link..
link..
నాకు కొన్ని సందేహాలు కలిగాయి.
నెలసరిలో ఉన్నప్పుడు దైవస్మరణ.. దైవనామస్మరణ.. చేస్తే దోషం కాదు కాని, మంత్రాలు.. స్తోత్రాలు.. చేయకూడదంటున్నారు కొందరు.
కార్తికమాసంలో కొన్ని దేవాలయాల్లో ఎవరైనా నెలకు కొంత డబ్బు కడితే, నెలంతా అభిషేకాలు..పూజలు చేస్తున్నారు. ...
అలాంటప్పుడు ఆ కుటుంబంలో స్త్రీలకు నెలసరి వస్తే అప్పుడు వాళ్ళ పేరు కూడా పూజలో చదువుతారు కదా....అప్పుడు వాళ్లు పూజ చేసినట్లే కదా..
మరి అలాంటప్పుడు దోషం ఉంటుందా? ఉండదా? అని సందేహం అనిపించింది.
అర్చనలు చేయించుకునేటప్పుడు కూడా వేరే ఊళ్లలో ఉండే కుటుంబసభ్యుల పేర్లు కూడా చెప్పి అర్చన చేయిస్తారు.
పూజలో పేర్లు ఉన్న వాళ్ళు నెలసరిలో ఉంటే అప్పుడేమిటి?
ఇలా పూజలు చేయించుకుంటే చేయించుకున్నవాళ్లకు, చేయించిన వాళ్లకు, చేసిన వారికి...కూడా దోషం వస్తుందా? అలా ఏమీ కాదా?
పూజకు డబ్బు కట్టిన తరువాత, ఎవరి ఇంట్లో అయినా అకస్మాత్తుగా మైల పాటించే పరిస్థితి వస్తే, ఆ సంగతిని వాళ్ళు చెప్పకపోవచ్చు.
అంటుముట్టు..మైల
ఉన్నాకూడా, దేవాలయంలో లేకుండా దూరంగా ఉంటే, వారి పేరుతో ఏ పూజ అయినా చేయించుకోవచ్చా? అలా చేస్తే ఏమైనా దోషం ఉంటుందా? ఉండదా? తెలియటం లేదు.
ఇన్ని సందేహాలు ఎందుకు అంటే, నెలసరి దోషం వల్ల చాలా కష్టాలు వస్తాయంటున్నారు అని.
.............................
కుటుంబసభ్యులందరూ పూజ చేస్తున్నట్లుగా వారి పేర్లు చెప్పటం కాకుండా, అంతా బాగుండాలని....కుటుంబంలో అందరూ బాగుండాలని భావిస్తూ పూజ చేయిస్తున్నట్లుగా (పూజారి గారితో) పూజ చేయించవచ్చేమో? అనిపించింది.
అయితే, అంటుముట్టు ఉన్నవారి గోత్రనామాలు చదివి పూజలు చేయవచ్చా? లేదా? అన్నది నాకు తెలియదు.
..........................
నేను గమనించిన విషయం ఏమిటంటే, కొన్నిసార్లు పూజలలో సుమారు అర్ధగంటకు పైగా ఈ గోత్రనామాలు ..కుటుంబసభ్యుల పేర్లను చదవటంతోనే సరిపోతుంది.
మేము చెన్నైలో ఉన్నప్పుడు, అక్కడ దేవాలయంలో ..అర్చన కొరకు గోత్రనామాలు చెప్పకపోయినా కూడా, స్వామిపేరుతో.. అని చెప్పి అర్చన చేసేవారు.
పేర్లు చెప్పకుండా ఈ పద్ధతి సులభంగా అనిపించింది.
....................
గోత్రనామాలు చెప్పినా చెప్పకపోయినా, దైవప్రీతి కొరకు.. జీవప్రీతి కొరకు ..కష్టాలు తొలగటానికి ..ఇలా దైవానికి ఎవరికి వారు మనస్సులో కూడా చెప్పుకోవచ్చు.
మన గురించి, మన ఆలోచనల గురించి..అన్నీ దైవానికి తెలుస్తాయి.
............................
వ్రాసినవాటిలో ఏమైనా తప్పులుంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
సోషల్మీడియాలో చెప్పేవన్నీ పాటించకపోతే కష్టాలొస్తాయేమోననే భయపడనవసరం లేదు.
అందరూ అన్నింటినీ పాటించలేరు. కలియుగంలో
దైవస్మరణ..దైవనామస్మరణతోనే తరించవచ్చని ప్రాచీనులే తెలియజేసారు.
ఎవరి
శక్తికి తగ్గట్లు వారు దైవాన్ని ఆరాధించుకోవచ్చు.
దైవానికి మన విషయాలను చెప్పుకోవచ్చు.
హిందూత్వంలో నిరాకారం, సాకారం..ఇలా ఇంకా ఎన్నో పద్ధతులున్నాయి. మన శక్తికి తగ్గట్లు చక్కగా హాయిగా దైవాన్ని ఆరాధించుకోవచ్చు.
సరైన విధంగా జీవించే శక్తిని ఇమ్మని దైవాన్ని ప్రార్ధించుకోవచ్చు.
ఈ రోజుల్లో చదువులు, ఉద్యోగాల వల్ల వత్తిడి పెరిగి ఆడవాళ్ళకు నెలసరి సరిగ్గా రావటం లేదు.
చదువుల వత్తిడి వల్ల చాలామంది అమ్మాయిలకు మూడునెలల వరకు కూడా నెలసరి రాకుండా ఉంటున్నాయి.
ఈ నెలసరి అంటుముట్టు గొడవల వల్ల కొన్నిసార్లు ...పండుగలు, పూజలు, శుభకార్యాలను కూడా ప్రశాంతంగా చేసుకోలేని పరిస్థితి ఉంటుంది.
నెలసరి వస్తుందేమో? అని భయపడుతూ ఉండవలసి ఉంటుంది.
ముందురోజు పూజకు సామాగ్రి కొనుక్కున్నా, పూజ చేస్తున్నా, ఫంక్షన్ జరుగుతున్నా కూడా సడన్ గా తమకుకానీ, తమ కుటుంబసభ్యులకు కానీ నెలసరి వస్తే ఏం చేయాలి? పూజ పూర్తి అవకపోతే మళ్ళీ చేయాలా? ఇలా ఎన్నో సందేహాలతో ప్రశాంతతే ఉండదు.
ఈ విషయాల వల్ల కుటుంబసభ్యుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి.
..............................
ఈ రోజుల్లో చాలారకాల పూజలను చాలామంది చేస్తున్నారు కదా..
పూజలప్పుడు కొందరు నెలసరి వాయిదా వేయటానికి మందులు వేసుకొంటున్నారు. ఇందువల్ల తరువాత చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఉదా..కొందరు కొన్ని వారాలు కొన్ని పూజలు చేస్తామనుకుంటారు. మధ్యలో నెలసరి రాకూడదని మందులు వేసుకుంటారు.
అలా అక్కరలేదు. నెలసరి వచ్చినా కూడా... తరువాత వారం ఆ పూజను కంటిన్యూ చేయవచ్చు.
కొన్ని పూజలు మాత్రం తిరిగి మొదటి నుంచి చెయ్యాలట...అంత ఓపిక లేనివాళ్లు పూజలు చేసే ముందే ఆలోచించుకుని మొదలుపెట్టడం మంచిది.
...........................
సంతానం కలిగే వయస్సులో ఉన్న స్త్రీలు నెలసరి వాయిదా టాబ్లెట్స్ బాగా వాడితే పుట్టే పిల్లలకు కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉండవచ్చు. అందువల్ల, జాగ్రత్తగా ఉండాలి.
నెలసరి అంటుముట్టు భయంతో నెలసరి వాయిదా..మందులు వేసుకుని, ఆరోగ్యం పాడుచేసుకోవద్దు...జాగ్రత్తలు తీసుకోవాలి.
అనారోగ్యం వస్తే కష్టం....ఆరోగ్యం ఉంటేనే ఏమైనా చేయగలరు.
...........................................
వివాహం వంటి శుభకార్యాల్లో లగ్నపత్రిక, వివాహం..ఇలా ఎన్నో సందర్భాలుంటాయి.
అన్ని
సందర్భాల్లో ఇంట్లో వారికి, బంధువులకు నెలసరి రాకుండా ఉండాలంటే కుదరదు.
జన్మకొకసారి చేసుకునే వివాహంలో నెలసరి వల్ల పాల్గొనకుండా ఉండాలంటే ఇంట్లో కుటుంబసభ్యులకు ఎంతో బాధగా ఉంటుంది.
వివాహం అంటే వధువుకు నెలసరి ఇబ్బంది లేకుండా ముహూర్తం నిర్ణయిస్తారు.
వధువు విషయంలో కూడా వివాహం సమయంలో అన్ని వేడుకలకు నెలసరి రాకుండా ఉండాలంటే కుదరకపోవచ్చు.
ఇలాంటి సందర్భాలలో టెన్షన్ వల్ల నెలసరి ముందే కూడా వచ్చే అవకాశముంది....
అలాంటప్పుడు ఏం చేయగలం...వేడుకలను పెంచుకుని నెలసరి వాయిదా మందులు మింగటం కన్నా, కొన్ని వేడుకలను తగ్గించుకోవచ్చు.
అయిదుసార్లు వేడుకలకు బదులు రెండు లేక మూడు సార్లు సరిపెట్టుకోవచ్చు.లేదా కొన్ని రోజులు తేడాతో ఫంక్షన్స్ జరుపుకోవచ్చు.
నెలసరిలో ఉన్నప్పుడు దేవాలయాలకు వెళ్ళటం, పూజలు చేయటం దోషం కాబట్టి, అందుకు తగినట్లు మొదటే జాగ్రత్తగా తేదీలను నిర్ణయించుకోవాలి.
................................
నాకు తెలిసిన ఒకమ్మాయి వివాహం సందర్భంగా నెలసరి ఆపటానికి ఒక వారం ముందు నుండి మందులు వేసుకుంటే, ఆ అమ్మాయికి ముఖానికి, పెదవులకు కొంచెం వాపు కూడా వచ్చింది....
ఏమీ కాదంటూ అలాగే మాత్రలు వేయించారు పెద్దవాళ్ళు.
అలా మందులు వేసుకుని ....వివాహం రోజుకు కొద్దిగా గోధుమరంగు డిశ్చార్జ్ కనిపిస్తే నెలసరి అవునా? కాదో? అమ్మాయికి కూడా అర్ధం కాదు.
కొందరికి మందులు వేసుకున్నా కూడా ఆగినట్లు ఉండదు.
.............................
ప్రాచీనులు చెప్పినట్లు ఖచ్చితంగా పాటించాలంటే.... నెలసరిలో ఆడవాళ్లు చదువులు, ఉద్యోగాల కొరకు కూడా ఖచ్చితంగా బయటకు వెళ్ళకూడదు.
మరి చదువులు, ఉద్యోగాలని నెలసరి రోజుల్లో బయటకు వెళ్ళి కలిపేస్తే కూడా పాపమే కదా..
కాలానుగుణంగా మారక తప్పదంటూ స్త్రీలు చదువులు, ఉద్యోగాలకు నెలసరి రోజుల్లో కూడా వెళ్తున్నారు. ఈ రోజుల్లో అలా ఇంట్లో కూర్చుంటే ఎలా కుదురుతుంది ..బయటకు వెళ్తే దోషంకాదు..అంటారు.
( ఇలా..అవసరాన్ని బట్టి మాట్లాడటం, అవసరాలకు తగ్గట్లు మార్చుకోవటం అంటారు.)
బయట దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు..పూజలు చేసుకున్నవాళ్ళు ఉంటారు. నెలసరిలో ఉన్నవాళ్ళు బయటకెళ్ళి తిరిగితే దోషం కాదా? మనకు అవసరం కాబట్టి బయటకు వెళ్తే దోషం ఉండదా?
