koodali

Wednesday, May 18, 2016

షిర్డి సాయి గురించి కొందరి అభిప్రాయాల గురించి ...

 
కొందరు ఏమంటున్నారంటే... సాయికి గురుపరంపర లేదు అంటున్నారు.

 దత్తాత్రేయుల వారు 24..గురువుల గురించి తెలియజేసారు. 
ఈ విషయాలను గమనిస్తే... గురువు కావాలంటే గురుపరంపర ఉండవలసిన అవసరం లేదని తెలుస్తుంది.

******************

సాయి పుట్టుక గురించి ప్రశ్నిస్తూ .. సాయి హిందువా ? ముస్లిమా ? సాయిది ఏ కులం ? ...గురించి..


షిర్డి సాయి ఎన్నో విధానాలను పాటించారు...

 ఉదా..అగ్నిహోత్రాన్ని వెలిగించటం ( ధుని వెలిగించటం ), విభూతిని పంచి ఇవ్వటం,  హిందూ దేవాలయాలను బాగుచేయించటం..మరియు .. అల్లాహ్ నామాన్ని స్మరించటం, మసీదులను బాగుచేయించటం..ఇలా అన్ని మతాలకు సంబంధించిన విధానాలను అవలంబించారు.
.......................
 
మరికొన్ని విషయాలు..

ఈ విషయాలను ఈ పోస్ట్ వ్రాసిన చాలాకాలం తర్వాత వ్రాసి పోస్ట్ చేయటం జరిగింది. 

మరికొన్ని విషయాలు..ఈ విషయాలను ఈ పోస్ట్ వ్రాసిన చాలాకాలం తర్వాత వ్రాసి పోస్ట్ చేయటం జరిగింది.

............
సమాజంలో రకరకాల మనస్తత్వాలవారుంటారు. కొందరు తమ మతంప్రకారం దైవాన్ని ప్రార్ధించుకుంటారు.  కొందరు దైవాన్ని నమ్మని నాస్తికులుంటారు. 
 
సాయిబాబా షిరిడి వస్తే, అక్కడ కొందరు హిందువులు వారిని  సాయి అని పిలిచారట. తరువాత భక్తులు రావటం పెరిగింది. 

సమాజంలో ఎందరో గొప్పవాళ్లు యోగులు, అవధూతలు ఉంటారు. వాళ్లు ఎంతో గొప్పవారే. ..హిందువులు ఎందరో యోగులను, అవధూతలను కూడా పూజిస్తారు. 
 
కొందరు మహిమలు కలవారు వారిమానాన వారు ఆడంబరం లేకుండా జీవించి మరణించిన తరువాత, వారి పేరుతో కొత్త విధానాలను తెచ్చి తాము లాభం పొందాలని చూసే వాళ్ళూ సమాజంలో ఉంటారు.
.....................
 
సాయిబాబా.. దత్తాత్రేయస్వామి అవతారం అని కొందరు, హనుమంతుని అవతారం అని కొందరు అంటున్నారు కదా.

అసలు దత్తాత్రేయుల వారు, హనుమంతుల వారు ఉండగా..ఇంకా ఎందుకు బాధ...దత్తాత్రేయస్వామివారిని, ఆంజనేయస్వామివారిని పూజిస్తే సాయిబాబాను కూడా పూజించినట్లే.....అలా వద్దనుకుంటే సాయిబాబాను పూజించుకోవచ్చు.

సాయిరాం, సాయి కృష్ణ అని సాయిబాబాకు రామ, కృష్ణ పేర్లను కలిపి అంటున్నారు కదా.. శ్రీరాముని, శ్రీకృష్ణుని పూజిస్తే సాయిని కూడా పూజించినట్లే.  దైవము ఒకే శక్తి.
 ...........................
 
కొందరు గొప్పవారికి మహిమలు ఉంటాయి. వారు ఎంతో గౌరవనీయులే. అలాగని చాలామంది దేవతలను పెంచుతూ ఉంటే, హిందువులకు బోలెడు దేవతలు, బోలెడు శాఖలుగా మారి, భవిష్యత్తులో ఏమవుతుందో?
 .....................
 
సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటానికి ఎక్కువ డబ్బు ఖర్చుచేయలేము,  ఎక్కువ సమయం చేయలేము...అనుకుంటే, తక్కువ ఖర్చుతో, కొంత సమయంలో  పద్ధతిగా చేయవచ్చు. అసలే చేయకుండా మానటం కన్నా, చేయటం మంచిది కదా.. 
 
