koodali

Monday, August 27, 2018

ఇంట్లోనే పిండి తయారీ ..కొన్ని విషయములు..


ఈ శ్రావణ పౌర్ణమికి ఈ సంవత్సరపు అమరనాధ్ యాత్ర సమాప్తమయింది.

*****************
పాతకాలంలో  తిరగలి తో ఇంట్లోనే పిండి తయారుచేసుకునేవారు.

 *************

ఈ రోజుల్లో  పిండి తయారీకి మిల్లుకు వెళ్తున్నారు. 
  
నేను ఒకసారి  పిండి మిల్లుకు బియ్యం తీసుకెళ్ళాను. 

నాకంటే ముందే  ఒకరు పిండి పట్టించటం కోసం బియ్యం డబ్బా  మూత తీసి సిద్ధంగా ఉన్నారు. 

వాళ్ళు  బియ్యాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోవటం వల్ల చీమలు, పురుగులు కనిపించాయి. నేను చెబితే అప్పుడు చూసి శుభ్రం చేసారు. 

మిల్లుకు తెచ్చే  ముందు శుభ్రం చేసి తేవాలి.

************
 బయట అమ్మే పిండి , నూనె వంటివాటిలో  కల్తీ జరిగే అవకాశముందని కూడా చాలామంది భయపడుతున్నారు.

ఈ రోజుల్లో ఇంట్లోనే పిండి తయారీ, నూనె తీయడానికి చిన్న మెషిన్లు వచ్చాయి.

*************
అయితే, అందరూ ఇంట్లో సొంత పిండిమరలు కొనరు. మేము కూడా ఇవన్నీ కొనలేదు.

అందుకని ఎవరైనా మిల్లుకు వెళ్లేముందు బియ్యంలో, పప్పులలో.. చీమలు, పురుగులు లేకుండా శుభ్రం చేసి తీసుకెళ్లాలి.

***************
ఈ రోజుల్లో కూడా తిరుగళ్లు  లభిస్తున్నాయి.

తిరుగలి కొరకు  ఇక్కడ .... 

Hand Carved Stone Grain Mill

******************
ఇంట్లోనే పిండి తయారీ  మెషిన్లలో ..కొన్నింటి గురించి ఇక్కడ ఇస్తున్నాను. 


* Flour Mill by Cookwell Domestic Appliances, Mumbai 

* Stainless Steel Domestic Flour Mill - PRICE FREE DELIVERY Rs 7000 : Online Demo 749000 7617

 * 9 Best Grain Mills 2017

*******************
ఇంట్లోనే  ఆయిల్ తయారీ  మెషిన్ కొరకు .... 

* Seeds2Oil - Home Oil Maker

************

మెషిన్ లేకుండా  ఇంట్లోనె కొబ్బరి నూనె తయారి గురించి  కింద చూడగలరు... 

* ఇంట్లోనె కొబ్బరి నూనె తయారీ...


Monday, August 20, 2018

వరదల వల్ల..



చాలా ప్రాంతాల వాళ్లు వరదల వల్ల  బాధలుపడుతున్నారు. 

ఇలా జరగటం చాలా బాధాకరం.  


Saturday, August 18, 2018

కొన్ని విషయములు.. గ్రంధాల ద్వారా..


 గ్రంధాల ద్వారా మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి... 

 శ్రీ దేవీభాగవతము గ్రంధము  (వచనము)లోని  కొన్ని విషయములు...

యమధర్మరాజు,  సావిత్రీదేవికి తెలియజేసిన  కొన్ని విషయాలు..

(సాయుజ్య-సారూప్యప్రదంగా) ద్వివిధమైన భక్తి ఒక్కటే కర్మనిర్మూలకం.అని యమధర్మరాజు తెలియజేసారు.


ఇంకా,ఎన్నో విషయాలను తెలియజేస్తూ,

 కాబట్టి దానధర్మాది శుభకర్మలను నిష్కామంగా ఆచరించి సద్గతులు పొందాలి. అని కూడా తెలియజేసారు.


