koodali

Wednesday, October 31, 2018

ఇద్దరూ ముఖ్యమే. ...


జీవితంలో తల్లితండ్రులూ ముఖ్యమే...జీవితభాగస్వామీ ముఖ్యమే.

కొందరు తల్లితండ్రిని బాగా గౌరవించి, జీవితభాగస్వామిని చిన్నచూపు చూస్తారు.

కొందరు జీవితభాగస్వామిని బాగా గౌరవించి, తల్లితండ్రిని చిన్నచూపు చూస్తారు.

 రెండూ తప్పే.

తల్లితండ్రులూ  ముఖ్యమే.. జీవితభాగస్వామీ   ముఖ్యమే.
........................

తల్లి తనకు  జన్మించిన సంతానాన్ని ఎంతో ప్రేమిస్తుంది.

 ఎందరో భార్యలు కూడా తమ భర్తలను ఎంతగానో ప్రేమిస్తారు.

తల్లి స్థానం ఎంతో గొప్పది.... అలాగని భార్యను చిన్నచూపు చూడటం సరికాదు.

రక్తం పంచుకుని పుట్టపోయినా ఎందరో స్నేహితులు ప్రాణస్నేహితులుగా ఉంటారు.


భార్యాభర్త కూడా జీవితంలోని  కష్టసుఖాలలో ఒకరికొకరు తోడుగా చక్కటి స్నేహితుల్లా ఉండాలని పెద్దలు 
 అంటారు.
..................

తల్లి నవమాసాలు మోసి సంతానానికి జన్మనిస్తుంది.

భార్య నవమసాలు మోసి, భర్తకు చెందిన సంతానానికి జన్మనిస్తుంది.


తల్లి, భార్య ఇద్దరూ గొప్పవారే.


 కొన్ని కారణాలవల్ల కొందరు దంపతులకు సంతానం కలగకపోవచ్చు.  


సంతానం లేరని క్రుంగిపోకుండా దంపతులిద్దరూ జీవితంలోని కష్టసుఖాలలో ఒకరికొకరు తోడుగా ఉంటూ సంతోషంగా ఉండాలి. 

దైవపూజలు చేయటం, వైద్య సహాయం ద్వారా సంతానాన్ని పొందే ప్రయత్నాలు చేయవచ్చు. లేదంటే ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు.

..................

కొందరు భర్తలు బయట తమకు కలిగిన విసుగును ఇంటికొచ్చి భార్యపై చూపిస్తారు. ఇలా చేయటం సరైనది కాదు.

కొందరు మగవాళ్ళు .... తల్లితండ్రితోనూ, అన్నదమ్ములతోను, అక్కచెల్లెళ్ళతోను , ఇరుగుపొరుగుతోనూ, ఆఫీసువాళ్ళతోనూ, అందరితో బాగా మాట్లాడుతూ భార్యతో సరిగ్గా మట్లాడకుండా విసుగును ప్రదర్శిస్తారు.

కొందరు స్త్రీలు కూడా ....అందరితో బాగా మాట్లాడి భర్తతో సరిగ్గా మాట్లాడరు.

భర్యాభర్తలను అర్ధనారీశ్వరులని పెద్దలు తెలియజేసారు.

శివపార్వతుల అర్ధనారీశ్వరతత్వం మనకు తెలుసు. అర్ధనారీశ్వర తత్వాన్ని గమనిస్తే, భార్యాభర్త బంధం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. 

మరి జీవితంలో భార్యపాత్ర, భర్త పాత్ర కూడా ముఖ్యమే కదా!


 జీవితంలో ఒకరికొకరు తోడుగా జీవించటం కొరకు, సత్సంతానం కొరకు వివాహాన్ని ఏర్పాటుచేసారు.

భార్యాభర్త యొక్క బంధం సరిగ్గా లేనప్పుడు తల్లితండ్రిగా బాధ్యతలను కూడా సరిగ్గా నిర్వహించలేరు. అప్పుడు పిల్లలు బాధలుపడతారు.

కుటుంబవాతావరణం సరిగ్గా లేనప్పుడు ఆ ప్రభావం సమాజంపై పడుతుంది.

చక్కని కుటుంబవాతావరణం ఉన్న సమాజం బాగుంటుంది.
..................... 
విషయాల గురించి కొన్ని పాత టపాలను క్రింద ఇచ్చిన లింక్ వద్ద చూడగలరు.

Thursday, March 20, 2014


Wednesday, May 20, 2015



Monday, October 29, 2018

మట్టి లేకుండా కూడా నీటి ద్వారా మొక్కలు పెంచే విధానంలో ఎండ తగిలి నీరు వేడెక్కే ప్రమాదం..



Monday, September 17, 2018...  
మట్టి లేకుండా కూడా నీటి ద్వారా మొక్కలు పెంచటం మరియు...అనే టపాను వ్రాసాను. 

HOW TO GROW HYDROPONIC PLANTS |GROW PLANTS ON WATER

Self watering system for plants using waste plastic bottle 


పై  విషయాల  గురించి ఇప్పుడు కలిగిన కొత్త ఆలోచనలు ఏమిటంటే....

