koodali

Friday, July 22, 2016

ఈ రోజుల్లో ఆహారం గురించి కొన్ని విషయాలు.. మరియు సోయా గురించి..


 
ఈ రోజుల్లో ఆహారపద్ధతులలో విపరీతమైన మార్పులు వచ్చాయి.

  అజనిమోటో, సోయాసాస్, వెనిగర్, సోడా ఉప్పు, బేకింగ్ పౌడెర్..వంటివి విరివిగా వాడిన ఆహారానికి ప్రజలు బాగా అలవాటుపడ్దారు.

 పొంగి కరకరలాడుతూ ఉండటానికి... సోడా ఉప్పు, బేకింగ్ పౌడెర్..


 ఒకవిధమైన రుచి పెరగటం కోసం ....అజనిమోటో, సోయాసాస్, వెనిగర్ వంటివి బాగా వాడుతున్నారు.

 అజనిమోటో ఎక్కువగా వాడకూడదు.

 ఇవన్నీ వాడటం వల్ల ఆహార పదార్ధాలకు ఒక విధమైన  రుచి  రావటం వలన  వీటి  వాడకం  బాగా పెరిగింది.

 ఆ రుచికి అలవాటుపడటం వల్ల  మళ్లీమళ్లీ అవే తినాలనిపిస్తుంది.  అలా శరీరంలోకి  వెళ్లే అజనిమోటో పరిమాణం బాగా పెరుగుతుంది.

ఇంట్లో చేసుకునే వంటలలో కూడా అజనిమోటో, సోడాఉప్పు వంటివి ఎక్కువగా వాడటాన్ని తగ్గించాలి.

నాకు తెలిసినంతలో సోయాసాస్ , వెనిగర్ వంటివి పదార్ధాలను నెలల తరబడి పులవబెట్టి తయారుచేస్తారు.

   కెమికల్స్ తో కూడా సోయాసాస్, వెనిగర్ తయారుచేస్తారట.


కొన్ని దేవాలయాలకు  సమీపంలో యాత్రికులు వెళ్ళే దారిలో కూడా  నూడిల్స్ వంటి  ఫాస్ట్  ఫుడ్   అమ్ముతున్నారంటే ప్రజలు వీటికి ఎంతలా అలవాటుపడ్డారో తెలుస్తోంది.

 మన పూర్వీకులు  సోడాఉప్పు వంటివి  వాడకుండానే వెన్న వాడి  కరకరలాడే రుచికరమైన స్నాక్స్ చేసేవారు.

 
 *************

ఇంకో విషయం ఏమిటంటే,  ఆరోగ్యానికి మంచిదని భావించి.... ఈ రోజుల్లో సోయా కు సంబంధించిన పదార్ధాలు కూడా ఎక్కువగా వాడుతున్నారు.


అయితే, సోయా మంచిదే కానీ  పరిమితి మించి మరీ ఎక్కువగా సోయాను తినకూడదంటున్నారు.

ఇందుకు సంబంధించిన కొన్ని విషయాలు ఈ క్రింద లింక్  ద్వారా తెలుసుకోగ
రు.


Benefits of Soy & Soy Protein Dangers | Natural Health Newsletter

************

పాతకాలంలో గుగ్గిళ్లు.. అంటే నానబెట్టి ఉడికించిన పెసలు, శనగలు..వంటివి తినేవారు. అప్పటివారు శారీరికంగా బాగా పనిచేసేవారు. శారీరికంగా పనిచేసేవారికైనా , మానసికంగా పనిచేసేవారికైనా మంచి పోషకాహారం అవసరం.


కొందరేమో పెసలు, శనగలు వంటివి ఎక్కువగా తినకూడదంటారు, ఎక్కువ తింటే కిడ్నీలు పాడైపోతాయంటారు. మరి కొందరేమో మొలకెత్తిన పెసలు, శనగలు..వంటివి తినాలంటారు. ఈ రోజుల్లో రకరకాలుగా చెప్పటం వల్ల గందరగోళంగా ఉండి ఏం తినాలో? ఏం తినకూడదో? ఎంత తినాలో? వంటి సందేహాలు ఎక్కువయ్యాయి.



ఈ రోజుల్లో ప్రొటిన్స్, కార్బోహైడ్రేడ్స్.. అంటారు. ప్రాచీనులు నవధాన్యాల గురించి తెలియజేసారు. మనం రెండు లేక మూడు ఇడ్లీలు, రెండు లేక మూడు దోసెలు, రెండు చపాతీలు..అలా లెక్కప్రకారం తింటే ఎక్కువతక్కువ కాకుండా ఉంటుంది.అరడజను అలా తినకూడదు.అన్నం మనిషికి సుమారు అరకప్పు బియ్యంతో వండితే సరిపోతుందంటారు.


