koodali

Wednesday, March 30, 2016

అమరావతి నమూనా..


అమరావతి నమూనా చక్కగా ఉంది. చక్కటి ఉద్యానవనాలు కూడా ఉంటాయంటున్నారు. అంతా బాగుంది.

 కొత్తగా నిర్మించే  భవనాలలోకి గాలి, వెలుతురు  ధారాళంగా  వచ్చేలా  నిర్మించాలనుకోవటం  ఎంతో చక్కటి విషయం. 

అయితే, ఈ రోజుల్లో భవనాలలో  ఎక్కువగా ఏసీలు ఉంటున్నాయి గానీ,  వీలైనంతలో వెలుతురు..  బాగా వచ్చేటట్లు నిర్మించుకుంటే విద్యుత్ ఖర్చు చాలావరకు  తగ్గుతుంది.

అమరావతి నమూనా  చాలా  బాగుంది .  

అయితే అసెంబ్లి మరియు శాసనమండలి భవనాల పై నిర్మాణాలు  గొట్టాలను పోలి ఉన్నాయని,  వాటి డిజైన్ మార్చితే బాగుంటుందని చాలామంది ప్రజలు అభిప్రాయపడినట్లు వార్తలు వచ్చాయి. 

ఆ గొట్టాల ఆకృతులు చూస్తే అణుకర్మాగారాలు కూడా గుర్తు వస్తున్నాయి.. (  తప్పులు ఎంచుతున్నామని దయచేసి భావించవద్దు. ఏదో తోచినంతలో నా అభిప్రాయం రాయాలనిపించి వ్రాసాను  అంతే.)

అయితే మరి ఈ గొట్టాల ఆకృతి ఏ ఉద్దేశంతో వేసారో, దానివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయేమో మనకు తెలియదు. 

  అమరావతి నిర్మాతలకు అభినందనలు. 


ఆంధ్రుల కలల  రాజధాని అమరావతి చరిత్రలో చిరకాలం  చక్కటి పేరుప్రఖ్యాతులతో నిలిచిఉండాలని ఆశిద్దాము.




Monday, March 28, 2016

రాష్ట్ర విభజన .... తరువాత..

 రాష్ట్ర విభజన సమయంలో పార్టీలు అనేక హామీలిచ్చిన సంగతి అందరికీ తెలుసు.

తమకు జరిగిన అన్యాయం గురించి ఆంధ్ర ప్రజలు అరచి గోల చేయకపోవచ్చు. అయితే, తమకు అన్యాయం చేసే వారి విషయంలో తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారు. 

ఉదా.. అప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీ ఆ తరువాత భారీగా నష్టపోవటం  గురించి అందరికీ  తెలుసు. 

 ఇప్పుడు కేంద్రం  కూడా  సరిగ్గా ఆంధ్రప్రదేశ్  ను  ఆదుకోవటం లేదనిపిస్తోంది. 

హామీల  అమలు ఆశించినంతగా లేదనిపిస్తోంది. 

రాజధాని మరియు ఇతర విషయాల కోసం భారీగా నిధులు ఇవ్వవలసి ఉంది.

 వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమలకు పన్నుల రాయితీల వంటివి కూడా ఇప్పటివరకూ అమలు చేయలేదు.

  బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కు  సరైన న్యాయం జరగలేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 

మిగతా రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ ను పోల్చటానికి లేదు.

 రాష్ట్ర విభజన ఆంధ్ర ప్రజల అభిమతానికి విరుద్ధంగా జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు  గణనీయంగా నిధులు ఇవ్వవలసి ఉంది.


 ఇవన్నీ ఎవరూ ఇచ్చే భిక్ష కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు.

 రాష్ట్ర విభజనలో ఇప్పుడు  కేంద్రప్రభుత్వంలో ఉన్న పార్టీ  ప్రమేయం కూడా ఉంది.

 విభజన జరిగిన కొత్తలో బిజేపీ పార్టీ రాష్ట్రాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీలిచ్చింది.

 అయితే ఇప్పుడు... ఇతరుల  చెప్పుడు మాటలు వినో లేక మరేదైనా కారణాల వల్లో గానీ ఆ పార్టీ తీరు కొంచెం మారిందేమో ? అనిపిస్తోంది. 

 విభజన జరిగి చాలాకాలమయ్యింది. అరకొరగా ఇచ్చే నిధులతో  రాష్ట్రం ఎప్పటికి కోలుకుంటుంది ? 

 సరిపడినంత నిధులు ఇవ్వలేమని భావించినట్లయితే  అందరూ కలిసి రాష్ట్రాన్ని విభజించకుండా ఉండవలసింది.

ఆంధ్రకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని అప్పట్లో బీజేపీ వాళ్లు ప్రకటించారు. వారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆశిద్దాము.

.......................

మరో విషయం ఏమిటంటే, 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉండగా ఇప్పుడే అమరావతికి తొందరేమొచ్చిందని కొందరు అంటున్నారు. 

10 సంవత్సరాలూ హైదరాబాద్లోనే ఉండి  10 సంవత్సరాల తర్వాత తీరిగ్గా కళ్ళు తెరిస్తే రాజధాని అప్పటికప్పుడు ఆకాశం నుంచి ఊడి పడదు కదా ! 

