koodali

Sunday, November 9, 2025

కొన్ని విషయములు..


 link..

ఓం, దైవానికి అనేక వందనములు...

 link..

  • ఓం..
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. ....4
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. .3
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్....2
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. 
  • చక్కగా దైవాన్ని ఆరాధించుకోవచ్చు. ...

     

     సోషల్మీడియాలో చెప్పేవన్నీ పాటించకపోతే కష్టాలొస్తాయేమోననే భయపడనవసరం లేదు.

     అందరూ అన్నింటినీ పాటించలేరు. కలియుగంలో దైవస్మరణ..దైవనామస్మరణతోనే తరించవచ్చని ప్రాచీనులే తెలియజేసారు.

     ఎవరి శక్తికి తగ్గట్లు వారు దైవాన్ని ఆరాధించుకోవచ్చు. 
     

    దైవానికి మన విషయాలను చెప్పుకోవచ్చు. 

    హిందూత్వంలో నిరాకారం, సాకారం..ఇలా ఇంకా ఎన్నో పద్ధతులున్నాయి. మన శక్తికి తగ్గట్లు చక్కగా హాయిగా దైవాన్ని ఆరాధించుకోవచ్చు.

     సరైన విధంగా జీవించే శక్తిని ఇమ్మని దైవాన్ని ప్రార్ధించుకోవచ్చు.

     

    ఇలాంటి గొప్ప తల్లులు అభినందనీయులు...



    చిన్నపిల్లలు వాళ్ళకువాళ్ళు చేత్తో తీసుకుని సరిగ్గా తినలేరు. చిన్నపిల్లలు పెద్దవారిలా గబగబా నమిలి తినలేరు. నిదానంగా తింటారు. అలాగని పిల్లలకు ఆహారాన్ని కుక్కి అదేపనిగా బోలెడు తినిపించకూడదు. 
     
    వాళ్ళకు ఎంతకావాలో అలాగ తల్లి దగ్గరుండి  ఓపికగా తినిపించాలి. అందుకు ఎక్కువ సమయమే పడుతుంది.

    అయితే, ఈ రోజుల్లో చాలామంది తల్లులు ఉద్యోగాల కొరకు వెళ్ళటం వల్ల పిల్లలకు చక్కగా తినిపించటానికి కూడా సమయం ఉండటం లేదు. 
     
    పిల్లలను డేకేర్ సెంటర్లలో వేస్తున్నారు. లేదంటే చిన్నప్పుడే స్కూల్లో వేస్తున్నారు. పిల్లలను త్వరగా అక్కడ దింపాలని ఉదయాన్నే వాళ్లకు హడావిడిగా ఏదో కుక్కి తినిపిస్తారు.

     ఇంట్లో ఉండే తల్లులు కూడా కొందరు ఈ విషయంలో ఓపికగా చేయటం లేదు. చిన్నపిల్లలు ఏమీ చేయలేరు కదా..
     
    కొందరు పిల్లలు ఉదా..3 సంవత్సరాల చిన్నపిల్లలు నాకు తినిపించమని పెద్దవాళ్ళను అడిగినా, నువ్వే తినాలంటూ తినిపించకుండా ఉండే పెద్దవాళ్ళను నేను చూసాను.. 
     
    పాపం చిన్నపిల్లలు తమకు తాము సరిగ్గా తినలేని వయస్సు వాళ్ళది...అలా అర్ధాకలితో ఉంటే  బాధ అనిపిస్తుంది. ఈ సమస్యలకు పరిష్కారం ఎప్పుడో?

    చాలామంది పిల్లలు తినటం విషయంలో విసిగిస్తారు. ఆ వయస్సు పిల్లలు చాలామంది అలాగే ఉంటారు. 
     
    కొందరు తల్లులు మాత్రం ఓపికగా మాటలు చెబుతూ తినిపిస్తారు. ఇలాంటి గొప్ప తల్లులు అభినందనీయులు.
     

    స్త్రీలు నెలసరి వాయిదా మందులు వేసుకుని, ఆరోగ్యం పాడుచేసుకోవద్దు...

     

    ఈ రోజుల్లో చదువులు, ఉద్యోగాల వల్ల వత్తిడి పెరిగి ఆడవాళ్ళకు నెలసరి సరిగ్గా రావటం లేదు. 

