koodali

Monday, July 25, 2016

అన్న క్యాంటీన్లు మరియు...


  అన్న క్యాంటీన్ల వల్ల ఎందరికో ఉపయోగం జరుగుతోంది.  ఇలాంటివి రాష్ట్రమంతటా  విస్తరించితే ఎందరికో లాభం జరుగుతుంది.


 ఈ రోజుల్లో అనేక కారణాల వల్ల ఉపాధి లభించటం ఎందరికో కష్టంగా ఉంది.


ఉపాధి లేకపోయినా  పేదలకు  కనీసం  తక్కువ ధరకు ఆహారం లభిస్తే ఎంతో మంచిది.

ప్రభుత్వాలు తక్కువ ధరకు ఆహారాన్ని అందించటం వల్ల ప్రజల ఆకలీ తీరుతుంది. ప్రభుత్వాలకూ మంచి పేరు వస్తుంది.


తమిళనాడులో ఇలాంటి అమ్మా క్యాంటీన్ల వల్ల ఎందరో పేదవాళ్లు కడుపు నింపుకుంటున్నారు. అక్కడ ఇంకా ఎన్నో పధకాలు ఉన్నాయి.


అక్కడ ఉన్న ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రావటానికి ఈ పధకాలు కూడా ఎంతో దోహదపడ్దాయి.


తమిళనాడులో కొత్త ప్రభుత్వం వస్తే పాత పధకాల అమలు ఉంటుందో ? ఉండదో? అనే భయం వల్ల కూడా ప్రజలు ఉన్న ప్రభుత్వానికే ఓటు వేసి ఉండవచ్చు.

ఇక ఇంకుడుగుంతల త్రవ్వకం, మొక్కలను నాటడం కూడా చాలా మంచి విషయాలు.  ఇందులో  ప్రజలు కూడా ఆసక్తిగా పాల్గొనటం మంచి విషయం.

..................................

 అయితే, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలలో అణువిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించాలనుకోవటం మాత్రం అత్యంత బాధాకరమైన విషయం.


ప్రపంచమంతటా  సో లార్, పవన విద్యుత్ వంటి హరిత విద్యుత్ కోసం ప్రయత్నిస్తుంటే....  ఆంధ్రప్రదేశ్లో అణువిద్యుత్ కర్మాగారాలు  నిర్మించాలనుకోవటం అత్యంత బాధాకరం ఐన విషయం. కేంద్రం ఈ విషయాలలో  తిరిగి ఆలోచించటం మంచిది.



Friday, July 22, 2016

ఈ రోజుల్లో ఆహారం గురించి కొన్ని విషయాలు.. మరియు సోయా గురించి..


 
ఈ రోజుల్లో ఆహారపద్ధతులలో విపరీతమైన మార్పులు వచ్చాయి.

  అజనిమోటో, సోయాసాస్, వెనిగర్, సోడా ఉప్పు, బేకింగ్ పౌడెర్..వంటివి విరివిగా వాడిన ఆహారానికి ప్రజలు బాగా అలవాటుపడ్దారు.

 పొంగి కరకరలాడుతూ ఉండటానికి... సోడా ఉప్పు, బేకింగ్ పౌడెర్..


 ఒకవిధమైన రుచి పెరగటం కోసం ....అజనిమోటో, సోయాసాస్, వెనిగర్ వంటివి బాగా వాడుతున్నారు.

 అజనిమోటో ఎక్కువగా వాడకూడదు.

 ఇవన్నీ వాడటం వల్ల ఆహార పదార్ధాలకు ఒక విధమైన  రుచి  రావటం వలన  వీటి  వాడకం  బాగా పెరిగింది.

 ఆ రుచికి అలవాటుపడటం వల్ల  మళ్లీమళ్లీ అవే తినాలనిపిస్తుంది.  అలా శరీరంలోకి  వెళ్లే అజనిమోటో పరిమాణం బాగా పెరుగుతుంది.

ఇంట్లో చేసుకునే వంటలలో కూడా అజనిమోటో, సోడాఉప్పు వంటివి ఎక్కువగా వాడటాన్ని తగ్గించాలి.

నాకు తెలిసినంతలో సోయాసాస్ , వెనిగర్ వంటివి పదార్ధాలను నెలల తరబడి పులవబెట్టి తయారుచేస్తారు.

   కెమికల్స్ తో కూడా సోయాసాస్, వెనిగర్ తయారుచేస్తారట.


కొన్ని దేవాలయాలకు  సమీపంలో యాత్రికులు వెళ్ళే దారిలో కూడా  నూడిల్స్ వంటి  ఫాస్ట్  ఫుడ్   అమ్ముతున్నారంటే ప్రజలు వీటికి ఎంతలా అలవాటుపడ్డారో తెలుస్తోంది.

 మన పూర్వీకులు  సోడాఉప్పు వంటివి  వాడకుండానే వెన్న వాడి  కరకరలాడే రుచికరమైన స్నాక్స్ చేసేవారు.

 
 *************

ఇంకో విషయం ఏమిటంటే,  ఆరోగ్యానికి మంచిదని భావించి.... ఈ రోజుల్లో సోయా కు సంబంధించిన పదార్ధాలు కూడా ఎక్కువగా వాడుతున్నారు.


