయత్నిస్తారు  కదా !

( గ్రంధాలలోని ఒక  కధ ఆధారంగా ఈ సంఘటన వ్రాసాను.)

మనం  పలికే  సత్యం  వల్ల  నిష్కారణంగా  అమాయకుల  ప్రాణం  పోయే  పరిస్థితి  ఉన్నప్పుడు  సత్యం  పలికినా  అది  అసత్యం  పలికిన  దానితో  సమానమే  నంటారు. 


 అందువల్ల  పరిస్థితిని  విశ్లేషించుకుని   వివేకంతో  ప్రవర్తించాలన్నది  పెద్దల  అభిప్రాయం.

నిదానమే  ప్రధానం  అన్న  పెద్దలే  ఆలస్యం  అమృతం  విషం . అని  కూడా  అన్నారు.

ఇవన్నీ  చదివిన   కొందరికి  పెద్దల  మీద  కోపం  వచ్చేస్తుంది.  పెద్దలు  ఏమిటి ? గ్రంధాలలో  వాళ్ళ  ఇష్టం  వచ్చినట్లు  వ్రాశారు. 

కాసేపు  నిదానమే  ప్రధానమంటారు.  కాసేపు  ఆలస్యం  అమృతం  విషం  అంటారు.   పూర్వీకులకు  ఏమీ  తెలియదు . అని  ఇంకా  ఏమేమో  నోటికొచ్చినవన్నీ  అనేస్తారు.

పెద్దలు  చెప్పిన  దానిలో  తప్పేముంది ?  రెండూ  నిజమే.

జీవితంలో  కొన్నిసార్లు  నిదానమే  ప్రధానం . అన్నట్లు  ప్రవర్తించాలి.  కొన్నిసార్లు  ఆలస్యం  అమృతం  విషం . అన్నట్లు   త్వరగా  నిర్ణయాలు  తీసుకోవాలి.

భార్యాభర్త   కొట్లాడుకుని  న్యాయమూర్తి  వద్దకు    తీర్పు  కోసం  వస్తే  నిదానమే  ప్రధానం  అని  నిదానంగా  ఆలోచించి  తీర్పు  చెప్పాలి.   కొంచెం  సమయం  గడిస్తే  ఈ  లోగా   భార్యాభ
ర్త  మధ్య  కోపం  తగ్గి  వాళ్ళే  సర్దుకుపోయే  అవకాశం  ఉంది.

అయితే,  అగ్ని  ప్రమాదం  జరిగి  కొంపలు  అంటుకుపోతుంటే  .....నిదానమే  ప్రధానం  అన్న  సూత్రం  వర్తించదు.  ఆలస్యం  అమృతం  విషం.  అన్నట్లు  త్వరగా  నిర్ణయం  తీసుకోవాలి. 

వేదాలలో  చెప్పిన  విషయాలు   చక్కగా  అర్ధం  అవటం  కోసం  పురాణేతిహాసాలు  వెలువడ్డాయి.

పురాణేతిహాసాలను  మరింత  స్పష్టంగా  వివరించటానికి  అవధూతలు,  అవతారమూర్తులు , సద్గురువులు...ఎందరో  అవతరించి  ప్రపంచానికి  దిశానిర్దేశం  చేస్తున్నారు.

........................................

శ్రీకృష్ణుడు  తనను  విందుకు  ఆహ్వానించిన  దుర్యోధనుని  ఆహ్వానాన్ని    తిరస్కరించి  విదురుని  ఇంట  విందును  స్వీకరించారు.  విదురుని  తల్లి  శూద్ర స్త్రీ. 


 ఈ  సంఘటన  ద్వారా   కులం  కన్నా  గుణమే  ప్రధానం  అని  లోకానికి  చాటినట్లయింది.

 శూద్రుడైన  ధర్మవ్యాధుడు  బ్రాహ్మణుడైన   పండితునికి   కర్తవ్యబోధ  చేసిన  సంఘటన  ఉంది.( భారతంలో..) 

   గొప్ప  సందేశాలున్న    మహా  భారతాన్ని,  అందులో  ముఖ్య పాత్రధారి   అయిన  శ్రీ  కృష్ణ  పరమాత్మను  విమర్శించటం  అంటే ,   విమర్శించిన  వారు   శ్రీ  కృష్ణపరమాత్మను  మరియు   ప్రాచీన  గ్రంధాలను  సరిగా  అర్ధం  చేసుకోలేదని  అర్ధం. 
...........................................

