koodali

Sunday, September 7, 2025

ఎప్పటికైనా..

 
భారతదేశం ఎంతో సుందరమైనది. ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్న దేశం. కొన్ని విదేశాల్లో అందంగా ఉన్నా కూడా ,  అక్కడ కొన్ని చోట్ల విపరీతమైన చలి కూడా ఉంటుంది. భారతదేశంలో వాతావరణం ఎండాకా
లం, వర్షాకాలం, చలికాలం తట్టుకోలిగే విధంగానే ఉంటుంది. 

అయితే ప్రజలు ఈ దేశాన్ని శుభ్రత లేకుండా మురికిగా చేయటం బాధాకరం. ఎక్కడపడితే అక్కడ చెత్తవేయటం, కిళ్లీలు ఉమ్మటం..మలమూత్రాలు చేయటం చేస్తున్నారు. ఇలా చేసేవారిని శిక్షించటం, జరిమానాలు వేస్తేనే వారు మారతారు. 
ప్రభుత్వాలు కూడా పబ్లిక్ టాయిలెట్స్ కట్టించాలి. 

చెట్లు ఎక్కువగా నాటి పెంచటం,రోడ్లు, పార్కులు శుభ్రం చేయటం, పరిసరాలు అందంగా ఉంచటంలో అనేకమంది కార్మికులను నియమిస్తే ఎందరికో ఉపాధి లభిస్తుంది.


మన భారతదేశం ఎప్పటికైనా ఇలా శుభ్రంగా ఉంచుకోగలమా? ఈ లింక్ లో  చూడండి... దీనికి సంబంధించిన ఫొటోలు ఈ పోస్ట్ క్రింద 
కూడా ఉన్నాయండి.

Beautiful Village Giethoorn of Netherlands |

విదేశాల్లో వాళ్లు తమ దేశాన్ని ఎంత అందంగా ఉంచుకున్నారో..మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాము? ఎవరి వద్ద నుండి  అయినా చెడును నేర్చుకోకూడదు కాని, మంచిని నేర్చుకోవచ్చు.

 పరిసరాలు శుచిగా, శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ప్రాచీనులు తెలియజేసారు.

చండీగఢ్ కొంత శుభ్రంగా ఉంటుందంటారు. అలా శుభ్రంగా ఉండటానికి అక్కడ పనిచేసిన ఒక కమిషనర్ గారు..
ఇతర సిబ్బంది కూడా కారణట. వారు ప్రజలలో శుభ్రత గురించి ఎప్పటికప్పుడు అవగాహన తెస్తూ చైతన్యవంతులను చేస్తూ చిన్నపిల్లలకు  కూడా శుభ్రత గురించి చెబుతూ ఎంతో కృషి చేసారట.

 కమీషనర్ గారు..
సిబ్బంది చెప్పినవి విని ప్రజలు  పాటించటం కూడా గొప్ప విషయమే. ప్రభుత్వాలు, అధికారులు, ప్రజలు అందరూ సరిగ్గా పాటిస్తేనే ఏదైనా బాగుంటుంది.
..................................
 కొందరు మైకుల ద్వారా పెద్దగా శబ్దాలు పెడుతున్నారు. వార్తలు చెప్పేవారు కూడా ఎందుకో గట్టిగా అరుస్తూ  వార్తలు చెబుతున్నారు.
..................................

  ఇతరదేశాల వాళ్లు భారతీయులను వెళ్ళిపొమ్మంటున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. మనము మన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటే ఎక్కడికో వెళ్లి మాటలు పడే పరిస్థితి ఉండదు కదా..

భవిష్యత్తులో విదేశాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో? తమ తరువాత తమ పిల్లల పరిస్థితి అక్కడ ఎలా ఉంటుందో? (భయపడుతూ బతకాలేమో?) ఇవన్నీ విదేశాల్లో స్థిరపడాలనుకునే వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది.
................
 

ఎవరైనా గొప్పవాళ్లం అనుకుంటే.. వారు తమ గొప్పతనంతో  తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చు.  తామూ బాగుండవచ్చు.

........................

మన దేశంలో చిన్న పరిశ్రమలు నెలకొల్పితే,  విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా తిరిగివస్తారు. మన యువత కూడా ఐటీ రంగంలో మాత్రమే కాకుండా వ్యాపారాలు చేయటానికి ముందుకు రావాలి..

ఐటీలో ఉద్యోగాలు చేస్తూ ఎప్పుడు ఉద్యోగాల నుంచి తీసేస్తారో అని భయపడటం కన్నా, స్వంతంగా వ్యవసాయ రంగం, వ్యాపారం, కుటీర పరిశ్రమలు ఉపాధిపొందటం చెయ్యాలి.
...............

 ఇరుగుపొరుగు దేశాలనుండి అనేకమంది అక్రమంగా భారతదేశంలోకి వచ్చి ఇక్కడ స్ఠిరపడుతుంటే, మన వాళ్లు ఉపాధి వెతుక్కుంటూ విదేశాలకు వెళ్లి కష్టాలు పడుతున్నారు. 

ఎన్నో సంవత్సరాలనుండి విదేశీయులు వస్తుంటే ఎందుకు సమర్ధవంతంగా అడ్దుకోలేదో అర్ధం కావటం లేదు. ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోవాలి.
...........

జనాభా అదేపనిగా పెరిగితే అందరికీ ఉద్యోగాలు లభించాలంటే కష్టం. భారతదేశంలో జనాభా ఎక్కువ..భూమితక్కువ. కొన్ని విదేశాల్లో జనాభా తక్కువ.. భూమి ఎక్కువ. 

యంత్రాల వినియోగం పెరిగిన ఎక్కువైన తరువాత ప్రపంచం అంతటా నిరుద్యోగం ఎక్కువవుతోంది.

యంత్రాలతోనే ఎక్కువగా పనులు చేయించుకుంటున్న ఈ రోజుల్లో అందరికీ ఉద్యోగాలు లభించాలంటే కష్టమే. కష్టమైన పనులను యంత్రాలతో చేయించి, మిగతా పనులను మనుషులే చేయాలి.
.............

మనుషులు బతకటానికి అవసరమైన గాలి, నీరు, సూర్యరశ్మితో కూడిన వాతావరణం, ఆహారానికి అవసరమైన మొక్కలు, చెట్లు..వంటివెన్నో దైవమే ఏర్పాటు చేసారు. అయినా మనుషులు సరిగ్గా బతకలేకపోతున్నారు.

 ఆహారం,ఇల్లు, వైద్యం, విద్య, రక్షణ..ఇలా నిత్యావసరాలు బాగుంటే చాలు చక్కగా బ్రతకవచ్చు. అయితే, అనేకకోరికలతో విలాసాలనే నిత్యావసారాలుగా చేసుకుని వాటికోసం అదేపనిగా కష్టపడుతున్నారు. 

కొందరు మనుషులు సరిగ్గా బతకలేకపోవటానికి బలవంతులైన కొందరు బలహీనులను అణచివేయటం కూడా కారణమే.కొందరు చెడ్దవాళ్ళు ఇతరులను బాధిస్తూ పెత్తనం చేస్తున్నారు.
.............

కంపెనీల్లో ఒక పనికి ఎక్కువ జీతాన్ని ఇచ్చి (సుమారు లక్షన్నర అనుకోండి..) ఒక్కరితో ఎక్కువ పనిచేయించటంటం కన్నా, అదే పనికి ఇద్దరిని నియమించి ఒక్కొక్కరికి లక్ష ఇస్తే, నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. 

వ్యక్తులు అలసిపోరు కాబట్టి పనిలో నైపుణ్యత పెరుగుతుంది.   పనిగంటలు తగ్గి సమయం మిగులుతుంది కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబసంబంధాలు కూడా బాగుంటాయి.

ఉద్యోగుల జీతాలు పెంచితే, వ్యాపారస్తులు ధరలు పెంచుతారు. ఇలాంటప్పుడు తక్కువ ఆదాయ వర్గాల వారు కొనలేని పరిస్థితి ఉంటుంది.

విపరీతంగా ధరలు పెంచకుండా కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

.......................
ఈ రోజుల్లో ఉద్యోగాలంటూ స్త్రీలు ఉదయం వెళ్ళి రాత్రికి వస్తుంటే విపరీతమైన పనివల్ల అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. స్త్రీలలో గర్భసంచి వ్యాధులు బాగా పెరిగాయి.

 స్త్రీలు అంద
రికి  ఉద్యోగాలు కావాలని  ఎవరినైనా బ్రతిమలాడటం కన్నా,  దర్జాగా  కొందరు స్త్రీలు కలసి చిన్న పరిశ్రమలు పెట్టుకోవచ్చు. తమకు సదుపాయంగా ఉండేటట్లు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు పనిగంటలు ఏర్పాటుచేసుకోవచ్చు. 

అందరూ స్త్రీలే  ఉంటారు కాబట్టి, లైంగిక వేధింపులు వంటివాటి బారినుండి కూడా కొంతవరకు తప్పించుకోవచ్చు.

డబ్బు బాగా ఉన్న స్త్రీలు మహిళామండలిగా ఏర్పడి సమాజసేవ చేయవచ్చు. పేద వారు పైకి రావటానికి సాయం చేయవచ్చు. అంటే విద్య, వైద్యం వంటి విషయాల్లో తమకు తోచిన సాయం చేయవచ్చు. వారికి చదువు చెప్పవచ్చు. చక్కటి సలహాలను అందించవచ్చు. 

రకరకాల చీరలు, నగలు ధరించినా కలగని సంతోషాన్ని ఇతరులకు సాయం చేయటంలో పొందవచ్చు...ఎంతో పుణ్యం కూడా వస్తుంది.
.................

ఈ మధ్య యూట్యూబ్ లో కొన్ని వార్తలు చదివాను. కొన్ని చోట్ల కొందరు స్త్రీలను కొందరు బాస్ లు బెదిరిస్తున్నారట. ఉద్యోగం ఊడకుండా ఉండాలన్నా, ప్రమోషన్లు కావాలన్నా తమ కోరికలు తీర్చాలని అడుగుతున్నారట. తప్పని పరిస్థితిలో కొందరు స్త్రీలు లొంగిపోతున్నారట. ఇలాంటివి ఎంతో బాధాకరం.

 తల్లుల మాట చాలా మంది పిల్లలు వింటారు కాబట్టి,  తల్లులు తమ పిల్లలకు చిన్నతనం నుంచి అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరిని ఒకరు గౌరవించుకోవాలని,  నైతికవిలువలతో జీవించాలని నేర్పించితే వారు వినే అవకాశం ఉంది.

.................

 కొందరిలో ఎందుకో తెలియదు కాని,  పాపభీతి లేకపోవటం, అత్యాశ, సోమరితనం, స్వార్ధం..వంటి లక్షణాలు పెరిగాయి.

ఈ రోజుల్లో సమాజంలో జరుగుతున్న నేరాలు..ఘోరాలు గమనిస్తే, మనుషులకు నైతికవిలువలు ఎంత అవసరమో తెలుస్తుంది.

ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే, బయట ఎక్కువసార్లు తినకుండా చక్కటి ఇంటిభోజనం తినాలి.

 శారీరికంగా, మానసికంగా దేశానికి  మంచి పౌరులు తయారవ్వాలంటే ఇంట్లో పెద్దవాళ్ళు తప్పనిసరిగా వీలు కుదుర్చుకుని పిల్లలకు నైతిక విలువలను నేర్పించాలి. ఇందుకు గృహిణి యొక్క సహాయసహకారాలు ఎంతో ముఖ్యం.

 ఉపాధ్యాయులు కూడా పిల్లలకు నైతిక విలువలు పెంపొందేలా కృషిచేయాలి.

మంచి పౌరులను తయారుచేయటం ఎంతో గొప్పవిషయం.  
 నైతికవిలువలు కలిగిన మంచి పౌరులు ఉంటే ...కుటుంబాలు తద్వారా సమాజమూ అన్నీ బాగుంటాయి.

నైతికవిలువలు కలిగిన 
వారు  మంచిగా ప్రవర్తిస్తారు. అశ్లీల చిత్రాలు దేశమ్మీదకు వదిలి డబ్బు సంపాదించరు,  ఇతరులను మోసం చేయరు , నేరాలుఘోరాలు చేయరు. ధరలు విపరీతంగా పెంచి ఇతరులను దోచుకోరు. 

*నైతికత ఉన్న పౌరులు ఉన్నసమాజం దానికదే బాగుంటుంది. ఎప్పటికైనా అంతా బాగుండాలి.

 ................
* అన్నింటికి దైవమే దిక్కు. 

 ........................

Beautiful Village Giethoorn of Netherlands |

How to visit Giethoorn, Netherlands, a charming village ...
Visit Giethoorn, the picturesque Dutch village with no roads ...

***************
 
 దైవానికి అనేక కృతజ్ఞతలు.
 

 

Friday, September 5, 2025

ఏం మనుషులో...?

 


మేము వినాయక నిమజ్జనం కొరకు వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉందంటే..ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు, ఆకులు, పువ్వులు ఉన్నాయి. చెత్త కూడా పడేసి ఉంది.  దుర్వాసన వస్తోంది.
 
 ఇక ఆ నీటిలో నిమజ్జనం చేయలేక ఇంటికి వచ్చి చిన్న బకెట్లో నీళ్ళు పోసి,  ఆ నీటిలో నిమజ్జనం చేసి నీటిని చెట్ల వద్ద పోసాను. ఎవరికైనా దగ్గరలో మంచి నీటి  చెరువు ఉంటే అక్కడ కూడా కలపవచ్చు.  

ఆ నీటిని మొక్కల వద్ద పోస్తే మనం అక్కడ మట్టిలో నడుస్తాము కదా..అని సందేహాలు రావచ్చు..చెరువు నీటిలో నిమజ్జనం చేసినా చెరువునీటిలో నిలబడతారు, చెరువు నీటిని పనులకు వాడుకుంటారు, చెరువు నీటిని  స్నానానికి కూడా ఉపయోగిస్తారు  కదా..అనిపించింది. 

మరీ ఎక్కువ ఆలోచిస్తే అయోమయం అవుతుంది. కొంతవరకే ఆలోచించగలం. మానవప్రయత్నంగా కొంతవరకు ఆలోచించి పాటించి.. దైవాన్ని నమ్ముకోవటం మంచిది.
 ..............

 పాతకాలంలో వినాయక చవితి సందర్భంగా  కొందరు తమ పిల్లలను మొక్కలు, చెట్ల వద్దకు తీసుకువెళ్ళి పత్రిని సేకరించేవారు. ఆ విధంగా ఎంతో విలువైన 21 రకాల పత్రి గురించి పిల్లలకు తెలిసేది. పూజ తరువాత ఆ పత్రిని చెరువులలో కలపటం వల్ల ఆ ఆకులలోని మెడిసినల్ గుణాలు నీటిలో కలిసేవి. 
 
 వినాయకుని  ప్రతిమకు రసాయన రంగులు వేసి నీటితో కలిపితే మంచిది కాదు. 
.....................

పాతకాలంలో సంక్రాంతికి భోగి రోజున ఇంట్లోని పాత చెక్క సామాను విరిగినవి, పాడైనవి ఉంటే భోగిమంటలో వేసేవారు. ఆ విధంగా ఇల్లు శుభ్రం అయ్యేది. ఈ రోజుల్లో కొందరు భోగిమంటలో రబ్బరు టైర్లను కూడా వేస్తున్నారు. ఇందువల్ల పొల్యూషన్ పెరుగుతుంది.
...........................
 
టెక్నాలజి పేరుతో ప్లాస్టిక్ ..వంటివాటి వల్ల పొల్యూషన్ పెరుగుతుంటే.. వాటిని విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ పడేస్తూ మరింత పొల్యూషన్ పెంచుతున్నారు.
 
పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వంటివి వాడి ఎక్కడపడితే అక్కడ పారేయటం,  ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు  రసాయన రంగులు కలిసిన భారీ విగ్రహాలను తయారు చేసి, నీటిలో నిమజ్జనం చేయటం.. జరుగుతోంది. 

ప్లాస్టిక్ వంటి కొన్నింటి తయారీ మరియు వాడకం వల్ల 
కొందరు ఉపాధి పొందుతున్నారు కాబట్టి, అలాంటి వాటిని విమర్శించకూడదు, నిషేధించమని అనకూడదని కొందరు అనుకుంటారు.

 పొల్యూషన్ వల్ల కొన్ని జీవజాతులు అంతరించే పరిస్థితిలో ఉన్నాయని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. అలాంటప్పుడు మన అవసరాలకోసం లేక కొందరు బ్రతకటం కోసం  పొల్యూషన్ పెంచుతూ పోతే మనుషులతో సహా అన్ని జీవజాతులు అంతరించే ప్రమాదముంది.

.....................................

సోషల్ మీడియా వల్ల  విపరీతధోరణి మరింత పెరిగింది. మీడియాలో ఉండాలంటే ఎప్పుడూ ఏదో ఒక్కటి చెప్పాలని కొందరు ఎప్పుడూ ఏదో చెబుతూ ఉన్నారు.

 మన దేశంలో చాలా మందికి అత్యాశ పెరిగింది. ఎంతసేపూ ఎలాగైనా డబ్బు సంపాదించాలనే పిచ్చి పెరిగింది. తల్లితండ్రి పిల్లలను చంపటం, భార్యాభర్తల అక్రమసంబంధాలు..ఒకరినొకరు క్రూరంగా చంపుకోవటాలు ఎక్కువయ్యాయి. 


మీడియా ద్వారా అశ్లీలమైన, భయంకరమైన వ్రాతలు, దృశ్యాలు ప్రసారాల ప్రభావం చాలా ఉంటుంది. మూఢనమ్మకాలను ప్రచారం చేసేవాళ్లు కూడా ఎక్కువయ్యారు. ఇలాంటి వాటిని ఎందుకు బాన్ చెయ్యటం లేదో అర్ధం కావటం లేదు.


 అశ్లీలత, భయానకమైన విషయాలు, మూఢనమ్మకాలు..ఇలాంటివి మీడియాలో రాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి ప్రచారం చేసే వాళ్లపైన కేసులు పెట్టి శిక్షించాలి.
..........................

మన దేశంలో చాలామంది  శుభ్రతను పాటించటం లేదు. అశుభ్రంగా ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తూ పర్యావరణాన్ని కలుషితం చేసే వారిపైన కూడా కేసులు పెట్టి శిక్షించాలి.
....................

ఈ రోజుల్లో చాలా విషయాల్లో వేలం వెర్రిలా ఏది ఎందుకు చేస్తున్నారో తెలియకుండా తయారవుతోంది.

ఎలాగోలా డబ్బు సంపాదించటం..విపరీతంగా ఆస్తులు పోగేయటం..విపరీతంగా వస్తువులను కొనేయటం..రకారకాలు వండుకుని విపరీతంగా తినటం...చేస్తున్నారు. మా డబ్బుతో మేం కొనుక్కుంటాం.. అనటానికి వీల్లేదు. 


విపరీతమైన వస్తు వినియోగం వల్ల పర్యావరణం పాడవుతుంది. అమూల్యమైన ఖనిజ సంపద తరిగిపోతుంది. ఈ ప్రపంచం ఏ కొద్దిమందికి సంబంధించినది కాదు. అన్ని జీవులకు సంబంధించినది.
...............

 మన కష్టసుఖాల గురించి కొందరు మనుషులతో చెప్పుకోవటం కంటే, దైవానికి చెప్పుకోవటం మంచిదనిపిస్తుంది.
 
సమాజంలో బ్రతుకుతున్నప్పుడు సాటి మనుషులతో కూడా మంచిగా ఉండాలి.  కష్టసుఖాలలో సాటి మనుషుల  సహాయసహకారాలు కూడా అవసరమే కానీ, మనుషులు కొంతవరకే చేయగలరు. 
 
దైవము సర్వశక్తివంతులు. వారు తలచుకుంటే ఏమైనా చేయగలరు. మానవప్రయత్నం సరిగ్గా చేస్తుంటే, దానికి తగ్గ ఫలితాన్ని దైవమే అందిస్తారు. 


పండుగలు, పూజలు కూడా కొందరు తమకు తోచినట్లు చెబుతుంటే, చేసేవాళ్లు తమకు తోచినట్లు చేస్తున్నారు. ఆచారవ్యవహారాల పేరుతో ప్రజలను భయపెట్టటం కూడా ఎక్కువయ్యింది.

ఈ రోజుల్లో ఎవరికి ఏమీ చెప్పేటట్లు లేదు. అందరిని సరైన దారిలోకి తీసుకురావాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 
 

konni vishayaalu...

 
ప్రాచీనకాలంలో   సమాజంలో పని విభజన జరిగింది. ఎవరి పనిని వారు చక్కగా చేస్తే స
మాజం సజావుగా ఉంటుంది. . రైతులు ఉదయాన్నే పొలానికి వెళ్తారు. సైనికులు  దేశరక్షణలో అప్రమత్తంగా ఉంటారు.
 
సమాజంలో ఎన్నో వృత్తులవారున్నారు. ఎవరి పని వారు చక్కగా చేస్తే అదికూడా పూజయే.

ఇవన్నీ తెలిసిన ప్రాచీనులు, కొన్ని వృత్తులవారు పెద్ద ఎత్తున పూజలు చేయనక్కరలేదు, వారు తమ స్వధర్మాన్ని చక్కగా పాటిస్తే చాలు, కొద్దిపాటి పూజలు చేసినా బోలెడు పూజలు చేసినంత పుణ్యం వస్తుందని తెలియజేసారు.

అయితే, ప్రాచీనులు చెప్పినదానికి వ్యతిరేకంగా ఇప్పుడు కొందరు ఏమంటున్నారంటే,  అన్ని వృత్తులవారు కూడా పెద్ద ఎత్తున పూజలు చేయవచ్చని, అందరూ చాలా ఆచారవ్యవహారాలను పాటించాలని  చెబుతున్నారు.