ఇప్పటి నుంచీ కష్టపడితేనే 10 సంవత్సరాలకు రాష్ట్రం  అంతా  అభివృద్ధి చెందుతుంది. 

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులలో చాలామంది రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర అభివృద్ధి కొరకు కృషిచేయటానికి  సిద్ధపడుతుండగా ...కొద్దిమంది  మాత్రం రాజధాని ఏర్పడి అన్ని సౌకర్యాలూ ఏర్పడితేనే వస్తామనటం బాధాకరం.

 తెలంగాణాకు చెందిన ఉద్యోగులు (ఆంధ్రలో ఉన్నవాళ్ళు ) తమను తమ రాష్ట్రానికి పంపివేస్తే తమ రాష్ట్ర అభివృద్ధిలో కృషిచేసుకుంటాము  అంటున్నారట ...

ఆంధ్ర  వాళ్ళు  కూడా తమ రాష్ట్రానికి వచ్చి.. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని ఆశిద్దాము.






Saturday, March 26, 2016

స్త్రీల సమస్యల గురించి కొన్ని అభిప్రాయాలు..



ఈ రోజుల్లో స్త్రీలకు ఎన్నో సమస్యలున్నాయి. వీటిని పరిష్కరించటం పట్ల శ్రద్ధ చూపకుండా... కొన్ని దేవాలయాలలోకి స్త్రీలను ప్రవేశం లేకపోవటం వివక్ష అంటూ గొడవ చేయటం ఏమిటి?

 స్త్రీలను ఉద్ధరించాలనుకుంటే  పరిష్కరించటానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి.

 ఎందరో స్త్రీలు వేశ్యాగృహాలలో నరకాన్ని అనుభవిస్తున్నారు.

 ఎందరో స్త్రీలు  అత్తలు, ఆడపడుచులు, సవతులు వంటి..తోటి స్త్రీల వల్లే  వేదనకు గురవుతున్నారు. 

పాఠశాలల్లో, కాలేజీల్లో , ఆఫీసులలో  లైంగిక వేధింపులు వల్ల ఎందరో స్త్రీలు వేదనను అనుభవిస్తున్నారు. 

ఇంకా  ఎన్నో సమస్యలున్నాయి . ఈ సమస్యలను పరిష్కరించుకుంటే  బాగుంటుంది.
.................................

Posted by anrd at 10:39 PM 
8 COMMENTS:

AnonymousJanuary 30, 2016 at 1:27 AM

వేరే వాళ్ళకి ఉచిత సలహాలు ఇచ్చే బదులు మీరు ఇంతగా బాధపడుతున్న సమస్యల గురించి మీరే పని మొదలుపెట్టొచ్చుగా. వాళ్లకి ఇబ్బందికి గురిచేస్తున్న సమస్యల గురించి వాళ్ళు పోరాడుతున్నారు, మీబోటి పెద్దలు అడ్డం పడకుండా ఉంటే అదే పదివెలు.

Reply
Replies

anrdJanuary 30, 2016 at 11:35 AM

మేము కొన్ని సంవత్సరాల క్రిందట శనిశింగణాపూర్ వెళ్లి వచ్చాము. అక్కడ దైవదర్శనం చేసుకోవాలంటే స్త్రీలు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అయితే మూలమూర్తి ఉన్న అరుగు పైకి మహిళలు వెళ్ళకూడదు. మూలమూర్తి ఆరుబయటే ఉంటారు కాబట్టి చక్కగా దర్శనమిస్తారు. 

పురుషులు పైన షర్ట్ లేకుండా తడి దుస్తులతో మూలమూర్తి వద్దకు వెళ్లాలనే నియమం ఉన్నట్లు గుర్తు. మరి ఈ విషయం పురుషుల పట్ల వివక్షగా భావించటం లేదు కదా ! 

అయ్యప్పస్వామి వద్దకు రజస్వల కాని ఆడపిల్లలు, బహిష్టులు ఆగిపోయిన ఆడవాళ్ళు వెళ్ళవచ్చు. కొన్ని ఆచారాలు అలా ఉంటాయి. 

శ్రీశైలంలో శివలింగాన్ని స్త్రీలు, పురుషులు అందరూ తాకవచ్చు.

ఒక్కొక్క దగ్గర ఒక్కో విధంగా నియమాలు ఉంటాయి. పెద్దలు వద్దన్నదే చేయాలనే పంతం ఎందుకు ?

ఆ మధ్య కొందరు ఆడవాళ్ళు గాయత్రి మంత్రం ఎందుకు చేయకూడదు ? ఇది స్త్రీల పట్ల వివక్షే అంటూ ఆవేశపడిపోయారు.

నాకు తెలిసిన ఒక విషయం చెబుతాను. మా బంధువుల అమ్మాయి గాయత్రి మంత్రం ప్రారంభించి కొంతకాలం చేసింది. కొంతకాలం తరువాత ఆ అమ్మాయికి బహిష్టులు అస్తవ్యస్తంగా వచ్చాయి. ఆమెకు ఏమీ అర్ధం కాలేదు.

పెద్దవాళ్ళు గమనించి గాయత్రిమంత్రం ఆపివేయించగా తిరిగి నెలసరి సక్రమంగా రావటం జరిగిందని చెప్పింది.

