ఈ రోజుల్లో మన దేశంలో చాలామంది.. కొన్ని విషయాలలో విదేశాల వారిని అనుకరించటానికి బాగా ప్రయత్నిస్తున్నారు.
ఇతరులలో ఉన్న మంచిని మనం గ్రహించాలి. చాలామంది మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు ఉన్నవారు ఉంటారు.
****************
రసాయనిక పురుగుమందులను విదేశీయులే కనుగొన్నారు.
అయినా, వాటివల్ల కలిగే నష్టాలను గుర్తించి ..... రసాయన పురుగుమందులను వాడని ఆహారాన్ని తీసుకోవటానికి వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తున్నారు.
భారతదేశం నుంచి ఎగుమతి అయిన కొన్ని పంటల ఉత్పత్తులను పురుగుమందుల అవశేషాలు ఉన్నాయనే కారణంతో విదేశాల వాళ్ళు తిరస్కరించటం కూడా జరిగింది.
అయినా మనలో చాలామంది రసాయన పురుగుమందులను విచ్చలవిడిగా వాడుతూనే ఉన్నారు.... భారతీయులు తిరిగి మన సేంద్రియవ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది.
ఉదా.సుభాష్ పాలేకర్ గారు తెలియచేస్తున్న సేంద్రియ వ్యవసాయం చేయాలి.
***********
ఇంకో విషయం ఏమిటంటే, ఎందరో విదేశాల వాళ్ళు తమ విద్యుత్ అవసరాల కోసం సోలార్ విద్యుత్ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
అపారంగా సూర్యరశ్మి లభించే మనదేశం వాళ్ళేమో సోలార్ విద్యుత్ కు ప్రాధాన్యత ఇస్తూనే, ఇంకా ధర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మించటం కోసం తాపత్రయపడుతున్నారు.
***********
ఎంతో గొప్ప విలువలు, విజ్ఞానం వారసత్వంగా కలిగినది భారతదేశం.
అయితే, మన దేశంలోనే కొందరు .. భారతీయ విధానాలను తక్కువచేసి మాట్లాడుతుంటే ఎందరో విదేశాల వాళ్ళు యోగా, ధ్యానం, భారతీయ ఆయుర్వేద పద్ధతులు.. మొదలైన విషయాల గురించి ఆసక్తి చూపటం ఆశ్చర్యకరమైన విషయం.
..........................
* క్రింద విషయాలను ఈ పోస్ట్ వ్రాసిన చాలా కాలం తరువాత వ్రాసి, ఇక్కడ ప్రచురించటం జరిగిందండి.
.............
.............
లోకంలో కొందరు బలవంతులు బలహీనమైన జీవులపట్ల పెత్తనం చేస్తుంటారు. కొందరుమగవాళ్లు స్త్రీలపట్ల పెత్తనం చేస్తారు.కొందరుస్త్రీలు కూడా సాటి స్త్రీల పై పెత్తనం చేస్తారు. కొందరుస్త్రీలు పిల్లలపై కోపాన్ని ప్రదర్శిస్తారు. కొందరుమనుషులు జంతువులను చంపుతారు. అలా కాకుండా బలమైన మంచివాళ్ళు, తమ బలాన్ని, తెలివితేటలను బలహీనులకు సాయపడటానికి ఉపయోగించాలి. మనుషులు మానవత్వంతో జీవించాలి.
***************
జన్మ ఎత్తాక ఎవరికీ వందశాతం అంతా సుఖమే ఉండకపోవచ్చు. సమాజంలో ఎవరి కష్టసుఖాలు వారికున్నాయి.
బ్రాహ్మణులు చాలా నియమాలను పాటించాలి. వేదవిద్య నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు చాలా కష్టపడాలి.ఎంత చేసినా తగినంత ధనం లభిస్తుందో లేదో తెలియదు. క్షత్రియులు, సైనికులు యుద్ధవిద్యలు నేర్చుకోవాలి.వాళ్లు యుద్ధానికి వెళ్తే ప్రాణాలతో తిరిగి వస్తారో రారో? తెలియదు.వైశ్యులకు వ్యాపారం కొంత ఫరవాలేదు కానీ, వాళ్లు అధికలాభాలను తీసుకోకుండా, ధర్మంప్రకారం మాత్రమే వ్యాపారంలో లాభాలను పొందాలి.శూద్రులకు బ్రాహ్మణులకులా చాలా నియమాలు లేకుండా, కొంత సడలింపులు ఉంటాయి.కొంత స్వేచ్చ ఉంటుంది.ఈ రోజుల్లో ఎందరో గొప్పగా భావిస్తున్న ఇంజనీరింగ్ ఉద్యోగాలు కూడా శూద్రులు చేసే వృత్తివిద్యలే.
ప్రాచీనకాలంలో
కొందరు విదేశీయాత్రికులు తమ గ్రంధాలలో భారతదేశంలో పేదరికం లేదని వ్రాసారు.
అంటే, అన్ని వృత్తులవారు చక్కగానే ఉన్నారనే కదా అర్ధం.
అయితే, కాలక్రమేణా కొందరు స్వార్ధపరులు ప్రజల మధ్య ఎక్కువతక్కువ తారతమ్యాలు మొదలుపెట్టటం, మూఢనమ్మకాలు ప్రవేశపెట్టడం వల్ల సమాజానికి నష్టం జరిగింది.
...................................
భారతదేశం ఎంతో గొప్పది. సనాతనధర్మము ఎంతో గొప్పది.