యమధర్మరాజును,  సావిత్రీదేవి అడిగిన సందేహాలలో కొన్ని విషయాలు..

భూలోకంలో మరణించాక దేహం భస్మమైపోతుంది.మట్టిలో కలిసిపోతుంది.  ఆపైని ఏ రూపంతో లోకాంతరాలకు వెళ్ళి శుభాశుభకర్మలను అనుభవించడం జరుగుతుంది?

అంతంతకాలం నరకయాతనలు అనుభవిస్తోంటే దేహం నశించకుండా ఎలా ఉంటుంది ? అసలు ఆ దేహం ఏమిటి ? అని ఎన్నో సందేహాలను అడగటం జరిగింది.

యమధర్మరాజు  సావిత్రికి  దేహస్వరూపాన్ని వివరిస్తూ..

స్థూలశరీరం పంచభూతాత్మకం.అది కృత్రిమదేహం. కనక నశ్వరం - బూడిద అయిపోతుంది. మట్టిలో కలిసిపోతుంది. పంచభూతాలూ పంచభూతాలలో కలిసిపోతాయి...

 అటుపైని అంగుష్ఠ ప్రమాణంలో జీవుడు మిగులుతాడు.ఇది సూక్ష్మదేహం. దీనితోనే శుభాశుభకర్మఫలాలు అనుభవిస్తాడు...

 ఇది నశించదు. శిధిలం కాదు.అగ్నిదగ్ధం కాదు.శస్త్రాస్త్రాలకు లొంగదు. తప్తద్రవ తప్తతైల  తప్తపాషాణాది  కూపాల్లో ఎంతకాలం ఎన్ని శిక్షలు వేసినా చెక్కుచెదరదు.దుఃఖాలను మాత్రం అనుభవిస్తూంటుంది. అని  ఎన్నో విషయాలను తెలియజేసారు.  

******************
జనమేజయునికి వ్యాసులవారు చెప్పగా సూతులవారు శౌనకాది మునులకు తెలియజేసిన విషయాలలో కొన్ని విషయాలు...

అనేక పూర్వజన్మలలో సంపాదించుకున్నది - సంచితకర్మ.....

దేహధారులందరూ శుభమో అశుభమో ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటారు. చెయ్యక తప్పదు..... 

సంచితకర్మల నుంచి ఏదో కొంతభాగాన్ని ఇటు తెచ్చి ప్రస్తుత( జన్మారంభంలో)-దేహారంభంలో కాలం వర్తమానకర్మకు ప్రేరణ ఇస్తుందనుకుంటాను.ఇలా ప్రారంభింపబడినదే ప్రారబ్ధకర్మ.....


 అసలు దేహారంభానికి ( జన్మించడానికి) కారణం కూడా కర్మయే. సకల ప్రాణులకూ కర్మక్షయమే జన్మనాశం...అని ఎన్నో విషయాలను తెలియజేసారు.

శ్రీదేవీభాగవతములో దేవీగీత కూడా ఉన్నది.

********
శ్రీ భగవద్గీతలో నిష్కామకర్మయోగమును శ్రీకృష్ణపరమాత్మ తెలియజేసారు.

************
 ఒక యోగి ఆత్మ కధ గ్రంధంలో కూడా .. ఎన్నో విషయాల గురించి  తెలియజేసారు.

**************
వ్రాసిన విషయాలలో అచ్చుతప్పుల వంటివి ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను. 




Thursday, August 16, 2018

వ్యాధుల వల్ల ...


వాజపేయి గారు  గొప్పవ్యక్తి . వారు మరణించారని  తెలిసింది. 

వారికి   ఉత్తమగతులు  కలగాలని   కోరుకుంటున్నాను. 

**************

వారు  కిడ్నీ వ్యాధితో  బాధ పడ్డారని వార్తల ద్వారా తెలుస్తోంది. 

