koodali

Wednesday, August 30, 2017

Friday, August 25, 2017

ఓం....

  
వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలండి.

 వినాయకచవితి పూజలో ఉపయోగించే పత్రి ఎన్నో ఔషధవిలువలు గలిగిన పత్రి. 

ఇప్పుడంటే  పత్రిని  బజారులో  కొంటున్నారు  గానీ, ఇంతకుముందు రోజుల్లో అయితే ఈ పత్రిని  సేకరించటంలో  పెద్దవాళ్ళతో  పాటు పిల్లలు  కూడా పాల్గొనేవారట. 

అందువల్ల  పిల్లలకు  రకరకాల  మొక్కల  గురించిన వివరాలు, వాటికి గల ఔషధగుణాలు తెలిసేవి . 

  పూజ  తరువాత  , పూజలో  వాడిన  పత్రిని  కూడా  నీటిలో  కలుపటం  ద్వారా  పత్రిలోని  ఔషధ  గుణాలు  నీటిలో  కలిసి  నీరు  బాగుంటుంది.

మట్టితో  తయారుచేసిన   విగ్రహాల   వల్ల     కలిగే  మంచి  గురించి   ఎందరో  ప్రచారం  చేస్తున్నారు.

  అందువల్ల  ప్రజలలోనూ  క్రమంగా   చక్కటి  చైతన్యం  పెరుగుతోంది.  

  పర్యావరణానికి  హానిని    కలిగించని   విగ్రహాలను  వాడటానికి  ముందుకొచ్చే  ప్రజల  సంఖ్య  పెరగటం   మంచి  పరిణామం.

Friday, August 18, 2017

త్యాగం వాటిది. ఫలితం మాత్రం మనకు మాత్రమేనా......ఇదెక్కడి అన్యాయం ?


 
ఈ సృష్టిలో మానవులమైన మనము మాత్రమే గొప్పవాళ్ళము అనుకుంటుంటాము. కానీ అల్పజీవులు అనబడే మొక్కలు, ఫలవృక్షములు, జంతుజాలము , ఇతరజీవులు మానవ మనుగడకోసం ఎన్నో త్యాగములు చేస్తున్నాయి.


మనము కోరికలతో ఎన్నో పూజలు చేసి వాటి ఫలితములను మాత్రము మనకు మాత్రమే దక్కాలని కోరుకుంటూ ఉంటాము. కానీ ఆలోచిస్తే పూజలో మనము వాడే ఎన్నో పదార్దములు ఇతర జీవుల నుంచి మనము పొందేవే.


ఉదా............పుష్పములు మొక్కల నుంచి పొందుతాము. మొక్కలు పెరిగేటప్పుడు వాటి కొమ్మలను తుంపటం, కత్తిరించటం ఇలా ఎన్నో బాధలకు గురవుతాయి.


మరి ప్రసాదముగా .......... పాయసం, ఇతరపిండివంటలు తయారుచెయ్యటానికి వాడే పాలు ........ ఆవుల ద్వారా వస్తాయి కదా.............. ఈ రోజుల్లో ఆ పాలను వాటి దూడలను కూడా సరిగ్గా త్రాగనివ్వకుండా పిండేస్తున్నారు .


పండ్లు, బియ్యపుపిండి, గోధుమలు, బెల్లము , ఇవన్నీ మొక్కలు, చెట్లనుంచి మనము పొందేవే. ఇలా దేవునికి ప్రసాదముగా మనము సమర్పించే పదార్దములు ఇతరజీవుల నుంచి మనము పొందుతూ పూజా ఫలము మాత్రము ......... మనకు మాత్రమే దక్కాలని కోరుకోవటం ఏమి న్యాయం ? 

మనము మనదిగా భగవంతునికి ఏమి ఇస్తున్నాము ?


మనము కూడా సత్ప్రవర్తనతో జీవితాన్ని గడిపిభగవంతునిఆనందపరచవచ్చుఇంకా ప్రేమతోకూడిన భక్తిని వారికిసమర్పించవచ్చు.