ప్లాస్టిక్ బాటిల్లో నీరు పోసి మొక్కలు పెంచినప్పుడు ఆ బాటిల్ ఎండలో ఉంటే ఎండకు నీరు వేడెక్కుతాయి.

తద్వారా మొక్కల వేర్లు వేడి నీటిలో ఉండటం వల్ల మొక్కలు చనిపోతాయి. 


 పైన మొక్క కొంత భాగం మట్టిలో  ఉన్నా కూడా, క్రింద వేర్లు వేడినీటిలో ఉన్నప్పుడు మొక్క వాడిపోతుంది.

 అందువల్ల ప్లాస్టిక్ బాటిల్లో నీరు పోసి  మొక్కలు పెంచే విధానంలో బాటిల్స్ ను ఎండలో ఉంచకూడదు.

 బాటిల్స్లో నీరు ఎండకు వేడెక్కకుండా బాటిల్స్ ను నీడలో మాత్రమే ఉంచాలి.


లేదా ఎండకు బాటిల్స్ లో నీరు వేడెక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


బాటిల్స్ లోని నీరు వేడెక్కకుండా బాటిల్స్ చుట్టూ క్లాత్  చుట్టాలి.

 ఈ బాధలన్నీ ఎవరు పడతారనుకుంటే ఎప్పట్లాగానే మట్టిలో మొక్కలు పెంచుకోవటం మంచిది.

పెద్ద ఎత్తున నీటిలో మొక్కలను పెంచే హైడ్రోపోనిక్ వ్యవసాయం చేసేవారు ఎక్కువగా  గ్రీన్ హౌస్ లలో మొక్కలను పెంచుతారు కాబట్టి , నీరు వేడెక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

Commercial Hydroponics Farm in India... 



Friday, October 26, 2018

మరి కొన్ని విషయాలు ఏమిటంటే..



తల్లితండ్రి తమకు పుట్టబోయే సంతానం అందంగా, ఆరోగ్యంగా, తెలివితేటలతో..ఉండాలని కోరుకుంటారు.

ఆయుర్వేద గ్రంధాల ద్వారా తెలిసిన విషయాలను పాటించి, కోరుకున్న విధంగా  విధంగా సంతానాన్ని పొందవచ్చట. 

నేను చదివిన కొన్ని విషయాలు ఏమిటంటే..

తల్లితండ్రి చక్కటి నైతిక విలువలను పాటించటం, సాత్వికాహారాన్ని తీసుకోవటం..వంటి విషయాలను పాటించితే చక్కటి సంతానాన్ని పొందవచ్చట. 

బాగా కారం ఉన్న పచ్చళ్ళు, నిల్వ ఆహారం వంటివి తగ్గించి...

తాజాపండ్లు, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, కూరగాయలు..వంటివి తీసుకుంటే తెల్లటి రంగుతో బిడ్దలు జన్మించే అవకాశాలు ఎక్కువట. 

అలాగని పుల్లటి పండ్ల రసాలు అధికంగా త్రాగకూడదు. 


పుల్లటి పండ్లు  కొన్నింటిని   తినాలి. లేదంటే, రసం తీసి  నీటితో కలిపి త్రాగాలి. ఏదైనా ఎంతవరకో అంతవరకూ తీసుకోవాలి..

***********
 ఎప్పుడో అప్పుడప్పుడు చిన్నాచితకా అనారోగ్యం తప్ప మాకు పెద్ద అనారోగ్యాలు లేవు  దైవం దయ వల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. 
****************

 పెరిగే వయస్సులో పిల్లలకు  మంచి ఆహారాన్ని అందిస్తే, వారసత్వంగా వచ్చే ఎత్తు కన్నా పొడుగు పెరిగే అవకాశాలున్నాయని పరిశోధనల ద్వారా తెలిసిందట. 

ఎదిగే వయస్సులో పిల్లలు సరైన ఆహారం తీసుకోకుంటే,  తల్లితండ్రి పొడుగువాళ్ళు అయినా కూడా  పిల్లలు పొడుగు పెరగకుండా పొట్టిగా ఉండే అవకాశం ఉందట. 
 ................

సమాజంలో అందం , డబ్బుకు చాలా గౌరవం లభిస్తోంది. 

ఉదా..సినిమారంగంలో అందంగా ఉన్న నటీనటులు ఏ కులం వారైనా,  వారిని ప్రజలు అభిమానిస్తున్నారు.

( అందంగా ఉండికూడా పైకి రాలేని కొందరున్నారు కానీ, అందుకు వేరే కారణాలుంటాయి.) 

ఇతరదేశాల తెల్లవాళ్ళను భారతీయులు బాగా గౌరవిస్తారు.

 ఇవన్నీ గమనిస్తే నేటి సమాజంలో డబ్బుకు, అందానికి చాలా విలువ ఉందని అర్ధమవుతోంది.
.............

తల్లితండ్రి యొక్క రూపురేఖలు ఎలా ఉన్నాసరే, కొన్ని నియమాలను పాటిస్తే వారికి అందమైన సంతానం  కలుగుతుందని ఆ  మధ్య కొన్ని వార్తలు వచ్చాయి.