..............................
నెలసరిలో ఉన్నప్పుడు దైవస్మరణ.. చక్కగా చేసుకోవచ్చు.
.................................
oka link...చేతనైతే ఈ సమస్యలను.........
oka link.. ఈ ఆచారం ఎక్కడవరకు వెళ్ళిందంటే..
........................
mari konni vishayaalu....
నాకు కొన్ని సందేహాలు కలిగాయి.
నెలసరిలో ఉన్నప్పుడు దైవస్మరణ.. దైవనామస్మరణ.. చేస్తే దోషం కాదు కాని, మంత్రాలు.. స్తోత్రాలు.. చేయకూడదంటున్నారు కొందరు.
కార్తికమాసంలో కొన్ని దేవాలయాల్లో ఎవరైనా నెలకు కొంత డబ్బు కడితే, నెలంతా అభిషేకాలు..పూజలు చేస్తున్నారు. ...
అలాంటప్పుడు ఆ కుటుంబంలో స్త్రీలకు నెలసరి వస్తే అప్పుడు వాళ్ళ పేరు కూడా పూజలో చదువుతారు కదా....అప్పుడు వాళ్లు పూజ చేసినట్లే కదా..
మరి అలాంటప్పుడు దోషం ఉంటుందా? ఉండదా? అని సందేహం అనిపించింది.
అర్చనలు చేయించుకునేటప్పుడు కూడా వేరే ఊళ్లలో ఉండే కుటుంబసభ్యుల పేర్లు కూడా చెప్పి అర్చన చేయిస్తారు.
పూజలో పేర్లు ఉన్న వాళ్ళు నెలసరిలో ఉంటే అప్పుడేమిటి?
ఇలా పూజలు చేయించుకుంటే చేయించుకున్నవాళ్లకు, చేయించిన వాళ్లకు, చేసిన వారికి...కూడా దోషం వస్తుందా? అలా ఏమీ కాదా?
పూజకు డబ్బు కట్టిన తరువాత, ఎవరి ఇంట్లో అయినా అకస్మాత్తుగా మైల పాటించే పరిస్థితి వస్తే, ఆ సంగతిని వాళ్ళు చెప్పకపోవచ్చు.
అంటుముట్టు..మైల
ఉన్నాకూడా, దేవాలయంలో లేకుండా దూరంగా ఉంటే, వారి పేరుతో ఏ పూజ అయినా ( చండీ హోమము, రుద్రాభిషేకము, సత్యనారాయణస్వామి వారి వ్రతములు..ఇలా ఏ పూజ అయినా ..) చేయించుకోవచ్చా? అలా చేస్తే ఏమైనా దోషం ఉంటుందా? ఉండదా? తెలియటం లేదు.
ఇన్ని సందేహాలు ఎందుకు అంటే, నెలసరి దోషం వల్ల చాలా కష్టాలు వస్తాయంటున్నారు అని.
.............................
కుటుంబసభ్యులందరూ పూజ చేస్తున్నట్లుగా వారి పేర్లు చెప్పటం కాకుండా, అంతా బాగుండాలని....కుటుంబంలో అందరూ బాగుండాలని భావిస్తూ పూజ చేయిస్తున్నట్లుగా (పూజారి గారితో) పూజ చేయించవచ్చేమో? అనిపించింది.
amtea, వాళ్లు పూజ చేస్తున్నట్లుగా భావించటం కాకుండా, పూజారి గారి చేత పూజ చేయిస్తున్నట్లు అయితే అంటుముట్టు దోషాలు ఉండవేమో?..అని నాకు అనిపించింది. .
అయితే, అంటుముట్టు ఉన్నవారి గోత్రనామాలు చదివి పూజలు చేయవచ్చా? లేదా? అన్నది నాకు తెలియదు.
..........................
నేను గమనించిన విషయం ఏమిటంటే, కొన్నిసార్లు పూజలలో సుమారు అర్ధగంటకు పైగా ఈ గోత్రనామాలు ..కుటుంబసభ్యుల పేర్లను చదవటంతోనే సరిపోతుంది.
మేము చెన్నైలో ఉన్నప్పుడు, అక్కడ దేవాలయంలో ..అర్చన కొరకు గోత్రనామాలు చెప్పకపోయినా కూడా, స్వామిపేరుతో.. అని చెప్పి అర్చన చేసేవారు.
పేర్లు చెప్పకుండా ఈ పద్ధతి సులభంగా అనిపించింది.
....................
గోత్రనామాలు చెప్పినా చెప్పకపోయినా, దైవప్రీతి కొరకు.. జీవప్రీతి కొరకు ..కష్టాలు తొలగటానికి ..ఇలా దైవానికి ఎవరికి వారు మనస్సులో కూడా చెప్పుకోవచ్చు.
మన గురించి, మన ఆలోచనల గురించి..అన్నీ దైవానికి తెలుస్తాయి.
గ్రంధాలలోని ఒక కధలో ఒక స్త్రీ.. ఒక రాజు కొడుకు.. అక్రమంగా తిరగటం.. కధలో..
ఇవన్నీ సామాన్యులు సరిగ్గా అర్ధం చేసుకోలేక, మంచిగా ఉన్నవారు నరకానికి పోవటం, చెడ్దపనులు చేసిన వాళ్లు స్వర్గానికి వెళ్లటం ఏమిటి? అని అనుకునే ప్రమాదముంది.
చెడు పనులు చేసిన వారు దయాభిక్షలా పుణ్యం ధారపోస్తే... స్వర్గానికి వెళ్ళవలసిన పరిస్థితి మంచివారికి ఏమిటి? అనిపిస్తుంది.
..................................
రాజకుమారుడు చనిపోయేముందు ఆత్మ రక్షణ కొరకు బ్రాహ్మణుని కూడా చంపటం జరిగిందని ఒక దగ్గర విన్నాను.
రాజకుమారుని ఒక్క కత్తివేటుతో చంపి, తరువాత బ్రాహ్మణుడు తనను తాను చంపుకున్నట్లు మరొక దగ్గర చదివాను.
( ఒక్కవేటుతో రాజకుమారుడు చనిపోయినప్పుడు, ఆత్మరక్షణ కొరకు బ్రాహ్మణుని ఎలా చంపగలడు?)
తనను తాను చంపుకోవటం అంటే ఆత్మహత్య . ఆత్మహత్య పాపం అంటారు కాబట్టి.. అలా కూడా బ్రాహ్మణున్ని నరకానికి తీసుకుపోవటానికి యమదూతలు వచ్చారేమో?
............................................
రాజకుమారుడు మొదట్లో మంచిగా ప్రవర్తించేవాడని, తరువాత అతను దురలవాట్లకు లోనయ్యి రాజ్యంలోని స్త్రీలను కూడా వేధించేవాడని తెలుస్తుంది.....
రాజకుమారుడు వాళ్ళు తాము చేసిన పాపానికి పశ్చాత్తాపం చెందారో ? లేక ఎందుకో తెలియదు కానీ, తమ దీపారాధన పుణ్యాన్ని బ్రాహ్మణునికి కొంత ఇవ్వటానికి ముందుకు వచ్చారు.
రాజకుమారుని తల్లితండ్రి గతంలో చేసిన పుణ్యాల వల్ల.. రాజకుమారుడు గతంలో చేసిన ఏమైనా పుణ్యాల వల్ల ఇంకా..దీపారాధన చేసిన పుణ్యం వల్ల.. అతనికి తాను పొందిన పుణ్యంలో కొంత భాగాన్ని బ్రాహ్మణునికి ఇవ్వాలనే ఆలోచన వచ్చి ఉండవచ్చు.
బ్రాహ్మణుడు ఇంతకుముందు చాలా పూజలు, పుణ్యాలు చేసిఉంటారు కాబట్టి, మొత్తానికి అతను స్వర్గానికి వెళ్ళటం జరిగిందని ఒక దగ్గర విన్నాను.
దుష్ప్రవర్తన కలిగిన రాజకుమారుని చంపటం ద్వారా ....రాజ్యంలోని స్త్రీలకు ఉపకారం కూడా జరిగింది.
బ్రాహ్మణుడు చేసిన పూజలు, పుణ్యాల వల్ల పరిస్థితులు కలసి వచ్చి బ్రాహ్మణుడు స్వర్గానికి వెళ్ళటం జరిగింది.
......................
మరికొన్ని ఆలోచనలు...........
ఆ రాజకుమారుడు భయపెట్టి ఆమెను లొంగదీసుకుని ఉండవచ్చు.
(అయితే, కధను గమనిస్తే ఆ స్త్రీ తాను కూడా ఇష్టంగానే రాజకుమారునితో ఉన్నట్లు తెలుస్తుంది.)
భార్య వేరే వారి మోజులో పడితే తప్పే.
...........................
ఆ రాజకుమారుని తండ్రి.. పుత్ర ప్రేమతో తన కొడుకుకు సరైన బుద్ధి చెప్పకుండా అలా వదిలేయటం తప్పు...ఇంకా అతడేం న్యాయం చేస్తాడు ప్రజలకు?
.............................
ఆ స్త్రీ భయంతో రాజకుమారునితో ఉన్నదో? లేక ఇష్టపడి ఉన్నదో? తెలియదు.
నాకు ఏమనిపిస్తుందంటే, ఆ స్త్రీ ఇష్టంగానే రాజకుమారునితో ఉంటే, ఆ స్త్రీ యొక్క భర్త ఆమెను సరిగ్గా పట్టించుకోలేదేమో?
(అయితే, కొందరు మగవారు...ఆడవారు తమ జీవితభాగస్వామి ఎంత బాగా చూసుకున్నా కూడా పరాయి వాళ్ల మోజులో పడుతారు.)
........................
జీవితానికి పరమార్ధం మోక్షాన్ని పొందటం అనేది నిజమే కానీ, మనకు నాలుగు ఆశ్రమాలను పెద్దలు తెలియజేసారు.
గృహస్తాశ్రమంలో ఉండగా సన్యాసాశ్రమంలా కాకుండా, భార్యాభర్తలు అన్యోన్యంగా కూడా ఉండాలి.
భార్యాభర్త ఇద్దరూ ఇష్టపూర్వకంగా ఒకే విధంగా ఆలోచించుకుని చాలా నియమాలను పాటిస్తూ జీవిస్తే.. అది వేరే విషయం.
.......................................
గృహస్తాశ్రమంలో ఉన్నప్పుడు భార్యాభర్త అన్యోన్యంగా లేకుంటే గొడవలు, అక్రమసంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది.
దైవాన్ని స్మరించుకోవటం, నిత్యపూజ చేయటం..వీటికి భార్యాభర్త సంసారానికి దూరంగా ఉండనవసరం లేదు.
కొన్ని పండుగలు, కొన్నిపూజలు రోజుల్లో బ్రహ్మచర్యాన్ని పాటించి, మిగతా రోజుల్లో భార్యాభర్త అన్యోన్యంగా సంసారం చేయవచ్చని నా అభిప్రాయం.
...................................
కధలలో మనకు తెలియని అంతరార్ధాలు ఎన్నో ఉంటాయి. పైపైన తెలుస్తున్న వాటిప్రకారం నా అభిప్రాయాలను వ్రాయటం జరిగింది.
వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని కోరుకుంటున్నాను.
దైవానుగ్రహం పొందాలన్నా, గురువు అనుగ్రహం పొందాలన్నా సత్ర్ప్రవర్తన అవసరం.
కొందరు పాపాలు చేసి, తరువాత చేసిన పాపాలకు పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తారు. తాము పశ్చాత్తాపం చెందాం కాబట్టి, ఇక తమకు ఎటువంటి శిక్షా లేకుండా ఉండాలని కూడా కొందరు ఆశిస్తారు.