( స్త్రీలకు నెలసరి, గర్భం దాల్చటం వంటివి ఉంటాయి కాబట్టి కొన్ని నియమాలు పాటించటం కుదరదు. కొన్ని మంత్రాలు చదివితే స్త్రీలలో గర్భసంచికి అనారోగ్యం కలిగే అవకాశం ఉందని కూడా అంటారు.)


ఏ విషయంలో ఏ రహస్యం ఉందో తెలియదు. పెద్దవాళ్లు వద్దని చెప్పిన విషయాలే చేస్తామని పట్టుబట్టడం ఎందుకు ?


కొన్ని దేవాలయాల లోపలికి స్త్రీలు వెళ్ళవద్దు .. అని పెద్దలు చెప్పటంలో ఎన్నో కారణాలు ఉండి ఉండవచ్చు. మేము ఎందుకు వెళ్ళకూడదు ? అని పంతాలు పోవటం ఏమిటి ? 



anrdJanuary 30, 2016 at 12:40 PM

హాస్పిటల్లో ఆపరేషన్ ధియేటర్లోకి అందరినీ రానివ్వరు. ఈ విషయంలో కొన్ని ఆంక్షలుంటాయి. అంతమాత్రాన వివక్ష అంటారా ?

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అయినా సరే పార్లమెంట్లోకి వెళ్ళి కూర్చుంటామంటే ఎప్పుడుపడితే అప్పుడు అందరినీ వెళ్ళనిస్తారా ? ఈ విషయంలో కొన్ని ఆంక్షలుంటాయి.అంతమాత్రాన వివక్ష అంటారా ? 

కొన్ని దేవాలయాల్లోకి వెళ్ళటానికీ కొన్ని ఆంక్షలు ఉంటాయి. ఇందులో వివక్ష ఏమీలేదు.



Jai GottimukkalaFebruary 1, 2016 at 12:39 PM

సమానత్వం అనే హక్కు ప్రైవేటు సంస్థలకు వర్తించదు. ముఖ్యంగా ప్రార్థనా స్థలాలలో మందిరం తాలూకా అనాదిగా పాటిస్తున్న ఆచారాలు ఉంటాయి. సదరు ఆచారాలు హేతుబద్దమా కాదా అన్న చర్చ సరికాదు. వారి గుడి కనుక వారి ఆచారాలు అందరూ పాటించాలి. కాదు కూడదు అనుకుంటే యాజమాన్యంతో చర్చించాలి కానీ రోడ్డు మీద గొడవ చేయడం అనవసరం.

మహిళలకు అనేక సమస్యలు ఉన్న తరుణంలో ఇలాంటి చిన్న విషయాలు లేవనెత్తి ఉపద్రవం జరుగుతుందని గగ్గోలు పెట్టడం అసలు సమస్యలను దృష్టి మళ్లించడమే.


anrdFebruary 1, 2016 at 9:02 PM

అవునండి, మహిళలకు అనేక సమస్యలు ఉన్న తరుణంలో ఇలాంటి విషయాలు లేవనెత్తి ఉపద్రవం జరుగుతుందని గగ్గోలు పెట్టడం అసలు సమస్యలను దృష్టి మళ్లించడమే.


Reply

anrdJanuary 30, 2016 at 10:26 AM


ఈ మధ్య ఈనాడులో ఒక వార్త వచ్చింది.తెలుగురాష్ట్రాలలోని వైశ్యులలో కొందరికి భూటెల్ కోలిన్ ఎస్టరేజ్ అనే ఎంజైం లోపం ఉన్నట్లు గుర్తించారట.ఈ లోపం ఉన్నవారికి ఏదైనా శస్త్రచికిత్స అవసరమైనప్పుడు మత్తుమందు ఇస్తే తిరిగి వారు స్పృహలోకి రావడం లేదట, కొన్ని సందర్భాలలో మృత్యువాత పడుతున్నారట. 

ఈ ఎంజైం లోపం గుర్తించిన తరువాత మత్తు ఇవ్వాల్సి వచ్చినప్పుడు వైద్యులు ప్రత్యామ్యాయ మార్గాలు అనుసరిస్తున్నారట. 

దక్షిణభారతదేశానికి చెందిన వారు అమెరికాలో ఆసుపత్రికి వెళ్లినా ఇప్పుడు వారి కులం గురించి అడుగుతున్నారట. భారత్ లో వైద్యులు కూడా శస్త్రచికిత్స సమయంలో కులం గురించి అడుగుతున్నారట.

భిన్నకులాలు, మతాల సమ్మిళతమైన భారతదేశంలో జన్యు పరిశోధనకు అపారావకాశాలున్నాయని హార్వర్డ్ విశ్వవిద్యాలయ జన్యుశాస్త్రవేత్త డేవిడ్ రీచ్ అనేవారు తెలియజేశారట.

( ఇందువల్ల .. మీది ఏ కులం ? అని వైద్యులు అడిగితే కులం సరిగ్గా చెప్పాలి. అంతేకానీ వైద్యులు కులవివక్ష చూపిస్తున్నారు. కులంగిలం అంటూ ఏమీలేద్.... అంటూ ఆవేశపడకూడదు.)