 
హిందువులు చాలా నియమాలను  పాటించగలిగిన వాళ్లు పాటించవచ్చు. అందరూ అలా పాటించాలి, లేకపోతే కష్టాలు మీదపడిపోతాయని చెప్పకూడదు. కలికాలంలో దైవస్మరణ..దైవనామస్మరణ చేసినా తరించుతారని ప్రాచీనులు తెలియజేసారు.
 
 పూజ అంటే చాలా నియమాలు పాటించలేమో? అని భయపడకండి. ఎక్కువ నియమాలతో కాకుండా,  సరళంగా కూడా హిందూదేవతలను పూజించుకోవచ్చు....చాలా నియమాలతో పూజించగలిగే వారు అలా పాటిస్తూ పూజించుకుంటారు.

 ఎవరైనా కూడా, దైవము పట్ల ప్రేమతో చక్కగా పూజించుకుంటే మంచిది.
********** 
 
 
 
వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.



Friday, May 13, 2016

మన దేశంలో ఎన్నో నదులు ఉన్నా కూడా...



భారతదేశంలో ఎన్నో నదులు ఉన్నాయి. ఎంతో నీరు ఉంది.

 దురదృష్టం ఏమిటంటే ఆ నీటిని మనం సరిగ్గా సద్వినియోగం చేసుకోవటం లేదు. 

ఎక్కువ  నీటి వసతి లేని సింగపూర్ , ఇజ్రాయిల్ వంటి దేశాలు వాళ్ళకు ఉన్న తక్కువ నీటినే సద్వినియోగం చేసుకుంటున్నారు.

  ఇజ్రాయిల్  దేశంలో కూడా అతి తక్కువ నీరుతో చక్కగా వ్యవసాయం చేస్తున్నారంటున్నారు.

 కొద్దికాలం క్రిందట ఆంధ్రప్రదేశ్లో కుప్పం ప్రాంతంలో ఇస్రాయిల్ వారి సలహాతో వ్యవసాయం చేసారు.


భారతదేశంలో  ఎన్నో TMC ల నీటి లభ్యత ఉన్నా కూడా సమర్ధవంతంగా వినియోగించుకోవటం చేతకాక గొడవలు పడుతున్నారు.

 నీటి యొక్క ప్రాముఖ్యత తెలిసి మన పూర్వీకులు నీటిని దేవతగా పూజించారు. నీటిని పాడుచేయకుండా సంరక్షించారు. నీటిని వృధా చేస్తే లక్ష్మీదేవి నిలవదన్నారు.

 నదులను దేవతలుగా పూజించే మన దేశంలో ప్రస్తుతం  జరుగుతున్నదేమిటంటే.. 

  నదులలో  డ్రైనేజీ వదలటం, పారిశ్రామిక వ్యర్ధాలను వదలటం ద్వారా నదులను  మురికి కూపాలుగా చేసేస్తున్నారు.

  ఉదా..అత్యంత పవిత్రంగా భావించే గంగా నది పరిస్థితి చూస్తే ..చాలా  బాధ కలుగుతుంది .  

 భారతదేశం వాళ్ళు ఇలా ఎందుకు తయారయ్యారో ?

***************
 పోస్ట్ పదేపదే మార్చటం కాకుండా కొత్తగా రాయాలనుకున్న విషయాలను వ్యాఖ్యల ద్వారా వ్రాస్తున్నాను.



Wednesday, May 11, 2016

.సాయిబాబా భక్తులు..మరికొన్ని విషయాలు..



ఎందరో హిందువులు  షిర్డి సాయిని కూడా పూజిస్తున్నారు.
 
***************
  క్రింద విషయాలను ఈ పోస్ట్ వేసిన తరువాత చాలాకాలం తరువాత వ్రాసి ఇక్కడ ప్రచురించటం జరిగింది.హెడ్డింగ్ కూడా మార్చటం జరిగింది.
 