అయితే, సోయా మంచిదే కానీ  పరిమితి మించి మరీ ఎక్కువగా సోయాను తినకూడదంటున్నారు.

ఇందుకు సంబంధించిన కొన్ని విషయాలు ఈ క్రింద లింక్  ద్వారా తెలుసుకోగ
రు.


Benefits of Soy & Soy Protein Dangers | Natural Health Newsletter

************

పాతకాలంలో గుగ్గిళ్లు.. అంటే నానబెట్టి ఉడికించిన పెసలు, శనగలు..వంటివి తినేవారు. అప్పటివారు శారీరికంగా బాగా పనిచేసేవారు. శారీరికంగా పనిచేసేవారికైనా , మానసికంగా పనిచేసేవారికైనా మంచి పోషకాహారం అవసరం.


కొందరేమో పెసలు, శనగలు వంటివి ఎక్కువగా తినకూడదంటారు, ఎక్కువ తింటే కిడ్నీలు పాడైపోతాయంటారు. మరి కొందరేమో మొలకెత్తిన పెసలు, శనగలు..వంటివి తినాలంటారు. ఈ రోజుల్లో రకరకాలుగా చెప్పటం వల్ల గందరగోళంగా ఉండి ఏం తినాలో? ఏం తినకూడదో? ఎంత తినాలో? వంటి సందేహాలు ఎక్కువయ్యాయి.



ఈ రోజుల్లో ప్రొటిన్స్, కార్బోహైడ్రేడ్స్.. అంటారు. ప్రాచీనులు నవధాన్యాల గురించి తెలియజేసారు. మనం రెండు లేక మూడు ఇడ్లీలు, రెండు లేక మూడు దోసెలు, రెండు చపాతీలు..అలా లెక్కప్రకారం తింటే ఎక్కువతక్కువ కాకుండా ఉంటుంది.అరడజను అలా తినకూడదు.అన్నం మనిషికి సుమారు అరకప్పు బియ్యంతో వండితే సరిపోతుందంటారు.


  నిమ్మకాయ వంటి పుల్లటిపండ్లు మరీ ఎక్కువ కాకుండా కొన్ని తినాలి.ఇంకా, పురుగుమందులు వేయని, దేశవాళి కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెలు..వాడితే మంచిది.

ఆహారం తీసుకోవటంలో కొన్ని పద్ధతులు..ఎవరి పద్ధతిని బట్టి వారు మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.

ఉదయం ఆకుల కషాయం..ఉదా..జామాకు..వంటివి వేడి నీటిలో 2 నిమిషాలు కాచి ఆ నీటిని తాగాలి.

నెలకు నాలుగు రోజులు ధనియాల కషాయం..ఉదా.. నెలలో మొదటి నాలుగురోజులు..

link.. జలుబు, దగ్గు తగ్గటానికి ఈ పానకం.......... 

చ్యవంప్రాశ్ కూడా తీసుకోవచ్చు.



మొర్నింగ్ బ్రేక్ఫాస్ట్ .. ఇడ్లి..దోస..పూరీ..పొంగణాలు..ఉప్మ..రోజు విడిచి రోజు ఒక గ్లాస్ రాగుల జావ..రోజులో ఎప్పుడైనా రాగుల జావ త్రాగవచ్చు.జొన్న జావ కూడా తాగవచ్చు.

భోజనంలో చక్కగా అరిగే పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి..

వారంలో రెండు సార్లు మునగాకు జ్యూస్
వారంలో ఒక సారి బూడిదగుమ్మడి జ్యూస్
వారంలో ఒకటి లేక రెండుసార్లు కొబ్బరి నీరు
 
నువ్వుల ఉండలు వారానికి రెండు తినవచ్చు.
వేడిచెయ్యకుండా మెంతిపిండికానీ, మెంతులు కానీ వాడవచ్చు.

ప్రతిరోజు ఫ్రూట్స్

సలాడ్ అండ్ డ్రైఫ్రూట్స్  వారానికి 3 సార్లు..

గ్రీన్ జ్యూస్ వీక్లి 3 సార్లు...పుదీనా, కొత్తిమీర వంటి వాటి జ్యూస్ ..

రాత్రిపూట.. వీక్లి 2 సార్లు చపాతీలు..మిగిలిన రోజుల్లో..జొన్న ఉప్మా..జొన్న దోసలు..జొన్న ఇడ్లి..

వారానికి ఒకసారి లేక రెండుసార్లు.. పకోడి..బజ్జి..లేక ..చాట్..

15 రోజులకు ఒకసారి(నెలకు రెండు సార్లు).. స్నాక్స్..కారప్పూస అండ్ స్వీట్..వండుకుని నెలలో ఎప్పుడైనా తినవచ్చు.

వారంలో రెండుసార్లు తలకు..నూనె నిదానంగా మర్దన చేయాలి.

రోజూ ఉదయానే లేచి సూర్యనమస్కారాలను లేత ఎండలో చేయటం.. ఉదయంగానీ సాయంకాలం కానీ అర్ధగంటయినా ఎండ శరీరానికి తగలాలి.