ఈ మధ్య కిడ్నీ వ్యాధి చాలామందిలో వస్తోంది.

ఈ వ్యాధి రావటానికి అనేక కారణాలుంటాయట.

కొన్ని కారణాలు.... కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవటం.

 బీపీ, సుగర్ వంటి వ్యాధుల వల్ల,

ఎక్కువగా మందుల  వాడకం..

 ****************

కొందరు పేదలు,  కలుషితమైన ఆహారం, నీరు తీసుకునే అవకాశం ఉంది.

 మరి..  మంచి ఆహారం, శుద్ధిచేసిన నీరు అందుబాటులో ఉన్నవారు కూడా వ్యాధుల బారిన పడటం ఆశ్చర్యం.


బహుశా ,రసాయన పురుగుమందులతో  పండించిన ఆహారపదార్ధాలు, రసాయనాలతో శుద్ధి చేసిన నీరు కూడా హానికరమా ? అనే సందేహం కలుగుతోంది.


జీవితంలో ఒత్తిడి పెరగటం వలన బీపీ వంటి వ్యాధులు వస్తాయి.

 సూర్యరశ్మి అంతగా తగలకుండా గదుల్లో గడపటం వంటి కారణాల వల్ల కూడా సుగర్ వ్యాధి వచ్చే అవకాశముందంటున్నారు.


 చిన్నాచితకా అనారోగ్యాల కారణంగా ఎక్కువగా మందులు వాడటం వల్ల  కూడా కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉందట.

****************

ఎవరైనా, వయస్సు మీదపడిన  తరువాత మరణించటం సహజం. 

 అంతేకాని,  వ్యాధుల వల్ల వ్యక్తులు చనిపోవటం బాధాకరం.


 వ్యాధి రాకుంటే వాజపేయి గారు రాజకీయాల్లో చాలాకాలం చురుగ్గా పాల్గొనేవారు.


ఇకనుంచయినా, దేశంలో  వ్యాధులు పెరగకుండా   అందరూ జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యాలు తగ్గుతాయి.



Wednesday, August 15, 2018

కొన్ని విషయాలు ..


 శ్రావణ పంచమి సందర్భంగా శుభాకాంక్షలు.

*************

ఆగష్టు 15 న  దేశానికి స్వాతంత్య్రం వచ్చిన  శుభసమయం.  

 ఎందరో మహనీయులు ఎన్నో కష్టాలకు ఓర్చి , ఎన్నో త్యాగాలతో   దేశానికి  స్వాతంత్య్రం  సాధించారని  అందరూ  గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది.  

..........................

ఎవరికైనా మనసు బాగోనప్పుడు ...

ధ్యానం చేయటం.. మంచి పాటలు వినటం ..మంచి పుస్తకాలు చదువుకోవటం..మంచి వ్యక్తులతో  కొంతసేపు కబుర్లు చెప్పుకోవటం..పనిలో  నిమగ్నమవటం..ఇలా  ఎన్నో మార్గాలున్నాయి.  తద్వారా  మనస్సు కుదుటపడే అవకాశం ఉంది.
.........................
  
పని  ముగించి ఖాళీగా కూర్చుంటే మళ్ళీ ఆలోచనలు విజృంభించే అవకాశమూ ఉంది. అందుకని అప్పుడప్పుడూ దైవనామ స్మరణ చేయటం అలవాటు చేసుకోవాలి.  కుదిరితే  కనీసం 10 నిమిషాలకు ఒకసారైనా దైవనామాన్ని స్మరించుకుంటే మంచిది.

  ధర్మబద్ధంగా  జీవించాలి.  అయితే,    కొన్నిసార్లు ...ఏది సరైన పద్ధతో ?   ఏది సరైనది కాదో  ? ఏం చేయాలో ?   ఏం చేయకూడదో ?   తెలియని గందరగోళ పరిస్థితులూ ఎదురుకావచ్చు.