చాలాకాలం క్రితం ద్వారకాపీట్ శంకరాచార్య, షిర్డి సాయిబాబాను పూజించవద్దన్నట్లుగా చెప్పటం జరిగింది.
ఆ మధ్య కొందరు సాయి భక్తులు ఇతర మత దేవత పేరుతో పాట పాడటం గమనించిన తరువాత, కొందరు హిందువుల్లో కొన్ని సందేహాలు, భయాలు కలుగుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల వల్ల కూడా, 
 
  సాయిని పూజించాలనుకుంటే హిందు దేవాలయాల్లో కాకుండా, సాయికి విడిగా మందిరం కట్టి, సాయిమందిరాల్లో కూడా హిందూ దేవతలను పెట్టకుండా, సాయిని ..సాయిరాం, సాయి కృష్ణ.. ఇలా హిందుపేర్లతో కలపకుండా పూజించ్చు.. అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
 
 సాయిబాబా ఇతర మతాల దేవతలను పూజించారు కాబట్టి, హిందూ దేవాలయాల్లో సాయిబాబా విగ్రహాలు పెట్టి పూజిస్తే,  భవిష్యత్తులో ఇతరమతాల వారివల్ల ఎలాంటి పరిస్థితి వస్తుందో..అని కొన్ని సందేహాలున్నాయి.
...........................

షిర్డి సాయి ఇతరమత దేవతలను కూడా ఆరాధించారు. అలాగని హిందువులైన సాయి భక్తులు ఇతరమత దేవతలను ఆరాధించరు కదా..
 
  సాయిబాబా ఇతరమతాల దేవతలను ఆరాధించటం గురించిన విషయంలో హిందువుకు  అయోమయం ఉంది. ఈ విషయాల గురించి దైవము దారి చూపితే బాగుండు.
 
ఇతరమతాల వాళ్లు వారి మతం పట్ల గట్టిగా ఉంటారు. హిందువులు మాత్రం అన్ని మతాలు ఒకటే అని తేలికగా తీసుకుని మతాన్ని మారితే హిందువుల సంఖ్య తగ్గిపోయే ప్రమాదముంది. 
 ..........................
 
 హిందువులకు ఎందరో దేవతలుండగా, హిందువుల్లోనే కొందరు బ్రాహ్మణులు కూడా కొత్త వారిని పూజించమని  ఎందుకు చెబుతున్నారో? తెలియటం లేదు. 
 
 వారి పద్ధతులు  సులభంగా ఉండి, ప్రజలు వారివైపు 
అకర్షితులయ్యి కొన్నిసంవత్సరాలు గడిచాక, 
 కొత్తవారు ఇతరమతాల దేవతలను కూడా ఆరాధించారు కాబట్టి, హిందువులు  ఇతరమతాల్లోకి వెళ్తారని భయపడి,  వారి పూజలను మానేయమంటారు. ఈ భయాలను కూడా తప్పు పట్టలేము. 

కొత్త వారిని పూజించమని చెప్పటం, అందుకు అలవాటుపడి కొన్నిసంవత్సరాల తరువాత మానేయమనటం ...ఇదంతా ప్రజలకు అయోమయంగా ఉంటుంది.
 
ఇక మీదటయినా ఎవరూ కొత్త వారిని తేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా కొత్తవారిని ప్రచారం చేయబోతే గట్టిగా ముందే అడ్డుకోవటం మంచిది.

ఆ మధ్య ఒకటోపి అమ్మను దైవస్వరూపంగా భావించి కొందరు ప్రచారం చేసారు. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఎక్కడకు దారితీస్తాయో..అని కొందరు గట్టిగా ఈ విషయం గురించి మాట్లాడారు. పరిస్థితి ప్రస్తుతానికి సద్దుమణిగింది. తెలుగువాళ్లకు ఇంకో కొత్త  వారిని కొలుచుకునే పని తగ్గింది.

నేను వాళ్లను తప్పుగా అనటం లేదు. వారు గొప్ప అవధూతలు, మహిమలు కలవాళ్లే కావ  చ్చు. 
 
హిందువులకు అనేక దేవతలుండగా  దేవతా స్వరూపాలంటూ
 కొత్తవారిని పూజించటం కన్నా, మనం ఎప్పుడూ పూజించే దైవాన్నే పూజించవచ్చు కదా. కొత్తగా అనేకమంది దేవతలను ప్రచారం చేస్తే హిందువులు అనేకశాఖలుగా చీలే ప్రమాదముంది.

 టోపి అమ్మ  తిని పడేసిన వాటిని  తింటే కష్టాలు, కోరికలు తగ్గుతాయని కొందరు ఆ
మె తిన్నవి  తింటున్నారట. హిందువులకు తాము నమ్మే దైవము పట్ల నమ్మకం లేదా? 
 
