చాలాకాలం తరువాత ఇక్కడ పాతపోస్ట్ తీసి క్రింద విషయాలు రాయటం జరిగింది.
దేశంలో
చాలామంది ప్రజలు బాధ్యత లేకుండా జీవిస్తున్నారు. శుచిశుభ్రత లేకుండా
ఎక్కడపడితే అక్కడ మలమూత్రాలు చేస్తారు. రోడ్లపైన చెత్త వేస్తారు. స్నాక్స్
తిన్నాక బస్సు, కారు, ట్రైన్లో కిటికిలోనుంచి నుంచి ప్లాస్టిక్ కవర్లు
రోడ్డుపై విసిరేస్తారు.
సామూహిక
పండుగలు ఉదా.. కుంభమేళా, జాతరలు.. ముగిసిన తర్వాత ఆ ప్రదేశాలు శుభ్రం
చేయాలంటే ఎంత కష్టమో..శుచిశుభ్రత పాటించకుండా పూజలు చేయటం ఏమిటో?
బయట బస్సు ఎక్కాలన్నా, గుడిలో క్యూలైన్లు పాటించకుండా ఒకరినొకరు తోసుకుంటారు.
ఎక్కడైనా సినిమావాళ్లు కనిపిస్తే, వెర్రిగా మీదపడిపోతారు. వాళ్ళను చూడటానికి ఒకరినొకరు తొక్కేసుకుని, కొందరు
చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. సినిమాఆడవాళ్ళను చూడటానికి అయితే, ఇక చెప్పనక్కరలేదు.
భారతదేశం గొప్పదే కానీ, చాలామంది భారతీయులే..భారతదేశం పరువుతీస్తున్నారు. భారతదేశం గొప్పది అని చెప్పుకుంటే సరిపోదు. అలా గొప్పగా ఉండేలా ప్రవర్తించాలి కూడా.
సెలెబ్రిటీలు అనబడేవాళ్లు కొందరు, అక్రమసంబంధాలతో ప్రవర్తిస్తుంటే.. అలా చేయటం తప్పని చెప్పకుండా, జనాలు కొందరు వాళ్ళను పొగుడుతుంటారు.
సమాజంలో
కొందరు స్త్రీలు, పురుషులు కూడా నైతికవిలువలను పాటించకుండా
ప్రవర్తిస్తున్నారు.
ఆ మధ్య కొందరు సినిమా ఆడవాళ్లు ఏం చెప్పారంటే, షూటింగ్ కొరకు బయటకు వెళ్లినప్పుడు రూములో పడుకుంటే, రాత్రిసమయంలో కొందరు మగవాళ్లు తలుపులు కొట్టి తమకోరిక తీర్చమని అడిగేవారని చెప్పారు.
ఆ మధ్య కొందరు సినిమా ఆడవాళ్లు ఏం చెప్పారంటే, షూటింగ్ కొరకు బయటకు వెళ్లినప్పుడు రూములో పడుకుంటే, రాత్రిసమయంలో కొందరు మగవాళ్లు తలుపులు కొట్టి తమకోరిక తీర్చమని అడిగేవారని చెప్పారు.
సమాజం ఇలా ఉన్నప్పుడు, స్త్రీలు కూడా ఎక్కడికి పడితే అక్కడకు వెళ్ళకుండా జాగ్రత్తగా
ఉండాలి. మగవాళ్లు కూడా తలుపులు కొట్టి అలా అడగటం, అంత దిగజారిపోవటం అసహ్యకరం.
కొందరు సినిమావాళ్లే కాదు, బయటకూడా కొందరు ఇలా అక్రమసంబంధాలుతో తిరుగుతున్నారని తెలుస్తోంది.
కొందరు సినిమావాళ్లే కాదు, బయటకూడా కొందరు ఇలా అక్రమసంబంధాలుతో తిరుగుతున్నారని తెలుస్తోంది.
శృంగారం ఎక్కువ పాల్గొంటే శరీరం బలహీనమయ్యి రోగాలొస్తాయి. మనస్సును కంట్రోల్ చేసుకోవాలి.
.................................
.................................