ఆధునిక విజ్ఞానం ద్వారా కూడా  డిజైనర్ బేబీస్ పద్ధతి సాధ్యమేనని ఆ మధ్య శాస్త్రవేత్తలు  ప్రకటించారు .

  కోరుకున్న విధంగా సంతానం పొందే విధానం నిజమయితే ..చాలామంది దంపతులు ఆ పద్ధతులను పాటించటానికి ముందుకు వస్తారు.

అప్పుడు సమాజంలో ప్రజలు అందరూ చక్కగా ఉంటారు.. ఒకరిని చూసి ఒకరు అసూయ చెందనక్కరలేదు.

అందరూ బాగుంటే సమాజంలో ప్రజల మధ్య కొన్ని అసమానతలు తగ్గుతాయేమో..

అయితే, కొందరు ప్రజలు తమకు ఎన్ని భాగ్యాలు ఉన్నా కూడా.. ఇతరులను చూసి అసూయ పడుతుంటారు.

 అందంతో పాటు మంచి మనస్సు కూడా  ఉండటం ఎంతో ముఖ్యం. 

మంచి ఆలోచనలు ఉన్న సమాజంలో మనశ్శాంతి ఉంటుంది.
..........

Garbh Vigyan Sanskar project to Customise Delivery of Fair, Tall Babies | Daily Mirror | TV5 News
.................

  ఆరోగ్యం, మంచి తెలివితేటలు, నైతిక విలువలతో కూడిన చక్కటి  గొప్ప మనుషులతో ప్రపంచం కళకళలాడాలని ఆశిద్దాము.




Monday, October 22, 2018

కేదారక్షేత్రం కొన్ని విషయాలు..



ఓం .. 

శివపురాణం – వికీపీడియా..


బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచన భాష్యంగా..


కేదారక్షేత్రం వెళ్ళినవారు తెలియక ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. కేదార లింగమును తిన్నగా కంటితో చూడకూడదు. వలయమును పట్టుకు వెళ్ళాలి. వలయము అంటే చేతికి వేసుకునే కంకణం వంటి గుండ్రని వస్తువును తీసుకువెళ్ళాలి. అంతరాలయంలో ప్రవేశించగానే కంటిముందు ఆ వలయమును పెట్టుకుని అందులోంచి చూడాలి. కేదారము దర్శనము చేత మోక్షమీయగలిగిన క్షేత్రం గనుక సమస్త బ్రహ్మాండము నిండినవాడు వీడే అని తెలుసుకోవడానికి కంటికి అడ్డంగా ఒక వలయాకరమును పెట్టుకుని అందులోంచి కేదార లింగమును చూడాలి. అలా చూసిన వలయ కంకణమును అక్కడ వదిలిపెట్టి వచ్చెయ్యాలి. మన చేతికి వున్నా ఏ బంగారు కంకణమునో ఉపయోగించినట్లయితే దానిని అక్కడ వదిలిపెట్టేయడానికి మనసొప్పదు. కాబట్టి ముందే ఒక రాగి కంకణమును పట్టుకుని వెడితే రాగి చాలా ప్రశస్తము కనుక, ఆ కంకణములోంచి కేదార లింగమును దర్శనం చేసి దానిని అక్కడ వదిలిపెట్టి రావచ్చు. ఇకముందు వెళ్ళేవారు ఒక వలయంలోంచి కేదారలింగమును దర్శనం చేసే ప్రయత్నం చేస్తే మంచిది.



Friday, October 19, 2018

ఓం ..


ఓం ..                                           


సాయి సాయి.


శ్రీ రాజరాజేశ్వర స్వామికి  అనేక  నమస్కారములు,

 శ్రీ రాజరాజేశ్వరీ దేవికి  అనేక  నమస్కారములు.

                       శ్రీ  రాజరాజేశ్వర్యష్టకం.


  1.  అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణా ఉమాపార్వతీ

      కాళీహైమవతీ  శివా  త్రినయనీ  కాత్యాయనీ  భైరవీ
     సావిత్రీ  నవయౌవనా శుభకరీ  సామ్రాజ్యలక్ష్మీ ప్రదా
     చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ రాజరాజేశ్వరీ 

2.  అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసంధాయినీ

     వాణీ పల్లవపాణి  వేణుమురళీగాన  ప్రియాలోలినీ
    కళ్యాణీ  ఉడురాజబింబవదనా  ధూమ్రాక్ష సంహారిణీ
   చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ 

3. అంబానూపుర  రత్నకంకణధరీ  కేయూరహారావళీ

  జాజీచంపక  వైజయంతలహరీ  గ్రైవేయ వైరాజితాం
  వీణావేణు  వినోదమండితకరా  వీరాసనా  సంస్థితా
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ 

4. అంబా రౌద్రిణి భద్రకాళి  బగళా జ్వాలాముఖీ  వైష్ణవీ

  బ్రహ్మాణీ  త్రిపురాంతకీ  సురనుతా  దేదీప్యమానోజ్వలా
  చాముండా  శ్రితరక్ష  పోషజననీ  దాక్షాయణీ  పల్లవీ
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీరాజరాజేశ్వరీ 

