koodali

Saturday, January 21, 2017

ఆహారం విషయంలో...


 
మన పెద్దలు ఎంతో విజ్ఞానాన్ని అందించారు.

 ఆయుర్వేదం ద్వారా ఎన్నో అద్భుతమైన  మూలికల గురించి  తెలియజేసారు..



 సరస్వతి ఆకు, అశ్వగంధ, పునర్నవ ..వంటివి ఎంతో శక్తివంతమైన ఔషధాలు. 
 

వీటిని కొన్ని గ్రాములు వరకూ మాత్రమే అంటే సుమారు 2 లేక 3 గ్రాములు..ఔషధంగా  తీసుకోవాలంటున్నారు. 
 

వీటిని ఎంత మోతాదులో , ఎన్ని రోజులు వాడాలనేది ఆయుర్వేద నిపుణుల సలహా ప్రకారం వాడటం మంచిది.


ఉసిరి, కరక్కాయ, పిప్పళ్లు.. వంటివి ఎంతో  విలువైనవి. 


ఇంకా  చక్కటి ఆహారవిధానాన్ని తెలియజేసారు. నవధాన్యాలను గురించి తెలియజేసారు.


  ఆహారంలో ఆవాలు, జీలకర్ర, మెంతులు, పసుపు, అల్లం, శొంఠి, వాము.. ..వంటి ఎన్నో విలువైన వాటిని  వంటలో చేర్చి వండే విధానాలను నేర్పించారు. ఇందువల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.


అయితే, ఈ రోజులలో సాంప్రదాయ ఆహారాన్ని తీసుకోవటం తగ్గించి.. ఫాస్ట్ ఫుడ్  ఎక్కువగా తినటం వల్ల కూడా అనారోగ్యాలు వస్తున్నాయి.


ఈ మధ్య సోయా తింటే మంచిదంటూ విపరీతంగా వాడుతున్నారు.


సోయా మంచిదే కానీ , ఎక్కువగా తింటే మంచిది కాదని అంటున్నారు.


అందువల్ల ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


 ప్రాచీనులు తెలియజేసిన .. తరతరాలనుండి పెద్దవాళ్ళు అలవాటుచేసిన ఆహారపు అలవాట్లను వదిలి వేసి ... జంక్ ఫుడ్ కు అలవాటు పడటం మంచిది కాదు.


ఈ రోజుల్లో విదేశాల వాళ్లు కూడా భారతీయ ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తున్నారు . మన వంటలను ఇష్టపడుతున్నారు.



No comments:

Post a Comment