కనీసం అర్ధగంట నడవాలి...ఉదయం కానీ, సాయంకాలం కానీ తక్కువ ఎండలో నడిస్తే ..ఎండ తగలటం, నడవటం అనే రెండు పనులు ఒకేసారి జరుగుతాయి. నడిచేటప్పుడు దైవనామాన్ని కూడా నిదానంగా అనుకోవచ్చు. 


కనీసం 15 నిమిషాలన్నా ధ్యానం చేయాలి. మీకు ఇష్టమైన దేవుని నామాలను వింటూ కూడా ఉండవచ్చు. అయితే, ధ్యానం, ప్రాణాయామం..వంటివి శిక్షకుల వద్ద అభ్యసించి చేస్తే మంచిది.

 ధ్యానం ద్వారా అనేక ఆలోచనల నుంచి కొంతసేపైనా మనస్సుకు విశ్రాంతిని ఇవ్వవచ్చు.

 
జీవితం అంటే కొన్ని టెన్షన్లు ఉంటాయి కదా..మన చుట్టూ టెన్షన్ పరిస్థితులు ఉన్నప్పుడు, మనకు కొంతయినా టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది.

 కానీ, మనం ఆరోగ్యంగా ఉండాలంటే టెన్షన్ ఎక్కువ ఉండకుండా తామరాకుమీద నీటిబొట్టులా జీవించటాన్ని తప్పక నేర్చుకోవాలి.

 జీవితంలో మన చేతనైనంత మనం చేసి,  దైవంపై భారం వేయాలి.  నిష్కామకర్మ యోగంతో జీవించటాన్ని అభ్యసించాలి.

శక్తి చాలనప్పుడు ..సరైనవిధంగా జీవించే శక్తిని ప్రసాదించమని దైవాన్ని శరణువేడుకోవాలి.

అంతా  దైవం దయ.

Monday, July 18, 2016

ఓం. హిందువులు.. మరి కొన్ని విషయాలు.....


గురువులకు అనేక వందనములు.


  .............
క్రింద వ్రాసిన విషయాలు ఈ పొస్ట్ వేసిన చాలాకాలం క్రిందట వ్రాసి ఇక్కడ వేయటం జరిగిందండి.
 
ఇప్పుడు చాలామంది హిందువులు హిందుదేవతలను ఆరాధిస్తూ, సాయిని కూడా ఆరాధిస్తున్నారు.

ఎన్నో నియమాలు పాటిస్తూ హిందువులకు దిశానిర్దేశం చేసే బ్రాహ్మణులు కూడా కొందరు ,  సాయి సర్వాంతర్యామి అని పూజలు చేస్తుంటే,  హిందువులు కొందరు  వారిని అనుసరించటంలో ఆశ్చర్యం లేదు.

సాయి విధానాలు సరళంగా ఉంటాయి. అనేక ఆచారవ్యవహారాలుండవు, అనేక కఠినమైన నియమాలుండవు. సాయిని ఆరాధించటానికి హిందుత్వంలోని కఠిననియమాలను పాటించలేకపోవటం కూడా ఒక కారణం కావచ్చు.
 
 
అయితే,షిర్డిసాయికి హారతులు ఇస్తారు. రోజుకి మూడుసార్లు అనుకుంటున్నాను, నాకు సరిగ్గా తెలియదు. హారతులకు ఎక్కువ సమయమే పడుతుంది.
 
 ఎక్కువ నియమాలు లేకుండా ఉండే సాయి ఆరాధనలో కూడా, సాయిని హిందు దేవతలుగా పూజలు మొదలుబెట్టి ఆరాధించటం ఆశ్చర్యం. 
.....................................
సులభమైన విధానాలతో ఉన్న షిర్డిసాయి ఆరాధనకు చాలామంది ఆకర్షితులవటంలో ఆశ్చర్యం లేదు.

 పరిస్థితి ఎలా ఉందంటే,  సాయి విగ్రహం ఉంటే,  జనాలు వస్తారని 
కొన్ని హిందు దేవాలయాల్లో  సాయి విగ్రహాన్నికూడా పెడుతున్నారట. భవిష్యత్తులో  పరిస్థితి  ఎలా ఉంటుందో?
..........................................

షిర్డిలో ప్రాచీన శివుని దేవాలయం ఉంటుంది. శివాలయానికి మేము వెళ్లినప్పుడు  అక్కడ, షిర్డి మందిరంలోలా  క్యూలు లేవు. బోలెడు భక్తులు లేరు.
....................................... 
 
 కొందరు హిందువుల ప్రవర్తన వింతగా ఉంటుంది. ఒకే హిందువుల్లో వైష్ణవులు, శైవులు అని కొందరు గొడవలు పడటం జరిగింది. మరి, ఇతర మతాలను కూడా నమ్మే సాయిబాబాను గురువుగా, దైవంగా భావించటం ఆశ్చర్యమే.
 
హిందువులు ఎందుకు శైవులు, వైష్ణవులు.. అని  గొడవలు పడుతున్నారు? అందరూ గాయత్రిశక్తిని ఆరాధిస్తారు కదా....హిందువులను ఉద్ధరిస్తామనే వాళ్ళు,  వైష్ణవ.. శైవ ..అని గొడవలు కూడా  మానేయాలి.
 .....................................
 