  మేమెందుకు పెద్ద ఎత్తున పూజలు చేయకూడదంటూ కొందరు మాట్లాడుతారు. ఇప్పుడు చాలామంది ఇతర ప్రాంతాల వారి నుండి నేర్చుకుని కూడా అనేకపూజలను చేస్తున్నారు. ఇవ్వాళ ఫలానా పూజ కాబట్టి, ఈ నియమాలను పాటించాలి, లేదంటే కష్టాలు వచ్చి పడిపోతాయంటూ చెప్పేవాళ్లు కూడా ఎక్కువయ్యారు.

 కొత్తకొత్త ఆచారవ్యవహారాలను చెబుతున్నారు కొందరు.  నిత్యమూ చాలా విషయాలను పాటించాలంటే అందరూ పాటించలేరు. వీటి గురించి కుటుంబసభ్యుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. మళ్ళీ ఆ గొడవలు తగ్గాలంటే ఏమి పరిహారాలు చేయాలో? 

 కొందరు చెప్పేవి వింటే హిందువుల ముసుగులో హిందువులకు విసుగు కలిగేలా చెబుతున్నారేమో? అని సందేహాలు కూడా కలుగుతున్నాయి.

...........................................

ప్రతి విషయానికి ఎన్నో కొత్తకొత్త విధివిధానాలను చెబుతుంటే అవన్నీ గుర్తు ఉంచుకుని పాటించాలంటే చాలా కష్టం. ఇవన్నీ తప్పుల్లేకుండా పాటించాలంటే ధ్యాస అంతా విధివిధానాల పట్లే ఉంటుంది కానీ,  దైవము పట్ల ధ్యాస ఎలా?

ఉదా..ఎవరికైనా తాంబూలం ఇవ్వాలంటే అరటిపండ్ల తొడిమలు ఏ దిక్కున ఉండేటట్లు ఇవ్వాలి, ఎలా ఇవ్వకూడదు..ఇలా వందల నియమాలు చెబుతారు.

 పూజకు సంబంధించిన విధివిధానాల గురించి ఆలోచించటానికి, ఆచరించటానికే ఎక్కువ సమయం పడుతోంది. 

రోజువారి పనుల విషయంలో కూడా టెన్షన్ ఉంటుంది కాని, దైవానికి సంబంధించిన విషయాల్లో ఎక్కడ తప్పులు వస్తాయో అని టెన్షన్ మరింత ఎక్కువగా ఉంటుంది.టెన్షన్ లేకుండా ప్రశాంతంగా దైవపూజ చేసుకుంటే బాగుంటుంది.  

 ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు శ్రద్ధగా విధివిధానాలను పాటించాలి. భజనలు, నామసంకీర్తనలు  ఎవరైనా టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. 

 ఆచారవ్యవహారాల్లో ఎన్నో మంచివిషయాలను పొందుపరిచి ప్రాచీనులు మనకు అందించారు. అయితే, కాలక్రమేణా ఎన్నో మూఢనమ్మకాలు వచ్చాయి. అందువల్ల విచక్షణతో ప్రవర్తించాలి.

oka link....................................కష్టాలు తీరటం..
...............................

 ఈ కాలంలో పండుగలు, ఫంక్షన్లు సందర్భంగా అనేక కొత్త ఆచారవ్యవహారాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా చాలా ఖర్చులు, శ్రమ కూడా ఉంటోంది. అనవసర సామాను ఎక్కువవుతోంది.
 
 ఇచ్చే గిఫ్టులతో ఇల్లంతా గజిబిజిగా తయారవున్నాయి. గిఫ్ట్ వద్దంటే వినరు. ఈ కార్యక్రమాల ద్వారా కొందరు వస్తువులను అమ్ముకుంటూ  వ్యాపారం కూడా చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమాల్లో అన్ని వృత్తులవారు 
(అందరూ) పాల్గొనటం వల్ల చాలామంది వ్యాపారస్తులకు ఆదాయం పెరిగింది.

పువ్వులు, పండ్లు, కొబ్బరి కాయలు..పూజాసామాగ్రి అమ్మటం..ఇలా కొందరికి జీవనోపాధి ఉంటుంది. కొందరికి జీవనోపాధి లభించే మాట నిజమే కానీ, ఎప్పుడూ రకరకాల పూజలంటూ చాలాసార్లు డబ్బు ఖర్చుచేయటం, అనేక ఆచారవ్యవహారాలను పాటిస్తూ చాలా సమయాన్ని కేటాయించటం అంటే అందరూ చేయలేరు.

కొంతకాలం క్రిందట కొన్ని వస్తువులు కొని సాటి స్త్రీలకు పంచిపెట్టాలని  లేకపోతే అరిష్టమని ప్రచారం చేసారు.  వ్యాపారస్తులు కొందరు వారి వద్ద వస్తువులను కొనిపించటానికి ఇలా ప్రచారం చేసారని వార్తలు వచ్చాయి.
 

ఈ రోజుల్లో కొందరు మతాల పేరుతో కూడా ధనార్జన..వ్యాపారం చేయటం ఎక్కువయ్యింది. జీవనవిధానంలో మతము, ఆర్ధికాభివృద్ధి కలగలిపి ఉండవచ్చు కానీ,   మతవిషయాలలో వ్యాపారమే ముఖ్యంగా మారకూడదు.

 అవసరమైనంత వరకు ఆర్ధికాభివృద్ధి అవసరమే కానీ, ఆర్ధికాభివృద్ధే జీవిత ధ్యేయం కాదుకదా.. ఈ రోజుల్లో చాలామంది  ఎలాగైనా సరే బోలెడు డబ్బు సంపాదించటమే  జీవితధ్యేయంగా బతుకుతున్నారు.

కొందరు మతం పేరుతో సంస్థలను మెలకొల్పి ప్రజల వద్ద డబ్బు తీసుకుని మోసం చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
........................................................

 పాతకాలంలో దేవాలయాల నిర్వహణకొరకు రాజ్యాలను ఏలే రాజులు ధనాన్ని సమకూర్చేవారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.. 

 ఈ రోజుల్లో అంటరానితనం వంటివి లేకుండా అందరూ దేవాలయాలకు వెళ్తున్నారు. 

ప్రజలు హుండీలలో వేసే ధనాన్ని.. బంగారాన్ని పెద్ద ఎత్తున నిల్వ ఉంచితే ఎవరైనా దోపిడీదారుల దృష్టి పడవచ్చు. హిందువులలో కూడా కొందరు చేతివాటం వాళ్ళుండే అవకాశం ఉంది.

అలా పెద్ద ఎత్తున బంగారాన్ని  ప్రోగుచేసి ఉంచటం కన్నా, కొంత నిల్వ ఉంచి, మిగతా ధనాన్ని హిందుపేదప్రజల కొరకు ఉపయోగించవచ్చు. అంటే, ప్రజలకు కొందరికి ఉచితంగా లేక కొందరికి తక్కువ ధరకు విద్యను, వైద్యాన్ని అందించవచ్చు.
 

 హిందువులలోనే చాలామంది పేదలున్నారు.  హిందూదేవాలయాల సొమ్మును ఇతరమతస్తులకు ఇచ్చే హక్కు ఎవరికి ఉండదు. అలాగని దేవాలయాలను ప్రభుత్వాల నుంచి తప్పించటమూ మంచిది కాదనిపిస్తుంది.  

కొందరు ఏమంటారంటే, దేవాలయాలను ప్రభుత్వాల నుంచి తప్పించి 
ప్రైవేట్ వారికి అప్పగించాలంటారు.
 (దేవాలయాల ప్రైవేటీకరణ) ప్రభుత్వం వద్ద ఉంటే అక్కడ ఏమైనా అవకతవకలు జరిగితే కనీసం ఓటు ద్వారా ఆ ప్రభుత్వాలను దింపే అవకాశమైనా సామాన్యప్రజలకు ఉంటుంది..... 

 .. ప్రైవేట్ వారి చేతుల్లోకి దేవాలయాలు వెళితే అక్కడ ఏమైనా అవకతవకలు జరిగితే సామాన్యప్రజలు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండే పరిస్థితి కూడా ఉండవచ్చు.

 ఈ రోజుల్లో ఎవర్ని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో? అర్ధం కావటం లేదు.

 దేవాలయాలకు వెళ్తే , మన దేవాలయము ..అని స్వేచ్ఛగా  అనిపిస్తుంది.  ఆధునిక కాలంలో అన్ని వర్గాల ప్రజలు దేవాలయాలకు వెళ్తూ తమకు తోచిన సొమ్మును కానుకలుగా  సమర్పిస్తున్నారు. అలా కోట్ల రూపాయలు ధనం సమకూరుతోంది. 

దేవాలయాలను ప్రైవేటీకరణ చేస్తే బడా వాళ్ళు స్వాధీనం చేసుకుని, ప్రజలు దేవాలయాలకు సమర్పించిన సొమ్ముతో సహా దేవాలయాలను తమ స్వంత ఆస్తిలా పెత్తనం చేస్తారేమో? అని భయాలు కూడా కలుగుతున్నాయి.

 
హిందూ దేవాలయాల సొమ్ము హిందువులు మాత్రమే.. అనే చట్టం రావాలి.  దేవాలయాల వద్ద ఉన్న కొంతసొమ్ము తీసి, దేవాలయాల ఆధ్వర్యంలో హిందువులకు పాఠశాలలు, ఆసుపత్రులు కట్టించేలా  ప్రభుత్వాలను అడిగి.. ఆ విధంగా అందరూ చర్యలు తీసుకోవచ్చు.

 
 *****************
ఈ రోజుల్లో కొన్ని చోట్ల శుభ్రత లేని ప్రదేశాలలో కూడా కొత్తకొత్త దేవాలయాలను కడుతున్నారు. 

ఆశ్చర్యం ఏమిటంటే, జనాలకు సరైన భక్తి ఉంటే సమాజంలో ఇన్ని నేరాలు, ఘోరాలు చేయకూడదు.  కోరికలు తీరటానికి పూజలు చేయటం కూడా ఎక్కువయ్యింది. 

దైవకృపను పొందాలంటే దైవభక్తి కలిగి నైతికవిలువలతో జీవించటానికి ప్రయత్నించాలి.
.................

మన గ్రంధాలలో కొన్ని విషయాలను గమనిస్తే.. ఇలా ఎందుకు రాసారో? అనిపిస్తుంది. అవి ప్రక్షిప్తాలు కావచ్చు అనుకుంటున్నాము. ఈ విషయాల గురించి కొన్ని పాత పోస్టులలో ఉన్నాయి.
 
తరతరాలనుంచి అంటరానితనం మరియు కొన్ని మూఢనమ్మకాల వల్ల  ఇప్పటికే హిందుసమాజం ఎంతో నష్టపోయింది. 

పాతకాలంలో జరిగిన అంటరానితనం, కొన్ని మూఢనమ్మకాలు..తద్వారా కొందరు బాధలుపడటం .. వంటి
 వాటి  వల్ల కాబోలు భారతదేశంలో విదేశీయుల పాలన రావటం, విదేశీమతాలు ప్రవేశం జరిగి ఉండవచ్చు. ప్రతివిషయానికి  కర్మ ప్రభావం ఉంటుంది కదా..
 