ఇలాంటి వాళ్ళు నిజంగా పశ్చాత్తాపం చెందారా లేక పరిస్థితి అనుకూలిస్తే మళ్ళీ నేరం చేస్తారా? అనేది తెలియదు.
నిజంగా పశ్చాత్తాపం చెందినా కూడా కొంతయినా శిక్ష పడక తప్పకపోవచ్చు. ఎందుకంటే, నేరస్తుల వల్ల బాధితులకు జరిగిన అన్యాయం, బాధ, ఆక్రోశం ఉంటాయి కదా!
చిన్న నేరం అయితే బాధితులు నేరస్తులను క్షమించే అవకాశం ఉంది, లేక కొద్దిపాటి శిక్షతో సరిపెట్టుకోవచ్చు.
పెద్ద నేరం, క్రూరమైన నేరం చేస్తే మాత్రం.. నేరం చేసిన వాళ్ళు పశ్చాత్తాపాన్ని ప్రకటించినా కూడా శిక్ష తప్పకపోవచ్చు. కొన్నిసార్లు మరణశిక్ష కూడా పడవచ్చు. అప్పుడు, నేరస్తులు ఎంత ప్రాధేయపడినా ఉపయోగం ఉండకపోవచ్చు.
అయితే, నేరం చేసిన కొంతకాలం తరువాత కానీ,మరణానికి ముందు కానీ .. పశ్చాత్తాపం కలిగితే దానివల్ల మరుజన్మలో కొంత మంచి జన్మ రావటానికి ఉపయోగపడవచ్చు.
........................................................
సమాజంలో క్రూరమైన నేరం చేసిన తరువాత ఉరిశిక్ష పడితే ఆ శిక్ష నుండి తప్పించాలని జడ్జి ముందు ఎంత ఏడ్చి ప్రాధేయపడినా ఏం లాభం?
జడ్జి ఎంత దయకలవారైనా వారికి కొన్ని నియమాలు ఉంటాయి కదా..వారు చట్టం ప్రకారం నడచుకోవాలి.
జీవులు తమను తాము నిగ్రహించుకోలేక పాపాలు చేసి, తత్ఫలితంగా కష్టాలు వస్తే దైవాన్ని నిందించటం సరికాదు. .
కొందరు పాపకర్మలను పరిహారాలు చేయటం ద్వారా తొలగించుకోవాలనుకుంటారు. అయితే, పాపకర్మల పరిహారం కొరకు పరిహారక్రియలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలి.
కొన్ని పరిహారాలను చేయటం కూడా కష్టమే. కొన్ని పరిహారాలను ఆచరించటం కంటే, కష్టాలను అనుభవించటం ద్వారా పాపక్షయం చేసుకోవటమే తేలికగా అనిపించవచ్చు.
పరిహారాలు సరిగ్గా ఫలించాలన్నా సత్ప్రవర్తన అవసరం.
.....................................................
ఎవరైనా తప్పు చేస్తే చట్టంలో దానికి తగ్గ శిక్షలుంటాయి. ఇలా శిక్షించటం ఎందుకంటే, శిక్ష వల్ల భయంతో ఇకమీదటైనా తప్పులు చేయరనే ఉద్దేశంతో శిక్షిస్తారు.
అంతేకానీ , తప్పు చేసినా తప్పుకు శిక్షగా జరిమానా చెల్లించటం లేక కొంతకాలం జైల్లో ఉండి వచ్చి , చేసిన తప్పులకు పరిహారం జరిగిపోయింది కాబట్టి, మళ్లీ తప్పులు చేయటం ..అనేది అసలు ఉద్దేశం కాదు.
తిరిగి మళ్లీ తప్పు చేయకూడదనేది సరైన ఉద్దేశ్యం.
చెడుపనుల వల్ల కష్టాలు వచ్చినప్పుడు, ఆ కష్టాల నుండి తప్పించుకోవటానికి పరిహార పూజలు చేసుకోవటంలో తప్పులేదు. అయితే పరిహారం జరిగింది కాబట్టి, మళ్లీ పాపాలు చేయటం తప్పు.
ఎన్ని పాపాలు చేసినా .. పరిహారాలతో బైటపడవచ్చు ..అనే భావన ప్రజలలో వస్తే అది ఎంతో ప్రమాదకరమైనది. పూర్వీకులు మనకు తెలిపిన ఉద్దేశ్యాలకు వ్యతిరేకమైనది.
..............................
కొందరు చేసే చెడ్దపనుల వల్ల సమాజంలో ఎందరికో కష్టాలు వస్తాయి.
ఇలాంటప్పుడు దైవం చూస్తూ ఊరుకోరు.. చెడుపనులు చేసేవారిని తనదైన విధానంతో దారిలోకి తెస్తారు.
****************************
రావణాసురుడు ఎంతో గొప్ప పండితుడు. అతనికి ఎన్నో పరిహారాలు తెలిసే ఉంటాయి. అయినా మరి శిక్ష నుంచి తప్పించుకోలేకపోయాడు.
పాపాలు చేయటాన్ని కొనసాగిస్తున్నప్పుడు పరిహారాలు చేయాలన్నా..అనుకున్నట్లు జరగకపోవచ్చు.
***************************
ఎవరైనా మంచిచేసినా.. చెడ్ద చేసినా దానికి తగ్గ ఫలితాలు ఉంటాయి.
చెడ్దవారి విషయంలో ఎలాగూ వారు చేసిన చెడుపనులకు తగ్గ ఫలితాలు ఉంటాయి.
అయితే, కొందరు మంచివారికి కూడా కొన్ని కష్టాలు రావటం, వ్యాధులు రావటం.. లోకంలో గమనిస్తాం.
ఎన్నో మంచిపనులు చేసినా కూడా ఇలాంటి కష్టం ఎందుకు వచ్చిందో కదా ..అనిపిస్తుంది.
కొన్ని విషయాలు ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, మంచివారి వల్ల కూడా కొన్నిసార్లు ఇతరులకు ఇబ్బందులు వస్తాయి.
ఉదా..ఒక మంచి వ్యక్తికి కోపం బాగా ఉండి అందువల్ల ఇతరులకు బాగా ఇబ్బందులు కలిగితే, అందువల్ల కూడా ఆ మంచివ్యక్తికి కొన్ని బాధలు కలిగే అవకాశముంది.
ఉదా..ఒక మంచివ్యక్తి తాను కొన్ని మూఢనమ్మకాలను నమ్మి, కుటుంబసభ్యులను, ఇతరులను కూడా ఆ మూఢనమ్మకాలతో ఇబ్బంది పెడితే, ఆ ఉసురు వల్ల అతనికి ఈ జన్మలోనో, మరుజన్మలోనో..కొన్ని కష్టాలు..వచ్చే అవకాశముంది.
.................................
భక్తులమని చెప్పుకునే వాళ్ళలో కూడా కొందరు చెడుపనులు చేస్తున్నారు. భక్తులనే వాళ్లు పాపాల విషయంలో ఎందుకు భయపడటం లేదు?
బహుశా వాళ్ళ ఉద్దేశం ఎన్ని పాపాలు చేసినా దానికి తగ్గ పరిహారం చేసుకుంటే చాలు.. పాపాల నుంచి విముక్తులు కావచ్చని అనుకుంటున్నారు కాబోలు, లేక మనస్సును అదుపులో ఉంచుకోలేక తిరిగి తప్పులు చేస్తారు.
................................................
దైవనామ స్మరణాన్ని, పూజలు చేయటాన్ని మొదలుపెట్టి, అలా పూజలు చేస్తూచేస్తూ..ఉండటం వల్ల క్రమంగా పాపాత్ములలో మార్పు వచ్చి మంచిగా పరివర్తన చెందుతారు.
* మందులు మనకు ఇష్టం ఉండి వేసుకున్నా, ఇష్టం లేక మ్రింగినా అనారోగ్యాన్ని పోగొడతాయి కదా! అలాగే ఏ కారణంతో దైవనామస్మరణాన్ని మొదలుపెట్టినా ఫలితం లభిస్తుంది.
అయితే, దైవనామ స్మరణం చేసే వ్యక్తి యొక్క భక్తిశ్రద్ధలు , నీతినిజాయితీలను బట్టి ఫలితాల్లో ముందువెనుక తేడాలుంటాయి. కొందరికి శీఘ్రంగా మంచి ఫలితాలు కనిపిస్తాయి. కొందరికి ఒక జన్మలో మంచి మార్పు కనిపిస్తే, మరి కొందరిలో కొన్ని జన్మలు పట్టవచ్చు.
* డాక్టరు తన వద్దకు వచ్చిన పది మంది రోగులకు ఒకే రకం మందులను ఇచ్చినా , ఆ రోగులు సక్రమంగా మందులను వేసుకోవటం, సక్రమంగా పధ్యాన్ని పాటించే విధానాలను బట్టి వారి వ్యాధులు తగ్గే సమయంలో ముందువెనుక తేడాలుంటాయి.
కొందరికి రోగం త్వరగా తగ్గుతుంది. కొందరికి ఆలస్యంగా తగ్గుతుంది. మందులు సరిగ్గా వేసుకోకుండా, పధ్యం సరిగ్గా పాటించని వారికి రోగం త్వరగా తగ్గకపోవచ్చు కూడా.
.............................
దైవాన్ని దృఢంగా నమ్మి శరణు పొందిన వారి విషయంలో దైవము, వారిని సరైన పద్ధతిలో జీవించేలా చేస్తారు.
అయితే, భక్తులం అని చెప్పుకునేవారికి కొందరికి అహంకారంతో పాటు, తన భక్తి కూడా ఎంతో గొప్పది..తాను ఎన్నో పూజలు చేయటం వల్ల, తాను ఎలా ప్రవర్తించినా కూడా..దైవం కూడా తనకి లొంగక తప్పదు..అనే విధంగా అహంకారం ఉన్న వారి విషయంలో, వారు ఎన్ని పూజలు చేసినా కూడా గొప్పఫలితాలను పొందలేకపోవచ్చు.
.................................
కష్టాల నుండి తప్పించుకోవాలంటే, చేసిన పాపాల గురించి పశ్చాత్తాపపడి మంచిమార్గంలోకి రావటానికి ప్రయత్నించాలి.
తప్పులు చేసిన వారిని క్షమించటమూ అవసరమే. అయితే ఎంతవరకు?
దైవం దయామయులు. ఎవరైనా మంచిగా మారటానికి కొంత సమయాన్ని ఇస్తారు.
ఆ తరువాత కూడా వినకపోతే వారికి తగిన శాస్తి జరుగుతుందని పురాణేతిహాసాల ద్వారా తెలుస్తుంది.
శ్రీరామునికి సీతాదేవిని అప్పగించేయమని ఎందరు చెప్పినా రావణాసురుడు వినలేదు.
శివుని అంశ అయిన హనుమంతులవారు మంచి చెప్పినా రావణుడు వినిపించుకోలేదు. తుదకు అందుకు తగిన శిక్షను అనుభవించాడు.
(రావణాసురునికి తాను గొప్పసంపదలు ఉన్న వ్యక్తిని అనే అహంకారంతో పాటు, తన భక్తి కూడా ఎంతో గొప్పది, తాను ఎలా ప్రవర్తించినా కూడా ..దైవం కూడా తన కి లొంగక తప్పదు.. అనే అహంకారం ఉండి ఉంటుంది.అందుకే అతనిపరిస్థితి అలా అయ్యిఉంటుంది. )
శ్రీకృష్ణుడు..శిశుపాలుని నూరు తప్పుల వరకు సహించి తరువాత శిక్షించారు.
అందువల్ల, అందరమూ జాగ్రత్తగా ఉండటం మంచిది.