మనము స్వచ్చమైన భక్తిని కూడా భగవంతుని యెడల ప్రదర్శించలేకపోతున్నాము. త్యాగం ఇతర జీవులది. ఫలితం మాత్రం మనకు మాత్రమేనా......ఇదెక్కడి అన్యాయం ?


అందుకే పెద్దలు పూజాఫలమును పరమాత్మకే సమర్పించమని చెబుతుంటారు.


ఆ పరమాత్మకు మాత్రమే తెలుసు ఏది ఎలా చెయ్యాలో ! ఎవరికి ఏది , ఎంత ఇవ్వాలో !


ఈ విశ్వ మనుగడకు ఇతర జీవులు ఎన్నో త్యాగాలు చేస్తున్నాయి. మరి జీవులలో ఉత్తములు అనబడే మనం భగవంతునికి ప్రేమ భక్తితో పూజ కూడా చెయ్యలేకపోతున్నాము.

ఇంకా, మనం బ్రతకటం అంతా....... మన గొప్పే, మన తెలివివల్లనే అని విర్రవీగుతుంటాము.


ఆలోచిస్తే ప్రాణవాయువు అందకపోతే........... గట్టిగా కొంతసేపు కూడా ఉండలేని అల్పజీవులమైన మనం పుట్టినప్పటినుంచి మనకు ప్రాణవాయువును, నీటిని ,ఆహారాన్ని ఇంకా అనేకమైన వాటిని ఏర్పరిచిన పరమాత్మ పట్ల ఎంత కృతజ్ఞతగా ఉండాలి.


అలా లేకపోగా ......... మన బ్రతుకుకు తోడ్పడుతున్న ఇతరజీవులను మన భౌతికమైన సుఖములకోసం నిర్దాక్షిణ్యముగా వాడుకుంటూ, మానవులు ఎంతో గొప్పవాళ్ళు ........ ఇతరజీవులు అల్పమైనవి అంటుంటారు.


ఇంకా, ఎన్నో అవసరముల కోసం ఇతర జీవుల దయపై ఆధారపడి బ్రతుకుతూన్న మనం , భౌతిక సుఖములకు అతిగా అలవాటుపడి ...................... కన్నూమిన్నూగానక ఇతర జీవులను సర్వనాశనం చేస్తున్నాము.

అవి అల్పజీవులు కాదు. మనిషే........... అల్పబుద్దిగలవానిగా తయారవటం నేటి దౌర్భాగ్యం. . 
......

(Friday, November 12, 2010)



Monday, August 14, 2017

శ్రీ కృష్ణాష్టమి మరియు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా....

 శ్రీ కృష్ణాష్టమి మరియు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలండి.

అప్పుడు సముద్రంలో మునిగిన ద్వారకా నగరపు ఆనవాళ్ళను ఈ మధ్య కాలంలో సముద్రంలో గుర్తించామని అంటున్నారు.

ఆ విశేషాలను తెలుసుకోవాలంటే ఈ లింక్ వద్ద చూడగలరు.

ఈ విషయాలను తెలియజేసిన వారికి ధన్యవాదములండి.


Sri Krishna Lost City of Dwarka found

 Under Sea ll justwowtv





Friday, August 11, 2017

దైవం మెచ్చే విధంగా జీవించటం...

  
ఈ రోజుల్లో చాలామంది ప్రజలు పూజలు ఎక్కువగా చేస్తున్నారు. 

పూజలు చేయటం ఎంతో సంతోషించవలసిన విషయం.

 అలాగే దైవం మెచ్చే విధంగా జీవించటం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది.

  దైవాన్ని పూజించేవారు చెడ్డ పనులు చేయకుండా ఆదర్శంగా జీవించటానికి ప్రయత్నించాలి.

 జీవితంలో నైతికవిలువలను పాటిస్తే సమాజంలో సమస్యలు తగ్గుతాయి. 