Reply

anrdJanuary 30, 2016 at 10:27 AM


స్త్రీల సమస్యల పట్ల శ్రద్ధచూపుతూ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నవారు ఎందరో ఉన్నారు. సునీతాకృష్ణన్ వంటివారు ఎంతో ధన్యజీవులు. అలాంటివారికి అండగా నిలిచి స్త్రీల సమస్యలను పరిష్కరించితే అందరూ అభినందిస్తారు.

సతీసహగమనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడటం కూడా అభినందించతగినదే. 

( అయితే సతీసహగమనం ఏవో కొన్ని కారణాల వల్ల ఆచారంగా ఏర్పడి ఉంటుంది. అంతేకానీ సనాతనధర్మం సతీసహగమనాన్ని ఆచారంగా ఏర్పరచలేదు. రామాయణంలో కౌసల్య, సుమిత్ర, కైక సతీసహగమనం చేయలేదు, భారతంలో సత్యవతి, కుంతీదేవి కూడా సహగమనం చేయలేదు.)

అయితే, జోగిని వ్యవస్థ వంటివి దురాచారాలే. ఇలాంటి దురాచారాలను రూపుమాపటానికి ఎవరు ఉద్యమాలు చేసినా అభినందనీయమే. 

సమాజంలో ఎన్నో సమస్యలు ఉండగా అవి పరిష్కరించటం పైన శ్రద్ధ పెట్టకుండా ..స్త్రీలు అన్ని దేవాలయాల లోపలి వరకూ వెళ్ళి ముట్టుకుని తీరుతాం అంటూ ఉద్యమాలు చేయటమేమిటి ? దీని వెనుక ఉన్న విషయం ఏమిటి ?


Reply

anrdJanuary 30, 2016 at 12:35 PM

బహిష్టు సమయం లో స్త్రీలు నీరసంగా ఉంటారు కాబట్టి కొంత విశ్రాంతి అవసరం. 

ఆ సమయంలో ఎక్కువ పనులు చేయకుండా మైల అంటూ కట్టడి చేసారు. ఇలాగైనా ఆ నాలుగురోజులూ స్త్రీలకు విశ్రాంతి లభిస్తుంది.

నెలసరి సమయంలో గర్భసంచి సున్నితంగా ఉంటుంది. అదేపనిగా పనిచేస్తే గర్భసంచి జారే అవకాశం కూడా ఉంది. అప్పుడు శాశ్వతంగా గర్భం ధరించే అవకాశం కూడా ఉండకపోవచ్చు. 

అయితే ఈ రోజుల్లో శానిటరీనాప్కిన్స్ వాడుతూ గెంతులు వేయవచ్చునంటూ ప్రచారం చేస్తున్నారు.( ఇది సరైనది కాదు.)

కొంతమంది స్త్రీలలో నెలసరి సమయంలో విపరీతంగా కడుపునొప్పి ఉంటుంది. 

చదువులు.. పరీక్షలు, ఉద్యోగాలు..టార్గెట్లతో సతమతమవుతున్న ఈ రోజుల్లో ఆరోగ్యం ఎలా ఉన్నా బయటకు వచ్చి కష్టపడటం స్త్రీలకు తప్పనిసరి అయ్యింది. 



Wednesday, March 23, 2016

బాధ్యతగల పౌరులు ఎక్కువగా ఉన్న దేశం బాగుపడుతుంది . ..

ఈ రోజుల్లో నీటి విలువ గురించి అందరికీ తెలిసినా కూడా చాలామంది  నీటిపొదుపును పాటించటం లేదు.

  కొందరు పెద్దవాళ్ళు బట్టలు ఉతికినంత సేపు పంపును అలాగే వదిలేస్తుంటారు. పెద్ద ధారతో నీళ్లు పోతూ ఉంటాయి. 

 వాకిలి కడగటానికి కొద్దిగా నీళ్లు చాలు. అయితే చాలామంది పైపుతో బోలెడు నీళ్లు గుమ్మరించి కడిగేస్తుంటారు.

 అసలే నీటికొరత బాగా ఉన్న ఈ రోజుల్లో నీళ్ళు ఉన్నవాళ్ళు ఇలా ధారాళంగా వాడేస్తుంటే క్రమంగా ఆ ప్రాంతంలో భూగర్భనీటిమట్టం పడిపోయి  అందరికీ నీటి కొరత ఏర్పడుతుంది. 


ఈ రోజుల్లో ఇళ్లలో ప్రతి గదికి పంపులు ఉంటున్నాయి.  

చాలా మంది ఇళ్లలో పంపులు లూజ్ అయి ఒక్కొక్క బొట్టూ నీరు  పోతూ ఉంటుంది . వాటిని రిపేర్ చేయకుండా అశ్రద్ధ చేస్తారు. 

ఒక్కొక్క బొట్టు పోతున్న పంపు క్రింద బకెట్ పెడితే గంటలో బకెట్ నిండిపోతుంది. ఇలా ఎంతో నీరు వృధాగా డ్రైనేజ్లోకి పోతుంటుంది. 

 పాతకాలంలో అయితే గదిగదికీ పంపులు ఉండేవి కాదు, నీళ్లను బయటనుంచి మోసుకుని తెచ్చుకోవాలి కాబట్టి , నీళ్ళను వృధాగా పారబోసేవారు కాదు. 