    చదువుల వత్తిడి వల్ల చాలామంది అమ్మాయిలకు మూడునెలల వరకు నెలసరి రాకుండా ఉంటున్నాయి.

    ఈ నెలసరి అంటుముట్టు గొడవల వల్ల  కొన్నిసార్లు  ...పండుగలు, పూజలు, శుభకార్యాలను కూడా ప్రశాంతంగా చేసుకోలేని పరిస్థితి  ఉంటుంది.

     నెలసరి వస్తుందేమో? అని భయపడుతూ ఉండవలసి ఉంటుంది.

    ముందురోజు పూజకు సామాగ్రి కొనుక్కున్నా, పూజ చేస్తున్నా, ఫంక్షన్ జరుగుతున్నా కూడా సడన్ గా తమకుకానీ, తమ కుటుంబసభ్యులకు కానీ నెలసరి వస్తే ఏం చేయాలి? పూజ పూర్తి అవకపోతే మళ్ళీ చేయాలా? ఇలా ఎన్నో సందేహాలతో ప్రశాంతతే ఉండదు. 

    ఈ విషయాల వల్ల కుటుంబసభ్యుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి.
    ..............................

     ఈ రోజుల్లో  చాలారకాల పూజలను చాలామంది చేస్తున్నారు కదా..

     పూజలప్పుడు  కొందరు నెలసరి వాయిదా వేయటానికి మందులు వేసుకొంటున్నారు. ఇందువల్ల తరువాత చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.

    ఉదా..కొందరు కొన్ని వారాలు కొన్ని పూజలు చేస్తామనుకుంటారు. మధ్యలో నెలసరి రాకూడదని మందులు వేసుకుంటారు. 

    అలా అక్కరలేదు. నెలసరి వచ్చినా కూడా... తరువాత వారం ఆ పూజను కంటిన్యూ చేయవచ్చు. 

    కొన్ని పూజలు మాత్రం తిరిగి మొదటి నుంచి చెయ్యాలట...అంత ఓపిక లేనివాళ్లు పూజలు చేసే ముందే ఆలోచించుకుని మొదలుపెట్టడం మంచిది.

    ...........................

    సంతానం కలిగే వయస్సులో ఉన్న స్త్రీలు నెలసరి వాయిదా టాబ్లెట్స్ బాగా వాడితే పుట్టే పిల్లలకు కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉండవచ్చు. అందువల్ల, జాగ్రత్తగా ఉండాలి.

    నెలసరి అంటుముట్టు భయంతో నెలసరి వాయిదా..మందులు వేసుకుని, ఆరోగ్యం పాడుచేసుకోవద్దు...జాగ్రత్తలు తీసుకోవాలి.

    అనారోగ్యం వస్తే కష్టం....ఆరోగ్యం ఉంటేనే ఏమైనా చేయగలరు.

    ........................................... 

    వివాహం వంటి శుభకార్యాల్లో లగ్నపత్రిక, వివాహం..ఇలా ఎన్నో సందర్భాలుంటాయి. 

    అన్ని సందర్భాల్లో ఇంట్లో వారికి, బంధువులకు నెలసరి రాకుండా ఉండాలంటే కుదరదు.

     జన్మకొకసారి చేసుకునే వివాహంలో 
    నెలసరి వల్ల పాల్గొనకుండా ఉండాలంటే ఇంట్లో కుటుంబసభ్యులకు ఎంతో బాధగా ఉంటుంది.

     వివాహం అంటే వధువుకు నెలసరి ఇబ్బంది లేకుండా ముహూర్తం నిర్ణయిస్తారు.

    వధువు విషయంలో కూడా వివాహం సమయంలో అన్ని వేడుకలకు నెలసరి రాకుండా ఉండాలంటే కుదరకపోవచ్చు. 

    ఇలాంటి సందర్భాలలో టెన్షన్ వల్ల నెలసరి ముందే కూడా వచ్చే అవకాశముంది....

    అలాంటప్పుడు ఏం చేయలం...వేడుకలను పెంచుకుని నెలసరి వాయిదా మందులు మింగటం కన్నా, కొన్ని వేడుకలను తగ్గించుకోవచ్చు. 

     అయిదుసార్లు వేడుకలకు బదులు రెండు లేక మూడు సార్లు సరిపెట్టుకోవచ్చు.లేదా కొన్ని రోజులు తేడాతో ఫంక్షన్స్ జరుపుకోవచ్చు.