జీవితంలో ఎవరి ధర్మాన్ని వారు పాటించాలి.

 ఇప్పుడు సమాజంలో  ఆధిపత్య ధోరణి, అత్యాశ, సంపాదన యావ..వంటివి ఎక్కువయ్యాయి.

తృప్తి, పొదుపు.. అనే విషయాలను అంతగా పట్టించుకోవటం లేదు.

అవినీతి, లంచగొండితనం.. ఎక్కువయ్యాయి..

వందలు, వేలకోట్లు సంపద పోగేస్తూ , డబ్బు సంపాదన కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

 ఆహారంలోనూ కల్తీ చేస్తున్నారు. భూములను కబ్జా చేస్తున్నారు.

మత్తుపదార్ధాలను అమ్ముతున్నారు. 

ఇంకా ఎన్నో విధాలుగా డబ్బు సంపాదనా మార్గాలను ఎంచుకుంటున్నారు.

 ఎటు చూసినా డబ్బు యావ.

 సంపద అంటే డబ్బు మాత్రమే కాదు. తృప్తిగా, ఆరోగ్యంగా, సంతోషంగా.. జీవించటం కూడా సంపదే.

 అసూయాద్వేషాలు, ఆధిపత్య ధోరణి, అహంకారం..వంటివి ఉన్నవారు ఎంత సంపద ఉన్నా సంతోషంగా జీవించలేరని పెద్దలు తెలియజేసారు. 

ధర్మబద్ధంగా జీవించటం.. దైవానికి నచ్చే, దైవం మెచ్చే గొప్ప పూజ. 

**************** 
 సహజవనరులు...గొప్ప సంపదలు. 

పర్యావరణాన్ని పాడుచేసి , సహజవనరులను కోల్పోతే  ప్రపంచం చక్కగా ఎలా ఉంటుంది? 

. అప్పుడు మనిషి అచ్చు వేసే కాగితపు డబ్బుకు ఎంత విలువుంటుంది?

 అందువల్ల పర్యావరణాన్ని కాపాడటం , సహజవనరులను తక్కువగా వినియోగించటం చేయాలి.

అవసరాలు, అభివృద్ధి అంటూ సహజవనరులను విపరీతంగా వాడేస్తున్నారు. కోరికలను తగ్గించుకోవాలి. 

ఇవన్నీ చాలామందికి సిల్లీగా, అభివృద్ధి నిరోధక మాటలుగా అనిపించవచ్చు. 

అయితే, ఇదే విధంగా పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ, సహజవనరులను వాడేస్తూ ఉంటే భవిష్యత్తులో పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. 

అలాంటి పరిస్థితి రాకుండా మేల్కొనవలసి ఉంది .     


Wednesday, August 9, 2017

కొన్ని విషయాలు..తక్కువ ధరకు భోజనాన్ని...


ఈ శ్రావణ పౌర్ణమికి ఈ సంవత్సరపు అమరనాధ్ యాత్ర సమాప్తమయింది. 
***************

మరి కొన్ని విషయాలు..


 కొన్ని రాష్ట్రాలలో అమలవుతున్న తక్కువ ధరకు భోజనాన్ని అందించడానికి ఏర్పాటయిన క్యాంటీన్ల గురించి చాలా మందికి తెలుసు.


ఎన్నో కారణాల వల్ల ప్రస్తుత పరిస్థితిలో అందరికీ పని లభించటం కష్టంగా ఉంది.


 ప్రభుత్వాలు కూడా అందరికీ ఉపాధి కల్పించలేవు. 


ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వాలు పేదలకు తక్కువ ధరకు ఆహారాన్ని అందించగలిగితే ఎంతో మంచిది. 


ఆకలితో ఉన్న మనిషికి పనిచేయటానికి సరైన శక్తి  ఉండదు. 


ఆకలితో  ఉన్నప్పుడు చాలామందిలో కోపం , ఆవేశం వంటి లక్షణాలు కూడా వస్తాయి. 