తాము పూజించే దైవప్రసాదాన్ని స్వీకరిస్తే తమ కష్టాలుపోతాయని, కోరికలు తీరుతాయని నమ్మాలి కదా.
...................................

 జీవితంలో కొన్నిసార్లు గురువునైనా, పెద్దవారినైనా.. కొన్నిసందేహాలు అడగాలనిపిస్తుంది. నాకు కొన్ని సందేహాలు కలిగాయి..
 
ఏ మతం వారికి ఆ మతాన్ని నమ్మి ఆచరించే గురువు ఉంటారు. అయితే, తాము నమ్మిన గురువు ఒక మతాన్ని కాకుండా, కొన్ని మతాలను నమ్మే వారైతే ఆ శిష్యులు ఏం చేయాలి?

ఎవరి మతాన్ని వారు నమ్మి ఆచరించాలి. ఇతరమతాల పట్ల గౌరవంతో ఉండాలి.. కానీ, ఇతరమతస్తులు తమపట్ల గౌరవంతో ఉండకపోతే ఏం చేయాలి? 
 
ఉదా..హిందువుల్లో చాలామంది పరమతసహనంతో ఉంటారు. కానీ, చాలామంది ఇతరమతస్తులు తమ మతం మాత్రమే గొప్పదని,  ఇతరమతాల వాళ్ళను మతమార్పిడి చేయడానికి ప్రయత్నిస్తారు.

భారతదేశం విభజన కూడా జరిగింది. ఆ సమయంలో ఎందరో  మరణించారు. 

 భారతదేశంలో ఎప్పటినుంచో హిందువులను నయానాభయానా మతం మార్చటానికి ఇతరమతాలవారు కొందరు ప్రయత్నిస్తున్నారు. హిందువులు కూడా చాలామంది మతాన్ని మారారు. ఇలాంటిపరిస్థితిలో హిందువులు తమ ఉనికిని గట్టిగా కాపాడుకోవాలా? లేక తమ గురువు ఇతరమతాలను కూడా నమ్మారు కాబట్టి, అన్ని మతాలు సమానమే, మనం నింపాదిగా ఊరుకుందాం..అని హిందువులు గమ్మున ఉండాలా?

 మరి, ఇతరమతాల వాళ్లు మతమార్పిడులకు ప్రయత్నించరని, హిందువులు మైనారిటీగా మారరని,  హిందువులకు హాని జరగదని ఎవరైనా హామీ ఇస్తారా? 
 
భవిష్యత్తులో ఏం జరుగుతుందో? ఇలాంటి పరిస్థితిలో అనేక సందేహాలు కలిగి అయోమయంగా ఉంటుంది. దైవమే దిక్కు.
.......................


 
 

Monday, May 9, 2016

అక్షయ తృతీయ...మరియు..

అక్షయ తృతీయ రోజున సింహాచలంలో చందనోత్సవాన్ని  చేస్తారు. 
.....................

అక్షయతృతీయ నాడు దానం చేస్తే మంచిదంటారు .

 అక్షయ తృతీయ సందర్భంగా.. మంచినీరు, గొడుగు, విసనకర్ర ...వంటివి   ఇతరులకు  దానం చేస్తే మంచిదని పెద్దలు  తెలియజేసారు. 

 దానం చేయటం వల్ల దానం చేసినవారికి మంచి  జరుగుతుందని,   ఆహారం,   గృహం …వంటివి   కొరత లేకుండా లభిస్తాయని అంటారు. 
................

 అయితే  ఈ రోజుల్లో, దానం చేసే ఆచారం  తగ్గిపోయి, ఎవరికి వారు  బంగారం కొనుక్కోవటం అనే ఆచారం మాత్రమే బాగా ప్రచారంలోకి వచ్చింది. 
..........

 అక్షయతృతీయ  పండుగ  వేసవిలో  వస్తుంది.  అప్పుడు  మంచినీరు, గొడుగు, విసనకర్ర    వంటివి  దానం  చేయటం  వల్ల  ఎందరికో ఉపయోగం  కలుగుతుంది. 


పూర్వీకులు  సమాజంలో  అందరికీ  ఉపయోగపడేవిధంగా  ఎన్నో  చక్కటి  ఆచారాలను ఏర్పాటుచేసారు. 


