ఈ రోజుల్లో చదువులు, ఉద్యోగాల వల్ల వత్తిడి పెరిగి ఆడవాళ్ళకు నెలసరి సరిగ్గా రావటం లేదు.
చదువుల వత్తిడి వల్ల చాలామంది అమ్మాయిలకు మూడునెలల వరకు కూడా నెలసరి రాకుండా ఉంటున్నాయి.
ఈ నెలసరి అంటుముట్టు గొడవల వల్ల కొన్నిసార్లు ...పండుగలు, పూజలు, శుభకార్యాలను కూడా ప్రశాంతంగా చేసుకోలేని పరిస్థితి ఉంటుంది.
నెలసరి వస్తుందేమో? అని భయపడుతూ ఉండవలసి ఉంటుంది.
ముందురోజు పూజకు సామాగ్రి కొనుక్కున్నా, పూజ చేస్తున్నా, ఫంక్షన్ జరుగుతున్నా కూడా సడన్ గా తమకుకానీ, తమ కుటుంబసభ్యులకు కానీ నెలసరి వస్తే ఏం చేయాలి? పూజ పూర్తి అవకపోతే మళ్ళీ చేయాలా? ఇలా ఎన్నో సందేహాలతో ప్రశాంతతే ఉండదు.
ఈ విషయాల వల్ల కుటుంబసభ్యుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి.
..............................
ఈ రోజుల్లో చాలారకాల పూజలను చాలామంది చేస్తున్నారు కదా..
పూజలప్పుడు కొందరు నెలసరి వాయిదా వేయటానికి మందులు వేసుకొంటున్నారు. ఇందువల్ల తరువాత చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఉదా..కొందరు కొన్ని వారాలు కొన్ని పూజలు చేస్తామనుకుంటారు. మధ్యలో నెలసరి రాకూడదని మందులు వేసుకుంటారు.
అలా అక్కరలేదు. నెలసరి వచ్చినా కూడా... తరువాత వారం ఆ పూజను కంటిన్యూ చేయవచ్చు.
కొన్ని పూజలు మాత్రం తిరిగి మొదటి నుంచి చెయ్యాలట...అంత ఓపిక లేనివాళ్లు పూజలు చేసే ముందే ఆలోచించుకుని మొదలుపెట్టడం మంచిది.
...........................
సంతానం కలిగే వయస్సులో ఉన్న స్త్రీలు నెలసరి వాయిదా టాబ్లెట్స్ బాగా వాడితే పుట్టే పిల్లలకు కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉండవచ్చు. అందువల్ల, జాగ్రత్తగా ఉండాలి.
నెలసరి అంటుముట్టు భయంతో నెలసరి వాయిదా..మందులు వేసుకుని, ఆరోగ్యం పాడుచేసుకోవద్దు...జాగ్రత్తలు తీసుకోవాలి.
అనారోగ్యం వస్తే కష్టం....ఆరోగ్యం ఉంటేనే ఏమైనా చేయగలరు.
...........................................
వివాహం వంటి శుభకార్యాల్లో లగ్నపత్రిక, వివాహం..ఇలా ఎన్నో సందర్భాలుంటాయి.
అన్ని
సందర్భాల్లో ఇంట్లో వారికి, బంధువులకు నెలసరి రాకుండా ఉండాలంటే కుదరదు.
జన్మకొకసారి చేసుకునే వివాహంలో నెలసరి వల్ల పాల్గొనకుండా ఉండాలంటే ఇంట్లో కుటుంబసభ్యులకు ఎంతో బాధగా ఉంటుంది.
వివాహం అంటే వధువుకు నెలసరి ఇబ్బంది లేకుండా ముహూర్తం నిర్ణయిస్తారు.
వధువు విషయంలో కూడా వివాహం సమయంలో అన్ని వేడుకలకు నెలసరి రాకుండా ఉండాలంటే కుదరకపోవచ్చు.
ఇలాంటి సందర్భాలలో టెన్షన్ వల్ల నెలసరి ముందే కూడా వచ్చే అవకాశముంది....