అందువల్ల ,  సరైనవిధంగా  నడిచేలా  సాయం చేయమని   దైవాన్ని ప్రార్ధించాలి . దైవాన్ని శరణు వేడాలి. 
 

Monday, August 13, 2018

నాకు కొన్ని ఆలోచనలు ...


ఈ రోజు శ్రావణ సోమవారం మరియు గోదాదేవి జయంతి సందర్భంగా శుభాకాంక్షలండి.

*********************
ఒక విషయాన్ని వ్రాయాలనుకుంటున్నాను  .

ఈ మధ్య ఒక పత్రికలో.. దైవం గురించి శ్రీ రామకృష్ణపరమహంస వారు చెప్పిన విషయం గురించి ప్రచురించారు.


 ఎన్ని పేర్లతో పిలుచుకున్నా దైవం ఒకరే అని, నీటిని కొందరు నీరు అంటారు, కొందరు వాటర్ అంటారు, కొందరు పానీ అంటారు..అయినా నీరు ఒక్కటే అయినట్లు దైవశక్తి ఒకరే అని.. వారు చెప్పటం గురించి పత్రికలో చదివాను. 


ఈ విషయం చదివిన తరువాత నాకు ఆశ్చర్యం మరియు గాభరా కలిగింది.

 నేను,  పాత  టపాలలో .. ఎన్ని పేర్లతో పిలిచినా దైవం ఒక్కరే ..అని వ్రాసి, ఇలాంటి ఉదాహరణలు వ్రాయటం జరిగింది.


నేను టపాలో పై విషయాలను వ్రాసినప్పుడు, శ్రీ రామకృష్ణపరమహంస గారు పైన చెప్పిన విషయాలను చదివినట్లుగా గుర్తులేదు. 


గుర్తు ఉంటే , నేను సొంతంగా వ్రాసినట్లు కాకుండా, రామకృష్ణపరమహంస గారు ఇలా చెప్పారని వ్రాయటం జరిగేది.

*************
ఇవన్నీ   ఆలోచిస్తే  నాకు ఏమనిపించిందంటే, 

నేను కొన్ని సంవత్సరాల క్రితమే రామకృష్ణపరమహంస గారి గురించి పుస్తకాలలో చదివాను. 

అలా చదివినప్పుడు ఎప్పుడైనా దేవుని గురించి వారు చెప్పిన విషయాలను చదివి ఉండవచ్చు,

పైకి ఆ విషయాలను మర్చిపోయినా, నా అంతరంగంలో అవి గుర్తుండిపోయాయేమో? వాటినే నేను టపాలలో వ్రాసానేమో ? అని ఒక ఆలోచన వచ్చింది.


 అయితే టపాలో ఆ విషయాలను వ్రాసినప్పుడు అవి రామకృష్ణుల వారు చెప్పిన విషయాలని తెలియరాలేదు.


తెలిస్తే వారు చెప్పినట్లుగానే ఆ విషయాన్ని టపాలో వ్రాయటం జరిగేది.

 అంతేకానీ, రామకృష్ణుల వారు చెప్పిన విషయాలను నా సొంత ఆలోచనలుగా వ్రాయాలన్నంత  దుస్సాహసం నాకు లేదు. 

ఎవరు నమ్మినా నమ్మకపోయినా జరిగింది మాత్రం ఇదే.

ఏం జరిగిందో భగవంతునికి తెలియాలి.

*******
రామకృష్ణపరమహంస వారు ఎంతో గొప్పవారు, వారు అవతారమూర్తులు. నేను హైదరాబాద్లో రామకృష్ణ మఠానికి చాలాసార్లు వెళ్ళాను.

 రామకృష్ణపరమహంస వారికి శారదామాతకు, వివేకానందుల వారికి నా వందనములు.


