koodali

Monday, November 24, 2025

కొన్ని విషయములు..

 

 link..

ఓం, దైవానికి అనేక వందనములు...

 link..

  • ఓం..
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. ....4
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. .3
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్....2
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. 1

  • కొన్ని సందేహాలు..కొన్ని ఆలోచనలు..

     

     నాకు కొన్ని సందేహాలు కలిగాయి. 

    నెలసరిలో ఉన్నప్పుడు దైవస్మరణ.. దైవనామస్మరణ.. చేస్తే దోషం కాదు కాని, మంత్రాలు.. స్తోత్రాలు.. చేయకూడదంటున్నారు కొందరు.

      కార్తికమాసంలో కొన్ని దేవాలయాల్లో ఎవరైనా నెలకు కొంత డబ్బు కడితే, నెలంతా అభిషేకాలు..పూజలు చేస్తున్నారు. ...

    అలాంటప్పుడు ఆ కుటుంబంలో స్త్రీలకు నెలసరి వస్తే అప్పుడు వాళ్ళ పేరు కూడా పూజలో చదువుతారు కదా....అప్పుడు వాళ్లు పూజ చేసినట్లే కదా..

    మరి అలాంటప్పుడు దోషం ఉంటుందా? ఉండదా? అని సందేహం అనిపించింది. 

    అర్చనలు చేయించుకునేటప్పుడు కూడా వేరే ఊళ్లలో ఉండే కుటుంబసభ్యుల పేర్లు కూడా చెప్పి అర్చన చేయిస్తారు. 

    పూజలో పేర్లు ఉన్న వాళ్ళు నెలసరిలో ఉంటే అప్పుడేమిటి?

     ఇలా పూజలు చేయించుకుంటే చేయించుకున్నవాళ్లకు, చేయించిన వాళ్లకు, చేసిన వారికి...కూడా దోషం వస్తుందా? అలా ఏమీ కాదా? 

    పూజకు డబ్బు కట్టిన తరువాత, ఎవరి ఇంట్లో అయినా అకస్మాత్తుగా మైల పాటించే పరిస్థితి వస్తే,  ఆ సంగతి
    ని వాళ్ళు   చెప్పకపోవచ్చు.

    అంటుముట్టు..మైల ఉన్నాకూడా, దేవాలయంలో లేకుండా దూరంగా ఉంటే, వారి పేరుతో ఏ పూజ అయినా  చేయించుకోవచ్చా? అలా చేస్తే ఏమైనా దోషం ఉంటుందా? ఉండదా? తెలియటం లేదు.

     ఇన్ని  సందేహాలు ఎందుకు అంటే, నెలసరి దోషం వల్ల చాలా కష్టాలు వస్తాయంటున్నారు అని.

    స్త్రీల అంటుముట్టు గురించి పబ్లిక్ గా మాట్లాడటం ఏమిటీ అంటున్నారు కొందరు.

     మరి స్త్రీల నెలసరి గురించి అలా చేయకూడదు..ఇలా చేయకూడదు..చేస్తే కష్టాలు వస్తాయని పబ్లిక్ గా కొందరు చెబుతున్నప్పుడు, ఆ సందేహాల గురించి పబ్లిక్ గా మాట్లాడితే తప్పేమిటి?

    ఇంకా, చాలా విషయాల గురించి కూడా.. ఇలా చేయకూడదు..అలా చేయకూడదు..చేస్తే కష్టాలు వచ్చి మీద పడిపోతాయని చెబుతున్నారు. ఇవన్నీ విని, ఏం చేస్తే ఏం తప్పో? అనే పరిస్థితితో భయం, అయోమయం కలిగి, అనేక సందేహాలతో సతమతమయ్యే పరిస్థితి ఉంటుంది.

      .............................

    లోకకల్యాణం కొరకు పూజలు చేసే సందర్భాలలో.. లోకంలో అంతా బాగుండాలని పూజ చేస్తారు. 

    ఎవరికి వారు పూజలు చేయించుకునే సందర్భాలలో.. అంటుముట్టు, మైలలో ఉన్నవారు కొన్ని రోజులు ప్రత్యేక పూజలు చేయడానికి దూరంగా ఉండాలంటారు.

    నాకు ఏమనిపిస్తోందంటే,  అర్చన, అభిషేకం వంటి సందర్భాలలో..వేరే ఊరిలో ఉన్న కుటుంబసభ్యులందరి పేర్లు చెప్పటం సంగతి ఏమోకానీ..

    అంతా బాగుండాలని, కుటుంబంలో అందరూ బాగుండాలని.. భావిస్తూ పూజ చేయిస్తున్నట్లుగా (పూజారి గారితో) పూజ చేయించవచ్చేమో? అనిపించింది. 

    (వేరే ఊరిలో ఉన్నవారి  పరిస్థితి(అంటుముట్టు..) గురించిన సంగతులు తెలియనప్పుడు, ఇలా కూడా చేయవచ్చేమో?..అనిపించింది.)

    .........................

      ఇంకొక విషయం ఏమిటంటే, కొన్నిసార్లు పూజలలో సుమారు అర్ధగంటకు పైగా  గోత్రనామాలు ..కుటుంబసభ్యుల పేర్లను చదవటంతోనే సరిపోతుంది.