దైవం పట్ల ప్రేమతో కూడిన శరణాగతి ఉంటే,
దైవం కాపాడుతారు.
......................
గతంలో చేసిన పాపాలకు దృఢంగా పశ్చాత్తాపపడి, ఇక మీదట పాపాలు చేయటం మాని, పూజలు చేయటం, కష్టాల్లో ఉన్నవారికి సాయంచేయటం.. వంటి పరిహారాలు, పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే.. గతపాపకర్మ ఫలితం గణనీయంగా పలుచబడి, తక్కువ కష్టాలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కష్టాలు వచ్చినా పెద్ద కష్టం తెలియకుండానే ఆ కష్టాలు గడిచిపోవచ్చు.
కష్టాలలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడు వారు పొందిన సంతోషం వల్ల మన పాపకర్మ పలుచబడే అవకాశముంటుంది.
పరిహారాలు సరిగ్గా పనిచేయాలంటే, పాపాలు చేస్తూనే పరిహారాలు చేయటం కాకుండా, పాపాలు చేయటం మాని పరిహారాలు చేస్తూ ఉండాలి.
...................................
మద్యానికి అలవాటు పడ్డ కొందరికి మద్యం హానికరమని తెలిసినా దానిని వదలలేరు. మద్యం వల్ల వ్యాధి వస్తే కొందరు దానిని తీసుకోవటం మానేస్తారు. కొందరు వ్యాధి వచ్చినా మద్యాన్ని మానలేరు.
అలాగే కొందరు, పాపాలు చేయటం తప్పని, అందువల్ల కష్టాలు వస్తాయని తెలిసినా, తాము చేసిన పాపాలకు నిజంగా పశ్చాత్తాపాన్ని పొందుతూ కూడా.....పాపాలు చేయకుండా మాత్రం మనస్సును నిగ్రహించుకోలేరు.
అలాంటప్పుడు తమకు సరైనదారిలో జీవించేలా శక్తిని ఇవ్వమని దైవాన్ని దృఢంగా ప్రార్ధిస్తే దైవము కరుణించే అవకాశం ఉంటుంది.
...........................
పాపపరిహారం కొరకు పరిహారాలు చేయటం మంచిదే....పాపపరిహారాలు చేయగాచేయగా...ఆ పుణ్యం వల్ల వాళ్ల పాపప్రవృత్తి పోవచ్చు.
పూజలు, దానధర్మాలను చేయటం వంటి పరిహారాల వల్ల....చేసేవారికి, సమాజానికి మంచిదే.
అయితే, సరైన దైవభక్తి లేకుండా, అహంకారం కలిగి ఉండటం, పాపభీతి లేకుండా చేసే పరిహారాల వల్ల గొప్ప ఫలితాలను పొందలేకపోవచ్చు.
...................................
ఎన్ని పాపాలు చేస్తునా కూడా కొన్ని పరిహారాలు చేస్తే చాలు సరిపోతుందని అనుకోవద్దు. దైవము ఏమీ అమాయకులు కాదు.
ఉదా..కొందరిని గమనిస్తే, వాళ్లకు చాలా డబ్బుంటుంది. కాని, ఇష్టమైనవి తినలేనివిధంగా డయాబెటిస్ లేక అలాంటి వ్యాధులుంటాయి....
చేసిన పుణ్యాలకు చాలా డబ్బును ఇచ్చి, చేసిన పాపాలకు ఫలితంగా ఇష్టమైన ఆహారాన్ని తినలేని విధంగా సుగర్ వంటి వ్యాధులను వచ్చేలా చేస్తారు.
కష్టాలు రాకుండా ఉండాలంటే, మనస్సును నిగ్రహించుకోవటానికి ప్రయత్నించక తప్పదు.
...................
ఎవరికైనా మంచిగా మారటానికి దైవము కొన్ని అవకాశాలను ఇస్తారు.
ఎన్ని అవకాశాలు ఇచ్చినా మంచిగా మారకుండా సమాజానికి హాని కలిగే విధంగా పాపాలు చేసినవాళ్లు.. ఒకవేళ సమాజం వేసే శిక్షల నుండి తప్పించుకున్నా కూడా, దైవం నుండి తప్పించుకోలేరు.
...........................
దైవభక్తి..ధర్మబుద్ధి ఉండేలా దైవాన్ని ప్రార్ధించుకుంటే బాగుంటుంది.
......................................
అజామిళుని కధ. వంటి కధలను చెప్పటంలో....link krimda..
link.... ఓం ..కొన్ని విషయములు..
link..జాతకంలో రాసిపెట్టి ఉన్నది అనుభవించక తప్పదా ?
కొందరు జోతిష్కులు చెబుతున్న ప్రకారం.. రాబోయేరోజుల్లో తీవ్రమైన బాధాకరమైన సంఘటనలు ప్రపంచంలో జరుగుతాయని చెబుతున్నారు. అవి వింటే ఎవరికైనా భయాందోళనలు కలుగుతాయి.
అయితే, భక్తితో దైవస్మరణ, దైవనామస్మరణ, లోకక్షేమం కొరకు యజ్ఞయాగాదులు చేయటం, ధర్మబద్ధంగా జీవించటం..వంటి వాటివల్ల రాబోయే విపత్తులు గణనీయంగా తగ్గుతాయి.
గ్రహ స్థితులు ఎలా ఉన్నా .. దైవభక్తి, మన ప్రవర్తనను బట్టి కూడా పరిస్థితులను మార్చుకోవచ్చు. గాయత్రి మంత్రాన్ని .. అందుకు సంబంధించిన విధులను చక్కగా ఆచరించటం మంచిది. అందువల్ల లోకక్షేమం కలుగుతుంది. ఎక్కువసార్లు చేయకపోయినా, కొన్నిసార్లు అయినా శ్రద్ధతో చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
అయితే, గాయత్రి మంత్రాన్ని అందరూ చేయకూడదంటారు. పెద్దవాళ్లు చెప్పినట్లు పాటించటం మంచిది. సర్వగాయత్రి మంత్రాన్ని అందరూ చేయవచ్చు, సర్వగాయత్రిని చేసినా మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు.
అయితే, కొందరు సర్వగాయత్రి మంత్రాన్ని చదవటంలో కూడా.. అలా కాదు, ఇలా చదవాలంటూ..చెబుతున్నారు. ఇవన్నీ సందేహాలు ఎందుకనుకుంటే.. దైవస్మరణ, దైవనామస్మరణ చక్కగా చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. కలికాలంలో దైవస్మరణ, దైవనామస్మరణ సులభోపాయమని పెద్దలు తెలియజేసారు.
********************
దైవపూజలు చేసినప్పుడు ప్రజలు , ప్రపంచంలో అందరికి తమతో సహా బుద్ధి సరిగ్గా ఉండాలని కూడా దైవాన్ని ప్రార్ధించుకుంటే మంచిది. బుద్ధి సరిగ్గా ఉంటే అంతా మంచిగా ఉంటుంది. సరైన విధంగా జీవించే శక్తిని ప్రసాదించమని దైవాన్ని ప్రార్ధించితే మంచిది.
*********************
వ్రాసిపెట్టి ఉన్నది ఎలాగూ తప్పనప్పుడు మనం ఏం చేయగలం? అని చాలామంది నిరాశగా అనుకుంటారు. అలా భావించటం పొరపాటు.దైవానుగ్రహాన్ని పొందగలిగితే భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉందని కొందరి చరిత్రల ద్వారా పెద్దలు తెలియజేసారు.
ఉదా..సతీ సావిత్రి చరిత్రలో సావిత్రి యమధర్మరాజును మెప్పించి , సత్యవంతుని ఆయుర్దాయాన్ని పెంచుకోవటమే కాకుండా ఎన్నో వరాలనూ పొందటం జరిగింది.
ఉదా.. భక్త మార్కండేయుని చరిత్రను గమనించినా ..దైవానుగ్రహాన్ని పొందగలిగితే మంచి జరుగుతుందని తెలుస్తుంది.
*********
గ్రంధాల ద్వారా మరి కొన్ని విషయాలను తెలుసుకోవచ్చు.
ఎవరైనా బాగా పట్టుదలగా తపస్సు చేస్తే, దేవతలు వరాలనివ్వటం జరుగుతుంది.
కొందరి విషయాలలో.. తపస్సు వల్ల విపరీతమైన వేడి వచ్చి, ఆ వేడి లోకమంతా వ్యాపిస్తే.. ఆ వేడిని తట్టుకోలేని ప్రజలు దేవతలను ప్రార్ధిస్తే.. దేవతలు వరాలనివ్వటం జరుగుతుంది. ఆ వరాలను పొందిన తరువాత, వరాలను పొందినవారు వరగర్వంతో ప్రజలను బాధ పెడితే, అప్పుడు ఎటువంటి మొహమాటం లేకుండా లోకక్షేమం కొరకు దైవం వారిని చంపివేస్తారు.
ఈ విషయాలను గమనిస్తే నాకు ఏమనిపించిందంటే, ఒక్కరు దృఢంగా తపస్సు చేస్తేనే లోకంపై చాలా ప్రభావం ఉన్నప్పుడు....కొందరైనా మంచివాళ్ళు లోకక్షేమం కొరకు గట్టి పట్టుదలతో ప్రయత్నిస్తే ... దైవం వరాలను ప్రసాదిస్తారు.. అనిపించింది.
******************
లోకంలో కొందరు దుర్మార్గులు దారుణాలు చేసినప్పుడు మనకు ఏమనిపిస్తుందంటే, దైవం లోకంలోని చెడ్డవారిని అందర్నీ చంపేయవచ్చు కదా.. అనిపిస్తుంది.
అన్నీ దైవమే చేస్తే మనుషులు ఏం చేస్తారు? టెక్నాలజీ పేరుతో ప్రకృతిని ధ్వంసం చేయటం, పశుపక్ష్యాదులను చంపి తింటూ, మద్యం, మత్తుపదార్ధాల మత్తులో నేరాలు..ఘోరాలు చేయటం , పాపాలు చేసి అయినా ఆస్తులు పెంచుకుంటూ విలాసాలలో మునిగి ఉంటారా?
దైవం జీవులకొరకు మంచి వాతావరణం, ఆహారం కొరకు ఎన్నో మొక్కలను, ఆహ్లాదకరంగా ఎన్నో సుందర ప్రకృతిదృశ్యాలను..ఇంకా ఎన్నింటినో ప్రసాదించినా కూడా, సంతోషంగా ఉండటం చేతకాక... అంతులేని కోరికలతో, అసూయాద్వేషాలతో కొట్టుకు పోతున్నారు.
మనం ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ మన ప్రయత్నాలు మనం చేస్తూ.. కాపాడమని దైవాన్ని ప్రార్ధిస్తే కలికాలంలోనైనా కూడా , అమాయకులు, మంచివారైన వారికి బాధలు గణనీయంగా తగ్గే అవకాశముంది. అంతా దైవము దయ.
*************************
Sunday, August 18, 2024
ఈ పోస్టును పైనవ్రాసిన తేదీన మొదట పోస్ట్ చేయటం జరిగింది. కొన్ని కారణాల వల్ల అక్కడ పోస్టును ఇక్కడ వేసి, ఇక్కడ పోస్టును అక్కడ వేయటం జరిగిందండి.
గ్రంధాలలో ఎన్నో అర్ధం కాని విషయాలుంటాయి. ప్రక్షిప్తాలు కూడా ఉంటాయి.
ఇవన్నీ అదేపనిగా ఆలోచిస్తూ, వాదిస్తూ సమయాన్ని గడపటం కన్నా, ఇవన్నీ విని గందరగోళం పడటం కన్నా..కొంతవరకు తెలుసుకుని..అన్నింటికి మూలమైన దైవాన్ని నమ్ముకుని మన శక్తికొలది చక్కగా దైవాన్ని ఆరాధించుకోవటం మంచిదనిపిస్తుంది.
