koodali

Wednesday, August 18, 2010

ఇది సవరించుకోవలెను.......

 

ఇంతకు ముందు ఒక వ్యాసంలో నేను నరకాసురుని వధ తరువాత శ్రీకృష్ణుల వారు 16 వేల మంది రాజకుమార్తెలను వారి రక్షణకొరకు వివాహం చేసుకున్నారే కానీ వారితో కలిసి జీవించలేదు అని వ్రాసానండి. అయితే శ్రీకృష్ణుల వారికి వారి 16 వేలమంది భార్యలకు సంతానం కలిగారట. పొరబాటుగా వ్రాసినందుకు అందరూ దయచేసి క్షమించాలండి..


ఇక మన ప్రాచీన గ్రంధములలో చాలా విజ్ఞానం కూడా ఉందండి. ఉదా...ఈ రోజుల్లో స్టెం సెల్స్ అనబడే మూలకణముల వల్ల చాలా ప్రయోజనములున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.


ఈ కణములను శరీరమునుండి మరియు అప్పుడే పుట్టిన శిశువు బొడ్డు తాడు నుండి సేకరిస్తారట. ఈ కణములవల్ల నుంచి క్రొత్త శరీరకణములను సృష్టించవచ్చట. ఇవన్నీ వింటుంటే నాకు వీటి గురించి మన పెద్దలకు ముందే తెలుసుననిపిస్తోంది.


విష్ణుమూర్తి బొడ్డునుండి ఏర్పడిన పద్మ నాళం పద్మము, అందులో కూర్చుని ఉన్న బ్రహ్మదేవుడు ఈయన సృష్టిని చేస్తారుకదా.. ఇవన్నీ ఆలోచిస్తే ఈనాటి మూలకణములతో పోలిక ఉందనిపిస్తోంది.. .


అలాగే ఇంకో ఆచారం గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. కొంతమంది పెద్దలు బిడ్డ పుట్టిన తరువాత బొడ్డుత్రాడును భద్రపరిచి ,దానిని రాగిరేకులో పెట్టి తాయెత్తులా బిడ్డకు కట్టేవారు, ఇలా చేయటం వల్ల బిడ్డకు మంచిది అని చెప్పేవారు.


అంటే మనము ఈనాడు మూలకణములను స్టెంస్టెల్స్ ను దాచే బాంక్ లో భద్రపరిచి అవసరమైనప్పుడు వాడుకుంటున్నట్లు .... అప్పటివారు రాగిరేకులో భధ్రపరిచే ఆచారం పెట్టారేమో అని నాకు అనిపించిందండి. మనం ఇవన్నీ గ్రహించక చాదస్తపు ఆచారాలు అనుకుంటాము. ఏమైనా ఇది నా ఊహ మాత్రమే.. .

ఇంకో విషయమండి నైతిక విలువలతో కూడిన శాస్త్ర విజ్ఞానం వల్ల మాత్రమే మంచి జరుగుతుంది. లేకపోతే అంతా వినాశనమే.

వ్రాసిన వాటిలో తప్పులు ఉన్నచో భగవంతుడు దయచేసి క్షమించవలెనని నా ప్రార్ధన. . 

 

No comments:

Post a Comment