     మేము చెన్నైలో ఉన్నప్పుడు,  అక్కడ దేవాలయంలో ..అర్చన కొరకు గోత్రనామాలు చెప్పకపోయినా కూడా,  స్వామిపేరుతో.. అని చెప్పి అర్చన చేసేవారు. 

    పేర్లు చెప్పకుండా ఈ పద్ధతి సులభంగా అనిపించింది.

    ....................

    గోత్రనామాలు చెప్పినా చెప్పకపోయినా,  దైవప్రీతి కొరకు.. జీవప్రీతి కొరకు ..కష్టాలు తొలగటానికి ..ఇలా దైవానికి ఎవరికి వారు మనస్సులో కూడా చెప్పుకోవచ్చు.

    మన గురించి, మన ఆలోచనల గురించి..అన్నీ దైవానికి తెలుస్తాయి.

     ............................

    వ్రాసినవాటిలో ఏమైనా తప్పులుంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

     

    Sunday, November 9, 2025

    చక్కగా దైవాన్ని ఆరాధించుకోవచ్చు. ...

     

     సోషల్మీడియాలో చెప్పేవన్నీ పాటించకపోతే కష్టాలొస్తాయేమోననే భయపడనవసరం లేదు.

     అందరూ అన్నింటినీ పాటించలేరు. కలియుగంలో దైవస్మరణ..దైవనామస్మరణతోనే తరించవచ్చని ప్రాచీనులే తెలియజేసారు.

     ఎవరి శక్తికి తగ్గట్లు వారు దైవాన్ని ఆరాధించుకోవచ్చు. 
     

    దైవానికి మన విషయాలను చెప్పుకోవచ్చు. 

    హిందూత్వంలో నిరాకారం, సాకారం..ఇలా ఇంకా ఎన్నో పద్ధతులున్నాయి. మన శక్తికి తగ్గట్లు చక్కగా హాయిగా దైవాన్ని ఆరాధించుకోవచ్చు.

     సరైన విధంగా జీవించే శక్తిని ఇమ్మని దైవాన్ని ప్రార్ధించుకోవచ్చు.

     

    ఇలాంటి గొప్ప తల్లులు అభినందనీయులు...



    చిన్నపిల్లలు వాళ్ళకువాళ్ళు చేత్తో తీసుకుని సరిగ్గా తినలేరు. చిన్నపిల్లలు పెద్దవారిలా గబగబా నమిలి తినలేరు. నిదానంగా తింటారు. అలాగని పిల్లలకు ఆహారాన్ని కుక్కి అదేపనిగా బోలెడు తినిపించకూడదు. 
     
    వాళ్ళకు ఎంతకావాలో అలాగ తల్లి దగ్గరుండి  ఓపికగా తినిపించాలి. అందుకు ఎక్కువ సమయమే పడుతుంది.

    అయితే, ఈ రోజుల్లో చాలామంది తల్లులు ఉద్యోగాల కొరకు వెళ్ళటం వల్ల పిల్లలకు చక్కగా తినిపించటానికి కూడా సమయం ఉండటం లేదు. 
     
    పిల్లలను డేకేర్ సెంటర్లలో వేస్తున్నారు. లేదంటే చిన్నప్పుడే స్కూల్లో వేస్తున్నారు. పిల్లలను త్వరగా అక్కడ దింపాలని ఉదయాన్నే వాళ్లకు హడావిడిగా ఏదో కుక్కి తినిపిస్తారు.

     ఇంట్లో ఉండే తల్లులు కూడా కొందరు ఈ విషయంలో ఓపికగా చేయటం లేదు. చిన్నపిల్లలు ఏమీ చేయలేరు కదా..
     
    కొందరు పిల్లలు ఉదా..3 సంవత్సరాల చిన్నపిల్లలు నాకు తినిపించమని పెద్దవాళ్ళను అడిగినా, నువ్వే తినాలంటూ తినిపించకుండా ఉండే పెద్దవాళ్ళను నేను చూసాను.. 
     
    పాపం చిన్నపిల్లలు తమకు తాము సరిగ్గా తినలేని వయస్సు వాళ్ళది...అలా అర్ధాకలితో ఉంటే  బాధ అనిపిస్తుంది. ఈ సమస్యలకు పరిష్కారం ఎప్పుడో?

    చాలామంది పిల్లలు తినటం విషయంలో విసిగిస్తారు. ఆ వయస్సు పిల్లలు చాలామంది అలాగే ఉంటారు. 
     
    కొందరు తల్లులు మాత్రం ఓపికగా మాటలు చెబుతూ తినిపిస్తారు. ఇలాంటి గొప్ప తల్లులు అభినందనీయులు.
     ......................................
     
    చంటిపిల్లల్ని క్రెచ్లలో వేసి పెద్దవాళ్లు ఉద్యోగం కోసం వెళ్తున్నారు. పిల్లల కొరకు డబ్బు సంపాదించటం కోసమే అలా చేస్తున్నామంటున్నారు కొందరు. 
     
    తల్లి వద్ద ఆప్యాయంగా పెరగవలసిన ....మాటలు కూడా సరిగ్గారాని చంటి పిల్లల్ని  పగలు ఎక్కడో బయట ఉంచుతున్నారు. అక్కడ వారిని మంచిగా చూస్తున్నారో ? లేదో? తెలియదు. చంటి పిల్లలు ఏమీ చెప్పలేరు. 
     