Wednesday, August 8, 2018

ఈమధ్య వార్తాపత్రికలో చదివిన ఒక వార్త ఏమిటంటే,


  
జీవితభాగస్వామికి..  నయం కాని రోగాలు  ఉంటే  ఆ కారణంగా విడాకులివ్వచ్చని విన్నాను. 

ఈ విషయాల గురించి చట్టంలో  ఏముందో పూర్తి వివరాలు  నాకు తెలియదు.

అయితే, ఈమధ్య వార్తాపత్రికలో చదివిన  ఒక వార్త ఏమిటంటే,

 ఈరోజుల్లో కుష్టు వ్యాధికి నయమవటానికి మందులు వచ్చాయి కాబట్టి, 

విడాకులు ఇచ్చే విషయంలో ఈ వ్యాధి ఉన్నవారిని మినహాయించాలని కొందరు కోరుతున్నారట. 


ఇవన్నీ చదివాక  నాకు కొన్ని సందేహాలు కలిగాయి. నాకు ఏమనిపించిందంటే, 

అన్ని బంధాల కన్నా భార్యాభర్తల బంధం  బలహీనమైనదా ? అనిపించింది. 

తల్లితండ్రికి నయం కాని వ్యాధులు వస్తే వాళ్లను వదిలేయమని ఎవరూ అనరు. 

సోదరసోదరీమణులకు వచ్చినా వాళ్ళను వదిలేయమని అనరు.

 పిల్లలకు వచ్చినా ఎవరూ వదిలేయరు. 

మరి భార్యాభర్తల విషయంలోనే వాళ్ళను వదిలేయవచ్చు అనటం ఎందుకు ? అనేది  అర్ధం కాలేదు. 

******************
పిల్లలు తమ తల్లితండ్రి ఇద్దరూ తమ వద్ద ఉండాలనుకుంటారు.  భార్యాభర్తల విడాకుల వల్ల పిల్లలు బాధపడతారు. 

 వివాహంలో భార్యాభర్తలకు భరోసా అనేది లేదనే అభిప్రాయాలు పిల్లలకు కలిగి, వాళ్లు వివాహవ్యవస్థపై నమ్మకం కోల్పోయే పరిస్థితి రాకూడదు. 

***********************

కొంతకాలం క్రిందట మాకు తెలిసిన వారింటికి వెళ్తే వాళ్ళ అమ్మాయిని చూసాము.. ఆమె మతిస్థిమితంలేని స్థితిలో ఉన్నది. 


ఆమె భర్త,  అత్తా, మామ.. ఆరళ్లు పెట్టగా ఆమెకు  మానసిక వ్యాధి వచ్చిందట.. 


మానసిక వ్యాధి  వచ్చేలా చేసిన భర్త కూడా  భార్యకు మెంటల్ అనే  కారణం చెప్పి విడాకులివ్వచ్చా?  


కొందరు బయటకు ఎంతో సాత్వికుల్లా కనిపిస్తూ, నీతులు చెబుతూ సమాజంలో  మంచిగా పేరు తెచ్చుకుంటారు.. 


తమకు ఇష్టం లేని కుటుంబసభ్యులకు  మాత్రం నరకం చూపిస్తారు....
 

తెలివిగా ప్రవర్తించి, తప్పు ఎదుటివాళ్ళదే అన్నట్లు లోకానికి అనిపించేలా ప్రవర్తిస్తారు.

సీరియల్స్ చూస్తే ఇలాంటి సంఘటనలు ఎలా ఉంటాయో చక్కగా అర్ధం అవుతుంది.  


 వివాహసమయంలో వధూవరులు ..జీవితంలో  కష్టసుఖాలను పంచుకుంటూ  కలిసిమెలసి కలకాలం కాపురం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తారు.



అనారోగ్యం వచ్చిందనే కారణంతో జీవితభాగస్వామిని మధ్యలోనే వదిలేస్తే..ఇక  కుటుంబ బంధాలకు భరోసా ఏమిటి?