మనల్ని ఎవరైనా కష్టపెడుతుంటే వారిని ఎదుర్కోవటం తప్పు కాదుకానీ, మనము అనవసరంగా ఇతరులను బాధించటం తప్పే కదా..అలా బాధపడినవారి ఉసురు తగిలే అవకాశం ఉంది.

 ఇప్పటికైనా హిందువులు ఒకరినొకరు గొడవలు పడకుండా సామరస్యంగా ఉంటే బాగుంటుంది. సమాజంలో అన్ని వృత్తుల వారు అవసరమే. ఎవరి కష్టసుఖాలు వారికి ఉన్నాయి. అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ చక్కగా జీవించాలి.
..................................................

జీవితంలో కొన్ని నియమాలు ఉంటే ఎవరికైనా ఆచరించడానికి సులభంగా ఉంటుంది. అదేపనిగా నియమాలంటూ అంతులేకుండా చెప్పుకుంటూ ఉంటే అందరూ పాటించలేరు. మతాన్నే వదిలేయాలనిపించవచ్చు. 

 ఎందరో హిందువులు మతం కూడా మారారు. అందువల్ల సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలి.

దైవము యొక్క అవసరం అందరికి ఉంటుంది. అయితే, దైవారాధనకు కఠినమైన మార్గాలను వదిలి సులభమైన మార్గాలను ఎన్నుకోవాలనిపించవచ్చు.

 పండుగలు వస్తున్నాయంటే టెన్షన్ వస్తుంది. బోలెడు నియమాలను పాటించలేక మతము అనేది లేకుండా నాకు కుదిరినంతలో దైవాన్ని ఆరాధించుకోవాలనిపిస్తుంది.  ఇదంతా గమనించిన తరువాత, నేను ఎలా మారతానో? అని భయం వేసి,  ఇప్పుడు నాకు వీలైనంతలో మాత్రమే పాటించటానికి ప్రయత్నిస్తున్నాను.

మేము ఇన్నిన్ని పాటించలేకపోతున్నాము బాబోయ్..అని మొత్తుకుంటున్నా కూడా అర్ధం చేసుకోకుండా కొందరు అపార్ధం చేసుకుంటున్నారు.

 కొందరు యువత..ఇవన్నీ మేము పాటించలేం, మాకు నచ్చిన పద్ధతిలో దైవాన్ని ప్రార్ధించుకుంటామని చెబుతున్నారు. అందువల్ల, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, కొంత పట్టువిడుపుగా ఉండటం మంచిది.

 ఇది కలికాలం. కలికాలంలో మనుషులు శారీరికంగా, మానసికంగా కొంత బలహీనులుగా ఉంటారు కాబట్టి, దైవభక్తి కలిగి దైవస్మరణ చేస్తే చాలు తరిస్తారని ప్రాచీనులే తెలియజేసారు.

బోలెడు పూజలను చేయకపోయినా.. జీవితంలో దైవభక్తి కలిగి, కొన్ని పూజలను చేస్తూ, నీతినిజాయితీలతో జీవించటానికి ప్రయత్నిస్తే దైవకృపను పొందే అవకాశం ఉంటుంది.




Monday, June 23, 2025

కొన్ని పోస్టుల లింక్స్..

 

కొన్ని పోస్టుల లింక్స్..

ఆసక్తి ఉన్నవారు క్రింద ఉన్న లింక్స్ వద్ద చదవగలరు.
 

 వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. 1   *******

  వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్....2   **********

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. .3    *************

 వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. ....4   *************



ఒక సంఘటన..

 

 ఒకప్పుడు మేము ముంబాయిలో ఉన్నప్పుడు 13 వ అంతస్తులో ఉండేవాళ్లం.ఆ ఇంటికి అద్దాలతో ఉన్న బాల్కనీలు చక్కగా ఉన్నాయి. వెళ్ళిన కొత్తలో బాల్కనీ నుంచి అన్నీ భలే కనిపిస్తున్నాయని బాల్కనీలో కూర్చోవటం జరిగింది.

 

 ఒకరోజు  ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్లినప్పుడు నేను బాల్కనీలో కూర్చున్నాను. కొంతసేపటి తరువాత ఇంట్లోకి వెళ్దామని చూస్తే ఎంత ప్రయత్నించినా గ్లాస్ డోర్ రావటం లేదు. పొరపాటున గ్లాస్ డోర్ స్పీడుగా వేస్తే అది లాక్ అయినట్లుంది. 

 

అలాంటి గ్లాస్ డోర్లు మాకు కొత్త. అలా లాక్ అవుతాయని నాకు తెలియదు. చాలా భయం వేసింది. నా దగ్గర ఫోన్ కూడా లేదు. 13 అంతస్తుల పైనుంచి పిలిచినా క్రింద ఎవరికి వినపడలేదు. 

 

 క్రింద  రెండు దేవాలయాలు కనిపిస్తున్నాయి. దూరంగా సముద్రం నుండి ఒక పాయ లాంటిది కనిపిస్తుంది. దైవాన్ని ప్రార్దించుకున్నాను.

(నవి ముంబై   ప్రాంతం)

 ఆ ఇంటికి వెళ్ళిన కొత్తలో ఈ సంఘటన జరిగింది. మా బాల్కనీకి ఆనుకుని పక్కింటివారి బాల్కని ఉంది. పక్కింటివారు నాకు పరిచయం లేదు.  పిలిచాను కానీ వాళ్ళు పలకలేదు. 

 ఆ బాల్కనీలో చిన్న అలమార ఉంది. అందులో ఒక పాత ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉంది. ఆ బాటిల్ తో పక్కింటివారి బాల్కనీ వైపు గట్టిగా కొట్టాను. ఆమె లోపల ఉన్నట్లున్నారు. వారికి వినిపించలేదు. 

మా వాళ్లు బయట నుంచి తిరిగి వచ్చే వరకు నేను బాల్కనీలో అలా ఉండలేను అనిపించింది. నాకు టాయ్లెట్ కూడా వెళ్ళాలనిపించింది. 

 దైవాన్ని ప్రార్ధించుకున్నాను. నేను మళ్లీ కొన్నిసార్లు  పక్కవారి బాల్కనీకి బాటిల్తో కొట్టి సౌండ్ చేసాను.

 కొంతసేపటికి పక్కింటి ఆమె, వారి బాల్కనీకి వచ్చారు. ఆమె నన్ను చూసి బయటకు వెళ్లి, ఇంకొక ఆమెను తీసుకొచ్చి ఇద్దరూ మా ఇంటి తలుపును బయటనుంచి తీసి నన్ను కాపాడారు. మా ఇంటి ఓనర్ మా ఇంటి ఇంకో తాళాన్ని వాళ్ల వద్ద ఉంచారట.

 నాకు పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది. దైవము దయ వల్ల అలా రక్షించబడ్దాను.

 ఆ సమయానికి  పక్కింటి వాళ్ళు వారి ఇంట్లో లేకపోతే నాకు చాలా కష్టమయ్యేది. 

  చిన్నపిల్లలు  ఎవరైనా అలా ఇరుక్కుపోతే కష్టం కదా.. అందుకే జాగ్రత్తగా ఉండాలని ఇవన్నీ వ్రాసాను. 

అక్కడ వాటర్ బోటిల్ ఉండటం, దానితో పక్కవాళ్లను పిలవాలని ఆలోచన రావటం, పక్కవాళ్ళు ఆ సౌండ్ విని రక్షించటం.. ఇవన్నీ భగవంతుని దయ వల్లనే జరిగాయి.

అంతా దైవము దయ. దైవానికి అనేక కృతజ్ఞతలు.

............. 

Reply
anrdDecember 7, 2023 at 5:07 PM

ఎత్తైన అపార్ట్మెంట్స్లో కొందరు బాల్కనీల్లో అద్దాలు డోర్లు అమరుస్తారు. అవి లోపల నుండి బోల్ట్ ఉంటాయి. బాల్కనీకి వెళ్లి తటాలున డోర్ వేస్తే క్లోస్ అయ్యి మనుషులు బాల్కనీలోనే ఉంటారు. ఇంట్లో ఎవరైనా ఉంటే ఫరవాలేదు. లేకపోతే బాల్కనీ నుంచి అరచి బైటవారిని పిలిచి, ఇంటి తలుపు ఎలాగోలా తెరిచి లోపలికి వెళ్లి బాల్కనీ అద్దాలతలుపు తెరవాలి.

ఇక 12వ అంతస్తు లో బాల్కనీలో చిక్కుకున్నవారు ఎంత అరిచినా క్రింద ఉన్నవారికి వినపడదు. పక్కన పోర్షన్లో వినిపించేటట్లు ఎవరైనా ఉండాలి. చేతిలో ఫోన్ ఉండాలి. ఫోన్ చార్జిన్గ్ ఉండాలి. బాల్కనీల్లో ఫోన్ అమర్చుకుంటే వాచ్మెన్ ను పిలవచ్చు. 

 లేకపోతే ఒక గట్టితాడుకు చిన్న బకెట్ కట్టి అన్ని బాల్కనీల్లో ఉంచుకోవాలి. ఎవరైనా ఇరుక్కుపోతే బకెట్ క్రిందకు వెయ్యచ్చు. బాల్కనీలో ఒకచిన్న అల్మారా కట్టి, అందులో చిన్నబుక్, పెన్ పెట్టుకుంటే బాల్కనీలో ఇరుక్కుపోయిన విషయం పేపర్లో వ్రాసి, బకెట్లో వేసి క్రిందకు వదలవచ్చు. క్రింద తిరిగేవారు చూసి కాపాడతారు.

  .................................

  anrdDecember 7, 2023 at 5:07 PM

కొన్ని అపార్ట్మెంట్స్ లో లిఫ్ట్ బయటవారు కనిపించేటట్లు ఉంటుంది. అయితే, కొన్నిచోట్ల పూర్తిగా క్లోస్ చేసిన తలుపులతో ఉండే లిఫ్ట్ ఉంటుంది. ఇలాంటి లిఫ్ట్ ఏ కారణం చేతనైనా కొద్దిసేపు ఆగిపోతే అందులో వారు భయపడతారు. చిన్నపిల్లలయితే ఇంకా భయపడతారు. 

 ఇలాంటి లిఫ్ట్ల్లో ఒక తలుపుకు పైనుంచి క్రిందకు కొద్దిగా ఖాళీ ఉండేటట్లు, అంటే పొడుగుగా ఉండే కిటికీలాగ చేసి దానికి మెష్ అమర్చి తయారుచేస్తే ఎప్పుడయినా ఆగిపోతే అందులో ఉన్నవారికి గాలి ఆడుతుంది, బయటకు కనిపిస్తుంది.చిన్నపిల్లలకు కూడా బయట కనిపించేలా ఉండాలి. అయితే చేతి వేళ్ళు పట్టకుండా సన్నటి మెష్ అమర్చాలి. లిఫ్టులో వాచ్ మెన్ కు తెలిసేలా ఫోన్ కూడా పెట్టవచ్చు.