    పిల్లల్ని కొట్టిన కొన్ని సంఘటనల గురించి వార్తల ద్వారా తెలిసింది. కనీసం పిల్లలకు బాగా మాటలు వచ్చి తమ గురించి చెప్పేవరకయినా వారిని తల్లి దగ్గరుండి చూసుకోవాలి. 
     
    పిల్లలు కొంచెం పెద్దయ్యాక ఉద్యోగం రాకుంటే, సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం చేస్తూ అయినా ఉపాధి పొందవచ్చు. 
     
    పిల్లల క్షేమం ముఖ్యం కదా.
    .....................................
     
    కొందరు తల్లితండ్రి , తమ పిల్లలను సరిగ్గ చూసుకోవటానికి కూడా సమయం లేదంటూ  బిజి అంటారు. 
     
    తాము పెద్దయ్యాక  మాత్రం,  ఏమీ తోచక ఫోన్ పుచ్చుకుని అస్తమాను పిల్లల జీవితాల్లో కల్పించుకుంటూ.. అదేపనిగా వాళ్లకు సలహాలిస్తూ పిల్లల విడాకులకు కారణమవుతున్న పెద్దవాళ్ళూ ఉన్నారు.
    ............................

    ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు ఉద్యోగాలని బయటకు వెళ్లటం వల్ల సమయం సరిపోక హడావిడిగా వండుకుని తింటున్నారు. పిల్లలు చదువులని బయట ఉండటం, ఇంకా అనేక కారణాల వల్ల చాలామంది బయట ఆహారాన్ని ఎక్కువగా తింటున్నారు. బయట ఆహారం పరిస్థితి ఎలా ఉందో.. ఈ లింక్ వద్ద గమనించవచ్చు.
    ................
     ఇంట్లో ఉండే స్త్రీలు కూడా కొందరు బయట ఆహారాన్ని ఎక్కువగా తెప్పించుకుంటున్నారు.

    ఇంట్లో సరైన ఆహారం లేక బయట ఎక్కువగా తింటే, పిల్లలకు, పెద్దవాళ్లకు అనారోగ్యం వచ్చే అవకాశముంది. ఆరోగ్య సమస్యలు వచ్చాక ఎంత డబ్బున్నా కూడా కొందరికి కొన్నిసార్లు అనారోగ్యం తగ్గటం కష్టమవుతుంది. అందువల్ల, అందరూ జాగ్రత్తగా ఉంటే మంచిది.
    ............
    ఈ మధ్య కొందరు యువతులు తాము ఇంజనీరింగ్ వంటివి చదువుకుని ఉద్యోగాలు చేయకుండా ఇంటిపనులు చేయటాన్ని తక్కువగా భావిస్తూ ..తామెంతో చిన్నపనులు చేస్తున్నట్లుగా పోస్టులు పెడుతున్నారు...
     
     స్త్రీలు కుటుంబబాధ్యతలను చక్కగా  నిర్వహించటం, పిల్లల్ని చక్కగా పెంచి శారీరికంగా, మానసికంగా ఉత్తమ పౌరులుగా చేయటం చాలా గొప్ప పనులు. 
     
     తమకు తమ కుటుంబసభ్యులకు ఇంత ఆహారాన్ని చక్కగా వండుకుని తినటం, ఇంటిని చక్కదిద్దుకోవటం తక్కువ పనులనుకుంటే ఎలా?
    ..................................
     కష్టాలున్నా కూడా , కుటుంబాన్ని చక్కగా చూసుకునే స్త్రీలు చాలామందే ఉంటారు.  అలాంటి వారు ఎంతో గొప్పవారు....అభినందనీయులు...
    ..............................
       యూట్యూబ్లో కొందరు అమ్మాయిలు తాము అత్తగార్లను ఎలా కంట్రోల్ లో పెడుతున్నది చూపిస్తున్నారు. పాతకాలంలో అత్తగార్లు కోడళ్లను కంట్రోల్లో పెట్టారు కాబట్టి, ఇప్పుడు కోడళ్ళు అత్తగార్లను కంట్రోలో పెట్టి మురిసిపోతున్నారు.

     అత్తగార్లు ఒకప్పటి కోడళ్ళే అని, కోడళ్ళూ కాబోయే అత్తగార్లేనని గుర్తంచుకుంటే అందరికి మంచిది.
    ............................

     చంటిపిల్లలు తల్లి దగ్గర ఉండాలనుకుంటారు. ఆ వయస్సులో వారిని 
    డేకేర్లో వేసి, వారి కొరకు బోలెడు డబ్బు సంపాదిస్తామంటారు. పెద్దవారిని వృద్ధాప్యంలో వృధాశ్రమంలో వేస్తే బాధపడతారు కదా..పిల్లలకు కొంత మాటలు చెప్పే వయస్సు వచ్చేవరకైనా ఇంట్లో వారు చూసుకుంటే మంచిది.

     పిల్లల్ని మంచిగా చూసుకునే సంస్థలు ఉండి, వారు పిల్లల్ని బాగా చూస్తారనే నమ్మకం కలిగితే వీడియో ద్వారా ఎప్పటికప్పుడు పిల్లల్ని చూసుకునే అవకాశం ఉంటే కొంతవరకు ఫరవాలేదు. ఇవన్నీ ఉండాలంటే ఎక్కువ డబ్బు అవుతుంది. 