**************

ఏ బంధమూ లేకపోయినా సాటిమనుషులు కష్టాలలో ఉంటే వారిని ఆదుకోవటం మానవత్వం అంటారు కదా! 

జీవితభాగస్వామి అంటే జీవితంలో భాగం పంచుకునే దగ్గరి వ్యక్తి. 


మరి, జీవితభాగస్వామికి ఆరోగ్యం ఉన్నప్పుడు ఉపయోగించుకుని, అనారోగ్యం వస్తే విడాకులు ఇచ్చేసి వదిలేస్తే,


 ఆ బంధానికి  జీవితభాగస్వామి అనే ఘనమైన పదం వాడటం ఎందుకు?

***************************
ఎయిడ్స్ వంటి వ్యాధిగ్రస్తులకు  వైద్యులు ట్రీట్మెంట్ చేయటానికి నిరాకరిస్తే నేరమవుతుందట.

అయితే,  వ్యాధి ఉన్నదనే నెపంతో  జీవితభాగస్వామి మాత్రం విడాకులిచ్చి బాధ్యతల నుండి తప్పించుకోవచ్చా?అన్నది తెలియటం లేదు. 

*  ఇలాంటప్పుడు కొన్ని సందేహాలు కూడా వస్తాయి.

 జీవితభాగస్వామి ఎలాంటివారైనా సరే , వారిని ఆదరించాలి అంటే ఒక సమస్య...


 ఆదరించనక్కరలేదు అంటే ఇంకో సమస్య. 


ఉదా.. కొందరు వ్యక్తులు జీవితభాగస్వామిని ఏడిపించి, నైతికవిలువలు లేకుండా తమకు ఇష్టమొచ్చినట్లు బయటవారితో తిరిగి ఎయిడ్స్ వంటి వ్యాధులు తెచ్చుకుని, ఆనక తమను ఇంట్లో వాళ్ళు ఆదరించి తీరాలి అంటే.. ఆ పరిస్థితి ఎంతవరకు సరైనది ?



ఇంకో ఉదా.. కొందరు ఏ తప్పూ చేయకపోయినా, పొరపాటునో లేక సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వ్యాధిగ్రస్తులు వాడిన వస్తువు వాడటం వల్లనో  ప్రమాదకరమైన  జబ్బు వస్తే.. అలాంటి వారిని జీవితభాగస్వామి ఆదరించటం సరైనదే కదా! అనిపిస్తుంది.



 కొన్ని కాన్సర్లు, గుండె , కిడ్నీ.. వంటి  జబ్బులు కూడా ముదిరిన  తర్వాత గుర్తిస్తే   నయం కావు.  మరి అలాంటప్పుడూ విడాకులు ఇవ్వచ్చా ? 


**************
ఇలా సమాజంలో ఎన్నో సమస్యలు, సందేహాలు కలుగుతాయి .

 ప్రతి సమస్యకు ఒకే సమాధానం కాకుండా , ప్రతి సమస్యను దానికదే ప్రత్యేకంగా విశ్లేషించి ఏం చేయాలో నిర్ణయిస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది. 

************
ఇంకొక విషయం ఏమిటంటే, తప్పులు చేసినవాళ్లు ఏదో ఒకటి చేసి ఇక్కడ శిక్ష నుండి తప్పించుకున్నా కూడా..దైవన్యాయస్థానం నుండి తప్పించుకోలేరు.



Monday, August 6, 2018

దుర్గాడలో సర్పం..


దుర్గాడలో సర్పం మరణించటం ఎంతో బాధాకరం. 

ఆ సర్పం అన్ని రోజులు అలా ఉండి  ఎవరినీ  కరవకపోవటం ఆశ్చర్యం.

కొందరు భక్తులు, సర్పం తమ వద్ద తిరుగుతున్నా భయపడకుండా కదలకుండా ఉండటం గొప్పవిషయమే..