చాలా అపార్ట్ మెంట్స్ లో ఇళ్లలో పనిచేసేవారిని, కూరలు అమ్మేవారిని లిఫ్ట్ వాడనివ్వరు. అన్ని మెట్లు ఎక్కాలంటే ఎవరికైనా కష్టమే. ఆ వర్కర్స్ వచ్చి పనిచేయకపోతే చాలామందికి కుదరదు. అందువల్ల వర్కర్స్ నూ లిఫ్ట్ వాడనివ్వాలి. అలా కుదరదు అంటే, కనీసం పైకి వెళ్ళేటప్పుడు లిఫ్ట్ ఉపయోగించి, క్రిందకు దిగేటప్పుడు మెట్లను వాడవచ్చు.

 ************** 

నాకు వచ్చిన మరికొన్ని ఆలోచనలు.......

మరికొన్ని విషయాలు..

 సమాజంలో, గొడవలు..నేరాలు..ఘోరాలు ఎక్కువయ్యాయి. సమాజంలో కొందరు మనుషులు విపరీతంగా ప్రవర్తిస్తున్నారు.  

ఇప్పడు ప్రపంచంలో మనుషులు ఎన్నో పాపాలు చేస్తున్నారు. 

మతం పేరుతో కూడా కొందరు హింస చేయటం, మూఢనమ్మకాలు ఎక్కువయ్యాయి. 

కొన్ని విషయాలను, సంఘటనలను గమనిస్తే, ఏది ఎందుకు జరుగుతుందో అర్ధం కావటం లేదు.

 ప్రపంచంలో జరుగుతున్న ఉపద్రవాలు, ప్రకృతి విపత్తులు తగ్గాలంటే, మనుషులు  పాపాలు చేయటం.. సాటిజీవులను హింసించటం వంటివి మానాలి.

అంతా మంచిగా ఉండాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను. దైవమే దిక్కు.

 ..........

 దైవము జీవులకు అవసరమైనవి ఎన్నో ఇస్తున్నారు. జీవులకు అవసరమైన..గాలి, నీరు, ఆహారానికి ఎన్నో మొక్కలు..ఇలా ఎన్నో ఉన్నాయి. ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలు కూడా ఉన్నాయి. 

దైవ సృష్టిలో ఎన్నో అద్భుతమైనవి ఉన్నాయి. ఉదా.. ఆహారం దానికి అదే అరగటం, శ్వాస తీసుకోవటం ఎలా ఎన్నో ఉన్నాయి.
దైవానికి అనేక కృతజ్ఞతలు. 
 

మనుషులు కొందరు తమ స్వార్ధం, అత్యాశ..వంటి గుణాలతో ప్రపంచంలో బాధలకు కారణమవుతున్నారు. మనుషులు మంచిగా ప్రవర్తిస్తే బాగుంటుంది.

********************

మన గతజన్మలలో ఉన్నవాటి గురించి ఇప్పుడు కూడా తెలిస్తే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది కొన్నిసార్లు.  గతజన్మలలో మనకు తెలిసినవి ఏమైనా ఇప్పుడు కూడా ఉంటే బాగుండనిపిస్తుంది.

 

 గతజన్మలలో మనతో ఉన్న వారు ఇప్పుడు మనతో ఉండవచ్చు..లేకపోవచ్చు. ఇప్పుడు ఉన్నా కూడా మనము వారిని గుర్తించలేకపోవచ్చు. అయితే, దైవము ఎప్పుడూ ఉంటారు..సూర్యుడు, చంద్రుడు, భూమి..గతజన్మలలో కూడా మనతో ఉన్నారు. 


గత జన్మలలో మనతో ఉన్న అప్పటి సూర్యుడు, చంద్రుడు, భూమి..ఇప్పుడు కూడా ఉన్నారు. మనము వాటిని గుర్తించగలము. ఇది ఎంతో ఆశ్చర్యకరము, ఆనందకరమైన విషయము. 

దైవము జీవులకు జన్మజన్మల బంధువు, శాశ్వతమైన వారు.

........................

 ఒకే పోస్టులో రకరకాల విషయాలను వ్రాసేసాను. ఏమీ అనుకోవద్దండి.

Saturday, March 22, 2025

కనీస అవసరాలు తీరాలి....

 

ఈ పోస్ట్ లోని విషయములు జనవరిలో వేసిన.. కొన్ని విషయములు ..పోస్టులోని విషయములే. ఆ పోస్ట్ పెద్దగా అవటం వల్ల, కొంతభాగాన్ని తీసి ఇక్కడ వేయటం జరిగిందండి.

....................

టెక్నాలజి అంటూ పోటీలు పడుతున్నారు కొందరు. టెక్నాలజీ కొంతవరకు అవసరమే కానీ, పర్యావరణహిత టెక్నాలజి ఉండాలి. .

 ప్రపంచంలో నైతికవిలువలకు హాని కలగని విధమైన టెక్నాలజి వాడకం కావాలి. ఉదా..సెల్ఫోన్ల ద్వారా అశ్లీలచిత్రాలు వంటివి మంచిదికాదు.

 ............

   ప్రపంచంలో మనుషులందరికీ ...ఆహారం, ఇల్లు, విద్య, వైద్యం, రక్షణ....ఇలాంటి కనీస అవసరాలు తీరాలి. 

 ...........

ఒక్క మొక్క నుండి అనేక విత్తనాలు ..ఆ విత్తనాల నుండి అనేక మొక్కలు..ఆ మొక్కల నుండి బోలెడు ఆహారం లభించేలా దైవం సృష్టిని చేసారు. ..

అయినా కూడా,   అందరికీ ఆహారం లభించేలా చేసుకోలేకపోతున్నారు. 

ఇప్పటికీ ప్రపంచంలో చాలామందికి సరిగ్గా ఆహారం లభించటం లేదు.

 కొందరేమో తినటానికి తిండిలేక, డబ్బులేక, ఉపాధిలేక కష్టపడుతున్నారు. 

చాలామంది మద్యం, మత్తుమందులకు బానిసలవుతున్నారు.  

డబ్బు ఉన్నా కూడా కొందరికి అనేక సమస్యలు ఉంటున్నాయి,  చాలామందికి మానసిక ప్రశాంతత ఉండటం లేదు.
 
 

ధనిక దేశాలలో కూడా చాలామంది అనేక సమస్యలతో బాధలు పడుతున్నారు.

 ప్రపంచంలో ప్రశాంతత లేనప్పుడు  ఏం లాభం?  

 సమాజంలో నేరాలు..ఘోరాలు జరగకుండా ఉండాలి. అందరూ ప్రశాంతంగా బ్రతకాలి. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండాలి. 

.................

 అంతా దైవము దయ.
 .....................

 


Friday, January 31, 2025

కొన్ని విషయములు..


ఈ పోస్ట్ పెద్దగా అవటం వల్ల, ఈ పోస్ట్ లోని కొంత భాగాన్ని మార్చ్ నెలలో పోస్ట్ చేయటం జరిగిందండి.
...........

ఈ రోజుల్లో, బ్రతుకుతెరువు కొరకు ఉద్యోగం అని కాకుండా, ఉద్యోగం కొరకు బ్రతకటం అన్నట్లు ఉంది వ్యవహారం.
 
ఈ మధ్య కొందరు పెద్ద కంపెనీల వాళ్ళు ఏమంటున్నారంటే, ఉద్యోగస్తులు మరిన్ని ఎక్కువ గంటలు పనిచేయాలని చెబుతున్నారు. త్వరగా ఇంటికెళ్ళటం వేస్ట్ అన్నట్లు, భార్యాభర్తలు ఎక్కువగా మాట్లాడుకోకూడదన్నట్లు కూడా కొందరు చెబుతారు.

 ఉద్యోగస్తులతో బాగా పనిచేయిస్తూ వేలకోట్లు సంపాదించే కంపెనీల వాళ్ళు ఇలా మాట్లాడటం అన్యాయం..

కొన్ని సంవత్సరాల క్రిందట పనిగంటలు పెరిగినదానికి వ్యతిరేకంగా విదేశాలలో కార్మికులు పోరాటం చేసారు. ఆ పోరాటాలకు గుర్తుగా మేడే జరుపుతారు.
 
 ఈ రోజుల్లో కంపెనీలు కొందరు ఉద్యోగస్తులను పని లో నుండి తీసివేస్తున్నారు..అది చూసి భయపడి, మిగతావాళ్ళు విపరీతంగా పనిచేస్తుంటారు.
...............

మనుషులు  డబ్బు కొరకు  పనిచేయటం కొరకే పుట్టలేదు. పనిచేసి డబ్బు సంపాదించటం జీవితంలో ఒక భాగం. మనుషులు దైవధ్యానం చేసుకోవాలి. గృహస్థాశ్రమంలో కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి.కుటుంబం అంటే ఎన్నో బాధ్యతలుంటాయి. సంతానాన్ని చక్కటి పౌరులుగా తయారుచేయటంలో తమ వంతు పాత్రను సరిగ్గా నిర్వహించాలి.

 
ఎవరైనా తాము ఆరోగ్యంగా ఉండటానికి కొంత సమయం కేటాయించుకోవాలి. చక్కటి చెట్లు, మొక్కలు పెంచుతూ ఆహ్లాదంగా ఉండవచ్చు. ప్రపంచంలో ఉన్న ప్రకృతిసుందరదృశ్యాలను చూసి ఆనందించవచ్చు. పర్యావరణాన్ని కాపాడటంలో కొంత సమయం కేటాయిస్తే మంచిది.

 
సమాజంలో కష్టాలలో ఉండేవారికి కొంత సేవ లేక సాయం చేయవచ్చు. ఇలా ఎన్నో ఉండగా, సమయం చాలక ఎందరో ఉరుకులు పరుగులతో జీవిస్తున్నారు. కొన్ని ఉద్యోగాల వారికి ఇంటికొచ్చినా, ఆఫీసువాళ్ళు ఫోన్లు చేసి పనులు చేయించుకుంటున్నారు.

 .....................
అనేకకారణాల వల్ల, కుటుంబసభ్యుల మధ్య కొన్ని గొడవలు వస్తుంటాయి.  
పనివత్తిడి వల్ల  కూడా కుటుంబాలలో గొడవలు జరిగి, వివాహబంధాలు విచ్చిన్నమవుతున్నాయి. ఈ రోజుల్లో చాలామంది  విచ్చలవిడి ప్రవర్తనకు ఇష్టపడుతున్నారు.
.....................

ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగులు సమయం చాలక ఒత్తిడితో అనారోగ్యం పాలవుతున్నారు. ఈ మధ్యన యువత కొందరు  పని ఒత్తిడితో ఉన్నపళాన చనిపోయారు. కొందరు ఉద్యోగస్తులు ఆహారం వండుకోవటానికి సమయం చాలక,బయట  ఆహారాన్ని తిని అనారోగ్యం పాలవుతున్నారు.