ప్రాచీన  గ్రంధాలలో  శివునికి  విష్ణువుకు  భేదం  లేదని  పెద్దలు  ఎన్నో  చోట్ల  తెలియజేయటం  జరిగింది.  


అయినా  ఎందరో  పండితులు  తరతరాలుగా  శివుడే  గొప్ప,  విష్ణువే  గొప్ప  అంటూ..    సమాజంలో    గొడవలను  సృష్టించారు.  ఆది  శంకరాచార్యుల  వారు  ఈ  భేదాలను  రూపుమాపటానికి  కృషిచేశారు.

 ఇంకా ,  మనీషాపంచకము  నాటి  సంఘటన  ద్వారా  అంటరానితనం  సరైనది  కాదని  లోకానికి  చాటి  చెప్పారు.  ఇంకా  ఎన్నో  చక్కటి  పనులను  చేశారు. 


 అంటరానితనం  తప్పని  లోకానికి  తెలియజేసిన  ఆది శంకరాచార్యుని  విమర్శించటం  సరైనది  కాదు.

 శివకేశవుల  మధ్య  భేదాలతో  కొట్టుకు చస్తున్న వారిని  ఉద్ధరించి , సమాజంలో  ప్రశాంత  వాతావరణాన్ని  ఏర్పరిచిన  ఆది శంకరాచార్యుని  విమర్శించటం  సరైనది  కాదు.

శూద్ర  వనిత  పుత్రుడైన  విదురుని  ఇంట  ఆతిధ్యం  స్వీకరించటం  ద్వారా  కులం  కన్నా  గుణం  గొప్పదని  లోకానికి  చాటిన   శ్రీ  కృష్ణుని  విమర్శించటం  సరైనది  కాదు.

ధర్మవ్యాధుని  కధ  ద్వారా  ఎవరూ  తక్కువ  వారు  కాదు ... మాంసాన్ని విక్రయించే వారు కూడా  గొప్పవారే .... అని  చాటిన  భారతాన్ని  విమర్శించటం  సరైనది  కాదు.

వ్రాసిన  విషయాలలో   పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.


Wednesday, July 10, 2013

జగన్నాధ రధయాత్ర .... పురాణేతిహాసాల గురించి కొన్ని విషయములు....

 
ఓం,
ఈ  రోజు  జగన్నాధ  రధయాత్ర......
శ్రీ జగన్నాధస్వామి వారికి, శ్రీ బలభద్ర స్వామివారికి , శ్రీ సుభద్ర అమ్మ వారికి  అనేక  నమస్కారములు....

...................
వేదములు ,పురాణేతిహాసములు  చాలా గొప్పవి. వీటి గురించి మనము అర్ధం చేసుకున్నది చాలా తక్కువ. అని నా అభిప్రాయము.

వాటిలో ఎన్నో అంతుపట్టని ఆథ్యాత్మిక విషయాలు, వైజ్ఞానిక విషయాలు, సామాజిక విషయాలు.. ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు.
 

  ప్రాచీనకాలపు పెద్దలు ,  పురాణేతిహాసములలో  ఎన్నో  విషయాలను సంకేతరూపములో ఉంచి ,  భద్రంగా మనకు అందించారని  ఈనాటి పెద్దల అభిప్రాయం. వాటిని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోవటం మన దురదృష్టం. 

అందులోని కధలను కొంతమంది అపార్ధం చేసుకుంటున్నారు.



పురాణేతిహాసాల ద్వారా పెద్దలు , మనకు  అవసరమైన  అన్ని విషయాలను  తెలియజేసారు. 

 రావణాసురుని  లేదా దుర్యోధనుని   ఇంకా   భూమి మీద రాక్షసులను, చెడ్డ శక్తులను  సంహరించాలంటే దైవానికి   చిటికెలో  పని.

కానీ అలా చంపకుండా .....


రామాయణం, భారతం వంటి ఇతివృత్తాల ద్వారా....ఎన్నో కధలను, అందులో పాత్రధారులను కల్పించి , వారి జీవితాల ద్వారా..వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇంకా ...