5. అంబా  శూలధనుః  కుశాంకుశధరీ  అర్ధేందు  బింబాధరీ

  వారాహీ  మధుకైటభప్రశమనీ  వాణీరమా సేవితా
  మల్లాద్యాసుర  మూకదైత్యదమనీ  మాహేశ్వరీ  అంబికా
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ రాజరాజేశ్వరీ 

6. అంబా  సృష్టి వినాశ పాలనకరీ  ఆర్యా  విసంశోభితా

    గాయత్రీ  ప్రణవాక్షరామృతరసః  పూర్ణానుసంధీకృతా
   ఓంకారీ  వినుతా  సురార్చితపదా  ఉద్దండ  దైత్యాపహా
   చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ

7. అంబా శాశ్వత  ఆగమాది  వినుతా ఆర్యామహాదేవతా

  యా  బ్రహ్మాది  పిపీలికాంత జననీ  యావై  జగన్మోహినీ
  యా  పంచప్రణవాది రేఫజననీ  యా  చిత్కళామాలినీ
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ  

8. అంబాపాలిత  భక్తరాజి రనిశం   అంబాష్టకం  యః పఠేత్

   అంబాలోక  కటాక్షవీక్ష  లలితా  ఐశ్వర్యమవ్యాహతా
   అంబాపావన మంత్ర రాజపఠనా ద్యంతేన  మోక్షప్రదా
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీరాజరాజేశ్వరీ

    ఫలం : ఆధ్యాత్మిక  జ్ఞానప్రాప్తి, సర్వవాంఛా  సిద్ధి.
..........................................

ఏమైనా  అచ్చుతప్పుల  వంటివి  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.



Thursday, October 18, 2018

ఆది పరాశక్తి కధలు .. మూడవ భాగం ..



 మహిషాసుర మర్దిని అమ్మవారు ...............


ఒకప్పుడు మహిషాసురుడు రాక్షసులకు చక్రవర్తి అయ్యాడు. అతడు దేవేంద్రుని జయించి స్వర్గాధిపత్యాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. దిక్పాలకులు, దేవతలు అందరూ అతని ఆజ్ఞకు వశులయ్యారు.


మహిషాసురుడు చేసే అన్యాయములు భరించలేక , దేవతలందరూ బ్రహ్మదేవునితో కలిసి శివకేశవులను దర్శించుకొని తమ బాధలు చెప్పుకొన్నారు. మహిషాసురుని దుర్మార్గాలు వివరించారు.


ఆ తరువాత వారందరి అంశాలతో ఒక మహాశక్తి ఆవిర్భవించింది. ఆ మహాశక్తి సర్వాలంకారములతో, సమస్త దివ్యాయుధములతో సాక్షాత్కరించింది. ఒక్కసారి మహాభయంకరముగా వికటాట్టహాసం చేసింది. ఆ తల్లిని దివ్యులంతా స్తుతించారు.


రాక్షసులకు ఆ భయంకరారావం గుండెల్ని బ్రద్దలు చేసేదిగా అనిపించింది. రాక్షసులు ఆయుధాలు ధరించి మహిషుని వెంట యుధ్ధానికి బయలుదేరారు. జగన్మాతను చూశాడు మహిషాసురుడు. ఇరుపక్షాలకు పోరు ప్రారంభమయింది.


చిక్షురుడు- తామ్రుడు- బిడాలుడు- అసిలోముడు మొదలైన రాక్షసులు నూతన వ్యూహ రచనలతో యుధ్ధం ప్రారంభించారు. ఎందరో రాక్షస వీరులు హతులయ్యారు.

జగన్మాత సింహవాహనాన్ని అధిరోహించింది. సింహగర్జనలతో, రాక్షసవీరుల అరుపులతో, రణరంగం భయంకరంగా ఉంది. సింహం రక్కసుల రక్తం త్రాగుతూ జూలు విదిలిస్తోంది. రాక్షసులు ప్రాణభీతితో అరుస్తూ ఉంటే, దేవతలు దేవి మీద పూలవాన కురిపిస్తున్నారు.

ఎందరో రాక్షసులు దేవి చేతిలో హతులయ్యారు.

ఈ దృశ్యం చూసి మండిపడ్డాడు మహిషాసురుడు. మహిష (దున్నపోతు ) రూపం ధరించాడు. కాలిగిట్టలతో నేల తట్టాడు. కొమ్ములతో పర్వతాలను బంతుల మాదిరిగా ఎగురగొట్టాడు. వాడి భయంకర రూపానికి ప్రకృతి కంపించింది.


మహిషుణ్ణి పాశంతో బంధించింది శ్రీదేవి. వాడు వెంటనే మహిష రూపం విడిచి రాక్షసాకారం  ధరించాడు. భయంకరారావం గావించాడు. అంతలో దేవి ఒక్కసారిగా మహిషుడిని   క్రింద పడవేసి పాదంతో త్రొక్కి పెట్టి ,శూలంతో గుండెల్లో పొడిచి సంహరించింది.


మహిషాసురుని సంహారాన్ని కళ్ళారా చూసిన మిగిలిన రాక్షస సైన్యం హాహాకారాలు చేస్తూ పాతాళానికి పారిపోయారు. దేవతలు ఆనందించి మహాదేవిని స్తుతించారు.