     
    పిల్లల పెంపకం తేలిక కాదు. అయితే, చిన్న పిల్లల ముద్దు ముచ్చట్లను  చూస్తే, ఆ కష్టం కష్టంగా అనిపించదు. పిల్లల ముద్దుముచ్చట్లను   చూసుకునే సమయం జీవితంలో మళ్లీ వస్తుందా?

    చదువులు, ఉద్యోగాల కొరకు రాత్రింబగళ్లు చదివి ఎంత కష్టమైనా చేస్తున్నారు కదా.. అవన్నీ కూడా ఎంతో కష్టమైన పనులే. కుటుంబబాధ్యతలంటేనే బొర్ అనటం బాధాకరం.
     ....................
     కొందరు తల్లులు తమ పిల్లల్ని చావబాదిన  కేసులను గురించి కూడా విన్నాము. ఇదంతా ఎంతో బాధాకరం. 
    ..............

    చిన్నతనంలో పునాది బాగుంటే జీవితంలో మంచిపౌరులుగా తయారయ్యే అవకాశం ఉంది. తల్లితండ్రి ఎన్ని మంచి విషయాలను నేర్పించినా కూడా, బయటప్రపంచం, సోషల్మీడియా..వాటి ప్రభావం చాలానే ఉంటుంది..

    అయితే, తల్లితండ్రి మరీ స్ట్రిక్టుగా చెప్పటం కాకుండా, కొంత ఫ్రెండ్లిగా పిల్లలకు విషయాలను చెప్పటం మంచిది.

    తల్లి చెప్పిన మాటలను చాలామంది పిల్లలు వింటారు. అయితే, తల్లులు మంచి విషయాలను నేర్పించాలి. పిల్లల మనస్సులో పంతాలు, పట్టుదలలు, ఆవేశకావేషాలు, పాపాలు చేసైనా డబ్బు సంపాదించాలి..అనే విధంగా చెప్పకూడదు.

    అమ్మాయిలు..అబ్బాయిలు ఒకరినొకరు గౌరవించుకోవాలని, జీవితంలో అధర్మంగా ఉండకూడదని, ఇతరులను మోసం చేసి డబ్బు సంపాదించకూడదని చెపుతూ ఉంటే దాని ప్రభావం పిల్లలపై చాలా ఉంటుంది.  వాళ్లు మంచిపౌరులుగా తయారయ్యే అవకాశం ఎంతో ఉంటుంది.

    అయితే,  సమాజంలో చెడు ప్రభావం వల్ల, ఎంత చెప్పినా కొందరు త్వరగా మాట వినేటట్లు లేరు. 
     
     ఈ రోజుల్లో తల్లితండ్రికి పిల్లలతో గడపటానికి కూడా సమయం ఉండటం లేదు. 

    సరిగ్గా తినటానికి సమయం లేక, కుటుంబసభ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి సమయం లేనప్పుడు ఎందుకొరకు అంత డబ్బు సంపాదించాలి? జీవితంలో డబ్బు ఎంతో ముఖ్యమే. అయితే, జీవితం కూడా ఎంతో ముఖ్యం.
    ................................

     కుటుంబసభ్యులకు తీరిక దొరికినా కూడా ఒకరితో ఒకరు ఏం మాట్లాడాలో తెలియక ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. కుటుంబసభ్యుల మధ్య అనేక కారణాల వల్ల సఖ్యత లేక గొడవలు పడుతున్నారు. మనుషుల్లో పంతాలు, పట్టుదలలు ఎక్కువయ్యాయి.

    కుటుంబం అంటే ఎన్నో సమస్యలుంటాయి. పెద్దవాళ్లతో అభిప్రాయ బేధాలు, భార్యాభర్త మధ్య ఇగోలు, పిల్లల సమస్యలు, డబ్బు సమస్యలు..ఎన్నో ఉంటాయి. ఇలాంటప్పుడు బయట వారితో స్నేహాలు బాగున్నట్లు అనిపిస్తాయి. 

    ఈ రోజుల్లో వ్యవస్థ అంతా మారిపోయింది కాబట్టి, ఎంతో ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి.

    ఒకే ఇంట్లో ఉంటూ  పెద్దవాళ్లతో సరిపడకుంటే , పెళ్లయిన పిల్లలు, పెద్దవాళ్లు..పక్కపక్కన ఇళ్లలో ఉండవచ్చు లేక ఒకే ఊరిలో దూరంగా వేరే ఇళ్ళలో ఉండవచ్చు. అప్పుడు సహాయం అవసరమైనప్పుడు ఒకరికొకరు అందుబాటులో ఉంటారు....ఇంకా కుదరకపోతే వేరే ఊర్లో ఉండవచ్చు.
    ...............

    చాలామంది డబ్బు సరిపోవటం లేదంటారు. 

    ఈరోజుల్లో ఒకరిని చూసి ఒకరు పోటీలుపడుతూ డబ్బు ఖర్చు చేసి అనేక వస్తువులను కొనటం ఎక్కువయ్యింది. చూసినవన్నీ కొంటూ పోతే ఇంట్లో అందరూ ఎంత డబ్బు సంపాదించినా కూడా డబ్బు సరిపోదు.

