koodali

Monday, July 18, 2016

ఓం. హిందువులు.. మరి కొన్ని విషయాలు.....


గురువులకు అనేక వందనములు.


  .............
క్రింద వ్రాసిన విషయాలు ఈ పొస్ట్ వేసిన చాలాకాలం క్రిందట వ్రాసి ఇక్కడ వేయటం జరిగిందండి.
 
ఇప్పుడు చాలామంది హిందువులు హిందుదేవతలను ఆరాధిస్తూ, సాయిని కూడా ఆరాధిస్తున్నారు.

ఎన్నో నియమాలు పాటిస్తూ హిందువులకు దిశానిర్దేశం చేసే బ్రాహ్మణులు కూడా కొందరు ,  సాయి సర్వాంతర్యామి అని పూజలు చేస్తుంటే,  హిందువులు కొందరు  వారిని అనుసరించటంలో ఆశ్చర్యం లేదు.

సాయి విధానాలు సరళంగా ఉంటాయి. అనేక ఆచారవ్యవహారాలుండవు, అనేక కఠినమైన నియమాలుండవు. సాయిని ఆరాధించటానికి హిందుత్వంలోని కఠిననియమాలను పాటించలేకపోవటం కూడా ఒక కారణం కావచ్చు.
 
 
అయితే,షిర్డిసాయికి హారతులు ఇస్తారు. రోజుకి మూడుసార్లు అనుకుంటున్నాను, నాకు సరిగ్గా తెలియదు. హారతులకు ఎక్కువ సమయమే పడుతుంది.
 
 ఎక్కువ నియమాలు లేకుండా ఉండే సాయి ఆరాధనలో కూడా, సాయిని హిందు దేవతలుగా పూజలు మొదలుబెట్టి ఆరాధించటం ఆశ్చర్యం. 
.....................................
సులభమైన విధానాలతో ఉన్న షిర్డిసాయి ఆరాధనకు చాలామంది ఆకర్షితులవటంలో ఆశ్చర్యం లేదు.

 పరిస్థితి ఎలా ఉందంటే,  సాయి విగ్రహం ఉంటే,  జనాలు వస్తారని 
కొన్ని హిందు దేవాలయాల్లో  సాయి విగ్రహాన్నికూడా పెడుతున్నారట. భవిష్యత్తులో  పరిస్థితి  ఎలా ఉంటుందో?
..........................................

షిర్డిలో ప్రాచీన శివుని దేవాలయం ఉంటుంది. శివాలయానికి మేము వెళ్లినప్పుడు  అక్కడ, షిర్డి మందిరంలోలా  క్యూలు లేవు. బోలెడు భక్తులు లేరు.
....................................... 
 
 కొందరు హిందువుల ప్రవర్తన వింతగా ఉంటుంది. ఒకే హిందువుల్లో వైష్ణవులు, శైవులు అని కొందరు గొడవలు పడటం జరిగింది. మరి, ఇతర మతాలను కూడా నమ్మే సాయిబాబాను గురువుగా, దైవంగా భావించటం ఆశ్చర్యమే.
 
హిందువులు ఎందుకు శైవులు, వైష్ణవులు.. అని  గొడవలు పడుతున్నారు? అందరూ గాయత్రిశక్తిని ఆరాధిస్తారు కదా....హిందువులను ఉద్ధరిస్తామనే వాళ్ళు,  వైష్ణవ.. శైవ ..అని గొడవలు కూడా  మానేయాలి.
 .....................................
 
   శిరిడి సాయి బాబా జీవితచరిత్రము పుస్తకములో ఒక దగ్గర సాయి స్వయముగా ఎన్నో విషయములను తెలియజేసిన సందర్భములో ఇలా కూడా అన్నారు. సాయిసాయి ..యను నామమును జ్ఞప్తి యందుంచుకున్న మాత్రమునే మంచి జరుగుతుందని తెలియజేసారు.
................................. 
 
 కొందరు సాయిబాబాకు అనేక దేవతలుగా అవతారాలు అలంకరించి పూజలు చేస్తున్నారు.
 
హిందుదేవతలకు వారి పద్ధతుల ప్రకారం పూజలు చేస్తారు.  శివుని విష్ణువులా ఆరాధిస్తారా? విష్ణువును శివునిగా ఆరాధిస్తారా?
 
సాయిని ఇతరదేవతలుగా అలంకరించి పూజలు చేయటం కాకుండా, సాయిని సాయిలా ఆరాధించుకోవచ్చు.
 ......................
 
 భవిష్యత్తులో ఇంకెవరైనా వచ్చి,  వారు సర్వాంతర్యామి అంటే, వారికి కూడా హిందుదేవతల అలంకారాలు చేసి పూజలు చేస్తే ఒప్పుకోవాలా?

