దైవపూజామందిరాలు ఎన్నో విధాలుగా ఉంటాయి.
కొందరు ఒక పీఠంపై దైవమూర్తిని లేక దైవమూర్తులను ఉంచి పూజించుకుంటారు.
కొందరు అలమారలో దైవమూర్తులను ఉంచి పూజిస్తారు.
అయితే ఎక్కువ దైవవిగ్రహాలు, పటాలు ఉన్నప్పుడు..
అలమారలో రెండు అరల్లో అంటే.. ఒక అరలో కొన్ని దైవ పటాలను, మరొక అరలో మరికొన్ని దైవ పటాలను ఉంచి పూజిస్తారు. ఇలాంటప్పుడు రెండు అరల్లోనూ దీపాలను వెలిగిస్తారు కొందరు.
ఇలాంటప్పుడు, క్రింద అరలో దీపం వెలిగించినప్పుడు ఆ వేడిసెగ పైన అరలో ఉన్న దేవతా విగ్రహాలకు, పటాలకు తగిలే అవకాశం ఉంది.
పైన అరలో ఉన్న దేవతా విగ్రహాలకు క్రింద దీపం పెట్టటం మంచిది కాదని నాకు అనిపించింది.
అందువల్ల దేవతా విగ్రహాలను అన్నింటినీ ఒక పీఠంపైనే ఉంచి, అక్కడ దీపం వెలిగించటం మంచిదనిపిస్తోంది.
లేదంటే అల్మరాలో దేవతా పటాలుంచి, బయట చిన్న స్టూల్ పైన దీపం వెలిగించటం మంచిది.
అయితే, అటూఇటూ తిరిగేసమయంలో స్టూల్ పైన ఉన్న దీపం చేతులకు తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి.
వీటన్నింటికన్నా ..ఉన్న దేవతా పటాలన్నీ ఒకే అరలో ఉంచి అక్కడ దీపం వెలిగించటం మంచిదనిపిస్తోంది.