అంబా! నీ శక్తితో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమతమ విధుల్ని నిర్వహించగలుగుతున్నారు. నువ్వు కీర్తివి, మతివి, స్మృతివి, గతివి, ధృతివి, కరుణవు, భయవు, శ్రధ్ధవు, వసుధవు, నువ్వే. .కమల, విజయ, గిరిజ, రమ, ఉమ, జయ మొదలైన నామాలతో కీర్తికెక్కిన దానివి నువ్వే. నువ్వు తుష్టివి, పుష్టివి, బుధ్ధివి, విద్యా, క్షమా, కాంతి, మేధలు నువ్వే. నీ ధారణా శక్తి వలన నాగకూర్మాలు భూమిని మోస్తున్నాయి. నీ స్వాహా శక్తి వలన యజ్ఞ హవిస్సులు దేవతలకు లభిస్తున్నాయి. 


తల్లీ ! నువ్వు అందరికీ భోగభాగ్యాలు ప్రసాదిస్తావు. వాగ్దేవతవై విద్యను అనుగ్రహిస్తావు. జనుల ఆర్తిని తొలగిస్తావు. నిన్ను నిరంతరం ధ్యానించేవారికి గర్భశోక రహితమైన మోక్షఫలాన్ని అందిస్తావు.



మాతా ! ఈ భువన చక్రాన్ని కారుణ్యవీక్షణంతో నడిపించే నీ నిజతత్వం వేదాలకే అర్ధం కాదు. మరి అన్యులకెలా బోధపడుతుంది .


మాతా ! మహోగ్రుడూ, భువన కంటకుడూ అయిన మహిషాసురుణ్ణి సంహరించి మమ్మల్ని అనుగ్రహించావు. మేము ధన్యులం. సర్వశరణ్యాలైన నీ పదపంకజాల మీద మాకు అచంచలమైన భక్తిని ప్రసాదించు. ఈ శరీరం (వృక్షం ) రెండు పక్షులకు ( జీవాత్మ, పరమాత్మ )ఆశ్రయం. వాటి సఖ్యం అవి భాజ్యం. వాటిమధ్య మూడోదానికి స్థానం లేదు. అటువంటప్పుడు జీవుడు నిన్ను ఎలా విడిచిపెడతాడు ? అలాగే మేము నిన్నెప్పుడూ సేవిస్తూనే ఉంటాము. మమ్మల్ని కరుణించి రక్షించు తల్లీ !


దేవతలు చేసిన స్తుతికి దేవి సంతోషించి మృదుమధుర వాక్కులతో- "దుస్సాధ్యమూ దుర్ఘటమూ అయిన కార్యం ఎప్పుడైనా సంభవించినప్పుడు నన్ను స్మరించండి. మీ ఆపదల్ని వెంటనే హరిస్తాను. " అని అభయమిచ్చి దేవి అంతర్ధానమయ్యింది.


Sunday, October 14, 2018

ఆదిపరాశక్తి కధలు.. రెండవ భాగము..



ఒకప్పుడు మహాశక్తి యొక్క సరస్వతీ శక్తి శుంభనిశుంభాది రాక్షసుల్ని సంహరించింది. 


ఒకానొక సమయంలో శుంభుడు, నిశుంభుడు అనే పేర్లు గల రాక్షసులు ,వరబలగర్వాలతో దేవతల్ని అమరావతి నుండి తరిమివేశారు.



శుంభ,నిశుంభుల వల్ల ఎన్నో బాధలు పడ్డ దేవతలు .... ఏదైనా ఉపాయం చెప్పమని దేవగురువు వద్దకు వెళ్ళి అడిగినప్పుడు, ఆయన చెప్పిన సలహా ప్రకారం , మీకేమయినా ఆపదలు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని ... మహిష వధానంతరం దేవి ఇచ్చిన అభయప్రదానమును గుర్తు తెచ్చుకుని , అందరూ కలిసి హిమాలయానికి వెళ్ళి దేవీద్యాన పరాయణులై, మాయాబీజ జపమగ్నులై పరమేశ్వరిని ప్రార్ధించారు.



దేవతల దీనాలాపాల్ని విని .. . . జగన్మాత ' కౌశికి ' అనే పేరుతో ఆవిర్భవించి మహాకాళి అనే నామంతో వారి కష్టాలు తీరుస్తానని పలికింది.



హిమాలయ ప్రాంతములో ఉన్న మహాకాళిని, శుంభనిశుంభుల సేవకులయిన చండముండాసురులు చూశారు. ఆ విషయాన్ని , ఆమె రూపలావణ్యాలను తమ ప్రభువులకు విన్నవించారు. ఆమె సౌందర్యాతిశయాన్ని గురించి విన్న శుంభుడు , సుగ్రీవుడనే రాక్షసుణ్ని దేవి దగ్గరకు రాయబారిగా పంపాడు.



సుగ్రీవుడు జగన్మాతను సమీపించి , శుంభనిశుంభుల గొప్పదనాన్ని ప్రశంసించి వారిలో ఎవరినో ఒకరిని వరించమన్నాడు. 