    వ్యాపారస్తులు వస్తువుల ధరలు పెంచేస్తున్నారు. ప్రజలు వస్తువులను అదేపనిగా కొనటాన్ని తగ్గిస్తే, వాళ్ళు ధరలు  కూడా తగ్గించక తప్పదు. 
     
     అదేపనిగా వస్తువుల్ని కొని పడేస్తుంటే చెత్త పెరిగి పర్యావరణసమస్యలు కూడా పెరుగుతాయి.
    ......................................

    సరైన ఆహారం, కుటుంబసభ్యుల మద్య ఆప్యాయతలకు సమయం లేనప్పుడు ఎంత డబ్బున్నా ఏం లాభం? సరైన ఆహారం, ఆప్యాయత ఉన్న కుటుంబాలలో వారు ఆరోగ్యంగా, చక్కగా జీవిస్తారు, అలాంటివారు ఉన్న సమాజమూ బాగుంటుంది.
    ....................

     ఈ రోజుల్లో 
    చాలామంది ఆదరాబాదరాగా ఉదయాన్నే పరుగులు పెడుతున్నారు. చంటిపిల్లల్ని డేకేర్లో వేయటం , పెద్దవాళ్ళు ఉద్యోగాలకు పోవటం..ఇలా ఉంటుంది.

     చిన్నతనంలోనూ టైం అయిపోతోందంటూ టెన్షనే, పెద్దయ్యాక అఫీసుల్లో టార్గెట్లతో టెన్షనే, ఇక వృద్దాప్యం వచ్చాక సంపాదించిన సొమ్ము హాస్పిటల్స్క్ పోస్తూ టెన్షన్లతోనే జీవితం సమాప్తం అవుతుంది. 
     
    చివరికి మిగిలేదేమిటి?


    స్త్రీలు నెలసరి వాయిదా మందులు వేసుకుని, ఆరోగ్యం పాడుచేసుకోవద్దు...మరికొన్ని..

     

    ఈ రోజుల్లో చదువులు, ఉద్యోగాల వల్ల వత్తిడి పెరిగి ఆడవాళ్ళకు నెలసరి సరిగ్గా రావటం లేదు. 

    చదువుల వత్తిడి వల్ల చాలామంది అమ్మాయిలకు మూడునెలల వరకు కూడా నెలసరి రాకుండా ఉంటున్నాయి.

    ఈ నెలసరి అంటుముట్టు గొడవల వల్ల  కొన్నిసార్లు  ...పండుగలు, పూజలు, శుభకార్యాలను కూడా ప్రశాంతంగా చేసుకోలేని పరిస్థితి  ఉంటుంది.

     నెలసరి వస్తుందేమో? అని భయపడుతూ ఉండవలసి ఉంటుంది.

    ముందురోజు పూజకు సామాగ్రి కొనుక్కున్నా, పూజ చేస్తున్నా, ఫంక్షన్ జరుగుతున్నా కూడా సడన్ గా తమకుకానీ, తమ కుటుంబసభ్యులకు కానీ నెలసరి వస్తే ఏం చేయాలి? పూజ పూర్తి అవకపోతే మళ్ళీ చేయాలా? ఇలా ఎన్నో సందేహాలతో ప్రశాంతతే ఉండదు. 

    ఈ విషయాల వల్ల కుటుంబసభ్యుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి.
    ..............................

     ఈ రోజుల్లో  చాలారకాల పూజలను చాలామంది చేస్తున్నారు కదా..

     పూజలప్పుడు  కొందరు నెలసరి వాయిదా వేయటానికి మందులు వేసుకొంటున్నారు. ఇందువల్ల తరువాత చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.

    ఉదా..కొందరు కొన్ని వారాలు కొన్ని పూజలు చేస్తామనుకుంటారు. మధ్యలో నెలసరి రాకూడదని మందులు వేసుకుంటారు. 

    అలా అక్కరలేదు. నెలసరి వచ్చినా కూడా... తరువాత వారం ఆ పూజను కంటిన్యూ చేయవచ్చు. 

    కొన్ని పూజలు మాత్రం తిరిగి మొదటి నుంచి చెయ్యాలట...అంత ఓపిక లేనివాళ్లు పూజలు చేసే ముందే ఆలోచించుకుని మొదలుపెట్టడం మంచిది.

    ...........................

    సంతానం కలిగే వయస్సులో ఉన్న స్త్రీలు నెలసరి వాయిదా టాబ్లెట్స్ బాగా వాడితే పుట్టే పిల్లలకు కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉండవచ్చు. అందువల్ల, జాగ్రత్తగా ఉండాలి.

    నెలసరి అంటుముట్టు భయంతో నెలసరి వాయిదా..మందులు వేసుకుని, ఆరోగ్యం పాడుచేసుకోవద్దు...జాగ్రత్తలు తీసుకోవాలి.

    అనారోగ్యం వస్తే కష్టం....ఆరోగ్యం ఉంటేనే ఏమైనా చేయగలరు.

    ........................................... 

    వివాహం వంటి శుభకార్యాల్లో లగ్నపత్రిక, వివాహం..ఇలా ఎన్నో సందర్భాలుంటాయి. 

    అన్ని సందర్భాల్లో ఇంట్లో వారికి, బంధువులకు నెలసరి రాకుండా ఉండాలంటే కుదరదు.