     కొందరికి మందులు వేసుకున్నా కూడా ఆగినట్లు ఉండదు...నెలసరిని మందులతో ఆపి పూజలు చేయటం శాస్త్రసమ్మతమేనా?

    నెలసరిలో ఉన్నప్పుడు దేవాలయాలకు వెళ్ళటం, పూజలు చేయటం దోషం కాబట్టి, అందుకు తగినట్లు మొదటే జాగ్రత్తగా తేదీలను నిర్ణయించుకోవాలి.

    .............................

     ప్రాచీనులు చెప్పినట్లు  ఖచ్చితంగా పాటించాలంటే.... నెలసరిలో ఆడవాళ్లు చదువులు, ఉద్యోగాల కొరకు కూడా బయటకు వెళ్ళకూడదు.  

     మరి చదువులు, ఉద్యోగాలని నెలసరి రోజుల్లో బయటకు వెళ్ళి కలిపేస్తే కూడా పాపమే కదా..

    కాలానుగుణంగా మారక తప్పదంటూ స్త్రీలు చదువులు, ఉద్యోగాలకు నెలసరి రోజుల్లో కూడా వెళ్తున్నారు.  ఈ రోజుల్లో అలా ఇంట్లో కూర్చుంటే ఎలా కుదురుతుంది 
    ..బయటకు వెళ్తే దోషంకాదు..అంటారు. 

    బయట దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు..పూజలు చేసుకున్నవాళ్ళు ఉంటారు. నెలసరిలో ఉన్నవాళ్ళు బయటకెళ్ళి తిరిగితే దోషం కాదా? మనకు అవసరం కాబట్టి బయటకు వెళ్తే దోషం ఉండదా?

     ..............................

     నెలసరిలో ఉన్నప్పుడు దైవస్మరణ.. చక్కగా చేసుకోవచ్చు.
    .................................

     oka link...చేతనైతే ఈ సమస్యలను.........

    oka link.. ఈ ఆచారం ఎక్కడవరకు వెళ్ళిందంటే..

    ........................

     నాకు కొన్ని సందేహాలు కలిగాయి. నెలసరిలో ఉన్నప్పుడు దైవస్మరణ.. దైవనామస్మరణ.. చేస్తే దోషం కాదు కాని, మంత్రాలు.. స్తోత్రాలు.. చేయకూడదంటున్నారు కొందరు.

      కార్తికమాసంలో కొన్ని దేవాలయాల్లో ఎవరైనా నెలకు కొంత డబ్బు కడితే, నెలంతా అభిషేకాలు..పూజలు చేస్తున్నారు. ...

    అలాంటప్పుడు ఆ కుటుంబంలో స్త్రీలకు నెలసరి వస్తే అప్పుడు వాళ్ళ పేరు కూడా పూజలో చదువుతారు కదా....అప్పుడు వాళ్లు పూజ చేసినట్లే కదా..మరి అలాంటప్పుడు దోషం ఉంటుందా? ఉండదా? అని సందేహం అనిపించింది. 

    అర్చనలు చేయించుకునేటప్పుడు కూడా వేరే ఊళ్లలో ఉండే కుటుంబసభ్యుల పేర్లు కూడా చెప్పి అర్చన చేయిస్తారు. 

    పూజలో పేర్లు ఉన్న వాళ్ళు నెలసరిలో ఉంటే అప్పుడేమిటి? ఇలా పూజలు చేయించుకుంటే చేయించుకున్నవాళ్లకు, చేయించిన వాళ్లకు, చేసిన వారికి...కూడా దోషం వస్తుందా? అలా ఏమీ కాదా? 

    అంటుముట్టు..మైల ఉన్నాకూడా, దేవాలయంలో లేకుండా దూరంగా ఉంటే, వారి పేరుతో ఏ పూజ అయినా చేయించుకోవచ్చా? అలా చేస్తే ఏమైనా దోషం ఉంటుందా? ఉండదా? తెలియటం లేదు.

     ఇన్ని ఎందుకు సందేహాలు అంటే, నెలసరి దోషం వల్ల చాలా కష్టాలు వస్తాయంటున్నారు అని.



    గ్రంధముల లోని ఒక కధ..కొన్ని అభిప్రాయాలు..


