koodali

Friday, September 2, 2011

దైవం ఎప్పటికప్పుడు ధర్మమును కాపాడటం జరుగుతుంది....



 
ఒకసారి నారాయణమహర్షి నారదమహర్షితో ఎన్నో విషయములను చెబుతూ ఇలా కూడా చెప్పటం జరిగింది. ..

జీవికి
కడదాకా సహాయంగా నిలిచేది ధర్మమొక్కటే. తల్లిదండ్రులు గానీ, భార్యాపుత్రులు గానీ, జ్ఞాతిమిత్రులు గానీఎవ్వరూ నిలవరు. తాను ఆచరించిన ధర్మమే తనకు సహాయకారి..అనీ,

ఇంకా
ఎన్నో విలువైన విషయములను చెప్పటం జరిగింది. ఇంకా, జగన్మాత గురించి చెబుతూ..

ఆవిడ జగన్మాత కనక పుత్రుల పట్ల సహజంగానే ప్రేమ దయ ఉంటాయి. భక్తితో అర్చన చేసే పుత్రుడంటే అవి ఎంతవిశేషంగా ప్రవహిస్తాయో వేరే చెప్పాలా ! అని కూడా చెప్పటం జరిగింది.

ఇలా
దేవతలు, పెద్దలైన మహర్షులు వంటివారు మనకు ఎన్నో విలువైన విషయములను అందించటం జరిగింది.

పరమాత్మ
పరాశక్తికి అందరూ బిడ్డలే.

పుణ్యాత్ముల
గురించి దైవం ఎంతగా ఆలోచిస్తారో పాపాత్ములను గురించి కూడా అంతగానూ ఆలోచిస్తారు.

పాపాలు
చేస్తున్నవారిని దైవం శిక్షించటమంటే , ఆ విధంగా వారిని సక్రమమార్గంలోకి మళ్ళించి , వారికి కూడాపుణ్యాత్ముల వలెనే పరమపదమును అందించటం కొరకే.


( లోకంలో తల్లిదండ్రులు చెడుమార్గంలో వెళ్తున్న తమ పిల్లలను కొద్దిగా శిక్షించి అయినా సరే, మంచిమార్గంలోకితీసుకువస్తారు కదా ! అలాగన్నమాట. )

కొందరు
మంచివాళ్ళు కూడా అప్పుడప్పుడు మనస్సును నిగ్రహించుకోలేక కోపతాపాలకు గురవ్వటం, తప్పులు చేయటంప్రాచీన కధలలో కూడా కనిపిస్తుంది.

గొప్పవారైనా
, సామాన్యులైనా మంచిపనులు చేస్తే ... మంచి ఫలితాన్ని , చెడ్డపనులు చేస్తే ... చెడ్డ ఫలితాన్నిపొందుతారని అనిపిస్తుంది.

( ప్రతీచర్యకు ప్రతిచర్య ఉంటుందని ఆధునికులు కూడా అంగీకరిస్తున్నారు కదా ! )

అయితే చేసిన తప్పును గ్రహించి పశ్చాత్తాపపడితే , ప్రాయశ్శ్చిత్తమును అనుభవించటం , వంటి కొన్ని విధానముల వల్లచెడుఫలితాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు అని కూడా అనిపిస్తోంది.


కొందరు
ఎన్నో పాపాలు చేస్తూ కూడా , పూజలు అవీ చేస్తుంటారు.

వారి
గురించి నాకు ఏమనిపిస్తుందంటే , దైవాన్ని నమ్ముతూ కూడా , పాపపుణ్యాల గురించి తెలిసి కూడా, మనస్సునుఅదుపులో పెట్టుకోలేక ఎన్నోపాపాలు చేస్తున్నారు కదా !

ఇక
ఇలాంటివారికి దైవభీతి, పాపపుణ్యాల భయం లేకపోతే ఇంకా ఎన్ని పాపాలు చేస్తారో ! లోకాన్ని ఎంతగా పీడిస్తారోకదా ! అనిపిస్తుంది.

వీరు కూడా భయంతో కానీ, భక్తితో కానీ..పూజలు చేయగా చేయగా, ఎప్పటికైనా మంచిదారిలోకి వస్తారు అనిపిస్తుంది. ( కొన్ని జన్మలు కూడాపట్టవచ్చు. )

అప్పటికీ
మంచిదారిలోకి రాకపోతే , దైవమే తనదైన శైలిలో వారిని సక్రమమార్గంలోకి తీసుకురావటం జరుగుతుంది. అనిపిస్తుంది.

విధంగా , దైవం ఎప్పటికప్పుడు ధర్మమును కాపాడటం జరుగుతుంది.....

పొరపాట్లు ఉన్నచో దైవం క్షమించాలని..
ప్రార్ధిస్తున్నాను. 

 అంతా దైవం దయ.

 

No comments:

Post a Comment