................
ఒకప్పుడు వేదములను రాక్షసులు అపరించినప్పుడు, దైవము రాక్షస సంహారం చేసి వేదాలను రక్షించారని గ్రంధాల ద్వారా తెలుస్తుంది.
వేదాలనే అపహరించగలిగినప్పుడు, ఎవరైనా గ్రంధాలలో మార్పులుచేర్పులు(ప్రక్షిప్తాలు) చేయటంలో ఆశ్చర్యం ఏముంటుంది.
..................
మాంసాహారం వల్ల ఎంతో జీవహింస జరుగుతుంది. మద్యం వంటి మత్తు పదార్ధాల వల్ల
మనస్సు అదుపు తప్పి ఎన్నో నేరాలు జరిగే అవకాశముంది. అందువల్ల, వాటిని
ప్రోత్సహించేలా మాట్లాడటం సరైనదేనా?
...................
మాంసాహారం తినకూడదని వేదములలో ఉందని కొందరు చెబుతున్నారు.
మద్యాన్ని తీసుకోవటం పంచమహాపాతకాల్లో ఒకటని గ్రంధాలలో ఉందంటున్నారు. వాటిని సమర్ధించటం కూడా పాపమేనట.
............
చక్కగా గాయత్రిని ఆచరించే కుటుంబాలవారు ఎన్నో నియమాలను పాటిస్తారు. అలా చేయలేనివారు తక్కువ నియమాలను పాటిస్తారు....(నాకు తెలిసినంతలో.. పాత కాలంలో అలా ఉండేదనుకుంటున్నాను.)
అయితే
ఈ మధ్య కొందరు, ఎవరైనా కూడా అనేక నియమాలను పాటించాలన్నట్లు చెబుతున్నారు.
ఉదా.. ఉల్లి,వెల్లుల్లి వంటివి తినకుండా నియమాలు పాటించాలన్నట్లు
చెబుతున్నారు.
మరికొందరు ఏమంటున్నారంటే, గాయత్రిని ఆచరించే కొన్ని అగ్రవర్ణాల వారు (ఉదా..క్షత్రియులు..)మాంసాహారం తినొచ్చు అంటున్నారు.
ఒకరు
ఏమంటున్నారంటే, బ్రాహ్మణ,క్షత్రియులు..యజ్ఞంలో వ్రేల్చబడిన బలిని
(మాంసాహారాన్ని) తీసుకోవాలని గ్రంధాలలో ఉందని చదివినట్లు గుర్తు ..అని
చెబుతున్నారు.
గాయత్రి మంత్రాన్ని చేసేవారు మాంసాహారాన్ని తీసుకోవచ్చా?
ఎలా
తిన్నా కూడా మాంసాహారం మాంసాహారమే కదా...అప్పుడు ఎవరైనా దైవం పేరు చెప్పి
జీవహింస చేసి మాంసాహారం తిని, మేం చేసింది తప్పుకాదు అంటే సరిపోతుందా?
నియమాలను పాటించేటప్పుడు ఉల్లివెల్లుల్లి వంటివే తినకూడదంటే, మాంసాహారాన్ని ఎలా తీసుకుంటారు? ఏమిటో ?
................
భారతదేశం విదేశీపాలనలో ఉన్నప్పుడు ఎవరైనా బెదిరించో, ప్రలోభపెట్టో గ్రంధాలలో కొన్ని మార్పులుచేర్పులు( ప్రక్షిప్తాలు)చేయించారేమో?
హిందువుల్లోనే కొందరు తమలోతాము గొడవలు పడి తమకుతోచినట్లు ప్రక్షిప్తాలు చేసారేమో? ఏం జరిగిందో దైవానికే తెలుస్తుంది.
..............
కొంతమంది ఏమనుకుంటారంటే, సాటి జీవులను ఎక్కువగా చంపితే వీరత్వం అనుకుంటారు. ఎవరైనా తమ మనస్సును అదుపులో ఉంచుకున్న వారే వీరులు. అంతేకానీ, మూగజీవులను చంపటం వీరత్వం కాదు.
................
క్రూరమృగాలు ఊళ్ళమీద పడి మనుషులను చంపే సందర్భాల్లో క్షత్రియులు ఆ క్రూరమృగాలను చంపవచ్చు . అందువల్ల, క్షత్రియులకు వేట నిషిద్ధం కాదు. అలాగని వేట వ్యసనం కాకూడదు.
............
వేటకు వెళ్లినప్పుడు దశరధ మహారాజు, పాండుమహారాజు.. అంతటివారే శాపాలకు గురయ్యారు.
................
నేను ఒకప్పుడు ఏమనుకున్నానంటే, యుద్ధరంగంలో పోరాడేవారు పౌరుషం రావటానికి బహుశా మాంసాహారం అలవాటుచేసుకున్నారేమో?..అనుకున్నాను.
ఇప్పుడు
ఏమనిపిస్తోందంటే, రాజ్యం మీదకు దండెత్తి వచ్చిన శత్రువులను చూస్తే..
వారిని ఎదుర్కునే ధైర్యం దానికదే రావాలి. అంతేకాని, ధైర్యం రావటం కొరకు
మూగజీవులను చంపనవసరం లేదు.
తామసాహారాన్ని తింటే కోపం, ఆవేశం..వంటి
తామస గుణాలు కలుగుతాయంటారు.
ఆ విధంగా ఆహారం ద్వారా ఆవేశం రావాలంటే,
మాంసాహారమే తిననవసరం లేదు. ఉప్పు,కారం బాగా ఉండే నిల్వ పచ్చళ్ళు, చద్ది
ఆహారం.. కూడా తామసాహారమే. అలాంటివి తిన్నా సరిపోతుంది.
...........................
ఎన్ని పూజలు చేసినా కష్టాలు తీరట్లేదని కొందరు వాపోతుంటారు. అలా జరగటానికి అనేక కారణాలుంటాయి.
మరి కొన్ని విషయాలను చెప్పుకుందాము..
ఆవుపాలు, నెయ్యి..వంటివి తీసుకుంటే ఆరోగ్యాలు బాగుంటాయని ప్రచారాలు ఎక్కువవటం, పూజలకంటూ పెద్ద ఎత్తున ధారాళంగా పాలు, నెయ్యి వాడకాలు పెరిగాక కూడా పాలు, నెయ్యి, పెరుగుకు డిమాండ్ బాగా పెరిగింది.
వేలాదిగా జనం వచ్చే కొన్ని దేవాలయాలలో ప్రసాదాల కొరకు వేల లీటర్ల నెయ్యిని వాడుతారు.
ఇంకా, మామూలుగా కూడా పాలు, నెయ్యి తో తయారుచేసిన స్వీట్స్ తినటానికి, కాఫీలు, టీలు..తాగటానికి జనాలు బాగా అలవాటు పడ్డారు.
ఇంతమంది జనాలకు ఇన్ని పాలు కావాలంటే ఆవులు, గేదెలు..ఎన్ని సార్లు గర్భధారణ చేసి అలసిపోవాలి?
మేము ఒకసారి కొద్దిగా ఆవుపాలకొరకు ఒక దగ్గరకు వెళ్తే, అక్కడ మసక వెలుతురులో ఉన్న ఒక బిల్డింగ్లో ఆవులను ఉంచి పెంచుతున్నారు. సిమెంట్ గచ్చు ఆవులకు గుచ్చుకుంటుంది కదా..
అక్కడ పరిసరాలు మురికిగా ఉన్నాయి. ఆ మసక వెలుతురులో ఆ ఆవులు పాపం ఆకలి కొరకు తినటం చేస్తున్నాయి. అవన్నీ చూశాక నాకు చాలా బాధనిపించింది.
చక్కగా ఆరుబయట పచ్చికబయళ్ళలో తిరగాల్సిన ఆవులను డబ్బుకొరకు అలా కట్టేసి వ్యాపారం చేయటం..అలాంటి పాలు, నెయ్యి తెచ్చి దైవానికి ఇస్తే దైవము మెచ్చుకుంటారా?
ఇక ముసలి ఆవుల పరిస్థితి అయితే చెప్పలేము. కొందరు ఆవుల పాలు పిండుకుని అవి ముసలివి అయ్యాక కబేళాకు పంపేస్తారు.ఇవి దారుణమైన విషయాలు.
వాటిని జీవితాంతము చక్కగా పెంచగలిగితేనే వాటిని పెంచాలి.
మనకు పుణ్యం కొరకో, ఆరోగ్యం కొరకో, మనం అదేపనిగా స్వీట్స్ తినటానికి, కాఫీలు, టీలు..తాగటం కొరకో..వాటిని అలా బాధించటం ఏమిటి?
తమ కష్టాలు తీరటం కొరకు మొక్కుకుని దూడలను పుట్టించి దేవాలయాలకు దానం ఇస్తారు కొందరు. ఇక అంతటితో అయిపోతుందా? అవేమీ బొమ్మలు కాదుకదా..ప్రాణమున్న జీవులు.
వాటిని జీవితాంతము పోషించడానికి ధనం కావాలి, చక్కగా చూసుకునే మనుషులు ఉండాలి.
వేలసంఖ్యలో గోవులు అయినప్పుడు, ఒకవేళ వాటిని ఎవరైనా సరిగ్గా చూసుకోకుంటే, ఆ పాపం ఎవరికి తగులుతుందో? మన కష్టాలు పోవాలని వాటిని కష్టపెట్టకూడదు కదా..
.............................
పాతకాలంలో ఆవుపేడలో నీళ్లు కలిపి ఇంటిముందు కళ్లాపి చల్లేవారు. అక్కడ నేల గట్టిపడేది. ముగ్గువేసేవారు.
గోశాలలో ఆవులు ఉండే దగ్గర సిమెంట్ చేయకుండా , కల్లాపి జల్లితే నేల గట్టిపడి ఆవులు పడుకోవటానికి బాగుంటుందో? పశువుల మలమూత్రాల తడికి నేల బురద అవుతుందో? ( ఈ విషయాల గురించి నాకు తెలియదు.)
పశువులు ఉండటానికి కొందరు రబ్బర్ మాట్ లు వేస్తున్నారు. కొబ్బరి పీచుతో లేక గోనె సంచులతో తయారుచేసిన మాట్లు వేస్తే తడికి తేమ ఆరకపోవచ్చు.
సిమెంట్ చేయకుండా అలా మట్టి నేలపైన కూడా పశువులను ఉంచవచ్చు.
లేదంటే, రబ్బర్ మాట్ల పైన కొంత ఎండుగడ్డి పరచి రోజూ ఆ గడ్డిని మార్చవచ్చు.
మనుషులైతే తమ సౌకర్యాల కొరకు చాలా ఆలోచిస్తారు. జంతువులు వాటి బాధలు చెప్పలేవు కదా. దైవమే దిక్కు.
.....................
అభిషేకాల కొరకు లీటర్ల పాలు, పెరుగులు సమర్పించటం కన్నా, మంచినీటితో అభిషేకం చేసినా దైవానుగ్రహం కలుగుతుందని నా అభిప్రాయం.
లేదంటే ఆవులను మంచిగా పెంచుతూ కొద్దిపాటి పాలతో అభిషేకించినా చాలు.
ఒక్కొక్కరు అభిషేకం చేయటం కంటే, సామూహికంగా పూజ చేస్తూ పూజ చేయించుకునేవారు పక్కన ఉండి, వారి గోత్రనామాలు చదివి పూజారులు అభిషేకం చేయవచ్చు. అప్పుడు తక్కువ పాలు, నెయ్యి..సరిపోతుంది.కొన్ని
దేవాలయాలలో ఇలాగే అభిషేకాలు చేస్తారు.
...................