అలాంటప్పుడు ఏం చేయగలం...వేడుకలను పెంచుకుని నెలసరి వాయిదా మందులు మింగటం కన్నా, కొన్ని వేడుకలను తగ్గించుకోవచ్చు.
వివాహం సందర్భంగా కొన్ని వేడుకలు ఉంటాయి...అవన్నీ ఒకే రోజు ఉండవు.
అయిదుసార్లు వేడుకలకు బదులు రెండు లేక మూడు సార్లు సరిపెట్టుకోవచ్చు.లేదా కొన్ని రోజులు తేడాతో ఫంక్షన్స్ జరుపుకోవచ్చు.
నెలసరిలో ఉన్నప్పుడు దేవాలయాలకు వెళ్ళటం, పూజలు చేయటం దోషం కాబట్టి, అందుకు తగినట్లు మొదటే జాగ్రత్తగా తేదీలను నిర్ణయించుకోవాలి.
................................
నాకు తెలిసిన ఒకమ్మాయి వివాహం సందర్భంగా నెలసరి ఆపటానికి ఒక వారం ముందు నుండి మందులు వేసుకుంటే, ఆ అమ్మాయికి ముఖానికి, పెదవులకు కొంచెం వాపు కూడా వచ్చింది....
ఏమీ కాదంటూ అలాగే మాత్రలు వేయించారు పెద్దవాళ్ళు.
అలా మందులు వేసుకుని ....వివాహం రోజుకు కొద్దిగా గోధుమరంగు డిశ్చార్జ్ కనిపిస్తే నెలసరి అవునా? కాదో? అమ్మాయికి కూడా అర్ధం కాదు.
కొందరికి మందులు వేసుకున్నా కూడా ఆగినట్లు ఉండదు.
.............................
ప్రాచీనులు చెప్పినట్లు ఖచ్చితంగా పాటించాలంటే.... నెలసరిలో ఆడవాళ్లు చదువులు, ఉద్యోగాల కొరకు కూడా ఖచ్చితంగా బయటకు వెళ్ళకూడదు.
మరి చదువులు, ఉద్యోగాలని నెలసరి రోజుల్లో బయటకు వెళ్ళి కలిపేస్తే కూడా పాపమే కదా..
కాలానుగుణంగా మారక తప్పదంటూ స్త్రీలు చదువులు, ఉద్యోగాలకు నెలసరి రోజుల్లో కూడా వెళ్తున్నారు. ఈ రోజుల్లో అలా ఇంట్లో కూర్చుంటే ఎలా కుదురుతుంది ..బయటకు వెళ్తే దోషంకాదు..అంటారు.
( ఇలా..అవసరాన్ని బట్టి మాట్లాడటం, అవసరాలకు తగ్గట్లు మార్చుకోవటం అంటారు.)
బయట దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు..పూజలు చేసుకున్నవాళ్ళు ఉంటారు. నెలసరిలో ఉన్నవాళ్ళు బయటకెళ్ళి తిరిగితే దోషం కాదా? మనకు అవసరం కాబట్టి బయటకు వెళ్తే దోషం ఉండదా?
..............................
నెలసరిలో ఉన్నప్పుడు దైవస్మరణ.. చక్కగా చేసుకోవచ్చు.
.................................
oka link...చేతనైతే ఈ సమస్యలను.........
oka link.. ఈ ఆచారం ఎక్కడవరకు వెళ్ళిందంటే..
........................
mari konni vishayaalu....
నాకు కొన్ని సందేహాలు కలిగాయి.
నెలసరిలో ఉన్నప్పుడు దైవస్మరణ.. దైవనామస్మరణ.. చేస్తే దోషం కాదు. కాని, మంత్రాలు.. స్తోత్రాలు.. చేయకూడదంటున్నారు కొందరు.
కార్తికమాసంలో కొన్ని దేవాలయాల్లో ఎవరైనా నెలకు కొంత డబ్బు కడితే, నెలంతా అభిషేకాలు..పూజలు చేస్తున్నారు. ...