అయితే  కాలక్రమేణా  కొన్ని  ఆచారాలు  మార్పులుచేర్పులను  సంతరించుకుని  పూర్వీకుల  అసలు  ఉద్దేశ్యాన్ని  మరుగునపరచే  విధంగా  తయారవుతున్నాయి.
..............

ఈ రోజున బంగారం  కొనుక్కోవటం  మంచిదని  కూడా  పెద్దలు తెలియజేశారు. దానితో పాటూ దానం చేస్తే మంచిదని  కూడా చెప్పారు.

అయితే ఇప్పుడు  ఇతరులకు  దానం  చేయవలసిన  విషయాలను  వదిలేసి , అక్షయతృతీయ  అంటే  బంగారం  కొనుక్కోవటమే ..అన్నట్లుగా  జరిగిపోతోంది.
 ............. 

 అంతా బాగుండాలి. అంతా దైవం దయ.

.................

నేను ఈ మాత్రం బ్లాగ్ వ్రాస్తున్నానంటే అంతా దైవం దయ. దైవానికి అనేక కృతజ్ఞతలు.

*********

 మరి కొన్ని విషయాలు ఏమిటంటే,

అపార్ట్మెంట్ క్రింద కార్ పార్కింగ్ .. స్థలంలో చండీయాగం లేక ఏదైనా యాగం చేయటాన్ని గమనిస్తే నాకు ఏమనిపించిందంటే, 

పైన ఇళ్ళలో  బాత్రూస్, బెడ్రూంస్ ఉంటాయి కదా! మరి,  పైన ఇండ్లలో మనుషులు నడుస్తున్నప్పుడు క్రింద యాగాలు చేయవచ్చా? అనే సందేహాలు కలిగాయి.

(ఈ టపా వ్రాసిన కొన్నాళ్ళకు ఈ విషయం చేర్చటం జరిగింది.) 



Friday, May 6, 2016

బెంగుళూరు పరిస్థితే అలాగయితే..


ఈ మధ్య ఒక వార్త వచ్చింది. పచ్చటి నగరమైన బెంగళూరులో పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలో మృత నగరం అయిపోతుందట.

 అంటే ప్రజలు నివసించటానికి వీలులేకుండా అయిపోతుందట. విచ్చలవిడిగా నగర జనాభా పెరగటం వల్ల అక్కడ చాలా కాలుష్యం పెరిగి ఉందంటున్నారు. 

పచ్చటి బెంగళూరు పరిస్థితే అలాగ ఉంటే ఇక మిగిలిన నగరాల సంగతి ఏమిటో ? 

 ఎంతో అభివృద్ధి జరిగిందంటున్న చైనాలో కూడా కాలుష్యం బాగా పెరిగిందట. 

మనవాళ్లు అక్కడకు వెళ్ళివచ్చి అబ్బో అక్కడి అభివృద్ధే అభివృద్ధి..  అని మెచ్చుకుంటారు. అక్కడ పెరిగిన కాలుష్యం గురించి పట్టించుకోరు.


ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో పెరిగిన కాలుష్యం వల్ల చాలామంది  ప్రజలకు రోగాలు బాగా పెరిగాయి. 

ఆరోగ్యమే మహా భాగ్యం. ఆరోగ్యం లేకపోయాక ఎన్ని వసతులు ఉన్నా ఏం లాభం.

 పట్టణీకరణ అంతా ఒక దగ్గరే కాకుండా వివిధ నగరాలలో అభివృద్ధి జరగాలి.

 పర్యావరణహితంగా అభివృద్ధి ఉండాలి. అప్పుడు కాలుష్యం పెరగకుండా ఉంటుంది.

ఊర్లు  మృతనగరాలు కాకుండా అమృతనగరాలు అవుతాయి.


Monday, May 2, 2016

నీటి గొడవల గురించి కొన్ని సంగతులు...మరియు..


కాకతీయులు ఎన్నో చెరువులను త్రవ్వించారంటారు .  

కాకతీయులు తెలంగాణకు మాత్రమే సంబంధించిన వారు కాదు. కాకతీయులు  తెలుగువారందరికీ  సంబంధించిన వారు.

 మున్నూరు సీమ (కృష్ణా జిల్లా) ..  చెందిన జాయప్ప సేనాని  కాకతీయ సామ్రాజ్యంలో ముఖ్యమైన వ్యక్తి. జాయపసేనాని సోదరి రుద్రమదేవికి తల్లి.


ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా కు  కూడా దాహార్తి తీరుస్తున్న ప్రాజ్రెక్ట్  నాగార్జునసాగర్ ప్రాజెక్ట్.

  నాగార్జునసాగర్ ప్రాజెక్ట్  నిర్మాణం  జరగటానికి  ఆంధ్రకు  చెందిన ముక్యాల రాజా వారి కృషి ఎంతో ఉంది. వారి చొరవ లేకపోతే లేకపోతే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వచ్చేదే కాదంటారు.


 తెలుగు వారు  బాగుపడాలని భావించి ఎన్నో కష్టాలుపడి నాగార్జునసాగర్ ఏర్పాటుకు కారకులు ఆంధ్ర వ్యక్తి. ఈ విషయాలను మర్చిపోకూడదు. 

  
ఈ రోజుల్లో డబ్బు కన్నా నీరే ముఖ్యం. డబ్బు ఇచ్చినా నీటిని  ఇచ్చే పరిస్థితి లేదు. 

అయితే, ఆంధ్రప్రదేశ్కు నీటి కొరత ఉన్నా కూడా  చెన్నై కు త్రాగునీటిని ఇవ్వటం జరిగింది.


ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను ఇవ్వటాన్ని తమిళనాడు వ్యతిరేకించటం అన్యాయం.

చిత్రమేమిటంటే, ఇవన్నీ ఎవరూ మాట్లాడటం లేదు.

...............

నదులు ప్రవహించే ప్రాంతాలు అన్నింటికి ఆ నీటిపై సమాన హక్కులు ఉంటాయి.

 నీరు దిగువ ప్రాంతాలకు రాకుండా ఎగువ రాష్ట్రాల వాళ్లే ఇబ్బడిముబ్బడిగా ఆనకట్టలు కట్టేసుకుని వాడేసుకుందామనుకుంటే అది అన్యాయం అవుతుంది.

 ట్రిబ్యునల్స్ ఉన్నాకూడా ఎగువ రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ ఆనకట్టలు ఎలా కట్టగలిగారో తెలియటం లేదు. 


 ఎవరి వాటాను వారు వాడుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు.  అయితే,  నీటిని న్యాయంగా వాటాలు వేయాలి. 


 ఎగువ రాష్ట్రాల వల్ల అన్యాయం జరుగుతుందని అనిపించినప్పుడు ...దిగువ రాష్ట్రాల వాళ్ళు తమకు న్యాయంగా రావాలసిన నీటి కోసం  న్యాయపోరాటం చేయక తప్పదు.


 నీరు దిగువకు పోకుండా ఆబగా ఆనకట్టలు కట్టేసుకున్న వాళ్ళు కూడా వర్షాలు పడకపోతే నీటికోసం  ఎన్నో కష్టాలు పడుతున్నారు కదా! 


ప్రకృతి సంపద  అందరితో  పంచుకోవాలి. అంతేకానీ అంతా మనకే చెందాలనుకుని అత్యాశకు పోకూడదు. 
........................

  సముద్రంలో నదుల నీరు కలవటాన్ని వృధాగా భావించకూడదు. నదులనీరు సముద్రంలో కలవటం ఎంతో అవసరం.

 వాననీరు కాలువలు, నదుల ద్వారా సముద్రంలో కలవటం..ఎండలకు ఆ నీటిఆవిరి వర్షంగా పడటం ప్రకృతి సహజమైన చర్య.

నదులనీరు సముద్రంలో కలవకుండా ఎక్కడికక్కడ అడ్దుకట్టలు కట్టేస్తే ... సముద్రపు నీటిలో లవణగాఢత హెచ్చితే...  వాతావరణంలో  ఏం మార్పులు జరుగుతాయో చెప్పలేం.

 మనం  ప్రకృతికి అనుగుణంగా ఉంటూ నీటిని పొదుపుగా వాడుకోవాలి. అవసరమైతే నీటి వాడకాన్ని తగ్గించుకోవాలి. 

  గృహావసరాల కోసం ఎక్కువ నీరు అవసరం ఉండదు. అయితే, ఆధునిక కాలంలో పరిశ్రమలకు ఎక్కువ నీరు అవసరమవుతోంది.


నీటిపొదుపు, వృక్షాలను బాగా పెంచటం, మేఘాలను అడ్డుకుని వర్షాలను కురిపించటం కొరకు కొండలను రక్షించుకోవటం.. వంటి చర్యలను తీసుకోవటం ఎంతో అవసరం.