  ఈ రోజుల్లో ప్రజలకు ఉదయం, సాయంకాలం ఎండ తగలకపోవటం, శరీరానికి వ్యాయామం లేకపోవటం, సరైన ఆరోగ్యకరమైన ఆహారం లభించకపోవటం, వాతావరణకాలుష్యం..వంటి సమస్యలతో పాటు......
 
 ఎక్కువమంది ఎప్పుడూ సెల్ఫోన్లు, కంప్యూటర్లు వాడటం వల్ల రేడియేషన్ మరియు సెల్ఫోన్లను వేళ్లతో అదేపనిగా నొక్కటం వల్ల నరాల వ్యాధులు, మెడనొప్పి, కంటిసమస్యలు, తల దిమ్ము..వంటి సమస్యలు వస్తున్నాయి.
 
 కొంతకాలం క్రిందట ఐటీ రంగంలో పనిచేసేవారికి మెడనొప్పులు, భుజాల నొప్పులు..వంటివి ఎక్కువగా ఉండేవి. సెల్ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చాక, ఇప్పుడు చాలామందికి ఈ జబ్బులు వస్తున్నాయి.
 
 పిల్లలు కూడా ఆన్లైన్  ద్వారా పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇవన్నీ సరిదిద్దుకోకుంటే ఎవరూ ఏం చేయలేరు.

 
ప్రపంచంలోని ప్రతి ఒక్కరు ప్రపంచంలోని ప్రతి విషయాన్ని నేర్చుకోవలసిన అవసరం లేదనిపిస్తుంది.  ప్రపంచంలోని విషయాలన్నీ తెలుసుకోవాలనుకోవటం కూడా వ్యసనమే. ఎంతవరకు అవసరమో అంతవరకు తెలుసుకుంటే చాలు అనిపిస్తుంది.
  ..........
 

చాలామంది సంతానాన్ని పెంచే సమయం, ఓపిక లేదంటూ డేకేర్లలో వేస్తున్నారు. ఇంటివద్ద అల్లారుముద్దుగా పెరగవలసిన చంటిపిల్లలు బయట ఎక్కడో పెరుగుతున్నారు. కొందరు తల్లితండ్రి ఏమంటారంటే, పిల్లల కోసమే డబ్బు సంపాదిస్తున్నామని చెబుతుంటారు.

  మాటలు కూడా సరిగ్గారాని, వాళ్ళ బాధలు చెప్పలేని చిన్నవయస్సులో పిల్లల్ని బయట డేకేర్లలో వేసి, వాళ్ళకొరకు డబ్బు సంపాదిస్తున్నామని చెప్పటమేమిటో?
 
కొందరు పేరెంట్స్  పిల్లలను జాగ్రత్తగా చూసుకోవటం లేదని  కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తోంది. అది చాలా పాపం.  

 చంటి పిల్లలను పెంచడానికి చాలా ఓపిక అవసరం. తల్లితండ్రి కూడా ఓపికతో వ్యవహరించాలి. 

 

కొన్ని డేకేర్ సెంటర్ల వాళ్ళు కూడా బాగానే చూసుకుంటారట. పిల్లలు అక్కడ తోటిపిల్లలతో ఆడుకుంటారు. అయితే, ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో..అర్ధం కావటంలేదు. పైకి అందరూ బాగానే మాట్లాడతారు. తల్లి దగ్గరుండి చంటిపిల్లలను ప్రేమగా చూసుకుంటే మంచిది.
 
చిన్నపిల్లల విషయాలలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
 .................
 
 కొన్ని ఆఫీసుల్లో ఉద్యోగులకు పనివత్తిడి తగ్గటం కొరకు అంటూ..ఆఫీసులోనే రకరకాల ఆహారం, వినోదం..వంటివి ఏర్పాటుచేస్తున్నారు.  ఇక, కొందరు ఉద్యోగులు ఇంటికంటే ఆఫీసులోనే బాగుందని ఆఫీసులోనే ఎక్కువసేపు పనిచేస్తుంటారు.

 ఈ రోజుల్లో పెంచుకున్న పనివత్తిడితో ఎవరికీ సరైన విశ్రాంతి ఉండటం లేదు.

అలాగని అందరూ పనులు మానేసి సోమరిగా ఉండకూడదు. అతిగా పనిచేసి అలసిపోకూడదు కాని, ఎవరి పనులు వారు చక్కగా నిర్వహించాలి.
.............................

  ఎన్నో రంగాలలో పనిచేసేవారు  చాలా టెన్షన్ తో పనిచేసే పరిస్థితి ఉంది.

......................

యంత్రాలు లేని పాతకాలంలో ఒక వస్తువు తయారుచెయ్యాలంటే
కొన్నిరోజులు పట్టేది, చేయడానికి కొన్ని రోజులు పని ఉండేది.
 
ఇప్పుడు యంత్రాల సాయంతో అదేపనిని గంటలో చేస్తున్నారు.ఇందువల్ల నిరుద్యోగం పెరుగుతుంది. అదేపనిగా వస్తువుల తయారీ వల్ల ప్రపంచంలో ఉన్న సహజవనరులూ త్వరగా ఖర్చవుతాయి.

ఉపాధి..ఉద్యోగాల కొరకు అదేపనిగా పనిచేసి, అదేపనిగా వస్తువులను ఉత్పత్తి చేస్తూ పోతే, పర్యావరణం పాడయ్యి ప్రపంచానికి పెనుప్రమాదం వచ్చే పరిస్థితులు రావచ్చు.
 
 మనం వాడుతున్న కంప్యూటర్లు, ఏసీలు, ఫ్రిజ్లు..వంటి వాటివల్లకూడా ఓజోన్ పొర పల్చనయ్యే ప్రమాదముందని ఒక దగ్గర చదివాను. అప్పుడు ఓజోన్ పొర పల్చనయ్యి అతినీలలోహిత కిరణాలు భూమిపై వ్యాపించి కొత్త విపత్తులు రావచ్చు.

 అందువల్ల అతిని తగ్గించుకుంటే మంచిది.
  

Friday, January 17, 2025

కుంభమేళా లో...

 ..

కొందరు ఏమంటున్నారంటే, మహాకుంభమేళా లో అనేకమంది స్నానాలు చేయటం.. వంటివాటి వల్ల పొల్యూషన్ జరుగుతుందని గగ్గోలు పెడుతున్నారు. 


 వర్షాలు పడినప్పుడు భూమిపైన ఉన్న సుగంధాలు, దుర్గంధాలు,  మంచివి, చెడువి...కూడా..అనేకమైనవి ..వాననీటితో పాటు నదుల్లోనూ, కాలువల్లోనూ కలుస్తాయి..

 

మనుషులు బయట పడేసే వ్యర్ధాలు, చెత్తా, చెదారం,  పశుపక్ష్యాదుల మలమూత్ర విసర్జనలు, వాటి మృతకళేబరాలు.. వంటివి కూడా వాననీటితో పాటు నదుల్లోనూ, కాలువల్లోనూ కలుస్తాయి...

 

 మాంసాహారం కొరకు ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేలు, లక్షలుగా పశుపక్ష్యాదులను చంపి, మిగిలిన టన్నుల  వ్యర్ధాలను బైటపడేస్తారు.

 

ప్రపంచవ్యాప్తంగా సముద్రం.. బీచ్ ల వద్ద అనేకమంది స్నానాలు చేస్తారు. ...స్విమ్మింగ్ పూల్స్ లో చాలామంది ఈతకొడుతుంటారు. ...స్విమ్మింగ్ పూల్స్   నీటిలో బ్లీచింగ్ పౌడెర్.. వంటివి కలుపుతారు.

 

అయితే, నదుల్లో నీరు ఒకదగ్గర నుంచి ఇంకో దగ్గరకు దూరప్రాంతాలనుంచి పారుతూ చక్కగా ప్రవహిస్తుంది కాబట్టి,  బ్లీచింగ్ పౌడర్ ..వంటివి వేయరు. 


అందువల్ల,  ఎన్నో సంవత్సరాల కొకసారి నదిలో పుష్కర స్నానం చేయటం వల్ల సమస్యలు ఏమీ ఉండవు.....అయితే, నదీ స్నానాలలో సబ్బులు, షాంపూలు, ప్లాస్టిక్ కవర్లు..వంటివి వాడకూడదు.


కుంభమేళాకు వెళ్తే రోగాలొస్తాయని కొందరు అంటున్నారు..కొన్నాళ్ళక్రితం కరోనాతో ప్రపంచం అల్లాడిపోయింది. మరి కరోనా రోగం ఎందుకొచ్చినట్లు?

*********

 ఆధునిక కాలంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి.   పారిశ్రామిక వ్యర్ధాలను, విషపదార్ధాలను,  నగరాలనుంచి వచ్చే డ్రైనేజ్ ను ...నదులలోకి, సముద్రంలోకి వదిలేస్తుంటారు..వాటివల్ల కలిగే నష్టాలు  చాలా ఉన్నాయి.

 

ఆధునిక పోకడలతో పర్యావరణం పాడయ్యింది. రసాయనాల పంటలు వాడి అనారోగ్యాలు వస్తున్నాయి. అనేక విష రసాయనాలు భూమిలోకి ఇంకి భూగర్భనీరు పాడవుతోంది.

 

 మనం వాడుతున్న కంప్యూటర్లు, ఏసీలు, ఫ్రిజ్లు..వంటి వాటివల్ల కూడా ఓజోన్ పొర పల్చనయ్యే ప్రమాదముందని ఒక దగ్గర చదివాను....గాలిలో కలిసే విషవాయువుల వల్ల కూడా  ఓజోన్ పొర రంధ్రాలు పడుతోందంటున్నారు. 

 

అప్పుడు ఓజోన్ పొర పల్చనయ్యి , అతినీలలోహిత కిరణాలు భూమిపై వ్యాపించి కొత్త విపత్తులు రావచ్చు.

 

 గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల విపరీతమైన వాతావరణ మార్పులు జరుగుతున్నాయి.

ఇలా చాలా జరుగుతున్నాయి. వీటి గురించి ఆలోచించితే మంచిది.

 

Sunday, January 12, 2025

మరికొన్ని విషయములు..

 

 మహా కుంభమేళా సందర్భముగా శుభాకాంక్షలండి.

***********

సమాజంలో అందరూ తమ బాధ్యతలను సరిగ్గా నిర్వహిస్తేనే సమాజంలో కష్టాలునష్టాలు తగ్గుతాయి....నైతికవిలువలకు, క్రమశిక్షణకు, శుభ్రతకు..అందరూ ప్రాధాన్యతను ఇవ్వాలి. 


సమాజం బాగుండాలంటే, చిన్నతనం నుంచే పిల్లలకు నైతికవిలువలను పాటించటం నేర్పించాలి. మంచి పౌరులుగా తయారుచేయాలి. 

 

 ఆధునికత పేరుతో పర్యావరణాన్ని  పాడు చేకూడదు.

 ఎక్కడపడితే అక్కడ చెత్త వేయటం, అన్ని ప్రదేశాలను మురికిచేయటం..వంటివి లేకుండా బాధ్యతగా ఉండాలి.