    గ్రంధాలలోని ఒక కధలో ఒక స్త్రీ.. ఒక రాజు కొడుకు.. అక్రమంగా తిరగటం.. కధలో.. 

     ఇవన్నీ సామాన్యులు  సరిగ్గా అర్ధం చేసుకోలేక, మంచిగా ఉన్నవారు నరకానికి పోవటం, చెడ్దపనులు చేసిన వాళ్లు స్వర్గానికి వెళ్లటం ఏమిటి? అని అనుకునే ప్రమాదముంది. 

     చెడు పనులు చేసిన వారు దయాభిక్షలా పుణ్యం ధారపోస్తే... స్వర్గానికి వెళ్ళవలసిన పరిస్థితి మంచివారికి ఏమిటి? అనిపిస్తుంది.
    ..................................

    రాజకుమారుడు చనిపోయేముందు ఆత్మ రక్షణ కొరకు బ్రాహ్మణుని కూడా చంపటం జరిగిందని  ఒక దగ్గర విన్నాను. 

    రాజకుమారుని ఒక్క కత్తివేటుతో చంపి, తరువాత బ్రాహ్మణుడు తనను తాను చంపుకున్నట్లు మరొక దగ్గర చదివాను. 

    ( ఒక్కవేటుతో రాజకుమారుడు చనిపోయినప్పుడు,  ఆత్మరక్షణ కొరకు బ్రాహ్మణుని ఎలా చంపగలడు?)

     తనను తాను చంపుకోవటం అంటే ఆత్మహత్య .  ఆత్మహత్య పాపం అంటారు కాబట్టి.. అలా కూడా బ్రాహ్మణున్ని నరకానికి తీసుకుపోవటానికి యమదూతలు వచ్చారేమో?

    ............................................

     రాజకుమారుడు మొదట్లో మంచిగా ప్రవర్తించేవాడని, తరువాత అతను దురలవాట్లకు లోనయ్యి రాజ్యంలోని స్త్రీలను కూడా వేధించేవాడని తెలుస్తుంది..... 

      రాజకుమారుడు వాళ్ళు తాము చేసిన పాపానికి పశ్చాత్తాపం చెందారో ? లేక ఎందుకో తెలియదు కానీ, తమ దీపారాధన పుణ్యాన్ని బ్రాహ్మణునికి కొంత ఇవ్వటానికి ముందుకు వచ్చారు. 

    రాజకుమారుని తల్లితండ్రి గతంలో చేసిన పుణ్యాల వల్ల.. రాజకుమారుడు గతంలో చేసిన ఏమైనా పుణ్యాల వల్ల  ఇంకా..దీపారాధన చేసిన పుణ్యం వల్ల.. అతనికి తాను పొందిన  పుణ్యంలో కొంత భాగాన్ని బ్రాహ్మణునికి ఇవ్వాలనే ఆలోచన వచ్చి ఉండవచ్చు.

     బ్రాహ్మణుడు ఇంతకుముందు  చాలా  పూజలు, పుణ్యాలు చేసిఉంటారు కాబట్టి,  మొత్తానికి అతను స్వర్గానికి వెళ్ళటం జరిగిందని ఒక దగ్గర విన్నాను. 

    దుష్ప్రవర్తన కలిగిన రాజకుమారుని చంపటం ద్వారా ....రాజ్యంలోని స్త్రీలకు ఉపకారం కూడా జరిగింది.

    బ్రాహ్మణుడు చేసిన పూజలు, పుణ్యాల వల్ల పరిస్థితులు కలసి వచ్చి  బ్రాహ్మణుడు స్వర్గానికి వెళ్ళటం జరిగింది.
    ......................
      

     రికొన్ని ఆలోచనలు...........

    ఆ రాజకుమారుడు భయపెట్టి ఆమెను లొంగదీసుకుని ఉండవచ్చు.

    (అయితే, కధను గమనిస్తే  ఆ స్త్రీ తాను కూడా ఇష్టంగానే రాజకుమారునితో ఉన్నట్లు  తెలుస్తుంది.) 

     భార్య  వేరే వారి మోజులో పడితే  తప్పే.

    ........................... 