ఏది ధర్మం ? ఏది అధర్మం? వంటి ఎన్నో విషయాలను,   ఎంతో  విజ్ఞానాన్ని ...పురాణేతిహాసాల ద్వారా ,  దైవం   లోకానికి అందించటం జరిగిందని  అనిపిస్తుంది.
.......

 పురాణములలో సృష్టి ఎలా జరిగింది..... ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయంట.

నవగ్రహములు  గురించి మనవారికి ఎప్పుడో తెలుసు.  గ్రహాల గురించి విషయాలు, అవి ఎన్ని యోజనముల దూరంలో ఉంటాయి..  వంటి  విషయాలను  ప్రాచీన కాలం నాటి  పెద్దలు తెలియజేసారు కదా !

 పంచాంగం ప్రకారము   రాబోయే  గ్రహణాలను  సరిగ్గా  అంచనా  వేసి,
ఏ యంత్ర  సహాయం  లేకుండానే  సంవత్సరానికి  ముందే  పండితులు చెప్పగలుగుతున్నారు  కదా ! 

 (ఇలా సరిగ్గా చెప్పగలగటం సైన్స్ కాదా ?)
...............

ఇంకా,  పురాణేతిహాసాలలోని  పాత్రల ద్వారా  పెద్దలు మనకు ...... జీవితములో మనము ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు...వంటి విషయాలను  కూడా తెలియచేశారు.

 ఎంత గొప్ప వ్యక్తి అయినా ఒకోసారి  అధర్మంగా ప్రవర్తించినప్పుడు ఆ వ్యక్తితోపాటు  బంధువులు .. ఆ వ్యక్తి  రాజు అయితే  రాజ్యంలోని  ప్రజలు  కూడా  ఎన్ని కష్టాలను  అనుభవించే   అవకాశాలున్నాయో..వంటి  విషయాల  గురించి  కూడా మనము తెలుసుకోవచ్చు.


....................................................
 దైవం యొక్క ఈ విశ్వ సృష్టిలో ఎన్నో పాలపుంతలు, గ్రహాలు, గొప్పవయిన కృష్ణబిలాలు (బ్లాక్ హోల్స్) ......... ఇలా మనకు తెలియని ఎన్నో విషయాలున్నాయి.

ఈ అనంత విశ్వంలో మన సూర్యకుటుంబం ఒక భాగం ....... అందులో మన భూమి ఒక భాగం. ఆ భూమిమీది  మానవులం మనమెంత... మన బ్రతుకెంత. .......ఆ దేవుని దయవల్ల ఏ ఆస్టరాయిడ్ భూమిని ఢీ కొట్టకపోబట్టి ఇలా బ్రతుకుతున్నాము.


అంతా  దైవం  దయ.....

Friday, July 5, 2013

నేను కొంతకాలం క్రిందట దైవాన్ని నమ్మని నాస్తికవాదిని...


 పెద్దవాళ్ళు  ప్రసాదాన్ని  ఇచ్చినా  తీసుకోకపోవటం,     దైవం  , పురాణేతిహాసాల  గురించి   ఫ్రెండ్స్ తో  వేళాకోళంగా  మాట్లాడటం  ఇలా ..... ఉండేది  నా  ప్రవర్తన. 

  క్రమంగా  దైవం  అంటే  నమ్మకం  కలగటం మొదలయ్యింది. (  కొన్ని కారణాల  వల్ల  ) 

పురాణేతిహాసాలలోని  విషయాలను  క్రొత్త  కోణంలో  తెలుసుకుంటూ    క్రొత్తక్రొత్త   విషయాలను   తెలుసుకుంటున్న  కొద్దీ  ఆశ్చర్యంగా  అనిపించేది. 


 అయ్యో ! ఇంతకు  ముందు  వీటిని  అపార్ధం  చేసుకున్నాను  కదా  !  అనిపించేది.

పురాణేతిహాసాల  గురించి  తెలిసినంతలో  పాత టపాలలో  వ్రాశాను.  నాకు  తెలిసిన  విషయాలు  తక్కువ.  ఈ  మాత్రం  వ్రాయగలుగుతున్నానంటే ,  అంతా  దైవం  దయ.