 ***********

భారతదేశంలో చాలామంది ప్రజలకు బస్సులు, రైళ్లు ఎక్కేటప్పుడూ, దేవాలయాలకు వెళ్లినప్పుడు, సినిమాలకు వెళ్ళినప్పుడు..ఇలా చాలాచోట్ల   నెట్టుకుంటూ  వెళ్లటం అలవాటయింది. చక్కగా ఒకరితర్వాత ఒకరు క్యూలో వెళ్తే మంచిది.

 

బస్సులు, రైళ్లు ఎక్కేటప్పుడూ....లోపలి వాళ్లు క్రిందకు దిగకముందే బయట ఉన్నవాళ్లు లోపలికి ఎక్కడానికి ప్రయత్నిస్తారు. ప్రయాణీకులు నెట్టుకోకుండా ఉండాలంటే, ప్రభుత్వాలు సరిపడినంత బస్సులు, రైళ్ళు వేయాలేమో... 

 

అయితే, కొన్ని బస్సులకు ఎక్కువమంది ప్రయాణీకులు ఉండరు. ప్రయాణీకులు లేక నష్టాలు వస్తున్నాయంటారు. కొన్ని బస్సులు కిక్కిరిసి ఉంటాయి. అలాంటప్పుడు ప్రయాణీకులు ప్రైవేట్ బస్సులను ఎక్కుతారు .రద్దీ ఎక్కువున్న రూట్లలో ఎక్కువ బస్సులు నడపాలి.

****************

 చాలామంది అధికారులు తమ పనిని తాము సక్రమంగా చేయటం లేదు. సమాజంలో అవినీతి, లంచగొండితనం, సోమరితనం, కుల, మత, ప్రాంతీయ..ద్వేషాలు ఎక్కువయ్యాయి.

 

 రాజకీయులను గమనిస్తే, అధికారం లోకి ఎలా రావాలా? అని కొందరు, అధికారం లోకి వచ్చిన తరువాత ప్రభుత్వం పడిపోకుండా ఎలా కాపాడుకోవాలో ? అని కొందరు, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలా? అని కొందరు,...

 

 ఎన్నికలు జరిగి అధికారంలోకి వచ్చి, వెంటనే  తరువాత జరిగే ఎన్నికల్లో ఎలా గెలవాలో? అనే ఆలోచనలతో కొందరు..ఇలా ఎవరికి వారు  పొద్దుపుచ్చటంతోనే కాలం గడిచిపోతోంది. ఇక ప్రజల కొరకు ఏమైనా చేయడానికి ఎవరికీ సమయం సరిపోవటం లేదు మరి.

  ***********

ఈ రోజుల్లో చాలామంది మనుషుల్లో  పాపభీతి తగ్గింది.

 కుటుంబ వ్యవస్థ  సరిగ్గా లేదు.   చాలామంది   స్త్రీలు, పురుషులు బాధ్యతలు లేకుండా స్వేచ్చగా జీవించడానికి ఇష్టపడుతున్నారు.

 

సెల్ఫోన్లు వచ్చి,  సోషల్మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చాక మంచితో పాటు చాలా చెడు జరుగుతోంది. 

  కొన్ని సినిమాలు, సీరియల్స్ వల్ల సమాజానికి చాలా హాని జరుగుతోంది.
 

ద్యం, మత్తు పదార్ధాలు,  అసభ్యకరమైన దృశ్యాలకు, రెచ్చగొట్టే వార్తలకు చాలామంది ఆకర్షితులవుతున్నారు.  వీటి వల్ల ఎన్నో నేరాలుఘోరాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలి.

***********

ఈ రోజుల్లో చాలామంది మాంసాహారాన్ని తినడం ఎక్కువయ్యింది.  మనుషులకు చిన్న దెబ్బ తగిలినా, కష్టం వచ్చినా..తట్టుకోలేరు.

 మరి పశుపక్ష్యాదులవి ప్రాణాలు కావా? మనుషులు ఇతర జీవులను హింసించినప్పుడు, వాటికీ నొప్పి, బాధ, భయం..ఉంటాయి కదా.

 

కొందరు మాంసాహారాన్ని తినకపోయినా , ఇతరజీవులకు హాని కలిగే విధంగా ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగా కానీ ప్రవర్తిస్తారు.

 చాలామంది నిర్దాక్షిణ్యంగా పశుపక్ష్యాదులను చంపితింటారు. అయితే, తమకు ఏదైనా అనారోగ్యం వస్తే మాత్రం రక్షించమని దైవాన్ని కోరుకుంటారు. 

 

తాము ఇతరజీవులకు హాని చేస్తూ,   తాము మాత్రం ...నొప్పి, బాధ, భయం..లేకుండా జీవించాలని  ఆశపడటాన్ని ఏమనాలి?

పశుపక్ష్యాదులు  మూగజీవులు, బలహీనమైనవి కాబట్టి , మనుషులకు ఎదురుతిరగలేవు....అలా చనిపోయిన జీవుల ఉసురు తగిలి కూడా ప్రపంచంలో కష్టాలు వచ్చే పరిస్థితి ఉంటుంది.

****************

 మనశ్శాంతి కొరకు దైవపూజ చేసుకుందామంటే.. కొందరు,  ప్రతిదానికి అలా చేయకూడదు..ఇలానే చేయాలంటూ.. .లేదంటే అష్టకష్టాలు వస్తాయంటూ భయం కలిగేలా చెప్పేస్తుంటారు. ఇవన్నీ విని జనాలు అయోమయం అయిపోతున్నారు.

దేనికైనా నియమాలు తప్పకుండా ఉండాలి. అయితే, అవి అతిగా ఉంటే కష్టం. 


 ఇప్పటి సమాజంలో మనకు ఏం చేయాలన్నా అన్నీ సమస్యలు, సందేహాలు ఎక్కువైపోయాయి.

 అయితే,  కొందరు సమాజక్షేమం కొరకు ఎన్నో విషయాలను చక్కగా తెలియజేస్తారు.

*************

ప్రపంచంలో ప్రజలు కొందరు నూరేళ్ళు ఆరోగ్యంగా చక్కగా జీవిస్తున్నారట..వారిని పరిశీలిస్తే ..వాళ్లు రోజులో చాలా భాగం ఆరుబయట పనిచేసుకుంటారట. వారు కల్తీ లేని స్వచ్చమైన నీటిని.. ఆహారాన్ని తీసుకుంటారు కావచ్చు.

 
వారు..డబ్బు, సంపద, అధికారం కొరకు ఆరాటం లేకుండా జీవిస్తారు కావచ్చు... చక్కగా సులభంగా..హాయిగా దైవాన్ని ప్రార్ధించుకుంటారు కావచ్చు....పంతాలు, పట్టింపులు, కుల, మత, ప్రాంతీయ గొడవలు లేకుండా హాయిగా, సహజంగా జీవిస్తారు కావచ్చు....

 అందరూ నా మాటే వినాలని పట్టుదలలు, అధికారం కావాలని, బోలెడు డబ్బు సంపాదించాలని, బోలెడు వస్తువులు కొనాలని, కెరీర్లో ఎక్కడికో వెళ్ళిపోవాలని..  వారు తాపత్రయపడరేమో?

************

ప్రాచీన సనాతన భారతదేశంలో నైతికవిలువలతో కూడిన చక్కటి జీవనవిధానముండేది. చాలామంది వంద సంవత్సరాల పైన ఆరోగ్యంగా, చక్కగా జీవించేవారు.  ఈ మధ్య కాలంలో కూడా యోగులు కొందరు, కొన్ని వందల ఏళ్లు జీవించిన ఆధారాలున్నాయి.

***********

 మనం చక్కగా జీవించడానికి దైవం ఎన్నో సృష్టించి ఇచ్చారు. ఎన్నో మొక్కలు, కాయలు, పండ్లు, వరి, గోధుమ....వంటివి ఎన్నో సృష్టించారు. ....

ఎన్నో పువ్వులు, ప్రకృతి సుందర దృశ్యాలను కూడా సృష్టించారు. వీటన్నింటితో హాయిగా జీవించటం చేతకాక చాలామంది కష్టాలు పడుతున్నారు.

 **************

 లాస్ ఏంజలెస్ లో కార్చిచ్చు మండుతోంది. అంత పెద్ద దేశమైనా కూడా కార్చిచ్చు రగలకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవటం, వెంటనే ఆర్పటం చేయలేకపోతోంది..టెక్నాలజీతో ఏమైనా చేయొచ్చని కొందరు మాట్లాడతారు కానీ, టెక్నాలజీతో కొంతవరకే చేయగలం.... ప్రకృతి ముందు మనుషులెంత.. 

  *****************

చాలామంది డబ్బు, అధికారం..వంటివాటి కొరకు తాపత్రయపడుతూ సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు.

 లోకంలో సంపదంతా కొందరు తమవద్దే ఉండాలని తాపత్రయపడుతుంటారు. ఒక్క కుటుంబమే వందలకోట్లు ఏం చేసుకుంటారో? సమాజంలో ఉన్న సంపద ..అందరి వద్ద కూడా ఉంటే..లోకంలో పేదరికం ఉండదు కదా..

ప్రపంచవ్యాప్తంగా  ఎన్నో గొడవలు జరుగుతున్నాయి.

**********

 చాలామంది  మనుషులు చేస్తున్న పాపాలు చూసి దైవానికి విసుగు కలిగి, ఎవరికర్మ వారిదని ఊరుకుని ఉంటున్నారేమో?

  అందరూ జాగ్రత్తగా మనస్సును అదుపులో ఉంచుకుంటూ జీవించడానికి ప్రయత్నించాలి.

 కొందరు మేము ఏ పాపాలు చేయలేదంటారు. కొందరికి తాము చేసే తప్పులు తప్పులుగా అనిపించవు. 

**********

 అయితే,  ప్రపంచంలో ఎంతో మంచిచేసేవాళ్లు కూడా ఎందరో ఉన్నారు. చెడ్డగా ప్రవర్తించినా కూడా తప్పు తెలుసుకుని మంచిగా మారుతున్నవారూ ఉన్నారు.  అందరూ మంచిగా ఉంటారని ఆశిద్దాము.

 ***********

 అందరూ నీతిగా జీవిస్తే ప్రపంచంలో ఇన్ని నేరాలు..ఘోరాలు వు. 

 దైవాన్ని నమ్మి భక్తితో ఉండేవారు ఎవరైనా మంచిగా జీవించాలి.  దైవభక్తి కలిగి ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నించాలి...అప్పుడే దైవకృపను పొందగలరు.

 లోకం అంతా ఎప్పుడూ శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను.


కొన్ని విషయములు..

 

 పండుగల సమయాల్లో దేవాలయాలకు భక్తులు ఎక్కువగా వస్తుంటారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి జనం బాగా వెళ్తారు.

 వైకుంఠ ఏకాదశి టికెట్ల కొరకు రద్దీ ఎక్కువై జరిగిన తోపుడులో కొందరు మృతిచెందారని, మరికొందరికి గాయాలయినట్లుగా వార్తల ద్వారా తెలుస్తోంది. 