ఇందువల్ల సమాజంలో నేరాలు పెరిగే అవకాశం ఉంది.


అందువల్ల అందరికీ ఆహారాన్ని అందించటం ఎంతో ముఖ్యం. 


ఆకలితో ఉన్నవారికి  ఆహారాన్ని అందించటం ఎంతో మంచి విషయమని పెద్దలు తెలియజేసారు. 


***************

 ఈ రోజుల్లో పని చేయాలన్నా పని దొరకటమే కష్టంగా ఉంది. 

 ఇలాంటప్పుడు పని చేసినవారికే  ఆహారం అనటం సరైనది కాదు. 

పనికోసం విపరీతంగా పరిశ్రమలు పెట్టి సహజవనరులు త్వరగా తరిగిపోవటమూ సరైనది కాదు.


 సహజవనరులు వేగంగా తరిగిపోని విధంగా  ఇతర రంగాలలో ఉపాధి అవకాశాలు అభివృద్ధి చేసుకోవాలి..


 ఉదా.. పర్యాటకం..వంటి రంగాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి. 


**************** 

రేషన్  కార్డుల  ద్వారా  నిత్యావసర  వస్తువులను  అందించటమూ  మంచిదే. 

అయితే, వంట  చేయాలంటే గ్యాస్  వంటివి ఎన్నో కావాలి.  


వంటచేసుకోవాలంటే  కుదరని వారికి  ఇలాంటి  క్యాంటీన్లు  ఎంతో  ప్రయోజనకరం.  


మనిషికి  ఆహారం  ముఖ్యం.  ఆకలితో  అల్లాడే  ప్రజలున్న  సమాజంలో  ఎంత  టెక్నాలజీ  ఉన్నా ఏం  లాభం ?  


అందరికీ  ఆహారాన్ని  అందించగలిగిన  రోజున  దేశంలో  ఎన్నో  సమస్యలు  పరిష్కారమవుతాయి.


***************

 ఇక్కడ  ఇంకో విషయాన్ని కూడా చెప్పుకోవాలి. 

 సమాజంలో  డబ్బున్న  వాళ్ళలో  కొందరు  మరీ  పిసినారివాళ్ళుంటారు.  


  ఇలాంటి  వాళ్ళు,  తక్కువ ధరకు  ఆహారం  లభిస్తుందంటే - ఇక  ఇంట్లో  వండుకోవటం  మానేసి  క్యాంటీన్లలోనే  భోంచేస్తారేమో ? 


  డబ్బున్న  వాళ్ళు  కూడా  ఇలా  చేస్తే , పేదవారికి  ఆహారం  సరిపోదు.  ఇలాంటి  క్యాంటీన్లను  ప్రారంభించిన  అసలు  ఉద్దేశ్యం  సరిగ్గా  నెరవేరదు. 


 ఎప్పుడో తప్పనిసరి  పరిస్థితిలో  తప్ప  డబ్బున్నవాళ్ళు  ఇలాంటి  క్యాంటీన్లను  ఉపయోగించకుండా  ఉంటేనే మంచిది.


  పీనాసితనాన్ని  తగ్గించుకుంటే  పేదవారి  కడుపు నింపిన వారవుతారు.


************

పేదవారికి రాత్రి సమయంలో తల దాచుకోవటానికి  షెల్టర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అక్కడే వైద్య సహాయం ఉండాలి.

 ఇవన్నీ జరగాలంటే ప్రభుత్వాల వద్ద డబ్బు ఉండాలి. 


డబ్బు ఉండాలంటే, సంపద అంతా కొందరి వద్దే ప్రోగుపడకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి.


 జనాభా విపరీతంగా పెరిగినా ఇబ్బందే. మంది ఎక్కువయితే మజ్జిగ పలుచన అనే పరిస్థితి వస్తుంది. 


స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచినా దేశంలో పేదరికం వంటి సమస్యలు ఉండటం బాధాకరం. 