 జీవితంలో  ఎలా  ప్రవర్తిస్తే  ఎలాంటి  ఫలితాలు  ఉంటాయో  ...ఎలా  ప్రవర్తించాలో...ఎలా  ప్రవర్తించకూడదో  పురాణేతిహాసాల  ద్వారా  పెద్దలు  మనకు  తెలియజేసారు.

  రామాయణం, భారతంలోని  విషయాలలో   ఎన్నో    కోణాలు  ఉంటాయి.  పురాణేతిహాసాలను  చదువుతున్నకొద్దీ ....  క్రొత్త  విషయాలు ( అర్ధాలు )  తెలుస్తుంటాయని  పండితులు  తెలియజేశారు.

  ప్రపంచంలో  ఉండే  అన్ని  విషయాల  గురించి  ప్రస్తావన  మహాభారతంలో  ఉన్నది. 

భగవద్గీత  గురించి  ఏమని   వర్ణించగలం...  భగవద్గీత   అత్యద్భుతమైన  గీత.

ఎన్నో  శాస్త్రాలు..... వైద్యశాస్త్రం,  ఆర్ధిక  శాస్త్రం,  ఖగోళ  శాస్త్రం,  రసాయనశాస్త్రం,   యంత్ర  శాస్త్రం, మానసిక  శాస్త్రం,   న్యాయశాస్త్రం,   లోహశాస్త్రం.......ఇలా  ఎన్నో  శాస్త్రాల  ద్వారా  ఎంతో  విజ్ఞానాన్ని  ప్రాచీనులు  మనకు  అందించారు.

దురదృష్టవశాత్తు  మనలో  కొందరు   ప్రాచీన  గ్రంధాలను  సరిగ్గా  అర్ధం  చేసుకోవటం  లేదు.

అయితే,  దైవాన్ని  పురాణేతిహాసాలను  విమర్శించేవారిని  చూస్తే  జాలిపడటం  తప్ప  ఏం  చేయగలం. 

 నేను  కూడా  నాస్తికవాదిగా  ఉన్నప్పుడు  దైవం  గురించి  పెద్దవాళ్ళు  ఎంత  చెప్పినా  వినిపించుకునేదాన్ని  కాదు.

ఎవరికైనా  తెలుసుకోవలసిన  సమయం  వచ్చినప్పుడు  తెలుస్తుందేమో.....

..........................


విదేశీయుల  రాక  మరియు   దండయాత్రల   పర్యవసానంగా    భారతదేశం  నుంచి  ఎంతో  సంపద  కొల్లగొట్టబడి,   విదేశాలకు  తరలిపోయింది. 

ఎన్నో  విలువైన  ప్రాచీన  విజ్ఞాన  గ్రంధాలను  కూడా  వాళ్ళు  తమ  దేశాలకు  తరలించుకుపోగా,   ఇక్కడ  ఉన్న  వాటిలో  కొన్నింటిని   నాశనం  చేశారు. 


 ఆ  విధంగా  తరతరాల  దోపిడీలో  మనం  ఎంతో  సంపదను  కోల్పోయాము.

  మెకాలే   విద్యావిధానాన్ని   భారతదేశంలో   ప్రవేశపెట్టేముందు   ఈ  దేశం  గురించి   అన్న  మాటలు  చాలా  మందికి  తెలుసు.

 ఇండియా  ఎంతో   సిరిసంపదలతో  ఉన్నదని ,  ఇక్కడ  బిచ్చగాళ్ళు  కనపడలేదని  ...అంటూ    మరెన్నో  విషయాలను  చెప్పటం   జరిగింది. 


Sunday Posts: Lord Macaulay's Speech on Indian Education: The ...


 బ్రిటిష్ వాళ్ళు  ఇండియాకు  రాకముందు  కూడా  కొన్ని  విదేశీ  దాడులు  జరిగాయి.  అయినప్పటికి ,   మెకాలే  కాలానికి  కూడా   ఇండియాలో  అంత  సిరిసంపదలు  ఉన్నాయంటే ......


 విదేశీయులు  భారతదేశంలో  ప్రవేశించి  దాడులు  జరగకముందు  ఈ  దేశం  ఎంత  గొప్పగా ఉండేదో  కదా!