వాషింగ్ మెషిన్ వల్ల నీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. వేసవికాలం వాషింగ్ మెషీన్ వాడకం కొంత వరకూ తగ్గించుకుంటే మంచిది. 

కొన్ని దుస్తులు చేతితో ఉతుక్కుంటే నీరు పొదుపు అవుతుంది. 

నీటిని వృధాచేయవద్దని ఎందరు చెబుతున్నా  ఎవరూ పట్టించుకోవటం లేదు.

 డ్రైనేజ్ నీటిని శుద్ధి చేసి ,టాంకర్లతో తరలించి రోడ్ల ప్రక్కన పెంచే మొక్కలకు పోయవచ్చు.

 అందరూ బాధ్యత వహించితేనే నీటిసమస్యలు తగ్గుతాయి. 

బాధ్యతగల పౌరులు ఎక్కువగా ఉన్న దేశం బాగుపడుతుంది . 


Monday, March 21, 2016

ప్రకృతి వ్యవసాయం..




 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందరో రైతులు  ప్రకృతి వ్యవసాయం పట్ల ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహిస్తున్న  ప్రభుత్వం ఎంతో మంచిపని చేస్తోంది. 

ప్రకృతి వ్యవసాయం గురించి కొన్ని వివరాలను ఈ లింక్ వద్ద తెలుసుకోవచ్చు.

Margadarshi - Subhash Palekar - YouTube





Wednesday, March 16, 2016

ఆర్ధిక అసమానతలు తగ్గితేనే సమస్యలు తగ్గుతాయి..

 
 
 
ఈ రోజుల్లో ఎన్నో రంగాలలో ఉపాధి లభించటం చాలా సమస్యగా ఉంది.   ఉపాధి లభించకపోవటం వల్ల ఆదాయం లేక ఎందరో ఇబ్బందులు పడుతున్నారు.

ఒక్కో రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరము ఇంజనీరింగ్ కాలేజీల నుండి ఎన్నో వేలమంది వరకూ పట్టాలు పుచ్చుకుని బయటకు వస్తున్నారు.  దేశం అంతటా కలిపితే ఎన్నో లక్షల మంది ఉంటారు. 


 పరిశ్రమల  ద్వారా  కొందరికి  మాత్రమే ఉద్యోగాలు లభిస్తాయి.  ఆ ఉద్యోగస్తులు కొన్ని సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తారు. 

ఇలాంటప్పుడు , ప్రతి ఏటా కాలేజీల నుండి బయటకు వచ్చే లక్షలాది మందికి ఉద్యోగాలు లభించాలంటే ఎలాగో తెలియదు.

 ప్రతి సంవత్సరం ఎన్నని కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయగలరు ?

నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలు తగ్గాలంటే ఆర్ధిక అసమానతలు తగ్గించటమే పరిష్కారం. 

 కొందరి వద్ద విపరీతంగా సొమ్ము ఉండటం ....కొందరి వద్ద సొమ్ము లేకపోవటం వల్ల ఆర్ధిక అసమానతలు ఏర్పడతాయి. 

ప్రపంచంలోని వనరులపై అందరికీ హక్కుంది. అయితే, బలవంతులు, తెలివిగలవాళ్ళు సంపదను తమ చేతుల్లో ఉంచుకుని బలహీనులకు అన్యాయం చేస్తున్నంత వరకూ  సమాజంలో ఆర్ధిక అసమానతలు , నిరుద్యోగం, పేదరికం ఉంటూనే ఉంటాయి. 


 ప్రభుత్వాల వద్ద సంపద ఉండటం వల్ల ఎన్నో ఉద్యోగాలను సృష్టించుకోవచ్చు. సంపద ఉండాలంటే సమాజంలో ఆర్ధిక అసమానతలు తగ్గించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.


 నల్లడబ్బును అరికట్టటం, అన్ని రంగాలలో ధరలను అదుపులో ఉంచటం  ..వంటి విషయాలలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. 

అందరికీ కనీస అవసరాలు తీరటం ఎంతో అవసరం. ముఖ్యంగా ఆహారం లభించకపోతే ప్రజలలో నేరప్రవృత్తి పెరిగే అవకాశం ఉంది. 

నిరుద్యోగం, పేదరికం వంటి పరిస్థితులు చక్కదిద్దటానికి ప్రభుత్వాలకు సమయం పడుతుంది. అంత వరకూ ప్రజలకు  ఆకలిబాధలు లేకుండా ప్రభుత్వాలు తక్కువ ధరకు ఆహారాన్ని అందించాలి.  

 కొన్ని రాష్ట్రాలలో  ప్రభుత్వం వాళ్ళు  తక్కువ ధరకే భోజన సదుపాయం కల్పిస్తున్నారు.

 ప్రభుత్వాలు ప్రజలకు చేరువ కావాలన్నా  తక్కువ ధరకే భోజనసదుపాయం కల్పించటం అనేది ఒక చక్కటి మార్గం.



Monday, March 14, 2016

తిరుమల తిరుచానూరు, శ్రీ కాళహస్తి ....




మేము తిరుమల తిరుచానూరు, శ్రీ కాళహస్తి వెళ్లి వచ్చాము. దర్శనాలు బాగా జరిగాయి. అంతా దైవం దయ. 