 దేశంలో పేదరికం తగ్గాలంటే ప్రజలూ, ప్రభుత్వాలు, అధికారులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తేనే చక్కటి ఫలితాలు వస్తాయి.



Wednesday, August 2, 2017

అప్పటి, ఇప్పటి, పారిశుధ్య విషయాల గురించి కొన్ని విషయాలు ...

Wednesday, January 23, 2013


అప్పటి, ఇప్పటి, పారిశుధ్య విషయాల గురించి కొన్ని విషయాలు ...


* కొంత  కాలం  క్రిందట  ఒక  టీవీ  చానల్ లో  ఒక  ప్రోగ్రాం  చూసాను. పెద్ద  స్టార్  హోటల్  వాళ్ళు  తమ  హోటల్లో  టాయిలెట్స్ ను  ఎంత  శుభ్రంగా  ఉంచుతామో  చూపించారు. . 


 అక్కడ  కమోడ్స్  కూడా   చేతిలో  ఒక బట్ట ముక్కను  పట్టుకుని  దానితో  శుభ్రంగా  తుడుస్తున్నారు.  ఆ  శుభ్రం  చేసే  వాళ్ళు  మంచి  దుస్తులు  వేసుకుని , చక్కటి  భాష  మాట్లాడుతున్నారు.  వాళ్ళకు   ఎక్కువ   జీతం  ఇస్తారట.

* ఇదంతా    చూసిన  తరువాత  నాకు   ఎన్నో  ఆలోచనలు  వచ్చాయి.
..........................


*  పూర్వకాలంలో   కొందరు    ప్రజలు,  ఇతరుల  మలినాలను  శుభ్రపరిచేవారు .  ఇది  ఎంతో  బాధాకరమైన  విషయం . 


* అయితే,  ఈ  రోజుల్లో  అలాంటివి   జరగటం  లేదా  ?   అనే   విషయాన్ని   గమనిస్తే,   ఇలాంటి    చర్యలు  అప్పటి  కన్నా,  ఇప్పుడే  ఎక్కువగా  జరుగుతున్నాయని  తెలుస్తుంది.

 *   ఈ  రోజుల్లో  కూడా  ఇతరుల  మలినాలను  సాటి  మనుషులే  శుభ్రం  చేయటం  చూస్తూనే  ఉన్నాము. 


* ఉదా...చాలామంది  ఇళ్ళలో ,  గదికో   టాయిలెట్,  గదికో  వాష్ బేసిన్  కట్టించుకుంటున్నారు.  అయితే,  వాటిని  ఇంటి  యజమానులు  శుభ్రం  చేయరు.  పనివాళ్ళతో  శుభ్రం  చేయిస్తారు.   



ఈ  రోజుల్లో  చాలామందికి  ఇంటిపని  చేయటానికి  పనివాళ్ళను  ఏర్పాటుచేసుకుంటున్నారు  కదా  !   వాళ్ళు  యజమానులు  తిన్న  ఎంగిలి  పాత్రలను  శుభ్రం  చేస్తారు. టాయిలెట్స్  శుభ్రం  చేస్తారు. 

అంతేకాదు,  వాటిని   గాఢమైన  రసాయనాలతో  శుభ్రం  చేయవలసి  వస్తుంది.  ఆ  ఘాటు  వల్ల  వాళ్ళ  చేతులకు,  కళ్ళకు  అనారోగ్యం  కలిగే  అవకాశం  కూడా  ఉంది. 


*   ఇళ్ళల్లోనే  టాయిలెట్స్, వంటగదిలో  సింకులు    వల్ల    డ్రైనేజ్  సమస్యలు   వచ్చినప్పుడు  కూడా  పారిశుద్య  కార్మికులు  వచ్చి   మలినాలను  శుభ్రం  చేసి  వెళ్తారు.