 భారతదేశం  ఆర్ధికంగా  ఇప్పుడిలా  వెనకపడి  ఉండటానికి  అనేక  కారణాలున్నాయి.  అందులో  కొన్ని...

1.  మనలో  ఎక్కువమందికి    మన  పూర్వీకులన్నా , మన  ప్రాచీన  సంస్కృతి  అన్నా,   చులకన  భావం   ఉంది....


.మనకేమీ  తెలియదని..... విదేశాల  వాళ్ళకే  అన్నీ  తెలుసు .... అనుకుంటూ  గిల్టీగా  ఫీలవుతుంటారు . 

2. మనలో  ఐకమత్యం  తక్కువ.  భారతదేశం  తరతరాలుగా  విదేశీదాడులకు   గురవుతోందంటే   ఇలాంటి    కారణాలు  ఎన్నో  ఉన్నాయి.

ఇప్పటికీ  భారతదేశం  నుంచి  సంపద  విదేశాలకు    తరలిపోతూనే  ఉన్నది. రకరకాల మార్గాలలో  మరియు   విపరీ
తమైన   మేధావుల  వలస  రూపంలో...
.........................


ఆధునిక  కాలంలో  ప్రపంచం  ఎదుర్కొంటున్న.....  నైతికవిలువల  క్షీణత,  ఆర్ధిక  సంక్షోభం,  నిరుద్యోగం,   గ్లోబల్  వార్మింగ్  వంటి  పర్యావరణ  సమస్యలు   ...

ఇలాంటి  ఎన్నో   సమస్యల నుండి  ప్రపంచం  బైటపడాలంటే  మన  పురాణేతిహాసాలు  మరియు  ప్రాచీన  విజ్ఞానం  ద్వారా  చక్కటి  పరిష్కారాలు  లభిస్తాయి.


Wednesday, July 3, 2013

పురాణేతిహాసాలు , చరిత్ర ..... గురించి కొన్ని విషయాలు.



 పురాణేతిహాసాలు  రామాయణము,  భారతము,(భగవద్గీత ) ... ద్వారా  ఎన్నో  చక్కటి  విషయాలు  తెలుస్తాయి.

మరియు   శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ  చరితామృతము  గ్రంధములో  కూడా   ఎన్నో  చక్కటి  విషయాలు  ఉన్నాయి.
....................................................


భారతం,  రామాయణం  నిజంగా  జరిగినవా ? కాదా ? అని కొందరు  సందేహపడుతుంటారు. 


 ఈ  మధ్య  శాటిలైట్  చిత్రాల సమాచారం  ద్వారా  రామాయణకాలంలో  సముద్రంలో   నిర్మించిన  వారధి  మరియు  భారతకాలం  నాటి    ద్వారకానగర  సమాచారం  లభించింది.

  పూర్వ  కాలం  నాటి  రామసేతు,  మరియు  ద్వారకా  నగర  విశేషాలు  ఇప్పటికి  ఎలా  ఉన్నాయి   ?  అని   కూడా కొందరికి  అనుమానాలు  వస్తాయి.

 మంచుయుగం  ముందటి   డైనోసార్ల  ఎముకలు,  శిలాజాలు  ఇప్పటికి    లభించటం ...... వాటి  ఆధారంగా  డైనోసార్ల  కాలం నాటి  పరిస్థితిని  శాస్త్రవేత్తలు    నిర్ణయిస్తున్నారు  కదా  ! 

 మంచుయుగం  ముందటి  డైనోసార్ల  అవశేషాలే  ఇప్పటికీ  లభిస్తున్నప్పుడు  ,   నాగరికత  ఏర్పడిన  నాటి  రామసేతు,  ద్వారకానగర    నిర్మాణాలు    చక్కగా  ఉండటంలో  ఎటువంటి  ఆశ్చర్యము   లేదు.


  విదేశాల  వారు  వారి  ప్రాచీన  కట్టడాలను  ఎంతో  జాగ్రత్తగా  రక్షించుకుంటారు.  మన  దేశం  వారికి  పురాతన కట్టడాలంటే  నిర్లక్ష్యం  ఎక్కువ.  మనం  కూడా  ప్రాచీన  కట్టడాలను  రక్షించుకోవాలి.