  నిమ్మకాయ వంటి పుల్లటిపండ్లు మరీ ఎక్కువ కాకుండా కొన్ని తినాలి.ఇంకా, పురుగుమందులు వేయని, దేశవాళి కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెలు..వాడితే మంచిది.

ఆహారం తీసుకోవటంలో కొన్ని పద్ధతులు..ఎవరి పద్ధతిని బట్టి వారు మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.

ఉదయం ఆకుల కషాయం..ఉదా..జామాకు..వంటివి వేడి నీటిలో 2 నిమిషాలు కాచి ఆ నీటిని తాగాలి.

నెలకు నాలుగు రోజులు ధనియాల కషాయం..ఉదా.. నెలలో మొదటి నాలుగురోజులు..

link.. జలుబు, దగ్గు తగ్గటానికి ఈ పానకం.......... 

చ్యవంప్రాశ్ కూడా తీసుకోవచ్చు.



మొర్నింగ్ బ్రేక్ఫాస్ట్ .. ఇడ్లి..దోస..పూరీ..పొంగణాలు..ఉప్మ..రోజు విడిచి రోజు ఒక గ్లాస్ రాగుల జావ..రోజులో ఎప్పుడైనా రాగుల జావ త్రాగవచ్చు.జొన్న జావ కూడా తాగవచ్చు.

భోజనంలో చక్కగా అరిగే పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి..

వారంలో రెండు సార్లు మునగాకు జ్యూస్
వారంలో ఒక సారి బూడిదగుమ్మడి జ్యూస్
వారంలో ఒకటి లేక రెండుసార్లు కొబ్బరి నీరు
 
నువ్వుల ఉండలు వారానికి రెండు తినవచ్చు.
వేడిచెయ్యకుండా మెంతిపిండికానీ, మెంతులు కానీ వాడవచ్చు.

ప్రతిరోజు ఫ్రూట్స్

సలాడ్ అండ్ డ్రైఫ్రూట్స్  వారానికి 3 సార్లు..

గ్రీన్ జ్యూస్ వీక్లి 3 సార్లు...పుదీనా, కొత్తిమీర వంటి వాటి జ్యూస్ ..

రాత్రిపూట.. వీక్లి 2 సార్లు చపాతీలు..మిగిలిన రోజుల్లో..జొన్న ఉప్మా..జొన్న దోసలు..జొన్న ఇడ్లి..

వారానికి ఒకసారి లేక రెండుసార్లు.. పకోడి..బజ్జి..లేక ..చాట్..

15 రోజులకు ఒకసారి(నెలకు రెండు సార్లు).. స్నాక్స్..కారప్పూస అండ్ స్వీట్..వండుకుని నెలలో ఎప్పుడైనా తినవచ్చు.

వారంలో రెండుసార్లు తలకు..నూనె నిదానంగా మర్దన చేయాలి.

రోజూ ఉదయానే లేచి సూర్యనమస్కారాలను లేత ఎండలో చేయటం.. ఉదయంగానీ సాయంకాలం కానీ అర్ధగంటయినా ఎండ శరీరానికి తగలాలి.


కనీసం అర్ధగంట నడవాలి...ఉదయం కానీ, సాయంకాలం కానీ తక్కువ ఎండలో నడిస్తే ..ఎండ తగలటం, నడవటం అనే రెండు పనులు ఒకేసారి జరుగుతాయి. నడిచేటప్పుడు దైవనామాన్ని కూడా నిదానంగా అనుకోవచ్చు. 


కనీసం 15 నిమిషాలన్నా ధ్యానం చేయాలి. మీకు ఇష్టమైన దేవుని నామాలను వింటూ కూడా ఉండవచ్చు. అయితే, ధ్యానం, ప్రాణాయామం..వంటివి శిక్షకుల వద్ద అభ్యసించి చేస్తే మంచిది.

 ధ్యానం ద్వారా అనేక ఆలోచనల నుంచి కొంతసేపైనా మనస్సుకు విశ్రాంతిని ఇవ్వవచ్చు.

 
జీవితం అంటే కొన్ని టెన్షన్లు ఉంటాయి కదా..మన చుట్టూ టెన్షన్ పరిస్థితులు ఉన్నప్పుడు, మనకు కొంతయినా టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది.

 కానీ, మనం ఆరోగ్యంగా ఉండాలంటే టెన్షన్ ఎక్కువ ఉండకుండా తామరాకుమీద నీటిబొట్టులా జీవించటాన్ని తప్పక నేర్చుకోవాలి.

 జీవితంలో మన చేతనైనంత మనం చేసి,  దైవంపై భారం వేయాలి.  నిష్కామకర్మ యోగంతో జీవించటాన్ని అభ్యసించాలి.

శక్తి చాలనప్పుడు ..సరైనవిధంగా జీవించే శక్తిని ప్రసాదించమని దైవాన్ని శరణువేడుకోవాలి.

అంతా  దైవం దయ.

No comments:

Post a Comment