* పూర్వం    ఇలా  గదికో  టాయిలెట్ ను   శుభ్రం  చేసే  అవసరం  ఉండేది  కాదు. రసాయనాల  బాధ  కూడా  ఉండేది  కాదు.

.......................................


* ఇప్పుడు  చాలా  మంది   సరదాగా  కుటుంబసమేతంగా  హోటల్స్ కు  వెళ్ళి   భోజనం  చేస్తున్నారు. . వాళ్ళు  తిన్న  పళ్ళేలను  అక్కడ   వదిలి  వచ్చేస్తారు  గానీ,  కడగరు  కదా  ! వాటిని  అక్కడి పనివాళ్ళే  కడుగుతారు.

* పూర్వ  కాలం    కుటుంబసభ్యులు  హోటల్స్ కు  వెళ్ళి  తినటం  అనేది  తక్కువగా  జరిగేది.  ఒకవేళ  బయట  తిన్నా , ఆ  రోజుల్లో  భోజనం  చేయటానికి  అరటాకులు  వంటి  ఆకులను  ఉపయోగించేవారు. 


భోజనం  తరువాత  అరటాకులను   ఇతరులు   శుభ్రం  చేయనవసరం  లేదు,  వాటిని  బయట  పారేస్తే  పర్యావరణానికి  హాని  లేకుండా  చక్కగా  మట్టిలో  కలిసిపోయేవి. 
...................................

*  అప్పటి  వాళ్ళు  సరుకులు  తెచ్చుకోవటానికి  కిరాణా  కొట్టుకు  వెళ్తే  ఇంటినుంచి  సంచిని  తీసుకు  వెళ్ళేవారు. 


పూర్వకాలంలో  ఇప్పుడు  ఉన్నన్ని  రకాల  వస్తువులు  లేవు  కాబట్టి ,  ఇంత  చెత్త  ఉండేది  కాదు.   ఆ  చెత్త కూడా  పర్యావరణానికి  హాని  కలిగించకుండా  మట్టిలో  కలిసిపోయేది.

 * పూర్వకాలం  వాళ్ళు  ఇంత  చెత్తను  బయట పారబోసేవారు  కాదు.  అంటే, 


ఉదా... ఇంట్లో  మిగిలిన  వ్యర్ధ పదార్ధాలైన  కూరగాయల తొక్కలను , వేరుశనగ  తొక్కలు,  మొక్కజొన్న  పై  తొక్కలు ,  అరటి  వంటి  పండ్ల  తొక్కలు,.... వంటివాటిని  చెత్తలో  వేయకుండా  పశువులకు  మేతగా  వేసేవారు.  మరికొన్ని  పదార్ధాలను  బయట  పారవేస్తే  కాకులు  వంటి  పక్షులు  తిని  పర్యావరణాన్ని  శుభ్రం  చేసేవి.

 * ఇప్పుడు  పెరిగిన  వాతావరణ  కాలుష్యం  వల్ల  కాకులు,  పిచ్చుకలు  వంటి  పక్షులు  ఎక్కువగా  కనిపించటం  లేదు  కదా  ! 


 ఈ  రోజుల్లో  చెత్త  బుట్టల  వద్ద  టన్నుల  కొద్దీ  చెత్త   పోగవుతోంది.  కుళ్ళిపోయిన  ఆ  చెత్తను  సాటి  మనుషులే  శుభ్రం  చేస్తుంటారు. ఈ  పారిశుద్య  కార్మికులు   డ్రైనేజ్  కాలువలను  కూడా  శుభ్రం  చేస్తుంటారు. 
....................


* పూర్వకాలంలో   ఎవరి  ఇంటిముందు  వీధిని  వాళ్ళే   ఊడ్చి,  కళ్ళాపి   జల్లి, ముగ్గులు  పెట్టుకునే  పద్ధతి  ఉండేది.  దీనివల్ల  వీధులను  శుభ్రం  చేసే   పారిశుధ్య కార్మికులకు  చాలా  పని తప్పుతుంది.