 పూజలలో అలా చేయకూడదు, ఇలా చేయకూడదని ఎన్నో చెప్పే బ్రాహ్మణులు,  ఈ విషయాలలో అలా చేయకూడదని చెప్పాలి కదా..
 ...............................
సాయిభక్తులు కూడా హిందువులే కాబట్టి, హిందుధర్మ పరిరక్షణ కూడా చేస్తారు.
..................................... 
ఈ తరంవారు తాము ఎప్పటినుంచో పూజించే హిందుదేవతలతో పాటు, సాయిని కూడా  పూజిస్తున్నారు. రాబోయే తరాల వాళ్ళు హిందుత్వంలోని అనేక నియమాలను పాటించలేక,  అందరు దేవతలు సాయిలోనే ఉన్నారని,  సాయిని మాత్రమే పూజించే పరిస్థితి కూడా రావచ్చేమో?

 ఇప్పటికే కొందరు సాయిభక్తులు ఏమంటున్నారంటే, సాయిలోనే అందరు దేవతలు ఉన్నారని, సాయిని ఆరాధించుకుంటామని అన్నట్లు అంటున్నారు.
 
    సాయిని హిందుదేవతల్లాగ అలంకరించి పూజలు మొదలుపెడితే, ఇక మళ్ళీ హిందుదేవతల పూజలు ఎందుకు? అందరు దేవతలు సాయిలోనే ఉన్నారని, కొందరు హిందువులు హిందుదేవతల ఆలయాలకు ఎక్కువగా వెళ్లటం మానేస్తారేమో? అని సందేహాలు కలుగుతాయి.
 ...........................
   హిందువులుగా ఉన్నవాళ్లు హిందుత్వం.. హిందుదేవతల ప్రాముఖ్యత తగ్గేలా ప్రవర్తించకూడదు. హిందుత్వానికి ఎటువంటి హాని జరగకుండా చూడాలి.
........................................
    వినాయకచవితి పూజలలో కొందరు ఏం చేస్తున్నారంటే,   తమకు ఇష్టం వచ్చినట్లు వినాయకునికి రకరకాల వేషాలు వేస్తున్నారు. ఇకమీదట ఇవన్నీ చేయకూడదని గట్టిగా చెప్పాలి. 

సినిమాల్లో హిందు దేవతలను తమ ఇష్టం వచ్చినట్లు మార్చి చూపించినా,  న్యాయస్థానంలో కేసులు వేయాలి.  
 
మూఢనమ్మకాలు పెంచే సీరియల్స్ ,  సోషల్మీడియాలో మూఢనమ్మకాలను వ్యాపింపచేసేవాళ్ళ పట్ల కూడా చర్యలు తీసుకోవాలి.

 తప్పులు చేసి ఇక్కడ న్యాయస్థానం నుంచి తప్పించుకున్నా కూడా,  దైవ న్యాయస్థానం నుండి తప్పించుకోలేరు.
.........................................
 పూర్వీకులు పూజించిన దేవతలు అంటే నాకు భక్తి ఉంది. షిర్డి సాయి అంటే భక్తి ఉంది. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. దైవము ఒక్కరే అయినా, ఏ మతం వారి పద్ధతులు వారికి ఉన్నాయి. దైవము ఒక్కరే కదా.. అని అన్ని మతాల వారు ఒకే ఆచారవ్యవహారాలు పాటించాలంటే చాలా కష్టం.
.................................
 
ఆ రోజుల్లో  సాయి  షిర్డి వస్తే, ఒకరి గుర్రం కనిపించకపోతే సాయి  ఆ విషయాన్ని చెప్పగా, సాయికి మహిమలున్నాయని  హిందువులే వారి వద్దకు వెళ్లి తమకష్టాలు తీర్చమని అడగటం ఎందుకు?
 
 హిందువులకు అనేక దేవతలు, అవధూతలు, గురువులు.. ఉండగా కొత్తవారి వెంటబడటం దేనికి? ఇది హిందువుల బలహీనతే. భవిష్యత్తులో మరొకరు వస్తే వాళ్ల వెంటకూడా పడతారా?

 నాకు తెలిసిన ఒక సాయి మందిరంలో హిందుదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి.
 చిన్న విగ్రహాను సాయి పాదాలవద్ద ఒక పళ్లెంలో పెట్టి పూజిస్తారు. దసరా వస్తే హాల్లో ఒక పక్కన పెద్ద అమ్మవారి బొమ్మను అలంకరించి నవరాత్రులు చేసేవారు. మామూలుగా నవరాత్రులంటే భక్తులు  అమ్మవారి దేవాలయానికి  లేక ఇంకో హిందుదేవాలయానికి వెళ్తారుకావచ్చు. 