అయితే, ఆ సర్పం  తన ఇష్టానికి  వెళ్ళడానికి  వీలులేకుండా చుట్టూ   జనం   గుమిగూడి  ఉన్నట్లు టీవీలో చూస్తున్నప్పుడు  అనిపించింది.


జనం అలా చుట్టూ నిల్చోటం కాకుండా సర్పానికి దారి ఇస్తే బాగుండేది .

రాత్రిసమయంలో సర్పం చుట్టూ ఎవరూ లేరు.. సర్పం ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళేది కదా.. అని కొందరు అన్నారు. 


(నిజంగా రాత్రి సమయంలో అక్కడ ఎవరూ లేరా ? లేక రాత్రి సమయంలో సర్పానికి  కొందరు జనం కాపలా ఉన్నారా ? లేదా ? అనేది తెలియదు.)


 మొత్తానికి  ఏం జరిగిందో ?  భగవంతునికి తెలియాలి.


సర్పాలు గుడ్లను కూడా  తింటాయంటారు.  ఆ సర్పానికి ఆహారంగా కోడిగ్రుడ్లను ఇస్తే బాగుండేది. 

( ఇచ్చారో? లేదో?  తెలియదు).

 ఒకరు   ఏమన్నారంటే,  ఆ సర్పం అలా  ఆహారం లేకుండా ఎండలో  తిరుగుతూ ఉంటే  చనిపోయే అవకాశం ఉంది కాబట్టి,   సర్పాన్ని తీసుకెళ్ళి  ఆహారం తినిపించాలి  అన్నారు.

 అలా తీసుకెళ్ళి రక్షణచర్యలు తీసుకుంటే సర్పం మరణించకుండా ఉండేదేమో? 

అలా తీసుకెళ్ళటానికి ప్రజలు ఒప్పుకున్నారో? లేదో?  తెలియదు . 

సర్పం మరణించటం మాత్రం బాధాకరం.

ఎంతో మంది ప్రజలు చుట్టూ ఉండి , టీవీల్లో చూస్తూ ఉండి కూడా సర్పాన్ని కాపాడలేక ...  ఆ మూగజీవి అలా అయిపోయింది. 

పుట్టల వద్ద,  పొలాల్లో తిరుగుతూ   కొన్ని సర్పాలు  అప్పుడప్పుడు ప్రజలకు కనిపిస్తాయని అంటారు.

ఈ సర్పం కూడా జీవించి ఉన్నట్లయితే,   ఆ పరిసరాల్లో తిరుగుతూ  అప్పుడప్పుడు ప్రజలకు కనిపిస్తూ ఉండేదనిపిస్తుంది.


Friday, August 3, 2018

మంచిని ప్రోత్సహించాలి, చెడును పారద్రోలాలి...



 ఆచారవ్యవహారాలలో.. కొందరు తెలిసితెలియని వాళ్లవల్లా, కొందరు స్వార్ధపరుల వల్లా సమాజంలో కొన్ని మూఢాచారాలు ప్రవేశించాయి. వాటిని వ్యతిరేకించవలసిందే. 

 
అలాగని ప్రతి ఆచారాన్ని వ్యతిరేకించటం కూడా మూఢత్వమే. పూర్వీకులు తెలియజేసిన ఆచారవ్యవహారాల్లో ఎన్నో మంచి విషయాలున్నాయి.ఎంతో సైన్స్ ఉంది.


భక్తులు  కూడా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. 

పాపపుపనులు చేసి సంపాదించిన సొమ్ముతో పూజలు చేస్తే పుణ్యం రాకపోగా, పాపం చుట్టుకుంటుందని పెద్దలు తెలియజేసారు.


రావణాసురుడు కూడా ఎన్నో పూజలు చేశాడు.  అతని పాపాలు కొట్టుకుపోలేదు. 

అతను చేసిన పాపాల వల్ల అతనూ, అతని వారసులూ కూడా కొట్టుకుపోయారు. 