     ఆ రాజకుమారుని తండ్రి.. పుత్ర ప్రేమతో తన  కొడుకుకు సరైన బుద్ధి చెప్పకుండా అలా వదిలేయటం తప్పు...ఇంకా అతడేం న్యాయం చేస్తాడు ప్రజలకు?

    .............................

    ఆ స్త్రీ భయంతో రాజకుమారునితో ఉన్నదో? లేక ఇష్టపడి ఉన్నదో? తెలియదు.

     నాకు ఏమనిపిస్తుందంటే, ఆ స్త్రీ ఇష్టంగానే రాజకుమారునితో ఉంటే,  ఆ స్త్రీ యొక్క భర్త ఆమెను సరిగ్గా పట్టించుకోలేదేమో? 

    (అయితే, కొందరు మగవారు...ఆడవారు తమ జీవితభాగస్వామి ఎంత బాగా చూసుకున్నా కూడా పరాయి వాళ్ల మోజులో పడుతారు.)

    ........................ 

    జీవితానికి పరమార్ధం మోక్షాన్ని పొందటం అనేది నిజమే కానీ, మనకు నాలుగు ఆశ్రమాలను పెద్దలు తెలియజేసారు.

     గృహస్తాశ్రమంలో ఉండగా సన్యాసాశ్రమంలా కాకుండా,  భార్యాభర్తలు అన్యోన్యంగా కూడా ఉండాలి. 

    భార్యాభర్త ఇద్దరూ ఇష్టపూర్వకంగా ఒకే విధంగా ఆలోచించుకుని చాలా నియమాలను పాటిస్తూ జీవిస్తే.. అది వేరే విషయం.

    .......................................

    గృహస్తాశ్రమంలో ఉన్నప్పుడు భార్యాభర్త అన్యోన్యంగా లేకుంటే గొడవలు, అక్రమసంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. 

    దైవాన్ని స్మరించుకోవటం, నిత్యపూజ చేయటం..వీటికి భార్యాభర్త సంసారానికి దూరంగా ఉండనవసరం లేదు. 

    కొన్ని పండుగలు, కొన్నిపూజలు రోజుల్లో బ్రహ్మచర్యాన్ని పాటించి,  మిగతా రోజుల్లో  భార్యాభర్త అన్యోన్యంగా సంసారం చేయవచ్చని నా అభిప్రాయం.
    ...................................

     కధలలో మనకు తెలియని అంతరార్ధాలు ఎన్నో ఉంటాయి. పైపైన తెలుస్తున్న వాటిప్రకారం నా అభిప్రాయాలను వ్రాయటం జరిగింది.

    వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని కోరుకుంటున్నాను.
     

    Friday, November 7, 2025

    కొన్ని విషయాలు..ఆవులు....


    link... 

    Friday, October 31, 2025

    చేసిన తప్పు లకు పశ్చాత్తాపాన్ని పొంది.....

     

     దైవానుగ్రహం పొందాలన్నా, గురువు అనుగ్రహం పొందాలన్నా సత్ర్ప్రవర్తన అవసరం.


        కొందరు పాపాలు చేసి, తరువాత చేసిన పాపాలకు పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తారు.  తాము పశ్చాత్తాపం చెందాం కాబట్టి,  ఇక తమకు ఎటువంటి శిక్షా లేకుండా ఉండాలని కూడా కొందరు ఆశిస్తారు. 

    ఇలాంటి వాళ్ళు నిజంగా పశ్చాత్తాపం చెందారా లేక పరిస్థితి అనుకూలిస్తే మళ్ళీ నేరం చేస్తారా? అనేది తెలియదు.

            నిజంగా పశ్చాత్తాపం చెందినా కూడా కొంతయినా  శిక్ష పడక తప్పకపోవచ్చు. ఎందుకంటే, నేరస్తుల వల్ల బాధితులకు జరిగిన అన్యాయం, బాధ, ఆక్రోశం ఉంటాయి కదా!

       చిన్న నేరం అయితే బాధితులు నేరస్తులను క్షమించే అవకాశం ఉంది, లేక కొద్దిపాటి శిక్షతో సరిపెట్టుకోవచ్చు.

      పెద్ద నేరం, క్రూరమైన నేరం చేస్తే మాత్రం.. నేరం చేసిన వాళ్ళు పశ్చాత్తాపాన్ని ప్రకటించినా కూడా శిక్ష తప్పకపోవచ్చు. కొన్నిసార్లు మరణశిక్ష కూడా పడవచ్చు.  అప్పుడు, నేరస్తులు ఎంత ప్రాధేయపడినా ఉపయోగం ఉండకపోవచ్చు.