     జన్మకొకసారి చేసుకునే వివాహంలో 
    నెలసరి వల్ల పాల్గొనకుండా ఉండాలంటే ఇంట్లో కుటుంబసభ్యులకు ఎంతో బాధగా ఉంటుంది.

     వివాహం అంటే వధువుకు నెలసరి ఇబ్బంది లేకుండా ముహూర్తం నిర్ణయిస్తారు.

    వధువు విషయంలో కూడా వివాహం సమయంలో అన్ని వేడుకలకు నెలసరి రాకుండా ఉండాలంటే కుదరకపోవచ్చు. 

    ఇలాంటి సందర్భాలలో టెన్షన్ వల్ల నెలసరి ముందే కూడా వచ్చే అవకాశముంది....

    అలాంటప్పుడు ఏం చేయలం...వేడుకలను పెంచుకుని నెలసరి వాయిదా మందులు మింగటం కన్నా, కొన్ని వేడుకలను తగ్గించుకోవచ్చు.  

    వివాహం సందర్భంగా కొన్ని వేడుకలు ఉంటాయి...అవన్నీ ఒకే రోజు ఉండవు.

     అయిదుసార్లు వేడుకలకు బదులు రెండు లేక మూడు సార్లు సరిపెట్టుకోవచ్చు.లేదా కొన్ని రోజులు తేడాతో ఫంక్షన్స్ జరుపుకోవచ్చు.

     నెలసరిలో ఉన్నప్పుడు దేవాలయాలకు వెళ్ళటం, పూజలు చేయటం దోషం కాబట్టి, అందుకు తగినట్లు మొదటే జాగ్రత్తగా తేదీలను నిర్ణయించుకోవాలి.

     ................................

    నాకు తెలిసిన ఒకమ్మాయి వివాహం సందర్భంగా నెలసరి ఆపటానికి ఒక వారం ముందు నుండి మందులు వేసుకుంటే, ఆ అమ్మాయికి ముఖానికి, పెదవులకు కొంచెం వాపు కూడా వచ్చింది.... 

    ఏమీ కాదంటూ అలాగే మాత్రలు వేయించారు పెద్దవాళ్ళు. 

    అలా మందులు వేసుకుని ....వివాహం రోజుకు కొద్దిగా గోధుమరంగు డిశ్చార్జ్ కనిపిస్తే నెలసరి అవునా? కాదో? అమ్మాయికి కూడా అర్ధం కాదు. 

    కొందరికి మందులు వేసుకున్నా కూడా ఆగినట్లు ఉండదు.

    .............................

     ప్రాచీనులు చెప్పినట్లు  ఖచ్చితంగా పాటించాలంటే.... నెలసరిలో ఆడవాళ్లు చదువులు, ఉద్యోగాల కొరకు కూడా ఖచ్చితంగా బయటకు వెళ్ళకూడదు.  

     మరి చదువులు, ఉద్యోగాలని నెలసరి రోజుల్లో బయటకు వెళ్ళి కలిపేస్తే కూడా పాపమే కదా..

    కాలానుగుణంగా మారక తప్పదంటూ స్త్రీలు చదువులు, ఉద్యోగాలకు నెలసరి రోజుల్లో కూడా వెళ్తున్నారు.  ఈ రోజుల్లో అలా ఇంట్లో కూర్చుంటే ఎలా కుదురుతుంది 
    ..బయటకు వెళ్తే దోషంకాదు..అంటారు.

    ( ఇలా..అవసరాన్ని బట్టి మాట్లాడటం, అవసరాలకు తగ్గట్లు మార్చుకోవటం అంటారు.)

    బయట దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు..పూజలు చేసుకున్నవాళ్ళు ఉంటారు. నెలసరిలో ఉన్నవాళ్ళు బయటకెళ్ళి తిరిగితే దోషం కాదా? మనకు అవసరం కాబట్టి బయటకు వెళ్తే దోషం ఉండదా?

     ..............................

     నెలసరిలో ఉన్నప్పుడు దైవస్మరణ.. చక్కగా చేసుకోవచ్చు.
    .................................

     oka link...చేతనైతే ఈ సమస్యలను.........

    oka link.. ఈ ఆచారం ఎక్కడవరకు వెళ్ళిందంటే..

    ........................

     mari konni vishayaalu....

     నాకు కొన్ని సందేహాలు కలిగాయి. 

    నెలసరిలో ఉన్నప్పుడు దైవస్మరణ.. దైవనామస్మరణ.. చేస్తే దోషం కాదు.  కాని, మంత్రాలు.. స్తోత్రాలు.. చేయకూడదంటున్నారు కొందరు.

      కార్తికమాసంలో కొన్ని దేవాలయాల్లో ఎవరైనా నెలకు కొంత డబ్బు కడితే, నెలంతా అభిషేకాలు..పూజలు చేస్తున్నారు. ...

    అలాంటప్పుడు ఆ కుటుంబంలో స్త్రీలకు నెలసరి వస్తే అప్పుడు వాళ్ళ పేరు కూడా పూజలో చదువుతారు కదా....అప్పుడు వాళ్లు పూజ చేసినట్లే కదా..

    మరి అలాంటప్పుడు దోషం ఉంటుందా? ఉండదా? అని సందేహం అనిపించింది. 