సాయి మందిరంలో ఈ పూజలు చేస్తున్నారు కాబట్టి, ఆ చుట్టుపక్కల ప్రజలు అమ్మవారిని అక్కడే పూజించేవారు. భక్తులు అక్కడ  కానుకలు సమర్పిస్తారు.

షిర్డిసాయి ఇవన్నీ పూజలు చేయమని చెప్పలేదు. 
ఇవన్నీ  సాయి మందిరాల నిర్వాహకులు  చేస్తున్నారు.
....................................
 
 హిందువుల గ్రంధాలలో ఎవరిశక్తిని బట్టి వారు దైవాన్ని పూజించవచ్చని ఉంది.

దైవపూజ అంటేనే ప్రశాంతంగా చేసుకోవాలి. అలాంటి విషయాన్ని   విపరీతధోరణితో కొందరు హిందువులు క్లిష్టం చేసేసారు.   అవన్నీ విన్న ప్రజలకు అనేక సందేహాలు, భయాలు కలుగుతాయి.
...............

అంటరానితనం వంటి విషయాల వల్ల,  కొందరు శూద్రులు  మతం మారారని కొందరు అంటారు.  కొందరు అగ్రకులాల వాళ్లు కూడా ఎందుకు మతం మారారు? మతం మారిన వారిలో బ్రాహ్మణులు కూడా ఉన్నారు.

హిందుత్వంలోని అనేక  విషయాలను పాటించలేక కూడా, అగ్రకులాల వాళ్లు కొందరు మతం మారుతున్నారేమో? అనిపిస్తుంది.

ఇవన్నీ గమనించాక, ఇప్పటికైనా హిందువులు తమ పద్ధతులను కొంత సులభం చేసుకోవాలి, లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము.
.........................................
 
 సాయి తనకు షోడశోపచారాలతో పనిలేదు, ప్రేమతో కూడిన భక్తి ఉంటే చాలన్నారు.
 
 మరి, హిందు పెద్దవాళ్లు ఎలా చెబుతారంటే,   ప్రతిదానికి  ఇలా చేస్తే కష్టాలు వస్తాయి, అలా చేయకూడదు, ఇలాగే చెయ్యాలంటూ భయపెడతారు. హిందువులకు విసుగొచ్చి ఇతరమార్గాల్లోకి వెళ్లేలా చేస్తున్నారు.

  పూజలో కొబ్బరికాయ కుళ్లితే ఏ కష్టం ముంచుకొస్తుందో.. అని భయం, దీపంలో ఎన్ని వత్తులు వేయాలో? అనే సందేహాలు, బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలనే శంకలు, ఫలానా దిక్కున తిరిగి అన్నం తినాలి, టాయ్లెట్లో ఫలానా దిక్కున 
తిరిగి  కూర్చోవాలి, టీవీ ఫలానా దిక్కు పెడితే అరిష్టం..ఇలా వందల విషయాలను గుర్తుంచుకోలేక, గుర్తున్నా కూడా పాటించలేక నలిగిపోతున్నారు.

 ఇవన్నీ పాటించకపోతే కష్టాలొస్తాయోమోనని  భయపడి విసిగిపోయినవాళ్లు,  సులభంగా ఏదైనా మార్గం కనిపిస్తే అటు వెళ్లటానికి ఆలోచిస్తారు.
 
 ప్రాచీనులు ఎన్నో మంచి విషయాలను ఆచారవ్యవహారాలుగా తెలియజేసారు. అయితే, కాలక్రమేణా కొందరు కొన్నింటిని మార్పులుచేర్పులు చేసి మూఢనమ్మకాలుగా అతిగా తయారుచేసారు.

***************

గ్రంధాలలో విషయాల గురించి ప్రశ్న వేయకూడదన్నట్లు కొందరు అంటారు. గ్రంధాలలో కొన్ని ప్రక్షిప్తాలు(మార్పులుచేర్పులు) జరిగాయంటారు. ఇలాంటప్పుడు ఎన్నో సందేహాలు కలుగుతాయి..
 
గ్రంధాలను చదివినప్పుడు కొన్ని విషయాలు అర్ధం కావు, సందేహాలు కలుగుతాయి. అలాగే,  కొన్ని గ్రంధాలను చదివినప్పుడు  నాకు  కొన్ని సందేహాలు కలిగాయి.
 
 తెలియనివిషయాలు పెద్దవాళ్లను అడిగి తెలుసుకోవటంలో తప్పులేదు. గురువును, దైవాన్ని అడగటంలో కూడా తప్పులేదు.
................................
 
