koodali

Monday, August 2, 2010

వ్రాయాలని అనిపించిన ఇంకొన్ని సంగతులు.....

ఓం.

మనలో కొందరు యోగశక్తులను, ఇంకా ఇలాంటి గొప్ప విషయాలను నమ్మలేరు కానీ ఒక యోగి ఆత్మ కధ గ్రంధము అందరూ చదువవలసిన గొప్ప గ్రంధము. సంఘటన అందులోనిదే.

శ్రీశ్రీ యుక్తేశ్వర్ గిరి గారు శ్రీ యోగానంద గారితో కొన్ని మాటలు చెబుతూ మాటలు కూడా అంటారు. ప్రపంచమంతా నీకోసం మారాలా ?నువ్వే మారు. దోమల్ని గురించిన స్పృహ వదుల్చుకో. అని. అశ్రమంలో ఉన్న కొత్తలో ఆయన దోమలవల్ల ఇబ్బంది పడేవారట.
.ఇందులోని మాటలను నేను ఇంకో విషయం చెప్పటానికి వాడినందుకు వారు నన్ను దయచేసి క్షమించాలని నా ప్రార్ధన...


ఇంకో దగ్గర సమాధిలోని ప్రధమావస్థలో (సవికల్పస్థితి} యోగి, బాహ్య ప్రపంచపు ఇంద్రియ బోధలన్నిటిని అటకాయించేస్తాడు. అని పుస్తకములో చెప్పబడింది. . ..

ఒకోసారి ప్రపంచాన్ని, జరిగే సంఘటనలు చూస్తుంటే చాలా నిరాశగా ఉంటుందండి. అసలు పెద్దలు ఏమి చెప్పారంటే ప్రపంచాన్ని మార్చటం ఎందుకు ముందు నువ్వు మారు అని.

మన మనస్సుని అదుపులో పెట్టుకోవటం చేతకాని మనం ఇతర జీవులపై ప్రయోగాలు చేస్తూ మన స్వార్ధం కోసం వాటి జీన్స్ ను మన ఇష్టప్రకారం మారుస్తూ అది ఒక గొప్ప పని అని మురిసి పోతున్నాము.


ఇంకా కొన్ని సంగతులు వ్రాయాలనిపిస్తోంది అండి. గోలోకం అని ఒక అధ్బుతమైన లోకం ఉందట. కృష్ణపరమాత్మ రాధాదేవి లోకమునకు అధిపతులట. వారిద్దరు పతీపత్నులు. అక్కడ ఎంతోమంది గోపాలురు, గోపికలు కూడా ఉంటారని పెద్దలు చెబుతున్నారు.


ఇంతకుముందు మనము శ్రీకృష్ణులవారు శంకరుని కొరకు తపస్సు చేశారని చెప్పుకున్నాము కదండి. మరియు గణాధిపత్యం కొరకు గజాననుడు,కుమారస్వామికి మధ్య పోటీ జరిగినప్పుడు శివుడు వినాయకునికి నారాయణ మంత్రము యొక్క శక్తిని వివరించారని అనుకున్నాము. మరి అయ్యప్పస్వామి వారి ఆవిర్భావమునకు కూడా శివ, విష్ణువులే కారకులు కదా... ఇలా ఎన్నో సంఘటనలు వారిద్దరిమద్యన భేదభావం లేదని నిరూపిస్తున్నాయి.


ఇంకా, మహాభారతయుధ్ధములో శ్రీకృష్ణులవారు ప్రత్యక్షముగా పాల్గొంటే , శంకరుడు, ఆంజనేయస్వామి వారు పరోక్షముగా పాల్గొని యుధ్ధములో ధర్మమును రక్షించారని పెద్దలు తెలియచేస్తున్నారు. శ్రీకృష్ణులవారు చిన్నతనం నుంచీ కూడా మానవాతీత మహిమలు ప్రదర్శించారు.


అలాగే ఒకప్పుడు శ్రీకృష్ణులవారు... నారదుల వారికి , తన దివ్యశక్తితో ఒకే సమయములో తన అష్టభార్యలయొక్క నివాసములలో దర్శనమిచ్చారట.


మనలో కొంతమందికి అన్నీ మంచి గుణములే ఉంటాయి, కానీ ఒక చిన్న బలహీనత ఉంటే దాన్నీ పెద్దగా పట్టించుకోము. కాని ఒక చిన్న గుణము వల్ల కూడా జీవితములు తలక్రిందులు అవుతాయని కూడా మనము ధర్మరాజువారు జూదములో ఓడటం ...... ఇంకా ఇలా ఎన్నో కధల ద్వారా తెలుసుకోవచ్చు.


ఇలా మన ప్రాచీన గ్రంధములలో ఒక్కొక్క సంఘటనకు ఎన్నెన్నో అర్ధములు ,ఉంటాయి. అందుకే అవి మహాధ్భుత గ్రంధములు.


అయితే నేను ఇంతకుముందు ఇవన్నీ వ్రాయటానికి కొంచెం భయంగా ఉంది అని ఎందుకు అన్నానంటేనండి, ఇవన్నీ గొప్ప సంగతులు, వ్రాసేటప్పుడు పొరపాటు రాకూడదు కదా ..... అందుకని .....అదిన్నూ ఎవరైనా ఏదైనా పరీక్షకుగాని, ఇంటర్వ్యూకి గాని వెళ్ళేటప్పుడు కొంచెమైనా టెన్షన్ ఉంటుంది కదా.....అలాగే ఇది నాకు పరీక్ష. ఎన్ని మార్కులు వస్తాయో భగవంతునికే తెలియాలి. .


ఏదో ఆ దైవం దయవల్ల నా అభిప్రాయములు మీకు చెప్పుకోగలిగాను. ఇందులో వ్రాసిన సంగతులు కొన్ని ఇంతకుముందు ఎప్పుడూ నాకు ఆలోచనకు కూడా రాలేదు. అందుకే నేను అంతా దైవం దయ అనేది.



4 comments:

  1. nijame namDi, amtha devuDi daya...

    ReplyDelete
  2. చదివినందుకు చాలా థాంక్స్ బ్రదర్. ఇప్పుడే మీ బ్లాగ్ చూశానండీ. మీరు వ్రాసిన కవిత్వం చాలా బాగుందండి.

    ReplyDelete
  3. మన మనస్సు ఒక సెల్ ఫోన్ లాంటిది. ప్రకృతి ప్రేరేపణలు మన మనస్సుకు తగిలే సంకేతాలు. సంకేతాల వలన చెలరేగేవే భావాలు. ఆ భావాలే మన నుండి ప్రభావించేవి. అందుకనే ముందుకు సాగండి ధృఢంగా.

    ReplyDelete
  4. చదివినందుకు చాలా థాంక్స్ సార్. ఒక పొరపాటు జరిగింది సార్. అందుకే మళ్ళీ సరిదిద్దవలసి వచ్చిందండి. నాకు కొన్నిసార్లు వ్రాసిన తరువాత మళ్ళీ దిద్దవలసివస్తోందండి...

    ReplyDelete