దయచేసి ఈ  క్రింది  లింక్స్  చూడగలరు........

Amazing facts about - Ancient India: Scientific Dating of Ramayan Era  


Science & Technology in Mahabharatha: Material evidence ...

 

The Holy Science - Wikipedia, the free encyclopedia



Rama Setu - An Engineering Marvel of 5076 BCE - YouTube


Shocking Truth of Ram Setu - YouTube

...............................................

 
పూర్వం  భూమి  అంతా  ఒకే
ఖండముగా    ఉండేదని   కొన్ని    గ్రంధాల  ద్వారా  తెలుస్తుంది. 

  ఆధునిక  పరిశోధకులు  కూడా ,   పూర్వం  భూమి  అంతా  ఒకే  ఖండముగా  కలిసి  ఉండి  ఉండవచ్చని ఒప్పుకున్నారు.  దానిని  గోండ్వానా లేండ్  అనే  పేరుతో  వ్యవహరిస్తున్నారు.

భూమి  అంతా  ఒకే  ఖండముగా  ఉన్నప్పుడు  భూమి  మీది   ప్రజలు  మరియు  నాగరికతలో  ఎంతో  సారూప్యం  ఉంటుంది.

 ఖండాలు  విడిపోయిన  తరువాత  చరిత్రకారులు    భూమిలో  త్రవ్వకాలు  జరిపితే ,  దొరికిన  చారిత్రిక  ఆధారాల  మధ్య  ఎన్నో  పోలికలు  ఉంటాయి.  అయితే,   వాటి  ఆధారంగా  చరిత్రకారులు   నిర్ణయించే  విషయాలలో  తప్పులు  వచ్చే  అవకాశం  ఉంది.

 ఎందుకంటే  ఇప్పుడు  విడివిడిగా  ఉన్న  ఖండాలు  పూర్వం   ఒకే  ఖండముగా  ఉండేవన్న  విషయం  ఇంతకుముందు  తెలియదు  కాబట్టి.
 
 ......................... 

పూర్వం భారతదేశము, ఆఫ్రికా,   ఆస్ట్రేలియా  ఖండాలతో    కలిసి ఉన్నప్పుడు    ఒక పెద్ద భూఖండముగా    ఉన్నదని , దానిని   లిమూరియా  అంటారనే  మరొక  వాదన కూడా ఉంది.
.................... ...............
డైనోసార్లు  ఉన్న  కాలంలో  మానవులు  కూడా  ఉన్నారని  తెలిసే  శిలాజాల  గుర్తులు  లభించాయని  కూడా   కొందరు   పరిశోధకులు  చెబుతున్నారు. (  ఇది  ఎంతవరకు  నిజమో  మనకు  తెలియదు. )
........................................
ఋగ్వేదంలో  ......


 ఒక  కుటుంబంలోని  వారే  భిన్నవృత్తులను  స్వీకరించినట్లు 
గ్వేదంలో  చెప్పబడిందట.  నేను  కవిని,  మా  తండ్రి  వైద్యుడు,  మా  తల్లి  ఒడ్లు  దంచేది......

.. ఏ  వృత్తి  నీచంగా  చూడబడలేదు.   చర్మకారులను,  చర్మాలను  బాగుచేసేవారిని  కూడా    సంఘములో  తక్కువ  జాతివారుగా  ఎంచలేదు........ ఇలా   చెప్పబడిందట.

  తరువాత  కాలంలో  మనుషులలో  స్వార్ధం  పెరగటం  మరియు  తెలిసితెలియనితనం  వల్ల  సమాజంలో  అంటరానితనం  మరియు  కొన్ని  మూఢాచారాలు  వ్యాప్తిలోకి  వచ్చాయని  అనిపిస్తుంది. 
......................................


ప్రస్తుతం  ఉన్న  రూపములో  ,  ప్రమాణములో రామాయణ,  మహాభారత  కావ్యములు  ఒక  వాల్మీకి,  వ్యాసరచితములు  మాత్రమే  కావని  పలువురి  అభిప్రాయము. 

ఎన్నో  సంవత్సరాలుగా  ఈ  రెండు  కావ్యములలో అనేకమంది  కవులు  తమ  రచనలను  కూడా  చేర్చి  ఉంటారని  కొందరు  భావిస్తున్నారు. .....
.........................................