      అయితే, నేరం చేసిన కొంతకాలం తరువాత కానీ,మరణానికి ముందు కానీ .. పశ్చాత్తాపం కలిగితే దానివల్ల మరుజన్మలో కొంత మంచి జన్మ రావటానికి ఉపయోగపడవచ్చు.
        ..........................
           
        సమాజంలో క్రూరమైన నేరం చేసిన తరువాత ఉరిశిక్ష పడితే ఆ శిక్ష నుండి తప్పించాలని జడ్జి ముందు ఎంత ఏడ్చి ప్రాధేయపడినా ఏం లాభం? 

    జడ్జి ఎంత దయకలవారైనా వారికి కొన్ని నియమాలు ఉంటాయి కదా..వారు చట్టం ప్రకారం నడచుకోవాలి.

       జీవులు తమను తాము నిగ్రహించుకోలేక పాపాలు చేసి, తత్ఫలితంగా కష్టాలు వస్తే దైవాన్ని నిందించటం సరికాదు.  .

       కొందరు పాపకర్మలను పరిహారాలు చేయటం ద్వారా తొలగించుకోవాలనుకుంటారు. అయితే, పాపకర్మల పరిహారం కొరకు పరిహారక్రియలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలి.

    పరిహారాలు సరిగ్గా ఫలించాలన్నా సత్ప్రవర్తన అవసరం.
      .....................................................

          భక్తులమని చెప్పుకునే వాళ్ళలో కూడా కొందరు చెడుపనులు చేస్తున్నారు. భక్తులనే వాళ్లు పాపాల విషయంలో ఎందుకు భయపడటం లేదు? 

    బహుశా వాళ్ళ ఉద్దేశం ఎన్ని పాపాలు చేసినా దానికి తగ్గ పరిహారం చేసుకుంటే చాలు.. పాపాల నుంచి విముక్తులు కావచ్చని అనుకుంటున్నారు కాబోలు, లేక మనస్సును అదుపులో ఉంచుకోలేక తిరిగి తప్పులు చేస్తారు.

        ****************

        ఎవరైనా తప్పు చేస్తే చట్టంలో దానికి తగ్గ శిక్షలుంటాయి.  ఇలా శిక్షించటం ఎందుకంటే, శిక్ష వల్ల భయంతో ఇకమీదటైనా తప్పులు చేయరనే ఉద్దేశంతో శిక్షిస్తారు.

        అంతేకానీ , తప్పు చేసినా తప్పుకు శిక్షగా జరిమానా చెల్లించటం లేక కొంతకాలం జైల్లో ఉండి వచ్చి , చేసిన తప్పులకు పరిహారం జరిగిపోయింది కాబట్టి, మళ్లీ తప్పులు చేయటం ..అనేది అసలు ఉద్దేశం కాదు. 

    తిరిగి మళ్లీ తప్పు చేయకూడదనేది సరైన ఉద్దేశ్యం.

        చెడుపనుల వల్ల కష్టాలు వచ్చినప్పుడు, ఆ కష్టాల నుండి తప్పించుకోవటానికి పరిహార పూజలు చేసుకోవటంలో తప్పులేదు. అయితే పరిహారం జరిగింది కాబట్టి, మళ్లీ పాపాలు చేయటం తప్పు.

        ఎన్ని పాపాలు చేసినా .. పరిహారాలతో బైటపడవచ్చు ..అనే భావన ప్రజలలో వస్తే అది ఎంతో ప్రమాదకరమైనది. పూర్వీకులు మనకు తెలిపిన ఉద్దేశ్యాలకు వ్యతిరేకమైనది.
     ..............................

    కొందరు చేసే చెడ్దపనుల వల్ల సమాజంలో ఎందరికో కష్టాలు వస్తాయి.

    ఇలాంటప్పుడు దైవం చూస్తూ ఊరుకోరు.. చెడుపనులు చేసేవారిని తనదైన విధానంతో దారిలోకి తెస్తారు.

        ****************
        రావణాసురుడు ఎంతో గొప్ప పండితుడు. అతనికి ఎన్నో పరిహారాలు తెలిసే ఉంటాయి. అయినా మరి శిక్ష నుంచి తప్పించుకోలేకపోయాడు.