    అర్చనలు చేయించుకునేటప్పుడు కూడా వేరే ఊళ్లలో ఉండే కుటుంబసభ్యుల పేర్లు కూడా చెప్పి అర్చన చేయిస్తారు. 

    పూజలో పేర్లు ఉన్న వాళ్ళు నెలసరిలో ఉంటే అప్పుడేమిటి?

     ఇలా పూజలు చేయించుకుంటే చేయించుకున్నవాళ్లకు, చేయించిన వాళ్లకు, చేసిన వారికి...కూడా దోషం వస్తుందా? అలా ఏమీ కాదా? 

    పూజకు డబ్బు కట్టిన తరువాత, ఎవరి ఇంట్లో అయినా అకస్మాత్తుగా మైల పాటించే పరిస్థితి వస్తే,  ఆ సంగతి
    ని వాళ్ళు   చెప్పకపోవచ్చు.

    అంటుముట్టు..మైల ఉన్నాకూడా, దేవాలయంలో లేకుండా దూరంగా ఉంటే, వారి పేరుతో ఏ పూజ అయినా ( చండీ హోమము, రుద్రాభిషేకము, సత్యనారాయణస్వామి వారి వ్రతములు..ఇలా ఏ పూజ అయినా ..) చేయించుకోవచ్చా? అలా చేస్తే ఏమైనా దోషం ఉంటుందా? ఉండదా? తెలియటం లేదు.

     ఇన్ని  సందేహాలు ఎందుకు అంటే, నెలసరి దోషం వల్ల చాలా కష్టాలు వస్తాయంటున్నారు అని.

    .............................

    కుటుంబసభ్యులందరూ పూజ చేస్తున్నట్లుగా  వారి పేర్లు చెప్పటం కాకుండా, అంతా బాగుండాలని....కుటుంబంలో అందరూ బాగుండాలని భావిస్తూ పూజ చేయిస్తున్నట్లుగా (పూజారి గారితో) పూజ చేయించవచ్చేమో? అనిపించింది.

     అంటే , వాళ్లు పూజ చేస్తున్నట్లుగా భావించటం కాకుండా, పూజారి గారి చేత పూజ చేయిస్తున్నట్లు అయితే అంటుముట్టు దోషాలు ఉండవేమో?..అని నాకు అనిపించింది. .

    అయితే, అంటుముట్టు ఉన్నవారి గోత్రనామాలు చదివి పూజలు చేయవచ్చా? లేదా? అన్నది నాకు తెలియదు.

    ..........................

     నేను గమనించిన విషయం ఏమిటంటే, కొన్నిసార్లు పూజలలో సుమారు అర్ధగంటకు పైగా ఈ గోత్రనామాలు ..కుటుంబసభ్యుల పేర్లను చదవటంతోనే సరిపోతుంది.

     మేము చెన్నైలో ఉన్నప్పుడు,  అక్కడ దేవాలయంలో ..అర్చన కొరకు గోత్రనామాలు చెప్పకపోయినా కూడా,  స్వామిపేరుతో.. అని చెప్పి అర్చన చేసేవారు. 

    పేర్లు చెప్పకుండా ఈ పద్ధతి సులభంగా అనిపించింది.

    ....................

    గోత్రనామాలు చెప్పినా చెప్పకపోయినా,  దైవప్రీతి కొరకు.. జీవప్రీతి కొరకు ..కష్టాలు తొలగటానికి ..ఇలా దైవానికి ఎవరికి వారు మనస్సులో కూడా చెప్పుకోవచ్చు.

    మన గురించి, మన ఆలోచనల గురించి..అన్నీ దైవానికి తెలుస్తాయి.

     

    గ్రంధముల లోని ఒక కధ..కొన్ని అభిప్రాయాలు..


    గ్రంధాలలోని ఒక కధలో ఒక స్త్రీ.. ఒక రాజు కొడుకు.. అక్రమంగా తిరగటం.. కధలో.. 

     ఇవన్నీ సామాన్యులు  సరిగ్గా అర్ధం చేసుకోలేక, మంచిగా ఉన్నవారు నరకానికి పోవటం, చెడ్దపనులు చేసిన వాళ్లు స్వర్గానికి వెళ్లటం ఏమిటి? అని అనుకునే ప్రమాదముంది. 

     చెడు పనులు చేసిన వారు దయాభిక్షలా పుణ్యం ధారపోస్తే... స్వర్గానికి వెళ్ళవలసిన పరిస్థితి మంచివారికి ఏమిటి? అనిపిస్తుంది.
    ..................................

    రాజకుమారుడు చనిపోయేముందు ఆత్మ రక్షణ కొరకు బ్రాహ్మణుని కూడా చంపటం జరిగిందని  ఒక దగ్గర విన్నాను. 

    రాజకుమారుని ఒక్క కత్తివేటుతో చంపి, తరువాత బ్రాహ్మణుడు తనను తాను చంపుకున్నట్లు మరొక దగ్గర చదివాను. 

    ( ఒక్కవేటుతో రాజకుమారుడు చనిపోయినప్పుడు,  ఆత్మరక్షణ కొరకు బ్రాహ్మణుని ఎలా చంపగలడు?)