   శిరిడి సాయి బాబా జీవితచరిత్రము పుస్తకములో ఒక దగ్గర సాయి స్వయముగా ఎన్నో విషయములను తెలియజేసిన సందర్భములో ఇలా కూడా అన్నారు. సాయిసాయి ..యను నామమును జ్ఞప్తి యందుంచుకున్న మాత్రమునే మంచి జరుగుతుందని తెలియజేసారు.
................................. 
 
 కొందరు సాయిబాబాకు అనేక దేవతలుగా అవతారాలు అలంకరించి పూజలు చేస్తున్నారు.
 
హిందుదేవతలకు వారి పద్ధతుల ప్రకారం పూజలు చేస్తారు.  శివుని విష్ణువులా ఆరాధిస్తారా? విష్ణువును శివునిగా ఆరాధిస్తారా?
 
సాయిని ఇతరదేవతలుగా అలంకరించి పూజలు చేయటం కాకుండా, సాయిని సాయిలా ఆరాధించుకోవచ్చు.
 ......................
 
 భవిష్యత్తులో ఇంకెవరైనా వచ్చి,  వారు సర్వాంతర్యామి అంటే, వారికి కూడా హిందుదేవతల అలంకారాలు చేసి పూజలు చేస్తే ఒప్పుకోవాలా?

 పూజలలో అలా చేయకూడదు, ఇలా చేయకూడదని ఎన్నో చెప్పే బ్రాహ్మణులు,  ఈ విషయాలలో అలా చేయకూడదని చెప్పాలి కదా..
 ...............................
సాయిభక్తులు కూడా హిందువులే కాబట్టి, హిందుధర్మ పరిరక్షణ కూడా చేస్తారు.
..................................... 
ఈ తరంవారు తాము ఎప్పటినుంచో పూజించే హిందుదేవతలతో పాటు, సాయిని కూడా  పూజిస్తున్నారు. రాబోయే తరాల వాళ్ళు హిందుత్వంలోని అనేక నియమాలను పాటించలేక,  అందరు దేవతలు సాయిలోనే ఉన్నారని,  సాయిని మాత్రమే పూజించే పరిస్థితి కూడా రావచ్చేమో?

 ఇప్పటికే కొందరు సాయిభక్తులు ఏమంటున్నారంటే, సాయిలోనే అందరు దేవతలు ఉన్నారని, సాయిని ఆరాధించుకుంటామని అన్నట్లు అంటున్నారు.
 
    సాయిని హిందుదేవతల్లాగ అలంకరించి పూజలు మొదలుపెడితే, ఇక మళ్ళీ హిందుదేవతల పూజలు ఎందుకు? అందరు దేవతలు సాయిలోనే ఉన్నారని, కొందరు హిందువులు హిందుదేవతల ఆలయాలకు ఎక్కువగా వెళ్లటం మానేస్తారేమో? అని సందేహాలు కలుగుతాయి.
 ...........................
   హిందువులుగా ఉన్నవాళ్లు హిందుత్వం.. హిందుదేవతల ప్రాముఖ్యత తగ్గేలా ప్రవర్తించకూడదు. హిందుత్వానికి ఎటువంటి హాని జరగకుండా చూడాలి.
........................................
    వినాయకచవితి పూజలలో కొందరు ఏం చేస్తున్నారంటే,   తమకు ఇష్టం వచ్చినట్లు వినాయకునికి రకరకాల వేషాలు వేస్తున్నారు. ఇకమీదట ఇవన్నీ చేయకూడదని గట్టిగా చెప్పాలి. 

సినిమాల్లో హిందు దేవతలను తమ ఇష్టం వచ్చినట్లు మార్చి చూపించినా,  న్యాయస్థానంలో కేసులు వేయాలి.  
 
మూఢనమ్మకాలు పెంచే సీరియల్స్ ,  సోషల్మీడియాలో మూఢనమ్మకాలను వ్యాపింపచేసేవాళ్ళ పట్ల కూడా చర్యలు తీసుకోవాలి.

 తప్పులు చేసి ఇక్కడ న్యాయస్థానం నుంచి తప్పించుకున్నా కూడా,  దైవ న్యాయస్థానం నుండి తప్పించుకోలేరు.
.........................................
 పూర్వీకులు పూజించిన దేవతలు అంటే నాకు భక్తి ఉంది. షిర్డి సాయి అంటే భక్తి ఉంది. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. దైవము ఒక్కరే అయినా, ఏ మతం వారి పద్ధతులు వారికి ఉన్నాయి. దైవము ఒక్కరే కదా.. అని అన్ని మతాల వారు ఒకే ఆచారవ్యవహారాలు పాటించాలంటే చాలా కష్టం.
.................................
 
ఆ రోజుల్లో  సాయి  షిర్డి వస్తే, ఒకరి గుర్రం కనిపించకపోతే సాయి  ఆ విషయాన్ని చెప్పగా, సాయికి మహిమలున్నాయని  హిందువులే వారి వద్దకు వెళ్లి తమకష్టాలు తీర్చమని అడగటం ఎందుకు?
 