అందరికి వేల లీటర్ల స్వచ్చమైన పాలు, నెయ్యి లభించక కల్తి చేస్తున్నారు.
అన్యాయార్జిత సొమ్ముతో సంపాదించిన ద్రవ్యాలతోను, కల్తీ వాటితోను పూజలు చేసినా సరైన ఫలితాలు రాకపోవచ్చు.
......................
జీవితంలో జాలి, దయ, నైతిక విలువలు పాటిస్తేనే దైవానుగ్రహాన్ని పొందగలరు కానీ, మానవత్వం లేకుండా ఎన్ని చేసినా ..
..........................
link...
ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో శుభాలు జరిగాయి. అశుభాలు కూడా జరిగాయి.
ప్రపంచంలో మతాల పేరిట, అధికారం గురించి, సంపదల గురించి ఎన్నో పోరాటాలు, రక్తపాతాలు జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇదంతా ఎంతో బాధాకరమైన విషయం.
ప్రపంచంలో జరుగుతున్న హింస చాలా బాధగా ఉంది.
ఆధునికకాలంలో చాలామందిలో అత్యాశ, పాపాలు చేసి అయినా డబ్బు సంపాదించాలనే తత్వం పెరిగాయి. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు.
డబ్బు, అధికారం..కొరకు ఎన్నో పాపాలు చేస్తున్నారు. సామాన్యజనం కూడా తమ వంతు పాపాలు చేస్తున్నారు. వీటి ఫలితాలే ప్రస్తుతం ప్రపంచం అనుభవిస్తోంది.
మద్యపానం, మత్తుపదార్ధాల వల్ల సమాజానికి చాలా నష్టం జరుగుతోంది.
సోషల్మీడియాలో హింసాత్మక దృశ్యాలు, చెడ్ద విషయాలు వల్లకూడా చాలామంది ప్రభావితులవుతున్నారు.
ఎవరైనా ఘోరమైన నేరాలు చేస్తే వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు ఉండాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే, ఎవరైనా నేరాలు చేయాలంటే ..భయంతో వణికిపోయేలా ఉండాలి. హింసతో కూడిన ప్రసారాలకు, సమాజానికి హాని కలిగించే వ్యవహారాలకు.. ప్రభుత్వాలు సమర్ధవంతంగా అడ్డుకట్ట వేయాలి. ప్రభుత్వాలు ఎప్పుడు ఇవన్నీ చేస్తాయో అర్ధం కావటం లేదు.
ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా, నీతినియమాలను పాటించనివారిని మనం ఏం చేయగలం? వారి సంగతి దైవం చూసుకుంటారు.
కొందరైనా నీతినియమాలతో దైవభక్తి కలిగి.. ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ ..దైవాన్ని ప్రార్ధిస్తే.. ఆ ఫలితం వల్ల దైవకృప కలిగి.. సమాజంలో శాంతి నెలకొనే అవకాశముంది.
ఆ మధ్య ఒక పేరుపొందిన జ్యోతిష్కుడు చెప్పినదాన్ని బట్టి.... ఆధునిక కాలంలో జీవ హింస చేయటం బాగా పెరిగింది. పశుపక్ష్యాదులను చంపి తినటం విపరీతంగా పెరిగింది...
అలా చనిపోయిన జీవుల ఉసురు తగిలి కూడా ప్రపంచంలో కష్టాలు వస్తున్నాయని వారు తెలియజేసారు.
మనుషులకు జరుగుతున్న హింస పట్ల మనకు ఇంత బాధ ఉన్నప్పుడు, జంతువుల పట్ల మనం చేస్తున్న హింస గురించి కూడా మనము ఆలోచించాలి.
కారణాలేమైనా కూడా, ప్రపంచంలో జరుగుతున్న ఘోరాలు వింటుంటే చాలా బాధగా ఉంది. రాక్షసప్రవృత్తి కలవారి పట్ల సౌమ్యత, సహనం పనికిరాదు. ఎలాగైనా ఈ ఘోరాలు ఆగాలి.
అయితే, అంతా దైవం మీదే భారం వేసి కూర్చోవటం కాకుండా, దారుణాలు ఆగడానికి అందరూ తమవంతు ప్రయత్నం చేయాలి.
**************
మనుషులు చేస్తున్న పాపాల వల్ల ఎవరి కర్మ వారిదని దైవము ఊరుకుంటున్నారేమో?
అయితే, యుద్ధాలు, హృదయవిదారకమైన ఘటనలు, యాక్సిడెంట్లు, రక్తపాతాలు జరిగినప్పుడు అమాయకులైన పిల్లలు, మంచివారైన పెద్దవాళ్లు, అమాయకజీవులు.. కష్టాలు పడినప్పుడు ఎంతో బాధనిపిస్తుంది.
దైవం చెడ్డవారిని శిక్షించి, ఆ దారుణాలను ఆపితే బాగుంటుంది కదా ..అనిపిస్తుంది.
గ్రంధాల ద్వారా దైవం.. రాక్షసులను చంపివేసి లోకాన్ని రక్షించిన సంఘటనలు గురించి మనం తెలుసుకోవచ్చు.
అయితే, ఏది ఎందుకు జరుగుతుందో చాలాసార్లు అర్ధం కాదు. మహాభారతంలో శ్రీకృష్ణులవారు..తమ గురువుయొక్క మరణించిన పుత్రులను తీసుకువచ్చి ఇచ్చారు.
కానీ, యుద్ధంలో అభిమన్యుని రక్షించలేదు. అలా జరగడానికి గల కారణాలు మనకు తెలియకపోవచ్చు. లోకంలో కూడా చాలా విషయాలు మనకు అర్ధం కావు. దైవానికి అన్నీ తెలుస్తాయి.
మనలో చాలామంది జీవితంలో...దైవం ఉన్నారని చక్కగా అనుభవంలోకి వచ్చిన సంఘటనలు ఉంటాయి. దైవాన్ని నమ్మి.. ధర్మబద్ధంగా జీవించాలి.
...............
ప్రపంచంలో శాంతి నెలకొనాలని , అంతా బాగుండాలని అందరూ మనస్పూర్తిగా దృఢంగా దైవాన్ని ప్రార్ధించాలి. దైవాన్ని, దైవనామాన్ని అందరూ స్మరించుకోవాలి.
అంతా దైవము దయ...
oka link.... గ్రహ స్థితులు ఎలా ఉన్నా ...
భారతదేశం ఎంతో సుందరమైనది. ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్న దేశం. కొన్ని విదేశాల్లో అందంగా ఉన్నా కూడా , అక్కడ కొన్ని చోట్ల విపరీతమైన చలి కూడా ఉంటుంది. భారతదేశంలో వాతావరణం ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం తట్టుకోగలిగే విధంగానే ఉంటుంది.
అయితే ప్రజలు ఈ దేశాన్ని శుభ్రత లేకుండా మురికిగా చేయటం బాధాకరం. ఎక్కడపడితే అక్కడ చెత్తవేయటం, కిళ్లీలు ఉమ్మటం..మలమూత్రాలు చేయటం చేస్తున్నారు. ఇలా చేసేవారిని శిక్షించటం, జరిమానాలు వేస్తేనే వారు మారతారు.
ప్రభుత్వాలు కూడా పబ్లిక్ టాయిలెట్స్ కట్టించాలి.
చెట్లు ఎక్కువగా నాటి పెంచటం,రోడ్లు, పార్కులు శుభ్రం చేయటం, పరిసరాలు అందంగా ఉంచటంలో అనేకమంది కార్మికులను నియమిస్తే ఎందరికో ఉపాధి లభిస్తుంది.
మన భారతదేశం ఎప్పటికైనా ఇలా శుభ్రంగా ఉంచుకోగలమా? ఈ లింక్ లో చూడండి... దీనికి సంబంధించిన ఫొటోలు ఈ పోస్ట్ క్రింద కూడా ఉన్నాయండి.
విదేశాల్లో వాళ్లు తమ దేశాన్ని ఎంత అందంగా ఉంచుకున్నారో..మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాము? ఎవరి వద్ద నుండి అయినా చెడును నేర్చుకోకూడదు కాని, మంచిని నేర్చుకోవచ్చు.
పరిసరాలు శుచిగా, శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ప్రాచీనులు తెలియజేసారు.
చండీగఢ్ కొంత శుభ్రంగా ఉంటుందంటారు. అలా శుభ్రంగా ఉండటానికి అక్కడ పనిచేసిన ఒక కమిషనర్ గారు..ఇతర సిబ్బంది కూడా కారణమట. వారు ప్రజలలో శుభ్రత గురించి ఎప్పటికప్పుడు అవగాహన తెస్తూ చైతన్యవంతులను చేస్తూ చిన్నపిల్లలకు కూడా శుభ్రత గురించి చెబుతూ ఎంతో కృషి చేసారట.
కమీషనర్ గారు..సిబ్బంది చెప్పినవి విని ప్రజలు పాటించటం కూడా గొప్ప విషయమే. ప్రభుత్వాలు, అధికారులు, ప్రజలు అందరూ సరిగ్గా పాటిస్తేనే ఏదైనా బాగుంటుంది.
..................................
కొందరు మైకుల ద్వారా పెద్దగా శబ్దాలు పెడుతున్నారు. వార్తలు చెప్పేవారు కూడా ఎందుకో గట్టిగా అరుస్తూ వార్తలు చెబుతున్నారు.
..................................
ఇతరదేశాల వాళ్లు భారతీయులను వెళ్ళిపొమ్మంటున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. మనము మన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటే ఎక్కడికో వెళ్లి మాటలు పడే పరిస్థితి ఉండదు కదా..
భవిష్యత్తులో విదేశాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో? తమ తరువాత తమ పిల్లల పరిస్థితి అక్కడ ఎలా ఉంటుందో? (భయపడుతూ బతకాలేమో?) ఇవన్నీ విదేశాల్లో స్థిరపడాలనుకునే వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది.
................
ఎవరైనా గొప్పవాళ్లం అనుకుంటే.. వారు తమ గొప్పతనంతో తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చు. తామూ బాగుండవచ్చు.
........................
మన దేశంలో చిన్న పరిశ్రమలు నెలకొల్పితే, విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా తిరిగివస్తారు. మన యువత కూడా ఐటీ రంగంలో మాత్రమే కాకుండా వ్యాపారాలు చేయటానికి ముందుకు రావాలి..
ఐటీలో ఉద్యోగాలు చేస్తూ ఎప్పుడు ఉద్యోగాల నుంచి తీసేస్తారో అని భయపడటం కన్నా, స్వంతంగా వ్యవసాయ రంగం, వ్యాపారం, కుటీర పరిశ్రమలు ఉపాధిపొందటం చెయ్యాలి.
...............
ఇరుగుపొరుగు దేశాలనుండి అనేకమంది అక్రమంగా భారతదేశంలోకి వచ్చి ఇక్కడ స్ఠిరపడుతుంటే, మన వాళ్లు ఉపాధి వెతుక్కుంటూ విదేశాలకు వెళ్లి కష్టాలు పడుతున్నారు.
ఎన్నో సంవత్సరాలనుండి విదేశీయులు వస్తుంటే ఎందుకు సమర్ధవంతంగా అడ్దుకోలేదో అర్ధం కావటం లేదు. ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోవాలి.
...........
జనాభా అదేపనిగా పెరిగితే అందరికీ ఉద్యోగాలు లభించాలంటే కష్టం. భారతదేశంలో జనాభా ఎక్కువ..భూమితక్కువ. కొన్ని విదేశాల్లో జనాభా తక్కువ.. భూమి ఎక్కువ.
యంత్రాల వినియోగం పెరిగిన ఎక్కువైన తరువాత ప్రపంచం అంతటా నిరుద్యోగం ఎక్కువవుతోంది.
