koodali

Wednesday, September 21, 2011

ఆదిలక్ష్మి గారు త్వరగా కోలుకోవాలని............

" అమ్మ ఒడి " ఆదిలక్ష్మి గారి జీవితంలో జరిగిన విషాదకర సంఘటనలు అత్యంత బాధాకరమైనవి. ఇలా జరగకుండా ఉంటే బాగుండేది.

ఆదిలక్ష్మి గారు త్వరగా కోలుకోవాలని , ఆమె ధైర్యం తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇలా చెప్పటం తేలికే గానీ .?

సినీనటి సౌందర్య అమ్మగారు తన ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్న తరువాత అనాధపిల్లలను చేరదీసి వారికి అండగా ఉంటున్నారట.

తమిళనాడులో ముగ్గురు పిల్లలు గల ఒక మధ్యతరగతి కుటుంబం ఉండేవారట.

ఆ మధ్య సునామీ వచ్చినప్పుడు వారి ముగ్గురు పిల్లలూ అందులో మరణించారట.

అంత బాధ తరువాత కూడా వారి తల్లిదండ్రులు సునామీలో అనాధలైన కొందరు పిల్లలను చేరదీసి పెంచుకుంటున్నారట.

వారి ఫోటోలతో సహా వార్తాపత్రికలో వేశారు.

ఎవరి జీవితంలో అయినా దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు ధైర్యం తెచ్చుకుని కష్టాల్లో ఉన్న ఇతరులకు సేవ చేయటం వల్ల వారి జీవితానికి సార్ధకత ఏర్పడుతుంది.

లేక ఇతరులు స్థాపించిన శరణాలయాలలోని అనాధలకు తమకు వీలు కుదిరినప్పుడు వెళ్ళి సాయాన్ని అందించవచ్చు.

ఇదంతా చెప్పినంత తేలిక కాదుగానీ, అలా చేయటం వల్ల ఇతరుల జీవితాల్ని నిలబెట్టినవారవుతారు.

వారి మనసుకి కూడా ఉపశమనం కలుగుతుంది.

భారత యుద్ధంలో కౌరవులు మాత్రమే చనిపోలేదు. ఉపపాండవులు, అభిమన్యుడు, ఘటోథ్గచుడు వంటి వారు కూడా మరణించారు.

అప్పుడు మరి వారి తల్లిదండ్రులు ఎంతో బాధను అనుభవించి ఉంటారు.

అంత గొప్ప వారికే ఇలాంటి కష్టాలు వచ్చాయి. అని , వారి కధల ద్వారా ధైర్యాన్ని తెచ్చుకోవాలి.

కాలం అందరి గాయాలను తగ్గిస్తుందని ఆశిస్తూ..

No comments:

Post a Comment