 దైవకృపను పొందాలంటే పూజతో పాటు సత్ప్రవర్తనతో జీవించటానికి ప్రయత్నించాలి.

..................
 సమస్యలు పోవాలంటే వ్యక్తులలో చెడులక్షణాలు పోవాలి. కోపం, స్వార్ధం..వంటి లక్షణాలు ఉంటే మనకే నష్టం. 

అయితే.. కోపం, స్వార్ధం..వంటివి ఉండకూడదని చెపుతున్న నేను కూడా కోపాన్ని, స్వార్ధాన్ని పోగొట్టుకోవటంలో ఇంకా పూర్తిగా విజయాన్ని సాధించలేదు. 

అయితే, అందరం పట్టుదలగా ప్రయత్నించి చెడు లక్షణాలను వదిలించుకుంటే మనకే మంచిది.

 మనలో చెడులక్షణాలు పోవాలని దైవాన్ని ప్రార్ధించాలి.
...............

Friday, September 2, 2011

దైవం ఎప్పటికప్పుడు ధర్మమును కాపాడటం జరుగుతుంది...


.................
కొన్ని ఆధునిక ఆవిష్కరణల వల్ల ఉపయోగాలు కలుగుతున్నాయి. కొన్నింటి  వల్ల నష్టాలూ కలుగుతున్నాయి. మంచిని ఉంచుకుని చెడును వదిలెయ్యాలి.

 ఆధునికకాలంలో పర్యావరణానికి  అపారమైన నష్టం కలుగుతోంది.గ్లోబల్ వార్మింగ్, పారిశ్రామిక   కాలుష్యం..వంటి వాటి వల్ల ఎన్నో జీవజాతులకు ముప్పు కలుగుతోంది.  ఇలాంటి వాటిని వ్యతిరేకించాలి.

.....................


ఈ రోజుల్లో ఎన్నో ఘోరమైన విషయాలను వింటున్నాము.  

మానవ అక్రమరవాణా, స్త్రీల పట్ల అకృత్యాలు, చిన్నపిల్లలను అపహరించి హింసించటం, మత్తుమందుల అమ్మకాలు,  అవినీతి, లంచగొండులు, గ్లోబల్ వార్మింగ్, పారిశ్రామిక కాలుష్యం, పెరుగుతున్న వ్యాధులు...ఇలాంటివెన్నో   సమస్యలున్నాయి. 


సమాజంలో  జరుగుతున్న అఘాయిత్యాలు వింటుంటే మనిషనే ఎవరికైనా రక్తం మరిగిపోతుంది.


 అలాంటి నేరాలను చేసే నేరస్తులను కఠినంగా శిక్షించాలి. ఆ శిక్షలు ఎలా ఉండాలంటే, అలాంటి నేరాలు చేయాలనే ఊహ రావడానికే భయపడేలా శిక్షలుండాలి.


భౌతికవాదులు, నాస్తికులు ..  అనబడేవారు కొందరు.. ఎంతసేపూ..  


గ్రహణసమయంలో అందరూ బయటకు రావాలి, అన్నీ తినాలి..ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా    మాట్లాడటం కన్నా,  సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న ఎన్నో సమస్యలపై  గట్టిగా పోరాడవచ్చు కదా!


ప్రాచీనులకు  ఏమీ  తెలియదు, ఆధునిక సైన్స్ మాత్రమే గొప్ప..   అని మాట్లాడే వాళ్ళు..  ఆధునికకాలంలో  గ్లోబల్ వార్మింగ్, పారిశ్రామిక   కాలుష్యం, పెరుగుతున్న రేడియేషన్ ముప్పు ..వంటి ఎన్నో సమస్యల  గురించి ఏం  చెబుతారు?

ఏ కాలంలోనైనా ,  ఎక్కడైనా , ఏ విషయంలోనైనా  చెడును పారద్రోలాలి,  మంచిని ప్రోత్సహించాలి.