యంత్రాలతోనే ఎక్కువగా పనులు చేయించుకుంటున్న ఈ రోజుల్లో అందరికీ ఉద్యోగాలు లభించాలంటే కష్టమే. కష్టమైన పనులను యంత్రాలతో చేయించి, మిగతా పనులను మనుషులే చేయాలి.
.............
మనుషులు బతకటానికి అవసరమైన గాలి, నీరు, సూర్యరశ్మితో కూడిన వాతావరణం, ఆహారానికి అవసరమైన మొక్కలు, చెట్లు..వంటివెన్నో దైవమే ఏర్పాటు చేసారు. అయినా మనుషులు సరిగ్గా బతకలేకపోతున్నారు.
ఆహారం,ఇల్లు, వైద్యం, విద్య, రక్షణ..ఇలా నిత్యావసరాలు బాగుంటే చాలు చక్కగా బ్రతకవచ్చు. అయితే, అనేకకోరికలతో విలాసాలనే నిత్యావసారాలుగా చేసుకుని వాటికోసం అదేపనిగా కష్టపడుతున్నారు.
కొందరు మనుషులు సరిగ్గా బతకలేకపోవటానికి బలవంతులైన కొందరు బలహీనులను అణచివేయటం కూడా కారణమే.కొందరు చెడ్దవాళ్ళు ఇతరులను బాధిస్తూ పెత్తనం చేస్తున్నారు.
.............
కంపెనీల్లో ఒక పనికి ఎక్కువ జీతాన్ని ఇచ్చి (సుమారు లక్షన్నర అనుకోండి..) ఒక్కరితో ఎక్కువ పనిచేయించటంటం కన్నా, అదే పనికి ఇద్దరిని నియమించి ఒక్కొక్కరికి లక్ష ఇస్తే, నిరుద్యోగ సమస్య తగ్గుతుంది.
వ్యక్తులు అలసిపోరు కాబట్టి పనిలో నైపుణ్యత పెరుగుతుంది. పనిగంటలు తగ్గి సమయం మిగులుతుంది కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబసంబంధాలు కూడా బాగుంటాయి.
ఉద్యోగుల జీతాలు పెంచితే, వ్యాపారస్తులు ధరలు పెంచుతారు. ఇలాంటప్పుడు తక్కువ ఆదాయ వర్గాల వారు కొనలేని పరిస్థితి ఉంటుంది.
విపరీతంగా ధరలు పెంచకుండా కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
.......................
ఈ రోజుల్లో ఉద్యోగాలంటూ స్త్రీలు ఉదయం వెళ్ళి రాత్రికి వస్తుంటే విపరీతమైన పనివల్ల అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. స్త్రీలలో గర్భసంచి వ్యాధులు బాగా పెరిగాయి.
స్త్రీలు అందరికి ఉద్యోగాలు కావాలని ఎవరినైనా బ్రతిమలాడటం కన్నా, దర్జాగా కొందరు స్త్రీలు కలసి చిన్న పరిశ్రమలు పెట్టుకోవచ్చు. తమకు సదుపాయంగా ఉండేటట్లు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు పనిగంటలు ఏర్పాటుచేసుకోవచ్చు.
అందరూ స్త్రీలే ఉంటారు కాబట్టి, లైంగిక వేధింపులు వంటివాటి బారినుండి కూడా కొంతవరకు తప్పించుకోవచ్చు.
డబ్బు బాగా ఉన్న స్త్రీలు మహిళామండలిగా ఏర్పడి సమాజసేవ చేయవచ్చు. పేద వారు పైకి రావటానికి సాయం చేయవచ్చు. అంటే విద్య, వైద్యం వంటి విషయాల్లో తమకు తోచిన సాయం చేయవచ్చు. వారికి చదువు చెప్పవచ్చు. చక్కటి సలహాలను అందించవచ్చు.
రకరకాల చీరలు, నగలు ధరించినా కలగని సంతోషాన్ని ఇతరులకు సాయం చేయటంలో పొందవచ్చు...ఎంతో పుణ్యం కూడా వస్తుంది.
.................
ఈ మధ్య యూట్యూబ్ లో కొన్ని వార్తలు చదివాను. కొన్ని చోట్ల కొందరు స్త్రీలను కొందరు బాస్ లు బెదిరిస్తున్నారట. ఉద్యోగం ఊడకుండా ఉండాలన్నా, ప్రమోషన్లు కావాలన్నా తమ కోరికలు తీర్చాలని అడుగుతున్నారట. తప్పని పరిస్థితిలో కొందరు స్త్రీలు లొంగిపోతున్నారట. ఇలాంటివి ఎంతో బాధాకరం.
తల్లుల మాట చాలా మంది పిల్లలు వింటారు కాబట్టి, తల్లులు తమ పిల్లలకు చిన్నతనం నుంచి అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరిని ఒకరు గౌరవించుకోవాలని, నైతికవిలువలతో జీవించాలని నేర్పించితే వారు వినే అవకాశం ఉంది.
.................
కొందరిలో ఎందుకో తెలియదు కాని, పాపభీతి లేకపోవటం, అత్యాశ, సోమరితనం, స్వార్ధం..వంటి లక్షణాలు పెరిగాయి.
ఈ రోజుల్లో సమాజంలో జరుగుతున్న నేరాలు..ఘోరాలు గమనిస్తే, మనుషులకు నైతికవిలువలు ఎంత అవసరమో తెలుస్తుంది.
ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే, బయట ఎక్కువసార్లు తినకుండా చక్కటి ఇంటిభోజనం తినాలి.
శారీరికంగా, మానసికంగా దేశానికి మంచి పౌరులు తయారవ్వాలంటే ఇంట్లో పెద్దవాళ్ళు తప్పనిసరిగా వీలు కుదుర్చుకుని పిల్లలకు నైతిక విలువలను నేర్పించాలి. ఇందుకు గృహిణి యొక్క సహాయసహకారాలు ఎంతో ముఖ్యం.
ఉపాధ్యాయులు కూడా పిల్లలకు నైతిక విలువలు పెంపొందేలా కృషిచేయాలి.
మంచి పౌరులను తయారుచేయటం ఎంతో గొప్పవిషయం. నైతికవిలువలు కలిగిన మంచి పౌరులు ఉంటే ...కుటుంబాలు తద్వారా సమాజమూ అన్నీ బాగుంటాయి.
నైతికవిలువలు కలిగిన వారు మంచిగా ప్రవర్తిస్తారు. అశ్లీల చిత్రాలు దేశమ్మీదకు వదిలి డబ్బు సంపాదించరు, ఇతరులను మోసం చేయరు , నేరాలుఘోరాలు చేయరు. ధరలు విపరీతంగా పెంచి ఇతరులను దోచుకోరు.
*నైతికత ఉన్న పౌరులు ఉన్నసమాజం దానికదే బాగుంటుంది. ఎప్పటికైనా అంతా బాగుండాలి.
................
* అన్నింటికి దైవమే దిక్కు.
........................
మరికొన్ని విషయములు..
ఈ రోజుల్లో చాలా పూజలలో విపరీతంగా సామాగ్రిని వాడుతున్నారు.
పూజలు
ముగిసేసరికి బోలెడు నిర్మాల్యం మిగులుతాయి. కొందరు వాటిని చెత్తలో
వేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లతో సహా నీటిలో పడేస్తారు కొందరు.
కొందరు తమ దీక్షలు పూర్తయ్యాక దీక్షా వస్త్రాలను నదీతీరాల వద్ద గట్లవద్ద వదిలేసి వెళ్లిన దృశ్యాలు వార్తల్లో వచ్చాయి.
కుంభమేళా తరువాత మిగిలిన టన్నుల వ్యర్ధా
లను మిషన్లతో ఎత్తిపోయవలసి వచ్చిందట.
ప్రజలు కొన్ని విషయాలను పాటించాలి.
దైవచిత్రాలను ఎక్కడపడితే అక్కడ ముద్రించి తరువాత వాటిని చెత్తలో వేయటం సరైనది కాదు.
పూజల తరువాత మిగిలిన వాటిని, తినగా మిగిలిన ప్రసాదం పాకెట్లను రోడ్ల పక్కన పడేయటం కాకుండా జాగ్రత్తగా ఒక దగ్గర వేయాలి.
పసుపుకుంకుమ తెచ్చిన ప్లాస్టిక్ కవర్లు, నూనె, నెయ్యి కవర్లు..ఇలాంటివి నీటిలోను, రోడ్ల పక్కన ఎక్కడపడితే అక్కడ వేయడం కాకుండా, ప్లాస్టిక్ వేసే చెత్తబుట్టలలో మాత్రమే వేయాలి.
పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. చెరువులను, నదులను అశుభ్రంగా చేయకూడదు
....................
ప్రాచీనకాలంలో సమాజంలో పని విభజన జరిగింది. ఎవరి పనిని వారు చక్కగా చేస్తే సమాజం సజావుగా ఉంటుంది. . రైతులు ఉదయాన్నే పొలానికి వెళ్తారు. సైనికులు దేశరక్షణలో అప్రమత్తంగా ఉంటారు.
సమాజంలో ఎన్నో వృత్తులవారున్నారు. ఎవరి పని వారు చక్కగా చేస్తే అదికూడా పూజయే.
ఇవన్నీ తెలిసిన ప్రాచీనులు, కొన్ని వృత్తులవారు పెద్ద ఎత్తున పూజలు చేయనక్కరలేదు, వారు తమ స్వధర్మాన్ని చక్కగా పాటిస్తే చాలు, కొద్దిపాటి పూజలు చేసినా బోలెడు పూజలు చేసినంత పుణ్యం వస్తుందని తెలియజేసారు.
అయితే, ప్రాచీనులు చెప్పినదానికి వ్యతిరేకంగా ఇప్పుడు కొందరు ఏమంటున్నారంటే, అన్ని వృత్తులవారు కూడా పెద్ద ఎత్తున పూజలు చేయవచ్చని, అందరూ చాలా ఆచారవ్యవహారాలను పాటించాలని చెబుతున్నారు.
మేమెందుకు పెద్ద ఎత్తున పూజలు చేయకూడదంటూ కొందరు మాట్లాడుతారు. ఇప్పుడు చాలామంది ఇతర ప్రాంతాల వారి నుండి నేర్చుకుని కూడా అనేకపూజలను చేస్తున్నారు.
కొత్తకొత్త ఆచారవ్యవహారాలను చెబుతున్నారు కొందరు. నిత్యమూ చాలా విషయాలను పాటించాలంటే అందరూ పాటించలేరు. వీటి గురించి కుటుంబసభ్యుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. మళ్ళీ ఆ గొడవలు తగ్గాలంటే ఏమి పరిహారాలు చేయాలో?
కొందరు చెప్పేవి వింటే హిందువుల ముసుగులో హిందువులకు విసుగు కలిగేలా చెబుతున్నారేమో? అని సందేహాలు కూడా కలుగుతున్నాయి.
...........................................
ప్రతి విషయానికి ఎన్నో కొత్తకొత్త విధివిధానాలను చెబుతుంటే అవన్నీ గుర్తు ఉంచుకుని పాటించాలంటే చాలా కష్టం. ఇవన్నీ తప్పుల్లేకుండా పాటించాలంటే ధ్యాస అంతా విధివిధానాల పట్లే ఉంటుంది కానీ, దైవము పట్ల ధ్యాస ఎలా?
పూజకు సంబంధించిన విధివిధానాల గురించి ఆలోచించటానికి, ఆచరించటానికే ఎక్కువ సమయం పడుతోంది.
రోజువారి పనుల విషయంలో కూడా టెన్షన్ ఉంటుంది కాని, దైవానికి సంబంధించిన విషయాల్లో ఎక్కడ తప్పులు వస్తాయో అని టెన్షన్ మరింత ఎక్కువగా ఉంటుంది.టెన్షన్ లేకుండా ప్రశాంతంగా దైవపూజ చేసుకుంటే బాగుంటుంది.
ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు శ్రద్ధగా విధివిధానాలను పాటించాలి. భజనలు, నామసంకీర్తనలు ఎవరైనా టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు.
ఆచారవ్యవహారాల్లో ఎన్నో మంచివిషయాలను పొందుపరిచి ప్రాచీనులు మనకు అందించారు. అయితే, కాలక్రమేణా ఎన్నో మూఢనమ్మకాలు వచ్చాయి. అందువల్ల విచక్షణతో ప్రవర్తించాలి.
oka link....................................కష్టాలు తీరటం..
...............................
ఈ కాలంలో పండుగలు, ఫంక్షన్లు సందర్భంగా అనేక కొత్త ఆచారవ్యవహారాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా చాలా ఖర్చులు, శ్రమ కూడా ఉంటోంది. అనవసర సామాను ఎక్కువవుతోంది.
ఇచ్చే గిఫ్టులతో ఇల్లంతా గజిబిజిగా తయారవున్నాయి. గిఫ్ట్ వద్దంటే వినరు. ఈ కార్యక్రమాల ద్వారా కొందరు వస్తువులను అమ్ముకుంటూ వ్యాపారం కూడా చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమాల్లో అన్ని వృత్తులవారు (అందరూ) పాల్గొనటం వల్ల చాలామంది వ్యాపారస్తులకు ఆదాయం పెరిగింది.
పువ్వులు, పండ్లు, కొబ్బరి కాయలు..పూజాసామాగ్రి అమ్మటం..ఇలా కొందరికి జీవనోపాధి ఉంటుంది. కొందరికి జీవనోపాధి లభించే మాట నిజమే కానీ, ఎప్పుడూ రకరకాల పూజలంటూ చాలాసార్లు డబ్బు ఖర్చుచేయటం, అనేక ఆచారవ్యవహారాలను పాటిస్తూ చాలా సమయాన్ని కేటాయించటం అంటే అందరూ చేయలేరు.
కొంతకాలం క్రిందట కొన్ని వస్తువులు కొని సాటి స్త్రీలకు పంచిపెట్టాలని లేకపోతే అరిష్టమని ప్రచారం చేసారు. వ్యాపారస్తులు కొందరు వారి వద్ద వస్తువులను కొనిపించటానికి ఇలా ప్రచారం చేసారని వార్తలు వచ్చాయి.
ఈ రోజుల్లో కొందరు మతాల పేరుతో కూడా ధనార్జన..వ్యాపారం చేయటం ఎక్కువయ్యింది. జీవనవిధానంలో మతము, ఆర్ధికాభివృద్ధి కలగలిపి ఉండవచ్చు కానీ, మతవిషయాలలో వ్యాపారమే ముఖ్యంగా మారకూడదు.
అవసరమైనంత వరకు ఆర్ధికాభివృద్ధి అవసరమే కానీ, ఆర్ధికాభివృద్ధే జీవిత ధ్యేయం కాదుకదా.. ఈ రోజుల్లో చాలామంది ఎలాగైనా సరే బోలెడు డబ్బు సంపాదించటమే జీవితధ్యేయంగా బతుకుతున్నారు.
కొందరు మతం పేరుతో సంస్థలను మెలకొల్పి ప్రజల వద్ద డబ్బు తీసుకుని మోసం చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
........................................................
పాతకాలంలో దేవాలయాల నిర్వహణకొరకు రాజ్యాలను ఏలే రాజులు ధనాన్ని సమకూర్చేవారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు..
ఈ రోజుల్లో అంటరానితనం వంటివి లేకుండా అందరూ దేవాలయాలకు వెళ్తున్నారు.
ప్రజలు హుండీలలో వేసే ధనాన్ని.. బంగారాన్ని పెద్ద ఎత్తున నిల్వ ఉంచితే ఎవరైనా దోపిడీదారుల దృష్టి పడవచ్చు. హిందువులలో కూడా కొందరు చేతివాటం వాళ్ళుండే అవకాశం ఉంది.
అలా పెద్ద ఎత్తున బంగారాన్ని ప్రోగుచేసి ఉంచటం కన్నా, కొంత నిల్వ ఉంచి, మిగతా ధనాన్ని హిందుపేదప్రజల కొరకు ఉపయోగించవచ్చు. అంటే, ప్రజలకు కొందరికి ఉచితంగా లేక కొందరికి తక్కువ ధరకు విద్యను, వైద్యాన్ని అందించవచ్చు.
హిందువులలోనే చాలామంది పేదలున్నారు. హిందూదేవాలయాల సొమ్మును ఇతరమతస్తులకు ఇచ్చే హక్కు ఎవరికి ఉండదు. అలాగని దేవాలయాలను ప్రభుత్వాల నుంచి తప్పించటమూ మంచిది కాదనిపిస్తుంది.
కొందరు ఏమంటారంటే, దేవాలయాలను ప్రభుత్వాల నుంచి తప్పించి ప్రైవేట్ వారికి అప్పగించాలంటారు. (దేవాలయాల ప్రైవేటీకరణ) ప్రభుత్వం వద్ద ఉంటే అక్కడ ఏమైనా అవకతవకలు జరిగితే కనీసం ఓటు ద్వారా ఆ ప్రభుత్వాలను దింపే అవకాశమైనా సామాన్యప్రజలకు ఉంటుంది.....
.. ప్రైవేట్ వారి చేతుల్లోకి దేవాలయాలు వెళితే అక్కడ ఏమైనా అవకతవకలు జరిగితే సామాన్యప్రజలు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండే పరిస్థితి కూడా ఉండవచ్చు.
ఈ రోజుల్లో ఎవర్ని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో? అర్ధం కావటం లేదు.
దేవాలయాలకు
వెళ్తే , మన దేవాలయము ..అని స్వేచ్ఛగా అనిపిస్తుంది. ఆధునిక కాలంలో
అన్ని వర్గాల ప్రజలు దేవాలయాలకు వెళ్తూ తమకు తోచిన సొమ్మును కానుకలుగా
సమర్పిస్తున్నారు. అలా కోట్ల రూపాయలు ధనం సమకూరుతోంది.
దేవాలయాలను ప్రైవేటీకరణ చేస్తే బడా వాళ్ళు స్వాధీనం చేసుకుని, ప్రజలు దేవాలయాలకు సమర్పించిన సొమ్ముతో సహా దేవాలయాలను తమ స్వంత ఆస్తిలా పెత్తనం చేస్తారేమో? అని భయాలు కూడా కలుగుతున్నాయి.
హిందూ దేవాలయాల సొమ్ము హిందువులు మాత్రమే.. అనే చట్టం రావాలి. దేవాలయాల వద్ద ఉన్న కొంతసొమ్ము తీసి, దేవాలయాల ఆధ్వర్యంలో హిందువులకు పాఠశాలలు, ఆసుపత్రులు కట్టించేలా ప్రభుత్వాలను అడిగి.. ఆ విధంగా అందరూ చర్యలు తీసుకోవచ్చు.
*****************
ఈ రోజుల్లో కొన్ని చోట్ల శుభ్రత లేని ప్రదేశాలలో కూడా కొత్తకొత్త దేవాలయాలను కడుతున్నారు.
ఆశ్చర్యం ఏమిటంటే, జనాలకు సరైన భక్తి ఉంటే సమాజంలో ఇన్ని నేరాలు, ఘోరాలు చేయకూడదు. కోరికలు తీరటానికి పూజలు చేయటం కూడా ఎక్కువయ్యింది.
దైవకృపను పొందాలంటే దైవభక్తి కలిగి నైతికవిలువలతో జీవించటానికి ప్రయత్నించాలి.
.................
మన గ్రంధాలలో కొన్ని విషయాలను గమనిస్తే.. ఇలా ఎందుకు రాసారో? అనిపిస్తుంది. అవి ప్రక్షిప్తాలు కావచ్చు అనుకుంటున్నాము. ఈ విషయాల గురించి కొన్ని పాత పోస్టులలో ఉన్నాయి.
తరతరాలనుంచి అంటరానితనం మరియు కొన్ని మూఢనమ్మకాల వల్ల ఇప్పటికే హిందుసమాజం ఎంతో నష్టపోయింది.
పాతకాలంలో జరిగిన అంటరానితనం, కొన్ని మూఢనమ్మకాలు..తద్వారా కొందరు బాధలుపడటం .. వంటి వాటి వల్ల కాబోలు భారతదేశంలో విదేశీయుల పాలన రావటం, విదేశీమతాలు ప్రవేశం జరిగి ఉండవచ్చు. ప్రతివిషయానికి కర్మ ప్రభావం ఉంటుంది కదా..
మనల్ని ఎవరైనా కష్టపెడుతుంటే వారిని ఎదుర్కోవటం తప్పు కాదుకానీ, మనము అనవసరంగా ఇతరులను బాధించటం తప్పే కదా..అలా బాధపడినవారి ఉసురు తగిలే అవకాశం ఉంది.
ఇప్పటికైనా హిందువులు ఒకరినొకరు గొడవలు పడకుండా సామరస్యంగా ఉంటే బాగుంటుంది. సమాజంలో అన్ని వృత్తుల వారు అవసరమే. ఎవరి కష్టసుఖాలు వారికి ఉన్నాయి. అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ చక్కగా జీవించాలి.
..................................................
యజ్ఞయాగాదులను చక్కగా చేసే వాళ్ళు వాటిని చేయటం మంచిది. అయితే, ఇవన్నీ పద్ధతిగా అందరూ చేయలేకపోవచ్చు.
.................................
జీవితంలో కొన్ని నియమాలు ఉంటే ఎవరికైనా ఆచరించడానికి సులభంగా ఉంటుంది. అదేపనిగా నియమాలంటూ అంతులేకుండా చెప్పుకుంటూ ఉంటే అందరూ పాటించలేరు. మతాన్నే వదిలేయాలనిపించవచ్చు.
ఎందరో హిందువులు మతం కూడా మారారు. అందువల్ల సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలి.
దైవము యొక్క అవసరం అందరికి ఉంటుంది. అయితే, దైవారాధనకు కఠినమైన మార్గాలను వదిలి సులభమైన మార్గాలను ఎన్నుకోవాలనిపించవచ్చు.
.......................
పండుగలు వస్తున్నాయంటే టెన్షన్ వస్తుంది. బోలెడు నియమాలను పాటించలేక మతము అనేది లేకుండా నాకు కుదిరినంతలో దైవాన్ని ఆరాధించుకోవాలనిపిస్తుంది.
ఇదంతా గమనించిన తరువాత, నేను ఎలా మారతానో? అని భయం వేసి, ఇప్పుడు నాకు వీలైనంతలో మాత్రమే పాటించటానికి ప్రయత్నిస్తున్నాను.
కొందరు యువత..ఇవన్నీ మేము పాటించలేం, మాకు నచ్చిన పద్ధతిలో దైవాన్ని ప్రార్ధించుకుంటామని చెబుతున్నారు. అందువల్ల, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, కొంత పట్టువిడుపుగా ఉండటం మంచిది.
............................
ఇది కలికాలం. కలికాలంలో మనుషులు శారీరికంగా, మానసికంగా కొంత బలహీనులుగా ఉంటారు కాబట్టి, దైవభక్తి కలిగి దైవస్మరణ చేస్తే చాలు తరిస్తారని ప్రాచీనులే తెలియజేసారు.
బోలెడు పూజలను చేయకపోయినా.. జీవితంలో దైవభక్తి కలిగి, కొన్ని పూజలను చేస్తూ, నీతినిజాయితీలతో జీవించటానికి ప్రయత్నిస్తే దైవకృపను పొందే అవకాశం ఉంటుంది.