ఇక్కడ ఎందరో గొప్పవారున్నారు. అయినా
కూడా, భారతదేశం కొంతకాలం విదేశీపాలనలో ఉండటం, విదేశీమతాలు ఇక్కడ
ప్రవేశించటం, దేశవిభజన సమయంలో జరిగిన హింస ఎవరూ ఆపలేకపోవటం ఏమిటో మరి?అనే సందేహాలు కలుగుతాయి.
కొన్ని గ్రంధాలలో కొన్ని మూఢనమ్మకాల గురించి వ్రాసిన విషయాలు బాధగా అనిపిస్తాయి...ఇలాంటివి ప్రక్షిప్తాలని నా అభిప్రాయం.
.....................
పాతకాలంలో కొందరిపట్ల కొంత వివక్ష ఉన్నమాటనిజం. అలాగని చాలా వివక్ష ఉందనటం సరైనదికాదు, అసలు వివక్షే లేదనటమూ సరైనది కాదు.
udaa..నాకు తెలిసినంతలో, ఒక కులానికి చెందిన మహాభక్తుని పట్ల దేవాలయ ప్రవేశాన్ని నిరాకరిస్తే, దైవమే ఆ భక్తుని కరుణించి దర్శనాన్ని అనుగ్రహించిన సంఘటన, కధ ద్వారా తెలిసే ఉంటుంది. ఈ విషయాలను గమనిస్తే, కొందరి పట్ల వివక్షతో ప్రవర్తించారని అర్ధమవుతోంది కదా..
మాంసాహారాన్ని తినకూడదని వేదములలో ఉందని కొందరు పండితులు చెబుతున్నారు.
హిందువుల్లోనే కొందరు దైవానికి బలులు అని
ఇచ్చి, ఆ మాంసాన్ని తింటారు. ఏమిటో?
నాకు ఏమనిపిస్తుందంటే, పశుపక్ష్యాదులను కష్టపెట్టి, దైవానికి మాంసాహారాన్ని సమర్పించటం ఎంతవరకు సరైనది? దేవుని పేరుచెప్పి ఇంత హింస ఏమిటో?
పాతకాలంలో కొన్నిచోట్ల జోగినివ్యవస్థ పేరుతో స్త్రీలపట్ల అన్యాయాలు జరిగినప్పుడు, అలాంటివి ఆపాలి కదా..
సమాజం కొరకు ఎన్నో చక్కటి విషయాలను గ్రంధాల ద్వారా తెలియజేసిన ప్రాచీనులు, మూఢత్వంతో ప్రవర్తించమని ఎవరికీ చెప్పరు.
అయితే, కాలక్రమేణా కొందరు స్వార్ధపరులు ప్రజల మధ్య ఎక్కువతక్కువ తారతమ్యాలు మొదలుపెట్టటం, మూఢనమ్మకాలు ప్రవేశపెట్టడం వల్ల సమాజానికి నష్టం జరిగింది.
మంచికోసం మతము. దైవాన్ని మహాశక్తిగా తలచి భక్తిగా దైవాన్ని స్మరించుకోవటం, సాటి జీవులకు నష్టం కలిగించకుండా మంచిగా జీవించటం..వంటివి చేస్తే దైవము కరుణిస్తారు.
మతాలు, ఆధునిక విజ్ఞానం.. మంచికి ఉపయోగపడాలి. అయితే, కొందరు వీటిని కూడా తమకు తగ్గట్లు మార్చి, సమాజంలో సమస్యలు సృష్టించటం అత్యంత బాధాకరం.
కొందరు తమ కోరికలు, కష్టాలు తీరటం కొరకు, జీవహింస చేసే విధంగా కూడా మతాన్ని ఉపయోగిస్తే ఇక దైవమే దిక్కు.
ఆధునిక విజ్ఞానం అంటూ కొందరు ప్రపంచానికి.. జీవులకు హానిచేసే విధంగా (జీవహింస చేసే విధంగా) కూడా ఉపయోగిస్తే ఇక దైవమే దిక్కు.
ఆధ్యాత్మికమైనా, ఆధునిక విజ్ఞానం అయినా అతి పోకడలు పోతే అనర్ధమే.
*********************
మంచివాళ్లు తమపనిని వదిలేస్తే , చెడ్దవాళ్లు విజృంభించి సమాజాన్ని తమ ఇష్టం వచ్చినట్లు బాధపెట్టే పరిస్థితి వచ్చే ప్రమాదముంది. అలా జరగకుండా ఉండాలంటే మంచివాళ్లు తమ స్వధర్మాన్ని చక్కగా పాటించాలి. స్వధర్మాన్ని చక్కగా పాటించటం కూడా దైవపూజయే.
మహాభారతసంగ్రామంలో శ్రీకృష్ణపరమాత్మ.. యుద్ధం చేయలేనని పలికిన అర్జునునితో స్వధర్మాన్ని పాటించవలసిన ఆవశ్యకతను గుర్తుచేసారు. అంతేకానీ, జీవితంలో వైరాగ్యమే ముఖ్యం అని, తన స్వధర్మాన్ని మాని, విరాగిగా ఉండమని చెప్పలేదు.మోక్షాన్ని పొందటం జీవితపరమలక్ష్యమే కానీ, చతురాశ్రమాల ప్రకారం చక్కగా జీవించి దైవాన్ని పొందాలి.
జనకమహారాజు నిష్కామకర్మయోగంతో చక్కగా జీవించారంటారు.
No comments:
Post a Comment