* ఈ  రోజుల్లో  ఎవరి  ఇంటి ముందు  చెత్తను   వారు  శుభ్రం  చేసే  పద్ధతి  తగ్గిపోయి ,  బాధ్యతంతా  పారిశుధ్య  కార్మికులపై  పడుతోంది.
..............................


* ఇవన్నీ  గమనిస్తే  పూర్వకాలంలో  కన్నా,  ఈ  కాలంలోనే  ఇతరుల  మలినాలను  సాటి  మనుషులు  శుభ్రం  చేసే  పని  ఎక్కువగా  జరుగుతోంది ... అనిపించింది.
..................................


* పూర్వం  ఈ  దేశంలో  టాయిలెట్స్  ఉండేవి  కాదని, అప్పటి  వాళ్ళు  ఆరుబయటకు  వెళ్ళేవారని  ఇప్పటివారంటారు. ఆరుబయట  కాలకృత్యాలకు  వెళ్ళినా  ఆ  వ్యర్ధాలు  మట్టిలో  కలిసి  ఎరువుగా  మారేవి.

* ఈ  రోజుల్లో అయితే, టాయిలెట్స్  ద్వారా    వచ్చే   వ్యర్ధాలను   పైపుల  ద్వారా, మురుగు కాలువల  ద్వారా......    డైరక్టుగా  నదులలో,  సముద్రాలలో  కలిపేస్తున్నారు. 


ఇలా  కాకుండా   గోబర్  గేస్  ప్లాంట్స్  ఏర్పరిచి ,  ఈ  వ్యర్ధాలను విద్యుత్ గా మార్చి , వీధి  దీపాలు  వెలగటానికి , ఇంకా  ఇతరత్రా  విద్యుత్  అవసరాలకు  వాడుకుంటే  బాగుంటుంది. ( ఇలా  వచ్చిన  గేస్ ను   వంటకు  ఉపయోగించటానికి  ఎక్కువమంది  ఇష్టపడరు  లెండి..  )

*   చాలా  కాలానికి  పూర్వమే ,  భారతదేశంలో   విలసిల్లిన   సింధు  నాగరికత  యొక్క పురావస్తు  త్రవ్వకాలలో  చక్కటి  మురుగునీటిపారుదల  ఏర్పాట్లు  ఉన్న  వ్యవస్థ  బయటపడింది.  దీన్నిబట్టి  చూస్తే  అప్పటి  వాళ్ళకు  ఎంతో  టెక్నాలజి  తెలుసు . అని  తెలుస్తుంది. 


* ఒకప్పుడు  భారత దేశం  ఎంతో  సిరిసంపదలతో  విలసిల్లేది.  ఇక్కడి  వైభవాన్ని గురించి  ఎందరో  విదేశీ  యాత్రికులు  తమ  గ్రంధాలలో  వర్ణించారు.  అయితే,  తరువాత  క్రమంగా  భారతదేశం  పేద  దేశంగా,  మురికితో  నిండిన  దేశంగా  తయారయింది.  

* తిరిగి  ఈ  దేశం   సిరిసంపదలతో, పరిశుద్ధంగా విలసిల్లాలని  ఆకాంక్షిస్తూ .....

***********
ఈ మధ్య నేను కూడా ప్లాస్టిక్ ను వేరు చేయాలంటే బద్ధకిస్తున్నాను. తడీపొడి చెత్త మాత్రమే కాకుండా ప్లాస్టిక్ చెత్త వేయటానికి విడిగా డస్ట్ బిన్లు ఉండాలి.

మాల్స్ లో పప్పులు అమ్మడం కొరకు నూలు దారాలతో అల్లిన వలలాంటి సంచులు వాడాలి, పిండి అమ్మడం కొరకు నూలు సంచులు వాడితే ప్లాస్టిక్ వాడకం తగ్గుతుంది.

వాడిపారేసిన  ప్లాస్టిక్ తో పెట్రోల్ తయారుచేయవచ్చట.