        పాపాలు చేయటాన్ని కొనసాగిస్తున్నప్పుడు పరిహారాలు చేయాలన్నా..అనుకున్నట్లు జరగకపోవచ్చు.
        ****************

        కష్టాల నుండి తప్పించుకోవాలంటే, చేసిన పాపాల గురించి పశ్చాత్తాపపడి మంచిమార్గంలోకి రావటానికి ప్రయత్నించాలి.

        తప్పులు చేసిన వారిని క్షమించటమూ అవసరమే. అయితే ఎంతవరకు?

        దైవం దయామయులు. ఎవరైనా మంచిగా మారటానికి కొంత సమయాన్ని ఇస్తారు.
        ఆ తరువాత కూడా వినకపోతే వారికి తగిన శాస్తి జరుగుతుందని పురాణేతిహాసాల ద్వారా తెలుస్తుంది.

        శ్రీరామునికి సీతాదేవిని అప్పగించేయమని ఎందరు చెప్పినా రావణాసురుడు వినలేదు.
        శివుని అంశ అయిన హనుమంతులవారు మంచి చెప్పినా రావణుడు వినిపించుకోలేదు. తుదకు అందుకు తగిన శిక్షను అనుభవించాడు.

    (రావణాసురునికి తాను గొప్పసంపదలు ఉన్న వ్యక్తిని అనే అహంకారంతో పాటు, తన భక్తి కూడా ఎంతో గొప్పది, తాను ఎలా ప్రవర్తించినా కూడా ..దైవం కూడా తన కి లొంగక తప్పదు.. అనే అహంకారం ఉండి ఉంటుంది.అందుకే అతనిపరిస్థితి అలా అయ్యిఉంటుంది. )


        శ్రీకృష్ణుడు..శిశుపాలుని నూరు తప్పుల వరకు సహించి తరువాత శిక్షించారు.

        అందువల్ల, అందరమూ జాగ్రత్తగా ఉండటం మంచిది.

     దైవం పట్ల ప్రేమతో కూడిన శరణాగతి ఉంటే,
     దైవం  కాపాడుతారు.

        ......................

    ఎవరైనా మంచిచేసినా.. చెడ్ద చేసినా దానికి తగ్గ ఫలితాలు ఉంటాయి.

        చెడ్దవారి విషయంలో ఎలాగూ వారు చేసిన చెడుపనులకు తగ్గ ఫలితాలు ఉంటాయి. 

    అయితే, కొందరు మంచివారికి కూడా కొన్ని కష్టాలు రావటం, వ్యాధులు రావటం.. లోకంలో గమనిస్తాం.

         ఎన్నో మంచిపనులు చేసినా కూడా ఇలాంటి కష్టం ఎందుకు వచ్చిందో కదా ..అనిపిస్తుంది. 

    అయితే, కర్మలకు సంబంధించి ఎవరికర్మ ఏమిటి? దానికి ఫలితాలు ఎలా ఉంటాయి? అనేది..మనకు తెలియని విషయాలెన్నో ఉంటాయి. అవన్నీ దైవానికి తెలుస్తాయి.
      .................


        కొన్ని విషయాలు ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, మంచివారి వల్ల కూడా కొన్నిసార్లు ఇతరులకు ఇబ్బందులు వస్తాయి.

    ఉదా..ఒక మంచి వ్యక్తికి కోపం బాగా ఉండి అందువల్ల ఇతరులకు బాగా ఇబ్బందులు కలిగితే, అందువల్ల కూడా ఆ మంచివ్యక్తికి కొన్ని బాధలు కలిగే అవకాశముంది.

        ఉదా..ఒక మంచివ్యక్తి తాను కొన్ని మూఢనమ్మకాలను నమ్మి, కుటుంబసభ్యులను, ఇతరులను కూడా ఆ మూఢనమ్మకాలతో ఇబ్బంది పెడితే, ఆ ఉసురు వల్ల అతనికి ఈ జన్మలోనో, మరుజన్మలోనో..కొన్ని కష్టాలు..వచ్చే అవకాశముంది.
     .................................

      
       ఎన్ని పాపాలు చేస్తునా కూడా కొన్ని పరిహారాలు చేస్తే చాలు సరిపోతుందని అనుకోవద్దు. దైవము ఏమీ అమాయకులు కాదు.

    ఉదా.. కొందరిని గమనిస్తే, వాళ్లకు చాలా డబ్బుంటుంది. కాని, ఇష్టమైనవి తినలేనివిధంగా డయాబెటిస్ లేక అలాంటి వ్యాధులుంటాయి....

    చేసిన పుణ్యాలకు చాలా డబ్బును ఇచ్చి, చేసిన పాపాలకు ఫలితంగా ఇష్టమైన ఆహారాన్ని తినలేని విధంగా సుగర్ వంటి వ్యాధులను వచ్చేలా చేస్తారు.

     కష్టాలు రాకుండా ఉండాలంటే, మనస్సును నిగ్రహించుకోవటానికి ప్రయత్నించక తప్పదు. 

    ...........................

    అయితే, గతంలో చేసిన పాపాలకు దృఢంగా పశ్చాత్తాపపడి ఇక మీదట పాపాలు చేయటం మాని, పూజలు చేయటం, కష్టాల్లో ఉన్నవారికి సాయంచేయటం.. వంటి పరిహారాలు, పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే.. గతపాపకర్మ ఫలితం గణనీయంగా పలుచబడి, తక్కువ కష్టాలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కష్టాలు వచ్చినా పెద్ద కష్టం తెలియకుండానే ఆ కష్టాలు గడిచిపోవచ్చు.

    కష్టాలలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడు వారు పొందిన సంతోషం వల్ల మన పాపకర్మ పలుచబడే అవకాశముంటుంది.

    పరిహారాలు సరిగ్గా పనిచేయాలంటే, పాపాలు చేస్తూనే పరిహారాలు చేయటం కాకుండా, పాపాలు చేయటం మాని పరిహారాలు చేస్తూ ఉండాలి.
    ...................................

    మద్యానికి అలవాటు పడ్డ కొందరికి మద్యం హానికరమని తెలిసినా దానిని వదలలేరు. మద్యం వల్ల వ్యాధి వస్తే కొందరు దానిని తీసుకోవటం మానేస్తారు. కొందరు వ్యాధి వచ్చినా మద్యాన్ని మానలేరు. 

    అలాగే పాపాలు చేయటం తప్పని, అందువల్ల కష్టాలు వస్తాయని తెలిసినా, కొందరు పాపాలు చేయటాన్ని మానుకోలేరు. అలాంటివాళ్లకు పరిహారాలు చేయమనే చెప్పాలి. 

     పాపపరిహారం కొరకు పరిహారాలు చేయటం మంచిదే....పాపపరిహారాలు చేయగాచేయగా ఆ పుణ్యం వల్ల వాళ్ల పాపప్రవృత్తి పోవచ్చు. 

    సరైన దైవభక్తి లేకుండా, అహంకారం కలిగి ఉండటం, పాపభీతి లేకుండా చేసే పరిహారాల వల్ల గొప్ప మంచి ఫలితాలు ఉండకపోవచ్చు. 

    పూజలు, దానధర్మాలను చేయటం వంటి పరిహారాల వల్ల, చేసేవాళ్లకు మంచిదే ..సమాజానికి మంచిదే. పరిహారాలు చేసేవాళ్ళకు పుణ్యం పెరుగుతుంది. సమాజానికి లాభం జరుగుతుంది.
    ............................

    ఎవరికైనా మంచిగా మారటానికి దైవము కొన్ని అవకాశాలను ఇస్తారు. 

    ఎన్ని అవకాశాలు ఇచ్చినా మంచిగా మారకుండా సమాజానికి హాని కలిగే విధంగా పాపాలు చేసినవాళ్లు...  ఒకవేళ సమాజం వేసే శిక్షల నుండి తప్పించుకున్నా కూడా, దైవం నుండి తప్పించుకోలేరు.

    ...........................

    దైవభక్తి..ధర్మబుద్ధి ఉండేలా దైవాన్ని ప్రార్ధించుకుంటే బాగుంటుంది.

    ......................... 

     అజామిళుని కధ. వంటి కధలను చెప్పటంలో....link krimda..

    link.... ఓం ..కొన్ని విషయములు..

     link..జాతకంలో రాసిపెట్టి ఉన్నది అనుభవించక తప్పదా ?