అలాంటప్పుడు ఆ కుటుంబంలో స్త్రీలకు నెలసరి వస్తే అప్పుడు వాళ్ళ పేరు కూడా పూజలో చదువుతారు కదా....అప్పుడు వాళ్లు పూజ చేసినట్లే కదా..
మరి అలాంటప్పుడు దోషం ఉంటుందా? ఉండదా? అని సందేహం అనిపించింది.
అర్చనలు చేయించుకునేటప్పుడు కూడా వేరే ఊళ్లలో ఉండే కుటుంబసభ్యుల పేర్లు కూడా చెప్పి అర్చన చేయిస్తారు.
పూజలో పేర్లు ఉన్న వాళ్ళు నెలసరిలో ఉంటే అప్పుడేమిటి?
ఇలా పూజలు చేయించుకుంటే చేయించుకున్నవాళ్లకు, చేయించిన వాళ్లకు, చేసిన వారికి...కూడా దోషం వస్తుందా? అలా ఏమీ కాదా?
పూజకు డబ్బు కట్టిన తరువాత, ఎవరి ఇంట్లో అయినా అకస్మాత్తుగా మైల పాటించే పరిస్థితి వస్తే, ఆ సంగతిని వాళ్ళు చెప్పకపోవచ్చు.
అంటుముట్టు..మైల
ఉన్నాకూడా, దేవాలయంలో లేకుండా దూరంగా ఉంటే, వారి పేరుతో ఏ పూజ అయినా ( చండీ హోమము, రుద్రాభిషేకము, సత్యనారాయణస్వామి వారి వ్రతములు..ఇలా ఏ పూజ అయినా ..) చేయించుకోవచ్చా? అలా చేస్తే ఏమైనా దోషం ఉంటుందా? ఉండదా? తెలియటం లేదు.
ఇన్ని సందేహాలు ఎందుకు అంటే, నెలసరి దోషం వల్ల చాలా కష్టాలు వస్తాయంటున్నారు అని.
.............................
కుటుంబసభ్యులందరూ పూజ చేస్తున్నట్లుగా వారి పేర్లు చెప్పటం కాకుండా, అంతా బాగుండాలని....కుటుంబంలో అందరూ బాగుండాలని భావిస్తూ పూజ చేయిస్తున్నట్లుగా (పూజారి గారితో) పూజ చేయించవచ్చేమో? అనిపించింది.
అంటే , వాళ్లు పూజ చేస్తున్నట్లుగా భావించటం కాకుండా, పూజారి గారి చేత పూజ చేయిస్తున్నట్లు అయితే అంటుముట్టు దోషాలు ఉండవేమో?..అని నాకు అనిపించింది. .
అయితే, అంటుముట్టు ఉన్నవారి గోత్రనామాలు చదివి పూజలు చేయవచ్చా? లేదా? అన్నది నాకు తెలియదు.
..........................
నేను గమనించిన విషయం ఏమిటంటే, కొన్నిసార్లు పూజలలో సుమారు అర్ధగంటకు పైగా ఈ గోత్రనామాలు ..కుటుంబసభ్యుల పేర్లను చదవటంతోనే సరిపోతుంది.
మేము చెన్నైలో ఉన్నప్పుడు, అక్కడ దేవాలయంలో ..అర్చన కొరకు గోత్రనామాలు చెప్పకపోయినా కూడా, స్వామిపేరుతో.. అని చెప్పి అర్చన చేసేవారు.
పేర్లు చెప్పకుండా ఈ పద్ధతి సులభంగా అనిపించింది.
....................
గోత్రనామాలు చెప్పినా చెప్పకపోయినా, దైవప్రీతి కొరకు.. జీవప్రీతి కొరకు ..కష్టాలు తొలగటానికి ..ఇలా దైవానికి ఎవరికి వారు మనస్సులో కూడా చెప్పుకోవచ్చు.
మన గురించి, మన ఆలోచనల గురించి..అన్నీ దైవానికి తెలుస్తాయి.
No comments:
Post a Comment