కొందరు ఎన్నో పాపాలు చేసి ఎంతో డబ్బు
సంపాదిస్తారు. వేలకోట్లు ఒక కుటుంబానికి అవసరమా? చచ్చాక ఆ డబ్బు
పట్టుకుపోలేరు కదా.బతికున్నప్పుడు చేసిన పాపపుణ్యాలే
చచ్చాక వెంట వస్తాయి తప్ప, డబ్బు రాదు కదా..
జనాభా ఎక్కువయితే ఎంత డబ్బూ సరిపోదు. కొందరు ఉచితాలు ఎవరు ఎక్కువిస్తే వాళ్లకు ఓట్లు వేయటానికి ఎదురు
చూస్తుంటారు.
కొందరు రాజకీయులు ప్రజలకు కొన్ని ఉచితాలు ఇచ్చి, తాము బాగా పైకి వస్తారు.
నేను ఒక దగ్గర చదివాను..ఒక దేశంలో ప్రజలు ప్రభుత్వం ఉచితాలు ఇస్తామని అన్నా కూడా, వారు తీసుకోలేదట. తాము కష్టపడి పని చేసి సంపాదించుకుంటామన్నారట. అలాంటి ఆత్మాభిమానం ఉన్న ప్రజలు ఎంతో గొప్పవారు.
యువత ఉద్యోగాలే కాకుండా, వ్యాపార, వ్యవసాయ రంగాల్లోకి రావాలి. ఎక్కడివాళ్లో వచ్చి ఇక్కడ చక్కగా వ్యాపారాలు చేసి సంపాదించుకుంటున్నారు.
నేను ఒక దగ్గర చదివాను..ఒక దేశంలో ప్రజలు ప్రభుత్వం ఉచితాలు ఇస్తామని అన్నా కూడా, వారు తీసుకోలేదట. తాము కష్టపడి పని చేసి సంపాదించుకుంటామన్నారట. అలాంటి ఆత్మాభిమానం ఉన్న ప్రజలు ఎంతో గొప్పవారు.
యువత ఉద్యోగాలే కాకుండా, వ్యాపార, వ్యవసాయ రంగాల్లోకి రావాలి. ఎక్కడివాళ్లో వచ్చి ఇక్కడ చక్కగా వ్యాపారాలు చేసి సంపాదించుకుంటున్నారు.
సమాజంలో వ్యాపారం, వ్యవసాయం చేసే వాళ్లను చిన్నచూపు
చూడకూడదు.
ఐటీ ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో.. అని భయపడుతూ అదేపనిగా
పనిచేస్తూ ఆరోగ్యాలు చెడగొట్టుకోకుండా, స్వంతంగా చిన్న పరిశ్రమలు కూడా
పెట్టుకోవచ్చు.
విపరీతంగా వస్తువ్యామోహం ఉన్నవారికి ఎంత డబ్బు ఉన్నా
సరిపోదు.
..........................చాలామంది ప్రజలు పాపభీతి లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఎంతసేపూ కోరికలు తీరాలి, కష్టాలు పోవాలి అనుకుంటారు. పాపాలు చేస్తూ ఉంటే కష్టాలు ఎలా పోతాయి? పాపాలు చేస్తే, వచ్చే జన్మలో ఎన్నో కష్టాలు అనుభవించవలసి వస్తుంది.
పాపాలు చేయకూడదని సన్నసన్నగా ఒకటిరెండు సార్లు చెప్పి, ఇక ఫలానా పరిహారాలు చేస్తే కోరికలు తీరుతాయి, కష్టాలు పోతాయి అని చెబుతుంటారు. . పాపాలు చేస్తూ నలుగురికి సాయం చేస్తే మంచివాళ్లయిపోరు కదా..
చావుతో జీవితం అంతంకాదని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు.అందువల్ల అందరూ మనస్సును అదుపులో ఉంచుకుని జాగ్రత్తగా జీవించాలి.
..........................
సమాజంలో చాలామంది స్వార్ధం, కుళ్లు, కుతంత్రాలతో.. చెడుప్రవర్తనతో
ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళ గురించి బాధపడటం అవసరమా? అనిపిస్తుంది. ఎవరి కర్మ
వారిది.
అయితే, మంచివాళ్లకు, అభంశుభం తెలియని పసిపిల్లలకు, మూగజీవులకు
ఆపదలు రాకుండా దైవము కాపాడితే బాగుండు.
దైవమే దిక్కు.
No comments:
Post a Comment