 హిందువులకు అనేక దేవతలు, అవధూతలు, గురువులు.. ఉండగా కొత్తవారి వెంటబడటం దేనికి? ఇది హిందువుల బలహీనతే. భవిష్యత్తులో మరొకరు వస్తే వాళ్ల వెంటకూడా పడతారా?

 నాకు తెలిసిన ఒక సాయి మందిరంలో హిందుదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి.
 చిన్న విగ్రహాను సాయి పాదాలవద్ద ఒక పళ్లెంలో పెట్టి పూజిస్తారు. దసరా వస్తే హాల్లో ఒక పక్కన పెద్ద అమ్మవారి బొమ్మను అలంకరించి నవరాత్రులు చేసేవారు. మామూలుగా నవరాత్రులంటే భక్తులు  అమ్మవారి దేవాలయానికి  లేక ఇంకో హిందుదేవాలయానికి వెళ్తారుకావచ్చు. 

సాయి మందిరంలో ఈ పూజలు చేస్తున్నారు కాబట్టి, ఆ చుట్టుపక్కల ప్రజలు అమ్మవారిని అక్కడే పూజించేవారు. భక్తులు అక్కడ  కానుకలు సమర్పిస్తారు.

షిర్డిసాయి ఇవన్నీ పూజలు చేయమని చెప్పలేదు. 
ఇవన్నీ  సాయి మందిరాల నిర్వాహకులు  చేస్తున్నారు.
....................................
 
 హిందువుల గ్రంధాలలో ఎవరిశక్తిని బట్టి వారు దైవాన్ని పూజించవచ్చని ఉంది.

దైవపూజ అంటేనే ప్రశాంతంగా చేసుకోవాలి. అలాంటి విషయాన్ని   విపరీతధోరణితో కొందరు హిందువులు క్లిష్టం చేసేసారు.   అవన్నీ విన్న ప్రజలకు అనేక సందేహాలు, భయాలు కలుగుతాయి.
...............

అంటరానితనం వంటి విషయాల వల్ల,  కొందరు శూద్రులు  మతం మారారని కొందరు అంటారు.  కొందరు అగ్రకులాల వాళ్లు కూడా ఎందుకు మతం మారారు? మతం మారిన వారిలో బ్రాహ్మణులు కూడా ఉన్నారు.

హిందుత్వంలోని అనేక  విషయాలను పాటించలేక కూడా, అగ్రకులాల వాళ్లు కొందరు మతం మారుతున్నారేమో? అనిపిస్తుంది.

ఇవన్నీ గమనించాక, ఇప్పటికైనా హిందువులు తమ పద్ధతులను కొంత సులభం చేసుకోవాలి, లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము.
.........................................
 
 సాయి తనకు షోడశోపచారాలతో పనిలేదు, ప్రేమతో కూడిన భక్తి ఉంటే చాలన్నారు.
 
 మరి, హిందు పెద్దవాళ్లు ఎలా చెబుతారంటే,   ప్రతిదానికి  ఇలా చేస్తే కష్టాలు వస్తాయి, అలా చేయకూడదు, ఇలాగే చెయ్యాలంటూ భయపెడతారు. హిందువులకు విసుగొచ్చి ఇతరమార్గాల్లోకి వెళ్లేలా చేస్తున్నారు.

  పూజలో కొబ్బరికాయ కుళ్లితే ఏ కష్టం ముంచుకొస్తుందో.. అని భయం, దీపంలో ఎన్ని వత్తులు వేయాలో? అనే సందేహాలు, బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలనే శంకలు, ఫలానా దిక్కున తిరిగి అన్నం తినాలి, టాయ్లెట్లో ఫలానా దిక్కున 
తిరిగి  కూర్చోవాలి, టీవీ ఫలానా దిక్కు పెడితే అరిష్టం..ఇలా వందల విషయాలను గుర్తుంచుకోలేక, గుర్తున్నా కూడా పాటించలేక నలిగిపోతున్నారు.

 ఇవన్నీ పాటించకపోతే కష్టాలొస్తాయోమోనని  భయపడి విసిగిపోయినవాళ్లు,  సులభంగా ఏదైనా మార్గం కనిపిస్తే అటు వెళ్లటానికి ఆలోచిస్తారు.
 
 ప్రాచీనులు ఎన్నో మంచి విషయాలను ఆచారవ్యవహారాలుగా తెలియజేసారు. అయితే, కాలక్రమేణా కొందరు కొన్నింటిని మార్పులుచేర్పులు చేసి మూఢనమ్మకాలుగా అతిగా తయారుచేసారు.

***************

గ్రంధాలలో విషయాల గురించి ప్రశ్న వేయకూడదన్నట్లు కొందరు అంటారు. గ్రంధాలలో కొన్ని ప్రక్షిప్తాలు(మార్పులుచేర్పులు) జరిగాయంటారు. ఇలాంటప్పుడు ఎన్నో సందేహాలు కలుగుతాయి..
 
గ్రంధాలను చదివినప్పుడు కొన్ని విషయాలు అర్ధం కావు, సందేహాలు కలుగుతాయి. అలాగే,  కొన్ని గ్రంధాలను చదివినప్పుడు  నాకు  కొన్ని సందేహాలు కలిగాయి.
 