అతని మాటలు విని ఆ తల్లి చిరునవ్వు నవ్వి , "నీ పలుకులు యధార్ధం. నన్ను జయించిన వాణ్ని గాని, నాతో సరిసమానమయిన పరాక్రమశాలిని గాని నేను వివాహం చేసికొంటాను. ఇది నా నియమం. నీవు పోయి ఈ విషయాన్ని మీ ప్రభువులకు చెప్పు." అన్నది.



ఆ మాటలకు కోపించిన సుగ్రీవుడు, ఆమెతో ఏవేవో ప్రగల్భాలు పలికి, శుంభునకు విషయాన్ని వివరించాడు. శుంభనిశుంభులు రణమునకు బయలుదేరి వచ్చారు. ఉభయపక్షాలు పోరు ఘోరంగా చేస్తున్నాయి. వీరుల పదఘట్టనలతో భూమి దద్దరిల్లుతోంది. దేవతలు ఆసక్తిగా చూస్తున్నారు. సృష్టికి ప్రళయం సంభవిస్తుందేమోనన్న అనుమానం బయల్దేరింది  కొంతమంది విద్యాధరులకు.




జగన్మాత; సదాశివుని, శుంభనిశుంభుల దగ్గరకు రాయబారం పంపింది. రాయబారం విఫలమైంది. యుధ్ధం ప్రారంభమైంది. రాక్షససంహారం ముమ్మరంగా సాగుతోంది. పిశాచాలు రణరంగంలో ఆనందనాట్యం చేస్తున్నాయి. భూత- ప్రేత- పిశాచ- బ్రహ్మరాక్షస- శాకినీ- డాకినీ- హాకినీ గణాలు స్వైరవిహారం చేస్తున్నాయి. తెగిన తలలు, భుజాలు, అవయవాలు, ఎముకలగుట్టలతో   రణరంగం మహా భయంకరంగా ఉంది.



ఇంతలో వచ్చాడు రక్తబీజాసురుడు. వాడి శరీరంలో నుండి నేలమీద రాలే ఒక్కొక్క రక్తపు బొట్టుకి ఒక్కొక్క రక్తబీజుడు ఉధ్భవిస్తాడు. ఆ ఇంద్రాణీ శక్తి తన వజ్రాయుధంతో రక్తబీజుడ్ని కొట్టింది. వాడు గాయపడ్డాడు. రక్తం చిందింది. అనేకులు రక్తబీజులు పుట్టుకొచ్చారు. ఇది వాడు సాధించిన అపూర్వశక్తి. వాణ్ణి జయించటం కష్టం.



ఆ దృశ్యం చూసింది సరస్వతీదేవి. మహాకాళితో ఈ విధంగా అన్నది.


కాళీ! వీడి శరీరంలో రక్తం ఉన్నంతవరకు చావడు. కనుక, వీని శరీరం నుండి నేల మీద పడే రక్తాన్ని నేలమీదపడకుండానే త్రాగెయ్యి. నీకు చండిక సహకారంగా ఉంటుంది." మహాదేవి మళ్ళీ రక్తబీజుడ్ని గాయపరిచింది. రక్తం నేలమీద పడకుండానే మహాకాళి పీల్చివేసింది. రక్తరహితుడయ్యాడు ఆ రాక్షసుడు. వెంటనే వాని శిరస్సు ఖండించి అతని కపాలాన్ని తన కపాలమాలలో చేర్చుకొన్నది కాళిక .



రక్తబీజ సంహారం గాంచిన శుంభనిశుంభులు కాలాగ్నిరుద్రులై వచ్చారు. మళ్ళీ భయంకర యుధ్ధం. సరస్వతీదేవి సింహంలా గర్జించింది. నారిసారించి ధనుష్టంకారం చేసింది. ఆ ధ్వనికి బ్రహ్మదేవుని చెవులు గింగురుమన్నాయి. మృత్యుదేవత నృత్యం చేస్తూ దైత్యగణాల్ని అత్యుత్సాహంతో ఆరగిస్తున్నది.



నిశుంభాసురుడు జగదాంబను గుర్తించాడు. అసురీ మాయతో వేరొక ఆకారాన్ని పొందాడు. ఆ విధంగా కొంతసేపు పోరాడినాడు. జగదంబ భయంకరాకారాన్ని ధరించి నిశుంభుని మీదికురికింది. సింహనాదం చేస్తూ నిశుంభుని శిరసు ఖండించింది. దేవతలు ఆనందించారు. దుష్టరాక్షస గణాలు దుఃఖించాయి.


నిశుంభుడు చనిపోయాడు. శుంభుడు , దుర్గాదేవికి , నన్ను శరణు వేడుకో ! అని సలహా ఇచ్చాడు.


 అపుడు అంబ , నీవు పూర్వజన్మలో చేసికొన్న పుణ్యలేశం వల్ల నన్ను గాంచగలిగావు. నాతో సంభాషించగలిగావు. నేనెవరినో, నా రూపమేమిటో, నా  నామమేమిటో తెలియక వేదాలు ఘోషిస్తున్నాయి." అని అన్నది.