     తనను తాను చంపుకోవటం అంటే ఆత్మహత్య .  ఆత్మహత్య పాపం అంటారు కాబట్టి.. అలా కూడా బ్రాహ్మణున్ని నరకానికి తీసుకుపోవటానికి యమదూతలు వచ్చారేమో?

    ............................................

     రాజకుమారుడు మొదట్లో మంచిగా ప్రవర్తించేవాడని, తరువాత అతను దురలవాట్లకు లోనయ్యి రాజ్యంలోని స్త్రీలను కూడా వేధించేవాడని తెలుస్తుంది..... 

      రాజకుమారుడు వాళ్ళు తాము చేసిన పాపానికి పశ్చాత్తాపం చెందారో ? లేక ఎందుకో తెలియదు కానీ, తమ దీపారాధన పుణ్యాన్ని బ్రాహ్మణునికి కొంత ఇవ్వటానికి ముందుకు వచ్చారు. 

    రాజకుమారుని తల్లితండ్రి గతంలో చేసిన పుణ్యాల వల్ల.. రాజకుమారుడు గతంలో చేసిన ఏమైనా పుణ్యాల వల్ల  ఇంకా..దీపారాధన చేసిన పుణ్యం వల్ల.. అతనికి తాను పొందిన  పుణ్యంలో కొంత భాగాన్ని బ్రాహ్మణునికి ఇవ్వాలనే ఆలోచన వచ్చి ఉండవచ్చు.

     బ్రాహ్మణుడు ఇంతకుముందు  చాలా  పూజలు, పుణ్యాలు చేసిఉంటారు కాబట్టి,  మొత్తానికి అతను స్వర్గానికి వెళ్ళటం జరిగిందని ఒక దగ్గర విన్నాను. 

    దుష్ప్రవర్తన కలిగిన రాజకుమారుని చంపటం ద్వారా ....రాజ్యంలోని స్త్రీలకు ఉపకారం కూడా జరిగింది.

    బ్రాహ్మణుడు చేసిన పూజలు, పుణ్యాల వల్ల పరిస్థితులు కలసి వచ్చి  బ్రాహ్మణుడు స్వర్గానికి వెళ్ళటం జరిగింది.
    ......................
      

     రికొన్ని ఆలోచనలు...........

    ఆ రాజకుమారుడు భయపెట్టి ఆమెను లొంగదీసుకుని ఉండవచ్చు.

    (అయితే, కధను గమనిస్తే  ఆ స్త్రీ తాను కూడా ఇష్టంగానే రాజకుమారునితో ఉన్నట్లు  తెలుస్తుంది.) 

     భార్య  వేరే వారి మోజులో పడితే  తప్పే.

    ........................... 

     ఆ రాజకుమారుని తండ్రి.. పుత్ర ప్రేమతో తన  కొడుకుకు సరైన బుద్ధి చెప్పకుండా అలా వదిలేయటం తప్పు...ఇంకా అతడేం న్యాయం చేస్తాడు ప్రజలకు?

    .............................

    ఆ స్త్రీ భయంతో రాజకుమారునితో ఉన్నదో? లేక ఇష్టపడి ఉన్నదో? తెలియదు.

     నాకు ఏమనిపిస్తుందంటే, ఆ స్త్రీ ఇష్టంగానే రాజకుమారునితో ఉంటే,  ఆ స్త్రీ యొక్క భర్త ఆమెను సరిగ్గా పట్టించుకోలేదేమో? 

    (అయితే, కొందరు మగవారు...ఆడవారు తమ జీవితభాగస్వామి ఎంత బాగా చూసుకున్నా కూడా పరాయి వాళ్ల మోజులో పడుతారు.)

    ........................ 

    జీవితానికి పరమార్ధం మోక్షాన్ని పొందటం అనేది నిజమే కానీ, మనకు నాలుగు ఆశ్రమాలను పెద్దలు తెలియజేసారు.

     గృహస్తాశ్రమంలో ఉండగా సన్యాసాశ్రమంలా కాకుండా,  భార్యాభర్తలు అన్యోన్యంగా కూడా ఉండాలి. 

    భార్యాభర్త ఇద్దరూ ఇష్టపూర్వకంగా ఒకే విధంగా ఆలోచించుకుని చాలా నియమాలను పాటిస్తూ జీవిస్తే.. అది వేరే విషయం.

    .......................................

    గృహస్తాశ్రమంలో ఉన్నప్పుడు భార్యాభర్త అన్యోన్యంగా లేకుంటే గొడవలు, అక్రమసంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. 

    దైవాన్ని స్మరించుకోవటం, నిత్యపూజ చేయటం..వీటికి భార్యాభర్త సంసారానికి దూరంగా ఉండనవసరం లేదు. 

    కొన్ని పండుగలు, కొన్నిపూజలు రోజుల్లో బ్రహ్మచర్యాన్ని పాటించి,  మిగతా రోజుల్లో  భార్యాభర్త అన్యోన్యంగా సంసారం చేయవచ్చని నా అభిప్రాయం.
    ...................................

     కధలలో మనకు తెలియని అంతరార్ధాలు ఎన్నో ఉంటాయి. పైపైన తెలుస్తున్న వాటిప్రకారం నా అభిప్రాయాలను వ్రాయటం జరిగింది.

    వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని కోరుకుంటున్నాను.
     

    Friday, November 7, 2025

    కొన్ని విషయాలు..