 ఇలా జరగటానికి అనేకకారణాలుంటాయి. ఏం జరిగిందో అంతా దైవానికే తెలుస్తుంది.

జనం  బాగా ఎక్కువ వస్తే ఏం చేయాలో దేవాలయాలను నిర్వహించేవారు  అనేక   జాగ్రత్తలు తీసుకోవాలి.    బాగా ఎక్కువమంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలి. 

 

  సిబ్బందిని ఎక్కువగా నియమించితే ఎక్కువమందికి ఉద్యోగాలు కూడా వస్తాయి. సిబ్బంది  కూడా చక్కగా పనిచేయాలి. ..

ప్రజలు అందరూ కూడా జాగ్రత్తగా  ప్రవర్తించాలి.

 నిర్వాహకులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి...వీఐపి..దర్శనాలంటూ సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టటం సరైనది కాదు...అవి  తగ్గించితే చాలామందికి ఇబ్బందులు తగ్గుతాయి.

 

 దైవం వద్ద వీ ఐ పీ.. అని ఎవరూ ఉండరు...అయితే, సెలెబ్రిటీలు అనేవారు వస్తే  కొందరు జనాలు ఒకరినొకరు తోసుకుంటూ.. సెలెబ్రిటీ వెంటపడే ప్రమాదం లేకపోలేదు. సెలెబ్రిటీలు మనుషులే. వారికీ దైవదర్శనం చేసుకోవాలనిపిస్తుంది కదా..

 

  అందువల్ల,  వీ ఐ పీ దర్శనాలు  వారంలో   ఒక గంట చొప్పున , ముఖ్యమైన రోజులలో కొంత సమయం వారికి కేటాయించవచ్చు. లేదంటే, ఎలా కేటాయిస్తే బాగుంటుందో ఆలోచించి చేయాలి.

 

వీ ఐ పీలు.. ఇతర భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, దైవదర్శనం కొరకు తరచుగా కాకుండా, కొన్నిసార్లు మాత్రమే వస్తే బాగుంటుంది..వీఐపీలు తమతోపాటు బోలెడు మందిని తీసుకువస్తే, వాళ్ళను కూడా వీఐపీ సౌకర్యాలతో పంపకూడదు.

************

మేము ఈ మధ్యన పొరుగురాష్ట్రంలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రానికి వెళ్లినప్పుడు రద్దీ బాగా ఉంది. ఆ రోజున ముందుగా అనుకుని మేము వెళ్ళలేదు. కొన్ని కారణాలవల్ల అనుకోకుండా అప్పటికప్పుడు వెళ్ళాము. చాలా మందితో కిక్కిరిసి ఉంది. క్యూలలో తిరుగుతూ దైవదర్శనానికి చాలా సమయం పట్టింది.



 కొందరు ఓపికతో క్యూలలో నడుస్తున్నారు. కొందరు జనాలు గోలగా ఒక క్యూనుంచి ఇంకో క్యూలోకి దూకేసారు. అదంతా చాలా గాభరా అనిపించింది.అలాంటప్పుడు ఏమైనా తొక్కిసలాట జరిగితే ఏమవుతుందోనని భయం కలిగింది.

***********

ఎక్కువమంది జనం వచ్చినప్పుడు సహజంగానే ఎక్కువసమయం వేచిఉండవలసి వస్తుంది. అలా వేచి ఉండలేనప్పుడు రద్దీ సమయాల్లో రాకుండా ఉంటేనే మంచిది. ముఖ్యంగా చిన్నపిల్లలను తీసుకుని విపరీతమైన రద్దీ సమయాల్లో అసలు వెళ్లకూడదు.


క్యూలలో వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. క్యూలలో తోపుళ్ళు జరిగి ఎవరికైనా విషాదం జరిగితే వారు, వారి కుటుంబసభ్యులే కదా బాధలు అనుభవించాలి.


బాగా ఎక్కువసేపు క్యూలో ఉండలేక అసహనం, నీరసం కలుగుతాయి. ఇలాంటప్పుడు కూడా ప్రజలలో అసహనం పెరుగుతుంది.  

 
 కొందరు వాళ్లకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. ఇలాంటి కొందరివల్ల చాలామందికి కష్టాలు కలుగుతాయి.
..
................


తిరుమలలో ఇంతకుముందు కూడా రద్దీ ఉండేది. క్యూలలో కొందరు జనం తోసుకుంటారు. గేట్లు తెరవగానే ఒకేసారి గోలగా పక్కవాళ్ళను నెట్టేస్తూ వెళ్లేవారు ఉంటారు.


కొన్నిచోట్ల అటుఇటూ జనంతో ఆ క్యూలైన్ల మధ్య ఊపిరి ఆడనట్లు ఉంటుంది. బయటకు వెళ్ళాలన్నా పక్కన 
మెష్ లు పైవరకూ ఉంటాయి. వాటికి తాళాలు వేసి ఉంటాయి. తాళాలు తీయడానికి అక్కడ ఎవరైనా ఉన్నట్లు అనిపించలేదు. అలాంటప్పుడు ఏమైనా తొక్కిసలాట జరిగితే ఎలా..అని భయమేస్తుంది.

 

అయితే, క్యూలలో ఎంత రద్దీగా ఉన్నా కూడా,  దైవం దయ వల్ల తిరుమలలో ఇప్పటివరకూ ఎలాంటి విషాదం జరగలేదు.

***************

 తిరుమల భక్తులు వేచి ఉండే రూములలో ఒక్కో రూములో సగానికి బారికేడ్లు వేసి, భక్తులను కూర్చోబెట్టి తలుపులు తెరిచినప్పుడు అందరూ ఒకేసారే  రాకుండా, రూములో వారిని ఒక వరుసలో  రమ్మని..భక్తులను బయటకు పంపేటప్పుడు రెండు లైన్ల లో పంపుతూ..ఆ రెండులైన్లలో మాత్రమే భక్తులు ఉన్న కంపార్ట్మెంట్ గదుల నుండి...మూలవిరాట్టు వరకు వెళ్ళి దర్శనం చేయిస్తే బాగుంటుందనిపిస్తుంది.


 మూలవిరాట్టు వద్దకు వెళ్ళేముందు కొంతదూరంలో అన్ని క్యూలైన్లను కలిపేస్తే..  జనాలు నెట్టుకుంటూ దైవదర్శనం సరిగ్గా చేయలేరు. 

 

అలా కాకుండా, మొదటినుంచి.. మూలవిరాట్టు దర్శనం వరకు పక్కపక్కన ఉండే రెండు క్యూలైన్లలో మాత్రమే భక్తులు బయటవరకూ  వెళ్ళేలా చేస్తే బాగుంటుంది. 

ఒక్కో క్యూలైన్లో కూడా ఒకరితరువాత ఒకరు నడిచేలా చూడాలి.


 
భక్తులు ఒకరినొకరు నెట్టుకోకుండా క్యూలైన్ల వద్ద అక్కడక్కడా సెక్యూరిటీ సిబ్బందిని ఎక్కువమందిని నియమించాలి. 

గ్రిల్స్ కు తాళాలు వేసినా కూడా, ఆ తాళాలు అక్కడ ఉండే సెక్యూరిటి వద్ద ఉంచితే ఎప్పుడైనా అవసరం అనిపించినప్పుడు వెంటనే తాళాలు తీసేలా ఉండాలి... అక్కడి సిబ్బంది క్యూలో ఉన్నవారి బాగోగులు చూడాలి.

 

తిరుమలలో భక్తులకు ఎప్పటినుంచో ఎన్నో సౌకర్యాలను ఇస్తున్నారు. ఉదా..కంపార్ట్మెంట్లలోను, బయట వేచి ఉండే భక్తులకు ఆహారాన్ని, నీటిని అందిస్తున్నారు.

 

క్యూలైన్లో ఉన్న భక్తులకు పెద్దవారికి, చిన్నపిల్లలకు అర్జంటుగా బాత్రూం కు వెళ్లాలంటే గ్రిల్స్ తాళాలు తీసి, బయటకు వెళ్ళేవారికి ఒక టోకెన్ ఇచ్చి, మరల క్యూలోకి రావటానికి ఆ టోకెన్ చూపించితే లోపలికి పంపవచ్చు. కొన్ని క్యూలైన్ల పక్కనే టాయ్లెట్స్ ఉన్నప్పుడు వాటిని ఉపయోగించవచ్చు.

  *************

 క్యూలలో దైవదర్శనం విషయంలో బోలెడు మంది భక్తులకు దైవదర్శనం చేయించాలంటే ఎన్నో  విషయాలుంటాయి. ..నాకు తెలిసినంతలో, దేవాలయాలలో దైవానికి రోజూ నిర్వహించే పూజలు ఉంటాయి..అందువల్ల భక్తుల దర్శనానికి కొన్నిసార్లు బ్రేక్ ఇస్తారు....

 

 ఇంకా, వీ ఐ పీ లు దర్శనాలంటూ మరికొంత సమయం బ్రేక్ ఉంటుంది. ఇక, ఇతర భక్తులకు దర్శనం కొరకు మిగిలే సమయం తక్కువగా ఉంటుంది.. ఇలాంటప్పుడు వేలాదిగా వచ్చే భక్తులు దైవాన్ని దర్శించుకోవాలంటే చాలా సమయం వేచి ఉండవలసి వస్తుంది.

********

 దైవదర్శనం ఎక్కువసేపు చేయాలని, చాలామంది మూలవిరాట్టు ముందు ఎక్కువసేపు ఉండాలనుకుంటారు. అయితే, మన వెనుక ఎందరో వేచిఉన్నారని గుర్తుంచుకుని ప్రవర్తించాలి. 

కొన్నిసార్లు కొందరు  సిబ్బంది ప్రజలను లాగేయటం కాకుండా, నిదానంగా పక్కకు జరపాలి.

  *********

ఎక్కడైనా ప్రమాదాలు జరగటానికి అనేక కారణాలుంటాయి. ఉదా..సరైన ప్రణాళిక లేక పోవటం వల్లగానీ, కొన్నిసార్లు వేసిన అంచనాలు తప్పటం వల్లకానీ, కొందరికి క్రమశిక్షణ..బాధ్యత సరిగ్గా లేకపోవటం వల్లకానీ, సమన్వయలోపం వల్ల కానీ, ఊహించని విధంగా అప్పటికప్పుడు సంఘటనలు జరగటం వల్లకానీ, ఎవరైనా కుట్ర చేయటం వల్లకానీ, ఇంకా మనకు తెలియని అనేక కారణాల వల్లకానీ..ప్రమాదాలు జరగవచ్చు. సరిగ్గా ఏం జరిగిందో దైవానికే  తెలుస్తుంది.

**************

 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో ఏళ్ళు గడిచినా కూడా, ఇంకా ఎన్నో సమస్యలు అలానే ఉన్నాయి.. సమాజం సరిగ్గా ఉండాలంటే.. ప్రజలు, అధికారులు, ప్రభుత్వాలు..అందరూ ఎవరి పనిని వారు సక్రమంగా నిర్వహించాలి.

 **********
వ్రాసిన వాటిలో ఏమైనా తప్పులుంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.