శుంభునికి జగన్మాత దర్శనమైనది. ఆమె తత్వం అవగతమయ్యింది. ఆమె చేతిలో చనిపోయి జన్మ ధన్యం గావించుకోవాలనుకొన్నాడు. ఆయుధాలు ధరించాడు. రధమారోహించాడు. పోరు ప్రారంభించాడు. వీరి పోరాటాన్ని గగనతలాన నిలిచి యక్ష కిన్నర కింపురుష గరుడోరగ సిధ్ధసాధ్య విద్యాధరాధి దేవతాగణాలు , మహర్షులు చూశారు. ఆ యుధ్ధంలో దేవి వాడిని సంహరించింది.



దేవతలు, దిక్పాలకులు, మహర్షులు మహాశక్తిని స్తుతించారు.


రాక్షస సంహారం జరిగింది. అంటే అజ్ఞానం తొలగిపోయింది. విజ్ఞాన కాంతులు దశదిశల వ్యాపించాయి.


 విజ్ఞానం సరస్వతి. కనుకనే మానవ హృదయాలలో గూడుకట్టుకొన్న దురభిమానం, అహంకారం, మమకారం, ఆత్మీయత, స్వార్ధం, ద్రోహం మొదలయిన దుష్ట రాక్షసశక్తులు నశించిపోవాలని, శాశ్వతమైనది, పారలౌకికమైనది, నిరంతరానందసంధాయకమైనది పరమేశ్వరీ కృపాకటాక్షమని గ్రహించడం కోసం సరస్వతీ పూజ చేస్తారని పెద్దలు చెబుతున్నారు.




Thursday, October 11, 2018

ఆదిపరాశక్తి కధలు...



ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రం మీద ఆదిశేషునిపై పవళించి యోగనిద్రలో ఉన్నారు. 

 అప్పుడు విష్ణుమూర్తి చెవులలోని గులివి నుండి మధువు, కైటభుడు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు. వారిద్దరూ మహా బలవంతులు.

వారు శక్తిస్వరూపిణి అయిన పరాశక్తిని గురించి తపస్సు చేసి స్వేచ్చామరణమును వరముగా కోరుకొన్నారు.

 ఆ వరగర్వముతో రాక్షసులిద్దరూ బ్రహ్మ మీద దాడి చేశారు. బ్రహ్మదేవుడు విష్ణువు శరణుజొచ్చారు.

మధుకైటభులు విష్ణుదేవుని తమతో యుధ్ధము చేసి గెలవమన్నారు. వారు ఒకరితర్వాత ఒకరు అలసట తీర్చుకుంటూ విష్ణుమూర్తితో యుధ్ధము చేశారు.

విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేకపోయింది.

అప్పుడు మధుకైటభులు , "నీవు పరాక్రమశాలివే, అలసిపోయినట్లున్నావు. దాసోహమన్నచో నిన్ను విడిచిపెడతాం. కాదంటే నిన్ను సంహరించి తర్వాత ఈ బ్రహ్మదేవుని పని పడతాం " అన్నారు.

 అప్పుడు విష్ణువు, నేను అలసిపోయాను. కొంత విశ్రాంతి తీసికొన్న పిమ్మట మళ్ళీ మీతో యుధ్ధం చేస్తాను " అన్నారు.

మళ్ళీ యుధ్ధం ప్రారంభమయ్యింది. విష్ణువు యోగమాయను నుతించాడు. యోగమాయ విష్ణువును అనుగ్రహించటం జరిగింది.

యుధ్ధసమయములో యోగమాయ గగనతలంలో రాక్షసులకు దర్శనమిచ్చి వారివైపు తన మాయా దృష్టిని ప్రసరించటం జరిగింది.

ఆ చూపులకు మధుకైటభులు   తమనుతాము   మరచిపోయారు.

ఆ సమయములో విష్ణువు , "గతములో నేను ఎంతోమంది రాక్షసులను వధించాను. నాతో ఇంతకాలం యుధ్ధం చేసినవారు మీరు తప్ప మరొకరు లేరు. కనుక ఏదైనా వరము కోరుకొనుడు ఇస్తాను " అన్నారు.

పరవశులై, మదోన్మత్తులై యున్న ఆ దానవులు, "మేము యాచకులము కాదు. నీవే కోరుకో వరం, ఇస్తాము." అన్నారు.

అపుడు  శ్రీ మహావిష్ణువు, మీరిద్దరూ నా చేతిలో మరణించాలి: అన్నారు.

 వారు ఆశ్చర్యపోయారు. తెలివిగా మోసగింపబడ్డామని గ్రహించారు. లోకమంతా జలమయంగా ఉండడం చూసి , మమ్మల్ని నిర్జలప్రదేశంలో సంహరించు అన్నారు.

విష్ణువు రాక్షసుల్ని తన తొడలమీద నొక్కిపెట్టి సుదర్శన చక్రంతో వారి తలలు నరికారు. ఆ తలలనుండి మేధస్సు {మెదడు} బయటకు వచ్చి నీటి మీద తేలింది. మధుకైటభులిద్దరూ మరణించారు.

మేధస్సు ఆవరించిన జలభాగం మేదిని {భూమి } అయింది. అందుచేతనే మట్టి తినకూడదంటారు.