కొందరు,  తమ పూర్వీకులు ఆరాధించిన దేవతలను, గురువులను  కాకుండా, ఇతర మతాలదేవతల ఆరాధనలోకి వెళ్తారు. భవిష్యత్తులో ఇంకో కొత్త వాళ్లు మహిమలు చూపిస్తే, వీళ్ళు అటు వెళ్లరని గ్యారంటి ఉందా?
.........................

 హిందువులకు చాలామంది దేవతలు, గురువులు ఉండగా, ఎందుకు కొత్త వాళ్లవద్దకు వెళ్తారు?  అన్నది ఆలోచించాలి.
 
తిరువణ్నామలైలో అంత గొప్ప దైవము ఉండగా, మళ్లీ అక్కడున్న టోపి అమ్మ అనే ఆమె వద్దకు వెళ్లి ఆమె విసుక్కుంటున్నా కూడా,  ఆమె వెంటపడుతున్నారు. 
 ............................
 
హిందువులు ఎన్నో నియమాలనే చట్రంలో భయపడుతున్నారు. గ్రంధాలలో ఉన్న ఎన్నో విషయాలను పాటించకపోతే ఏమవుతుందో?  అని భయపడుతున్నారు. తరతరాలనుంచి గ్రంధాలలో ఎందరు ఎన్ని మార్పులుచేర్పులు చేసారో?
 
 గ్రంధాలలోని విషయాలు, ఆచారవ్యవహారాలు గత యుగాలలో చక్కగా పాటించగలరు.
 
కలియుగంలో పరిస్థితుల గురించి తెలిసిన ప్రాచీనులు, కలికాలంలో దైవస్మరణ..దైవనామ స్మరణ సులభమైన ఉపాయమని తెలియజేసారు.

 ఈ రోజుల్లో చాలామంది గంటసేపైనా సెల్ఫోన్ సంతోషంగా చూస్తారు కానీ, గంటసేపు సంతోషంగా పూజ చెయ్యటానికి మనస్సు పెట్టలేరు.
 
కలికాలంలో చాలా పదార్ధాలు కల్తి అయి ఉంటాయి. దైవనామము కల్తి చెయ్యలేరు.  దైవనామాన్ని చక్కగా సులభంగా స్మరించుకోవచ్చు.

దైవస్మరణ..దైవనామస్మరణ వల్ల ఆ శక్తి ప్రపంచమంతా వ్యాపించి, ప్రపంచం శాంతిగా ఉండే అవకాశముంది.
 
తపస్సు చేసినప్పుడు ఆ శక్తి ప్రపంచమంతా వ్యాపించి,  దేవతలు వరాలను ఇవ్వటం జరిగినట్లు గ్రంధాల ద్వారా తెలుస్తుంది.
.............................

 విధివిధానాలు తక్కువగా ఉన్నప్పుడు ప్రశాంతంగా దైవంపై ధ్యాస ఉంచటానికి కుదురుతుంది..విధివిధానాలు ఎక్కువ ఉన్నప్పుడు వాటిని సరిగ్గా పాటించామా? లేదా? అనే టెన్షన్ తోనే సరిపోతుంది.

విధివిధానాలు ఎక్కువ చేస్తూ చెప్పేవారు ప్రజలను దైవానికి దూరం చేస్తున్నట్లే.

........................


దైవపూజ కోసం విధివిధానాలు కానీ, విధివిధానాల కొరకు దైవపూజ ఏర్పాటు చేయలేదు. 
 
అతి చారాలను తగ్గించుకుంటే,  దైవాన్ని ప్రశాంతంగా  ఆరాధించుకోవచ్చు.
 ......................
 రామానుజాచార్యుల వారు, శంకరాచార్యుల వారు సమాజక్షేమం కొరకు ఎంతో కృషి చేసారు.  
 
 నాకు తెలిసినంతలో, హిందువులలో.. వైష్ణవము, శైవము, శాక్తేయము..ఇలా వివిధ పద్ధతులు ఉన్నాయి.  ఆదిశంకరులు తెలియజేసిన పంచాయతన పద్ధతిలో తాము అధికంగా పూజించుకోవాలనుకున్న దేవతను మధ్యలో ఉంచి పూజిస్తారు. 
 ...............

అందరు దేవతలను ఒకే దైవశక్తిగా శ్రీ మాత..శ్రీ పరమాత్మగా లేక పరమాత్మగా కూడా పూజించుకోవచ్చు..అని నాకు అనిపిస్తుంది.
 .......................... 
 
ఈ పోస్ట్ పెద్దది అయ్యింది.
 konni links...
 

No comments:

Post a Comment