 తిరుమలలో  పూజ కొరకు టికెట్స్ తీసుకున్నాము. ఈ టికెట్స్ కొన్ని సంవత్సరాల క్రిందట తీసుకున్నాము. 

పూజలో పాల్గొనే అవకాశం కలిగింది. అంతా దైవం దయ. 

తిరుమల నడక దారిలో వెళ్ళాము.

 తిరుమలలో కాలినడక భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించటం బాగుంది. 

అయితే ఒక దగ్గర  ఏమంటున్నారంటే..... కాలినడక భక్తులు 24 గంటల లోపే ప్రత్యేకదర్శనం చేసుకునే అవకాశం  ఉంది  అంటున్నారు.

 ఇంకొక దగ్గర ఏమంటున్నారంటే .....24 గంటలు అనే నియమం ఏమీ లేదు. తరువాత కూడా  ప్రత్యేకదర్శనం  చేసుకునే అవకాశం  ఉంది  అంటున్నారు.

 కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులలో కొందరికి కాళ్ళనొప్పుల వల్ల 24 గంటల లోపే దర్శనం చేసుకోవాలంటే కుదరకపోవచ్చు. అందువల్ల 24 గంటలకన్నా ఎక్కువ కాలం పర్మిషన్ ఇవ్వటమే బాగుంటుంది.


 తిరుమలలో అన్నప్రసాదం చాలా బాగా చేస్తున్నారు. రోజూ ఎందరో భక్తులు వస్తున్నా కూడా అవన్నీ అలా నిర్వహించటం ఎంతో గొప్ప విషయం.


 కొన్ని రాష్ట్రాలలో కూడా ప్రభుత్వం వాళ్ళు  తక్కువ ధరకే భోజన సదుపాయం కల్పిస్తున్నారు.

 ప్రభుత్వాలు ప్రజలకు చేరువ కావాలంటే తక్కువ ధరకే భోజనసదుపాయం కల్పించటం అనేది ఒక చక్కటి మార్గం.


 అందరికీ ఉద్యోగాలు కల్పించటం అనేది అంత సులభమైన విషయంకాదు. అందరికీ ఆహారం అందించటం కొంత తేలికైన విషయమే.

 అయితే ఆహారాన్ని వృధా చేయకూడదు. 

 తిరుమలలో ఉన్నట్లు అన్ని ఊళ్ళలోనూ బాగా మొక్కలు పెంచాలి.

శ్రీ కాళహస్తి దేవాలయం కూడా చాలా పెద్దది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూలైన్లు ఏర్పాటు చేసారు. 

దైవదర్శనాలు బాగా జరిగాయి. అంతా దైవం దయ.

Tuesday, March 8, 2016

ఓం నమఃశ్శివాయ.....


  ఓం 

శ్రీ విశ్వనాధాష్టకం...


గంగాతరంగ రమణీయ జటాకలాపం

గౌరీనిరంతర విభూషిత వామభాగం

నారాయణప్రియ మనంగమదాపహారం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం.


వాచామగోచర మనేక గుణస్వరూపం

వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం

వామేన విగ్రహవరేణ కళత్రవంతం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం.


భూతాధిపం భుజగభూషణ భూషితాంగం

వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం

పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం.


శీతాంశు శోభిత కిరీట విరాజమానం

ఫాలేక్షణానల విశోషిత పంచబాణం

నాగాధిపా రచిత భాసుర కర్ణపూరం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధం


పంచాననం దురిత మత్తమతంగజానాం

నాగాంతకం దనుజపుంగవ పన్నగానాం

దావానలం మరణశోక జరాటవీనాం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం



తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం

ఆనందకంద మపరాజిత మప్రమేయం

నాదాత్మకం సకల నిష్కళ మాత్మరూపం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం


ఆశాం విహాయ పరిహృత్య పరస్యనిందాం

పాపేరతించ సునివార్య మనస్సమాధౌ

ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం


రాగాది దోషరహితం స్వజనానురాగం

వైరాగ్య శాంతినిలయం గిరిజా సహాయం

మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం


వారాణసీ పురపతేః స్తవం శివస్య

వ్యాసోక్త మష్టక మిదం పఠతే మనుష్యః

విద్యాం శ్రియం విపుల సౌఖ్య మనంత కీర్తిం

సంప్రాప్య దేహ నిలయే లభతేచ మోక్షం


విశ్వనాధాష్టక మిదం పుణ్యం యః పఠే చ్చివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే..


ఫలం : ధనధాన్యాలూ, విద్యావిజయాలూ, ఇహపర సర్వసౌఖ్యాలు.

శ్రీ అన్నపూర్ణాష్ఠకము...

 
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ

నిర్ధూతాఖిలఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ

ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..

నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ

ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ

కాశ్మీరాగరు వాసితాంగ రుచిరే కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక నిష్టాకరీ

చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ

సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..

కైలాసాచల కందరాలయకరీ గౌరీ ఉమాశాంకరీ

కౌమారీ నిగమార్ధ గోచరకరీ ఓంకార బీజాక్షరీ

మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..

దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ

లీలానాటక సూత్రఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ

శ్రీ విశ్వేశమనః ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబన కరీ మాతాన్న పూర్ణేశ్వరీ..

ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శాంకరీ

కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ

స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీ పురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ..

ఉర్వీ సర్వజయేశ్వరీ దయాకరీ మాతాకృపాసాగరీ

నారీ నీలసమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ

సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..


దేవీ సర్వవిచిత్రరత్న రచితా దాక్షాయణీ సుందరీ

వామాస్వాదుపయోధర ప్రియకరీ సౌభాగ్య మాహేశ్వరీ

భక్తాభీష్టకరీ దశాశుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..

చంద్రార్కానల కోటికోటిసదృశా చంద్రాంశు బింబాధరీ

చంద్రారాగ్ని సమాన కుండలధరీ చంద్రార్క వర్ణేశ్వరీ

మాలా పుస్తక పాశాంకుశధరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..

క్షత్రత్రాణకరీ సదా శివకరీ మాతాకృపాసాగరీ

సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ

దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..


అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే

జ్ఞానవైరాగ్య సిధ్యర్ధం భిక్షాందేహీ చ పార్వతి.

మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః

భాంధవా శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం..


ఫలం: ఇహానికి ఆకలిదప్పులూ - పరానికి ఏ కలితప్పులూ కలగకపోడం.

శ్రీ గణేశ స్తుతి...

శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే..

ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి

దోషభేదికి బ్రపన్నవినోదికి విఘ్నవల్లికాచ్చేదికి

మంజువాదికి నశేషజగజ్జననందవేదికిన్

మోదకఖాదికిన్ సమదమూషకసాదికి సుప్రసాదికిన్

ఫలం: సర్వపాపనాశనం - సర్వ విఘ్న నాశనం - సర్వ వాంచా ఫలసిద్ధి.

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం..

హే స్వామినాధ కరుణాకర దీనబంధో

శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో

శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ

వల్లీసమేత  మమదేహి కరావలంబం..

దేవాదిదేవనుత దేవగణాధినాధ

దేవేంద్ర వంద్య మృదుపంకజ మంజుపాద

దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే

వల్లీసనాధ మమదేహి కరావలంబం..

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్

తస్మా త్ప్రసాద పరిపూరిత భక్తకామ

శ్రుత్యాగమ ప్రణవ వాచ్య నిజస్వరూప

వల్లీసనాధ మమదేహి కరావలంబం..

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల

పాశాది శస్త్ర పరిమండిత దివ్యపాణే

శ్రీ కుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ

వల్లీసనాధ మమదేహి కరావలంబం..

దేవాదిదేవ రధమండల మధ్య వేద్య

దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తం

శూరం నిహత్య సురకోటిభి రీడ్యమానం

వల్లీసనాధ మమ దేహి కరావలంబం..

హారాదిరత్న మణియుక్త కిరీటహార

కేయూర కుండల లసత్కవచాభిరామ

హే వీర తారక జయామర బృంద వంద్య

వల్లీసనాధ మమ దేహి కరావలంబం..

పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయైః


పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైమునీంద్రైః


పట్టాభిషిక్త హరియుక్త పరాసనాధ


వల్లీ సనాధ మమ దేహి కరావలంబం..

శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా

కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం

సిక్త్వాతు మా మవ కళాధర కాంతికాంత్యా

వల్లీసనాధ మమ దేహి కరావలంబం..

సుబ్రహ్మణ్యాష్టకం యే పఠంతి ద్విజోత్తమా తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదితః.

సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటిజన్మ కృతం పాపం తత్ క్షణాదేవ నశ్యతి..

ఫలం: సర్వ వాంచా ఫల సిద్ధి - సర్వ పాప నాశనం...


సంతాన ఫల మంత్రం..

సంతానం లేకపోవడానికి నాగదోషం లేదా సర్పదోషం కారణమని అంటారు.

ఈ నాగదోషం తొలగాలంటే గర్భం ధరించిన నెలలోపులో లేదా గర్భధారణకి పూర్వమే అయినా ఈ క్రింది శ్లోకాన్ని రోజూ స్నానం చేశాక ముమ్మారు పఠించాలి. ఇలా చదివితే తప్పక 108 రోజుల్లో నాగదోషం తొలగుతుందన్నది అనుభవంలో ఉన్న సత్యం.

చక్కని సంతానం కలిగారన్నది వాస్తవం.

ఏ నిత్య నివేదనలూ నియమాలూ లేవు. 108 వ రోజు చదవటం పూర్తయ్యాక నువ్వుల చిమ్మిలి నైవేద్యం పెట్టాలి. ఆ మంత్రం లాంటి శ్లోకం ఇదిగో,.

జరత్కారుర్జగద్గౌరీ మానసా సిద్ధయోగినీ

వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తధా !

జరత్కారుప్రియాఽఽ
స్తీకమాతా విషహారేతి చ 

మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా !!

ద్వాదశైతాని నామాని పూజాకాలే తు యః పఠేత్!

తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్యచ !!

శ్రీ కాల భైరవాష్టకం..
దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం

వ్యాళయజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం

నారదాది యోగిబృంద వందితం దిగంబరం

కాశికాపురాధినాధ కాలభైరవం భజే..

భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం

నీలకంఠ మీప్సితార్ధదాయకం త్రిలోచనం

కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం

కాశికాపురాధినాధ కాలభైరవం భజే..

శూలటంక పాశ దండమాది కారణం

శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయం

భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం

కాశికాపురాధినాధ కాలభైరవంభజే..

భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం

భక్తవత్సలం స్థితం సమస్త లోక నిగ్రహం

నిక్వనణ్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం

కాశికాపురాధినాధ కాల భైరవం భజే..

ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గ నాశకం

కర్మ పాశమోచకం సుశర్మ దాయకం విభుం

స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ మండలం

కాశికాపురాధినాధ కాలభైరవం భజే..


రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం

నిత్య మద్వితీయ మిష్టదైవతం నిరంజనం

మృత్యుదర్శనాశనం కరాళదంష్ట్ర భీషణం

కాశికాపురాధినాధ కాల భైరవం భజే.

అట్టహాస భిన్న పద్మ జాండకోశ సంతతిం

దృష్టి పాతనష్ట పాపతజాల ముగ్రనాశనం

అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం

కాశికాపురాధినాధ కాల భైరవం భజే..

భూత సంఘనాయకం విశాల కీర్తి దాయకం

కాశివాసి లోక పుణ్యపాప శోధకం విభుం

నీతిమార్గ కోవిదం పురాతనం జగత్ప్రభుం

కాశికాపురాధినాధ కాల భైరవం భజే..

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం

జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం

శోక మోహ దైన్యలోభ కోపతాప నాశనం

తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం..

ఫలం: మనశ్శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం..


శివపంచాక్షరీ స్తోత్రం....
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ

భస్మాంగ రాగాయ మహేశ్వరాయ

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ

తస్మ్యై నకారాయ నమశ్శివాయ.

మందాకినీసలిల చందన చర్చితాయ

నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ

మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ

తస్మ్యై మకారాయ నమశ్శివాయ.

శివాయ గౌరీవదనారవింద

సూర్యాయ దక్షాధ్వరనాశకాయ

శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ

తస్మ్యై శికారాయ నమశ్శివాయ.

వశిష్ట కుంభోధ్భవ గౌతమాది

మునీంద్ర దేవార్చిత శేఖరాయ

చంద్రార్క వైశ్వానర లోచనాయ

తస్మ్యై నకారాయ నమశ్శివాయ.

యక్షస్వరూపాయ జటాధరాయ

పినాక హస్తాయ సనాతనాయ

సుదివ్య దేహాయ దిగంబరాయ

తస్మ్యై యకారాయ నమశ్శివాయ.

పంచాక్షర మిదం పుణ్యం యః పఠే చ్చివస్సన్నిధౌ

శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.

 
పైన వ్రాసిన వాటిలో అచ్చు తప్పులు ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.



Wednesday, March 2, 2016

కాలకృత్యాలు ఆపుకునే పరిస్థితి....

చిన్నపిల్లలను ఉదయాన్నే హడావిడిగా తయారుచేసి స్కూల్ కు పంపుతున్నప్పుడు.. కొందరు పిల్లలు  టైం అయిపోయిందని టాయ్ లెట్ వెళ్ళకుండానే స్కూలుకు వెళ్తుంటారు.

 స్కూలులో అర్జంట్ గా టాయ్లెట్ వెళ్ళాలంటే కుదరకపోవచ్చు.  పిల్లలు టాయ్ లెట్ వెళ్ళాలని చెప్పినా కొందరు టీచర్లు పంపరు. 

టాయ్లెట్ ఆపుకోవటం అనేది ఎంతో ఘోరమైన పరిస్థితి. ఆ బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది. 

కొన్నిసార్లు ఫంక్షన్స్ కొరకు స్కూల్ పిల్లల్ని గంటల తరబడి నిల్చోబెట్టేస్తుంటారు.ఇలాంటప్పుడు ఆ పిల్లలు పడే ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. 

పెద్దవాళ్ళకు స్వాగతం పలకటం కోసం  పిల్లలను నిల్చోబెడుతుంటారు. ఆ పెద్దవాళ్ళేమో తీరికగా ఎప్పుడో వస్తారు. వాళ్ళకోసం ఎదురు చూసిచూసి పిల్లలు  నీరసపడిపోతారు. 

 పెద్దవాళ్ళ స్వాగతాల కోసం  చిన్నపిల్లల్ని  నిల్చోపెట్టడం సరైనది కాదు. 

ఇక , చాలా హాస్టల్స్లో ఎక్కువ టాయ్లెట్స్ ఉండవు. అందువల్ల  టాయ్లెట్స్ వద్ద  పెద్ద క్యూ ఉంటుంది.

 క్యూల వల్ల  ఉదయాన్నే టాయ్లెట్స్ వెళ్ళటానికి  కుదరక  ...కొందరు పిల్లలు అలాగే స్కూలుకు, కాలేజీలకు  వెళ్లిపోతుంటారు. 

కొన్ని కాలేజీ  హాస్టల్స్లో  పెద్దపిల్లలు కూడా టాయ్లెట్ విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నారు.

కాలకృత్యాలు ఆపుకునే  సమస్య వల్ల  ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయి.