koodali

Monday, September 2, 2024

ఇలాంటి పరిస్థితులు మారాలి...

 

సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వచ్చిపడటం వల్ల కూడా ..కొన్ని సమస్యలు కలిగి ప్రజలలో ఆందోళన కలుగుతుంది.


 దేశంలో సమస్యలు ఒకదానితరువాత ఒకటి  ఉంటూనే ఉన్నాయి.  సమస్యలు ఎందుకొస్తున్నాయి? వీటిని ఎలా పరిష్కరించుకోవాలని అందరూ ఆలోచించి పరిష్కరించుకోవాలి.


దేశంలో
 ఎప్పుడూ సమస్యలేనా?  ..ఇంకెప్పుడు భారతదేశం బాగుపడుతుంది?


అవినీతి, స్త్రీల పట్ల అత్యాచారాలు, నిరుద్యోగసమస్య....ఇలాంటి పరిస్థితి మారాలి.

  ఇవన్నీ పోవాలి.  పట్టుదలగా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే. 

 
భారతదేశం ఎంతో గొప్పదేశం అయ్యుండి కూడా, ఇక్కడి ప్రజలు ఎందుకు దేశాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతున్నారు?

 
 స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలయినా కూడా భారతదేశం పేదదేశంగా ఎందుకు ఉంది? ఇలాంటి పరిస్థితిలో ఎవరికైనా నిరాశ కలుగుతుంది .


 మనం మనదేశాన్ని అభివృద్ధి చేసుకోలేని చేతకాని దద్దమ్మలం,  చవటలం కాదు కదా..దేశపౌరులందరూ   దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపించాలి.
 

సమాజాన్ని సరైన దారిలోకి తీసుకురావాలంటే, కొన్నిసార్లు కఠినంగా ఉండటం కూడా అవసరం.

 

యువత ఉపాధి కొరకు విదేశాలకు వెళ్లే పరిస్థితి కాకుండా,  స్వదేశంలోనే చక్కగా జీవించేలా వ్యవస్థలను మార్చుకోవాలి.

 ఎప్పుడూ సినిమాలు, క్రికెట్, సోషల్మీడియా, అస్తమాను సెల్ఫోన్లు చూడటం..అని కాకుండా, పట్టుదలగా దేశాన్ని అభివృద్ధిపధంలో నడిపించే దిశగా యువత మరియు ప్రజలందరూ  మారాలి.

 జనాలు కొందరు ఒక మైక్ పుచ్చుకుని, పనిచేసే వారి వద్దకు వెళ్ళి అనేక ప్రశ్నలు అడుగుతూ విసిగిస్తుంటారు. ఇంకా కొందరు రెచ్చగొట్టే ప్రశ్నలు వేస్తూ గొడవలు పెడుతుంటారు.

..........
రాజకీయాలు స్వచ్చంగా ఉండేలా మార్పులు జరగాలి. అవినీతి పోవాలి. పేద, ధనిక అసమానతలు తగ్గాలి.. భారతదేశం గత వైభవాన్ని పొందాలి. భారతీయులు ప్రపంచానికి మార్గదర్శకులు కావాలి.

 అంతా  దైవం దయ.

..............

మంచి అంతా దైవం దయ. దైవానికి అనేక కృతజ్ఞతలు. 


 

No comments:

Post a Comment