 తెలియనివిషయాలు పెద్దవాళ్లను అడిగి తెలుసుకోవటంలో తప్పులేదు. గురువును, దైవాన్ని అడగటంలో కూడా తప్పులేదు.
................................
 
కొందరు,  తమ పూర్వీకులు ఆరాధించిన దేవతలను, గురువులను  కాకుండా, ఇతర మతాలదేవతల ఆరాధనలోకి వెళ్తారు. భవిష్యత్తులో ఇంకో కొత్త వాళ్లు మహిమలు చూపిస్తే, వీళ్ళు అటు వెళ్లరని గ్యారంటి ఉందా?
.........................

 హిందువులకు చాలామంది దేవతలు, గురువులు ఉండగా, ఎందుకు కొత్త వాళ్లవద్దకు వెళ్తారు?  అన్నది ఆలోచించాలి.
 
తిరువణ్నామలైలో అంత గొప్ప దైవము ఉండగా, మళ్లీ అక్కడున్న టోపి అమ్మ అనే ఆమె వద్దకు వెళ్లి ఆమె విసుక్కుంటున్నా కూడా,  ఆమె వెంటపడుతున్నారు. 
 ............................
 
హిందువులు ఎన్నో నియమాలనే చట్రంలో భయపడుతున్నారు. గ్రంధాలలో ఉన్న ఎన్నో విషయాలను పాటించకపోతే ఏమవుతుందో?  అని భయపడుతున్నారు. తరతరాలనుంచి గ్రంధాలలో ఎందరు ఎన్ని మార్పులుచేర్పులు చేసారో?
 
 గ్రంధాలలోని విషయాలు, ఆచారవ్యవహారాలు గత యుగాలలో చక్కగా పాటించగలరు.
 
కలియుగంలో పరిస్థితుల గురించి తెలిసిన ప్రాచీనులు, కలికాలంలో దైవస్మరణ..దైవనామ స్మరణ సులభమైన ఉపాయమని తెలియజేసారు.

 ఈ రోజుల్లో చాలామంది గంటసేపైనా సెల్ఫోన్ సంతోషంగా చూస్తారు కానీ, గంటసేపు సంతోషంగా పూజ చెయ్యటానికి మనస్సు పెట్టలేరు.
 
కలికాలంలో చాలా పదార్ధాలు కల్తి అయి ఉంటాయి. దైవనామము కల్తి చెయ్యలేరు.  దైవనామాన్ని చక్కగా సులభంగా స్మరించుకోవచ్చు.

దైవస్మరణ..దైవనామస్మరణ వల్ల ఆ శక్తి ప్రపంచమంతా వ్యాపించి, ప్రపంచం శాంతిగా ఉండే అవకాశముంది.
 
తపస్సు చేసినప్పుడు ఆ శక్తి ప్రపంచమంతా వ్యాపించి,  దేవతలు వరాలను ఇవ్వటం జరిగినట్లు గ్రంధాల ద్వారా తెలుస్తుంది.
.............................

 విధివిధానాలు తక్కువగా ఉన్నప్పుడు ప్రశాంతంగా దైవంపై ధ్యాస ఉంచటానికి కుదురుతుంది..విధివిధానాలు ఎక్కువ ఉన్నప్పుడు వాటిని సరిగ్గా పాటించామా? లేదా? అనే టెన్షన్ తోనే సరిపోతుంది.

విధివిధానాలు ఎక్కువ చేస్తూ చెప్పేవారు ప్రజలను దైవానికి దూరం చేస్తున్నట్లే.

........................


దైవపూజ కోసం విధివిధానాలు కానీ, విధివిధానాల కొరకు దైవపూజ ఏర్పాటు చేయలేదు. 
 
అతి చారాలను తగ్గించుకుంటే,  దైవాన్ని ప్రశాంతంగా  ఆరాధించుకోవచ్చు.
 ......................
 రామానుజాచార్యుల వారు, శంకరాచార్యుల వారు సమాజక్షేమం కొరకు ఎంతో కృషి చేసారు.  
 
 నాకు తెలిసినంతలో, హిందువులలో.. వైష్ణవము, శైవము, శాక్తేయము..ఇలా వివిధ పద్ధతులు ఉన్నాయి.  ఆదిశంకరులు తెలియజేసిన పంచాయతన పద్ధతిలో తాము అధికంగా పూజించుకోవాలనుకున్న దేవతను మధ్యలో ఉంచి పూజిస్తారు. 
 ...............

అందరు దేవతలను ఒకే దైవశక్తిగా శ్రీ మాత..శ్రీ పరమాత్మగా లేక పరమాత్మగా కూడా పూజించుకోవచ్చు..అని నాకు అనిపిస్తుంది.
 .......................... 
 
ఈ పోస్ట్ పెద్దది అయ్యింది.
 konni links...
 

Saturday, July 16, 2016

ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరాదు...

 
ఈ రోజులలో  ప్రజలు రోగాల బారిన పడటం ఎక్కువగా జరుగుతోంది.  

వయస్సుతో సంబంధం లేకుండా  చిన్నపిల్లలు  కూడా ఎక్కువగా వ్యాధుల బారిన పడుతున్నారు. 

ఇలా  జరగటానికి అనేక కారణాలున్నాయి.

 వాతావరణ కాలుష్యం బాగా పెరగటం , పంటలు పండించటానికి రసాయన ఎరువులు వాడటం , చదువు, ఉద్యోగ వత్తిళ్ళు పెరగటం..ఇలా అనేక కారణాలున్నాయి.

 ఈ రోజుల్లో  ఇంటి శుభ్రత కోసం వాడుతున్న రకరకాల రసాయనాల వల్ల కూడా భూమి, నీరు కలుషితం అవుతున్నాయి.


 ఇలా కలుషితమైన మట్టి, నీటితో పంటలు పండించటం  అనారోగ్యకరం.
..............................

 అనారోగ్యం రావటానికి  ఇంకో ముఖ్యమైన కారణం ఏమిటంటే ..చిన్నతనం నుంచి తీసుకునే ఆహార  పద్ధతిలో వచ్చిన విపరీతమైన  మార్పులు.

 పాతకాలంలో ఇంట్లోనే  తయారుచేసిన ఆహారం ఎక్కువగా తీసుకునే వారు.

ఈ రోజుల్లో ఎక్కువగా బయట ఆహారం తీసుకోవటం జరుగుతోంది.

 పాతకాలంలో...  కొబ్బరి నూనె, పసుపు, కారం ...వంటివి  ఇంట్లోనే తయారుచేసుకునేవారు.


 ఈ రోజుల్లో అల్లం..వెల్లుల్లి పేస్ట్ కూడా బయట నుంచి కొని తెచ్చుకునే పరిస్థితి ఉంది.

బయట నుంచి తెచ్చుకునే వాటిలో నిల్వ ఉండటం కోసం కొన్ని రసాయనాలు కలిపే అవకాశం ఉంది.

 ఈ రోజులలో  పదార్ధాల రుచికొరకు వాడే రసాయనాలతో కూడిన ఆహారాన్ని తినటం ఎక్కువయింది.  


 జంక్ ఫుడ్ వల్ల రుచి బాగుంటుంది కానీ, రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

 ఆహారపదార్ధాలలో రుచి పెరగటం కోసం  ఈ రోజుల్లో  చాలామంది ..  ఎన్నో వంటలలో  బేకింగ్ సోడా, అజనిమోటో వంటివి.. వాడుతున్నారు. 

 అజనిమోటో  బయట షాపులలో సులభంగా లభిస్తుంది. ఇవన్నీ వాడటం వల్ల ఆహార పదార్ధాలకు ఒక విధమైన  రుచి  రావటం వలన  వీటి  వాడకం  బాగా పెరిగింది.

 ఆ రుచికి అలవాటుపడటం వల్లకు మళ్లీమళ్లీ అవే తినాలనిపిస్తుంది.  అలా శరీరంలోకి  వెళ్లే అజనిమోటో పరిమాణం బాగా పెరుగుతుంది. 


 అజనిమోటో  తరచు వాడితే కలిగే నష్టాలు చాలామందికి తెలియదు.

ఇంట్లో చేసుకునే వంటలలో కూడా అజనిమోటో, సోడాఉప్పు వంటివి ఎక్కువగా వాడటాన్ని తగ్గించాలి.

నాకు తెలిసినంతలో సోయాసాస్ , వెనిగర్ వంటివి పదార్ధాలను నెలల తరబడి పులవబెట్టి తయారుచేస్తారు.


   కెమికల్స్ తో కూడా సోయాసాస్, వెనిగర్ తయారుచేస్తారట.

 మన పూర్వీకులు  సోడాఉప్పు వంటివి  వాడకుండానే వెన్న వాడి  కరకరలాడే రుచికరమైన స్నాక్స్ చేసేవారు. 

................................

 పాత రోజుల్లో  సూర్యరశ్మి, వెన్నెల, గాలి, వెలుతురు ప్రసరించే విధంగా జీవనశైలి ఉండేది.

 ఈ రోజుల్లో  ఎక్కువగా  నాలుగుగోడల మధ్యన సెల్ ఫోన్స్, టీవీ, కంప్యూటర్స్.. మధ్యే ఉంటున్నారు.  


అనారోగ్యాలు పెరగటానికి ఇవన్నీ కారణాలే.

40 సంవత్సరాల క్రిందట కూడా  కాన్సర్, కిడ్నీ..వంటి వ్యాధులు  అరుదుగా ఉండేవి.  


ఇప్పుడు చిన్నపిల్లలలో కూడా కాన్సర్, కిడ్నీ..వంటి జబ్బులు వస్తున్నట్లు  వింటున్నాము.

ఆరోగ్యమే మహాభాగ్యం.  ఆరోగ్యాన్ని  అశ్రద్ధ  చేయరాదు.



Monday, July 11, 2016

విపరీతమైన జనాభా పెరుగుదల అనేక సమస్యలకు మూలం.

విపరీతమైన జనాభా పెరుగుదల వల్ల అనేక నష్టాలున్నాయి.

  విపరీతంగా జనాభా పెరిగితే వనరులు సరిపోవు. 

దేశంలో ఆహార కొరత,  నిరుద్యోగ సమస్య ఎక్కువ అయ్యే  పరిస్థితులు ఏర్పడుతాయి.  

ఆహార కొరత,   నిరుద్యోగ సమస్యల  వల్ల  దేశంలో నేరాలు కూడా పెరుగుతాయి. 

 జనాభా పెరిగే కొద్దీ  దేశం జనాభాతో  కిటటలాడుతూ మురికిగా ఉంటుంది. 

విపరీతమైన జనాభా పెరుగుదల  అనేక సమస్యలకు మూలం. 

  అయితే,  మరీ ఒక్కరే కాకుండా,  ఇద్దరు సంతానం ఉంటే మంచిది. 

Wednesday, July 6, 2016

పండుగ సందర్భంగా శుభాకాంక్షలు..




జగన్నాధ రధయాత్ర శుభాకాంక్షలు...



Saturday, July 2, 2016

శ్రీ అమర్‌నాధ్ శివలింగం రూపం లాంటి రూపం ఫ్రిజ్ లో.... ..మరియు కొన్ని విషయములు..



శుభప్రదమైన 2016 సంవత్సరపు అమర్ నాధ్ యాత్ర ప్రారంభమయింది. 

 .........

విజయవాడలో ఉన్న  కనకదుర్గమ్మ దేవాలయానికి వెళ్ళే దారిలో ఉన్న విఘ్నేశ్వర స్వామి దేవాలయాన్ని కూల్చివేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా  చేయాలనుకోవడం చాలాచాలాతప్పు.

 

*********

ఇంతకుముందు వ్రాసిన ఒక టపా కూడా ఇక్కడ ఇస్తున్నాను .

 

 Friday, June 18, 2010





శ్రీ అమర్‌నాధ్ శివలింగం రూపం లాంటి రూపం ఫ్రిజ్ లో.... ..




ఈ విషయం చెప్పాలని ఎప్పటినుండో అనుకుంటున్నానండి. ఇది సుమారు అయిదు సంవత్సరముల క్రిందట జరిగింది.


అప్పట్లో మేము చెన్నైలో ఉండేవాళ్ళమండి. మా ఫ్రిజ్ లో ఎప్పుడు అందరికిలానే అయిస్ ఫార్మ్ అవుతుంది. కానీ ఒకసారి అయిస్ పెద్ద ఆకారములో దగ్గరదగ్గర శ్రీ అమర్‌నాధ్ శివలింగం ఆకారములో ఏర్పడిందండి. డీప్ ఫ్రిజ్లో నీరు బొట్లుబొట్లుగా పడుతూ రెండు ఆకారములు ఏర్పడ్డాయి. ముందు నేను గమనించలేదు. తర్వాత చూసి ఆశ్చర్యపోయామండి. ఒక ఆకారానికి ముఖము లాగ కూడా అనిపిస్తోంది.




. ప్రక్కన వాళ్ళకు చూపిస్తే ఫొటోస్ తియ్యమని సలహా ఇచ్చారు. కొన్నాళ్ళు తరువాత ఆ అయిస్ కరిగించి నీరు శ్రీ పిడారి నవశక్తి కాళీ అమ్మన్ అమ్మవారి గుడిలోని చెట్టు మొదట్లో పోశానండి. గుడివారికి ఈ విషయములు చెప్పలేదండి. ఈ ఫ్రిజ్లోని అయిస్ తో ఏర్పడ్డ ఆకారములను కొందరికి మాత్రమే చూపించామండి. అంటే అసలే రోజులు బాగాలేదు కదా ఎవరికయినా చెప్పినా నమ్మకపోగా మేమే ఇలా అయిస్ తో ఏర్పాటు చేశామని అన్నా అంటారు. ఎందుకొచ్చిందని ఊరుకున్నామండి.



కానీ తరువాత ఏమనిపించిందంటే భగవంతుని కి సంబందించిన వింతలు ఇతరులుకు కూడా చూపిస్తే మంచిది కదా అని. అలా కొందరికి ఫోటోస్ ను మెయిల్ చేశాము. ఈ ఫోటోస్ ను చూస్తే నాకు కొంచెము బాధగా అనిపిస్తుంది ఎందుకంటేనండి. అప్పుడు వీడియో తీయించుకోలేకపోయాము. వీడియోలో అయితే బాగా కనిపిస్తుంది కదా... ఇప్పుడు మాకు వీడియో కెమెరా ఉంది కానీ అలా మళ్ళీ ఏర్పడలేదు. . . . . .నేను అయితే ఇది అద్భుతం అనుకుంటాను. .


ఇది సహజంగానే అలా ఏర్పడిందండి. ఇక నమ్మటం నమ్మకపోవటం ఎవరి ఇష్టం వాళ్ళది. .ఆ భగవంతుని దయవలన క్రితం సంవత్సరం మేము ,పిల్లలతో శ్రీ అమర్ నాధ్ జీ యాత్ర, శ్రీ వైష్ణవీ దేవి అమ్మవారి యాత్రలు చేసి వచ్చామండి. .....