ఆధునిక  విజ్ఞానం  మరియు  చరిత్రకు  సంబంధించిన  విషయాల  నిరూపణలో  ఎన్నో  అభిప్రాయభేదాలు  ఉంటుంటాయి.  


సైన్స్   గురించి శాస్త్రవేత్తల  మధ్య ...... చరిత్ర  గురించి  చరిత్రకారుల  మధ్య  ఎన్నో  అభిప్రాయభేదాలు  ఉంటుంటాయి. .

ఆర్యుల  జన్మ  స్థానం  గురించి ......స్వామి దయానంద  గారి  ప్రకారం  ఆర్యులు  టిబెట్  నుంచి  వచ్చారు.

 లోకమాన్య  బాలగంగాధర  తిలక్  గారి  అభిప్రాయం  ప్రకారం  ఆర్యులు  ఉత్తరధృవం  నుంచి  వచ్చారు.


 ఫ్రొఫెసర్  మాక్డొనల్  గారి  ప్రకారం  ఆర్యులు  డాన్యూబ్ (  యూరోప్ )  నుంచి  వచ్చారు.  

 భారతీయులు,  పర్షియా  వారు  ఒకే  ఆర్యజాతికి  చెందిన  వారని  కొందరి  అభిప్రాయం. 

ఇలా  భిన్నాభిప్రాయాలు    ఉన్నాయి. 
 ..........................................

సింధు  నాగరికత  నిర్మాతల  గురించి  కూడా  ఎన్నో  అభిప్రాయాలు  ఉన్నాయి. 
ఉదా..  శాస్త్రాధారముల  ప్రకారం  పరీక్షించగా  ఈ  నాగరికతను  భిన్నజాతులవారు  కలిసిమెలసి  నిర్మించినట్లు  తెలిసిందట.


ఏదీ  నిర్ధారణగా  తేలనందున,.....

  ఫాదర్  హీరాన్  సింధు  నగరాలను  ద్రావిడులు  నిర్మించారని  ఆన్నారు.


డా.  లక్ష్మణ్  స్వరూప్,  కాంతి  స్వరూప్   ఆర్యులే  దీనిని  నిర్మించారని  అన్నారు.

మొహంజదారో  నగరము  ఏడుపొరలుగా   ( అంతస్థులుగా  )  బయటపడిందట.  ఒక్కొక్క  పొరకు  500  సంవత్సరముల  చొప్పున దాని  కాలాన్ని  క్రీ.పూ.  3500  సంవత్సరములకు  నిర్ణయించడమైనది.
.............................................. 


భారత దేశానికి  ప్రధమముగా  వలస  వచ్చిన  ఆర్యజాతులలో  ద్రావిడులు  ఒకరని  
కొందరు  చరిత్రకారుల  అభిప్రాయము.

   కొందరు  ఆర్యులు  తమను  ద్రావిడులుగా  పిలుచుకొన్నారని  మరి కొందరు   చరిత్రకారుల  అభిప్రాయము.

ద్రావిడులు  మధ్య  ఆసియాలోని   సీధియన్స్ కు  సంబంధించిన  వారని,  ఈ  రెండు  జాతుల  మధ్య భాషాసంస్కృతులకు  సంబంధం  ఉన్నదని  డా.  కాల్డ్వెల్  అభిప్రాయపడ్డారు.
..........................................


పురాణేతిహాసాలను  గమనిస్తే   కులాలను  బట్టి   అంటరానితనం  పాటించాలని  ఏమీ  చెప్పలేదని  చక్కగా  తెలుస్తుంది.

 పాపాలు చేసే వారి పట్ల అంటరానితనాన్ని పాటించాలి...అని...  ప్రాచీనుల  ఉద్దేశం  అని  తెలుస్తుంది. 

ఈ  విషయాల  గురించి  ఈ  టపాలో  వ్రాయటం  జరిగింది. 


పాపాలు చేసే వారి పట్ల అంటరానితనాన్ని పాటించాల... 
..............

వ్రాసిన విషయాలలో ఏమైనా  పొరపాట్లు ఉంటే  దయచేసి  క్షమించాలని దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.