Friday, October 5, 2018

.....సంబంధాలు ఉంటే తప్పేమిటి ?



 కొందరు స్త్రీలుపురుషులు ఏమంటున్నారంటే , 

వివాహేతర సంబంధాలు ఉంటే తప్పేమిటి ? అంటున్నారు.

ఇలా మాట్లాడే వాళ్ళు..  తమ భార్యలుభర్తలుకోడళ్ళు..  వివాహేతర సంబంధాలను ఏర్పరుచుకుంటే సమర్ధించి ప్రోత్సహిస్తారా?

***********

 వివాహేతర సంబంధాలు తప్పుకాదంటే ఇక వివాహ వ్యవస్థ ఎందుకు ?

స్త్రీ పురుషుల పరస్పర అంగీకారంతో కూడిన వివాహేతర సంబంధాలు తప్పుకాదనటం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.

ఇప్పటికే చాలామంది భార్యలు తమ భర్తల వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో  కష్టాలు పడుతున్నారు...

..ఇప్పుడిక ఇలాంటి భార్యల  కష్టాలు మరింత పెరిగే అవకాశముంది.


 స్త్రీ లైనాపురుషులైనా  తమ జీవితభాగస్వామికి  వివాహేతర సంబంధాలుంటే భరించలేరు.

ఇలాంటప్పుడు కుటుంబాల్లో గొడవలు జరుగుతాయికొన్నిసార్లు హత్యలుఆత్మహత్యలు కూడా జరుగుతాయి


 వివాహేతర సంబంధాల వల్ల కుటుంబ సంబంధాలు విచ్చిన్నం అవుతాయి.

***********
స్త్రీలకు అన్యాయం జరగకూడదు

అదే సమయంలో పురుషులకూ అన్యాయం జరగకూడదు.

 స్త్రీలకుపురుషులకు ఎవరి ప్రత్యేకత వారికుంది.
 వారు ఒకే విధంగా ఎలా అవుతారు?

 స్త్రీలు గర్భం ధరించి సంతానం పొందగలరు

తమకు కలిగిన సంతానం తన సంతానమే..అని నమ్మకంగా చెప్పగలరు.

పురుషులు గర్బం ధరించి సంతానం పొందలేరు కదా!

 స్త్రీలు వివాహేతరసంబంధాలు కలిగి ఉంటేసంతానం విషయంలో పురుషుని హక్కు సంగతేమిటి?

పెద్దవాళ్ళకు కూడా తమ వారసులు తరతరాలుగా  వృద్ధిలోకి రావాలని ఆశలు ఉంటాయి కదా!

సంతానం విషయమే కాకుండాభార్యకు భర్తకు...తమ కుటుంబం అనే ఒక భద్రతభరోసా ఉండాలి.

***********
వివాహేతర సంబంధాలు విషయంలో ..
ఎవరి బెదిరింపుల వల్లనైనా అలాంటి కార్యకలాపాలలో పాల్గొనవలసి వచ్చిందా

లేక ఇష్టపూర్వకంగా పాల్గొన్నారాఅనే విషయాలు పరిశీలించి, 

 స్త్రీ లైనా, పురుషులైనా..  తమ జీవితభాగస్వామి వివాహేతర సంబంధం ద్వారా మోసం చేస్తేఅందుకు సంబంధించిన వారిపై కేసు వేసే హక్కు ఉండాలి.

************

సమాజంలో స్త్రీలకు సమానత్వం లేదని వాపోవటం కన్నా...

.స్త్రీలుపురుషులు సమానమే అని చెబుతూ తల్లులు పిల్లల్ని పెంచితే స్త్రీలకుపురుషులకు సమానంగా గౌరవం ఉంటుంది.


అయితే,కొందరు స్త్రీలే సాటి స్త్రీల కష్టాలకు కారణం అవుతున్నారు. 
   
ఉదా..భార్యను గౌరవంగాప్రేమగా చూసుకోవాలని కొడుకులకు చెప్పే అత్తగార్లు  ఎందరుంటారు?


కొడుకు పెళ్లయి కోడలు వచ్చిన తరువాత  కోడలుకు వ్యతిరేకంగా మాట్లాడే  అత్తలు ఎందరో ఉన్నారు.

 మగవాళ్లు స్త్రీలకు శత్రువులన్నట్లు కొందరు మాట్లాడుతున్నారు

అయితే..తండ్రిఅన్నదమ్ములు,భర్త, కొడుకులు..స్త్రీలకు శత్రువులా?

స్త్రీలందరూ మంచివారు..పురుషులందరూ చెడ్డవాళ్లు అని  అనుకోనక్కరలేదు.

ఎంతసేపూ,  స్త్రీలపట్ల పురుషాధిపత్యం నశించాలని అంటారు కానీ, స్త్రీల పట్ల సాటి స్త్రీల ఆధిపత్య ధోరణి నశించనక్కరలేదా?

*********************

  రోజుల్లో ఎన్నో కుటుంబాల్లో గొడవలువిడాకులు  జరుగుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో  పిల్లలు మానసికంగా ఎంతో నలిగిపోతారు.

అందువల్ల ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి.