koodali

Monday, January 22, 2024

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్....2

 

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. లింక్స్ పైన క్లిక్ చేసి చదవగలరు..

 

దైవం నిత్యం.. దైవానికి ఆది, అంతము లేవు ..ఉదాహరణ.....

 

 పురాణేతిహాసాలలోని పాత్రలు, సంఘటనల ద్వారా ... చక్కట...

 

 మహాభారతం గురించి కొన్ని విమర్శలు...నా అభిప్రాయ...

 

 ముహూర్తాలు...మరి కొన్ని విషయాలు.

 

 జీవితంలో సంపాదన ఉంటే చాలా ?

 

 ".Matter and energy cannot be created or destroyed...

 

 అప్పుడు ..ఇప్పుడు .. కొన్ని విషయాలు ...

 

 వేదం ఒప్పుకున్నదే సద్ధర్మం.......

 

 ఆడవాళ్ళ మధ్యే ఇన్ని గొడవలు ఉండగా..

 

 ఎలా జీవించాలి ? ఎలా జీవించకూడదు ? కొన్ని విషయా...

 

8 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete

  2. దైవభక్తి కలిగి, అవసరమైనంత వరకూ విషయాలను తెలుసుకుని, దైవాన్ని నమ్ముకుని సత్కర్మాచరణతో చక్కగా హాయిగా జీవితాన్ని గడుపుతూ దైవకృపను పొందవచ్చు.

    అయితే, సరళంగా ఉండే జీవితాలను క్లిష్టంగా చేస్తున్నారు కొందరు. ఆచారవ్యవహారాల పేరిట కొందరు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు. ఉదా..కొందరు రకరకాలపుకార్లను ప్రచారం చేస్తారు..ఇక, జనానికి వేలంవెర్రి భయం మొదలవుతుంది. ఇదేమిటోగాని,ఇలాంటివాటి పట్ల ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తారు.

    పాపాలు చేయకండి, చేస్తే కష్టాలు.. నష్టాలు వస్తాయని ప్రాచీనులు తెలియజేసినా కూడా, జనం పెద్దగా పట్టించుకోరు. పాపాలు చేయటానికి భయపడరు. మూఢనమ్మకాలను వెర్రిగా నమ్మి వాటి వెనుక పడతారు.

    ఇవన్నీ ఎవరు ఎందుకు చెబుతున్నారో గానీ, ఇదంతా గమనిస్తే .. ఏం చేయాలో? ఏం చేయకూడదో ? తెలియక ..ప్రజలు అయోమయానికి గురయ్యే విధంగా పరిస్థితి వస్తోందా? అని కూడా సందేహాలు కలుగుతున్నాయి.

    మరికొందరు చెప్పే విషయాలను గమనిస్తే, ప్రజలను గందరగోళానికి గురి చెయ్యటానికి ఎవరైనా అలా చెప్తున్నారేమో? అనికూడా సందేహంగా అనిపిస్తుంది. ఇవన్నీ పాటించలేకపోతున్నామని కొందరు వాపోతుంటారు.. అయినా, పట్టించుకోకుండా చెప్పేవారు చెబుతున్నారు..వినేవారు వింటున్నారు.

    హిందువులు తమకు ఉన్న కొన్ని మూఢనమ్మకాలను వదిలించుకుంటే మంచిది. వీటివల్ల ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. వీటివల్ల కుటుంబాలలో గొడవలు కూడా వస్తున్నాయి. పాటించకపోతే ఏమవుతుందోననే భయంతో కొందరు మానసికంగా నలిగిపోతున్నారు.

    హిందువులలోనే ఎన్నో భేదాభిప్రాయాలున్నాయి. కొన్నివిషయాలలో ఎవరి అభిప్రాయాలు వారివి. ఇలాంటప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో దైవానికే తెలియాలి.

    ఇప్పుడు కొందరు అనేకరకాల పూజల గురించి చెబుతున్నారు. పాతకాలంలో ఇన్నిరకాల పూజలు అందరికీ తెలిసేవికాదు. అందరూ ఆచరించేవారుకాదు. కొన్నిపూజలకు అనేకనియమాలుంటాయట. ఈ విషయాలగురించి కూడా అనేక అభిప్రాయభేదాలున్నాయి. ఇవన్నీ విని సామాన్యులకు ఏం చేయాలో అర్ధంకాదు. దైవమే దిక్కు.

    ఇక, కొందరు కొన్నిపూజలను చెబుతుంటారు. కొందరు జంతుబలులతో చేస్తారట. కొందరు ఎండుమిరపకాయలవంటి వాటితో చేస్తారట. జంతుబలులకన్నా, ఎండుమిరపకాయల వంటివి కొంతనయమే. అయితే,ఈ విధానాలలో చాలా నియమాలుంటాయట. అవన్నీ పాటించటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు.. ఇలాంటి విషయాల గురించి దైవానికే సరిగ్గా తెలియాలి.

    ReplyDelete
    Replies
    1. ఆచారవ్యవహారాలలో ఆధ్యాత్మికత, ఆరోగ్యం, ఎంతో విజ్ఞానం ఉంది. అయితే కొందరు వాటిని సరిగ్గా అర్ధం చేసుకోకుండా అసలు విషయాన్నే మార్చేస్తుంటారు. ఉదా..పాతకాలంలో భోగిరోజున భోగిమంటలో ఇంట్లో ఉన్న పాతచెక్కసామాన్లను కూడా పడేసేవారు. అలా పర్యావరణహితంగా పాతసామాను పర్యావరణంలో కలిసిపోయేది. ఈరోజుల్లో కొందరు పాతటైర్లను కూడా భోగిమంటలో వేస్తున్నారు.పర్యావరణాన్నిపాడుచేస్తున్నారు. ఆచారవ్యవహారాల్లోని అసలు విషయాన్ని మార్చేస్తున్నారు.

      ఇక, ఈరోజుల్లో యూట్యూబ్ ద్వారా ఎందరో ఎన్నో చిత్రవిచిత్రమైన ఆచారవ్యవహారాలను చెబుతున్నారు. ఇలాంటివి గమనించినప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇలా చెబుతున్నారంటే, ఇక తరతరాలనుండి ఎందరు ఇలాగ్రంధాలలో విషయాలను మార్పులుచేర్పులు(ప్రక్షిప్తాలు) చేసి ఉంటారో? అని సందేహాలు కలుగుతాయి. గ్రంధాలలో ఏవి పెద్దలు చెప్పినవో? ఏవి మార్పులుచేర్పులు చేసిన విషయాలో? తెలియదు. ఆచరణవిషయంలో విచక్షణతో నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అర్ధంకానప్పుడు దైవాన్ని ప్రార్ధించుకోవాలి.

      Delete
  3. పాతకాలంలో కొందరు స్వదేశీయులు కూడా కొన్ని పొరపాట్లు చేసారు. భారతీయులలో ఐకమత్యం ఉంటే విదేశీయులు ఈ గడ్దపై వ్రేళ్ళూనుకునేవారా? ఈ దేశాన్ని పాలించేవారా? అయితే, పాతకాలం వారు ఎందరో చేసిన త్యాగాల వల్ల దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఇప్పుడు కూడా భారతీయులలో ఐకమత్యం లేదు. ఇప్పుడు కూడా కొందరు ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు.

    మతం విషయంలో.. ఎవరిమతాన్ని వారు చక్కగా ఆచరించుకోవచ్చు. అయితే, కొందరు ఇతరులను మతం మార్చటానికి నయానా, భయానా ప్రయత్నించటం సరైనది కాదు. మన మతాన్ని మనం కాపాడుకోవాలి. దైవం దయవల్ల తిరుమలలో ..వాదవివాదాలు సమసిపోవాలి.

    ఇతరమతాల వారు కొందరు ఎన్నో పాఠశాలలు స్థాపించారు. చాలామంది హిందువుల పిల్లలు కూడా అక్కడ చదువుతుంటారు. ఆసుపత్రులు కూడా పెట్టారు. ఎందరో అక్కడకు వెళ్ళి వైద్యం చేయించుకుంటారు.
    దేవాలయాల ఆధ్వర్యంలో.. ప్రజలకు ఉచితం కాకపోయినా, తక్కువ ఖర్చుతో విద్య, వైద్యం అందించగలిగితే బాగుంటుంది.
    ...........
    ప్రపంచంలో అధికారం, డబ్బు కొరకు, కొందరు వ్యక్తులు ..కుల, మత, ప్రాంత..విభేదాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోటానికి ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు గొడవలు, యుద్ఢాలు.. జరిగే అవకాశం ఉంది. కొందరి వల్ల అందరికీ కష్టనష్టాలు కలుగుతాయి. అందువల్ల అందరూ విచక్షణతో ఆలోచించుకుని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.

    డబ్బు, అధికారం కొరకు గొడవలు, యుద్ధాలు జరిగితే అంతగా ఆశ్చర్యం అనిపించదు. కానీ, దైవం అంటేనే శాంతి. మరి, దైవం విషయంలో కూడా ప్రజలు గొడవలు పడటం బాధాకరం. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో ? ప్రపంచం ఎప్పుడు శాంతిగా ఉంటుందో? ఎక్కడైనా, ఎవ్వరైనా చిన్నపిల్లలు, మంచివారు కష్టాలు లేకుండా ఉండాలి.

    ప్రపంచంలో అందరూ, అన్నిజీవులు మంచిగా ఉండాలి.

    ReplyDelete
  4. వేదములలో అపారమైన విజ్ఞానం ఉంటుంది. మరి, అంతటి గొప్ప విజ్ఞానం నేర్చుకోవాలంటే ఎన్నో నియమాలు ఉంటాయి. లౌకికమైన విద్యలు నేర్చుకోవాలంటేనే ఎన్నో ఆంక్షలు ఉంటాయి.
    ఉదా.. లౌకికమైన చదువులు చదవాలంటేనే ఎన్నో అడుగుతారు. నేర్చుకోవాలని ఉన్నా అందరికీ ప్రవేశం ఇవ్వరు. మరి ఎంతో గొప్పదైన వేదవిద్య నేర్చుకోవాలంటే ఎన్ని చూడాలి.

    వేదవిద్యను దుర్వినియోగం చేయకూడదు. దుష్టులకు ఆ విద్యలు అందకూడదు. ఇవన్నీ ఆలోచించి ఎన్నో కట్టుబాట్లను విధించారు. సాత్వికతతో కూడిన నియమాలు ఉంటాయి. దినచర్య పద్ఢతిగా ఉండాలి. ఇలా ఎన్నో ఉంటాయి. దైవభక్తి, ఉపాసనాబలం, సత్ప్రవర్తన..వంటివి ఉన్నప్పుడు విద్య బాగా అర్ధమవుతుంది.

    కొన్ని కుటుంబాల్లో వంటల తయారీవిధానాల గురించి కూడా ఇతరులకు చెప్పరు. తరతరాలుగా వారి కుటుంబాల్లోని వారికే ఆ విషయాలను చెబుతుంటారు. ఈ రోజుల్లో కూడా కొన్ని సంస్థలు.. వారి సంస్థకు సంబంధించిన ఫార్ములాలు, రహస్యాలు బయటకు తెలియనివ్వరు. మరి, అత్యంతవిలువైన వేదవిద్యను తెలుసుకోవాలంటే ఎన్నో నియమాలుంటాయి కదా..

    వేదములు ఎంతోగొప్పవి.. ఎంతో ప్రయత్నిస్తే, కొద్దిగా తెలుసుకోవచ్చు అంటారు.. అన్నింటికీ మూలమైన దైవకృపను పొందటానికి ప్రయత్నించి సఫలమైన వారికి, అన్నీ లభిస్తాయి. ఈ విధంగా ఎవరైనా ప్రయత్నించవచ్చు.

    ReplyDelete
  5. రాజ్యానికి చెందిన గోప్యంగా ఉంచవలసిన అత్యంతరహస్యాలను అన్నీ పూసగుచ్చినట్లు ప్రతిఒక్కరికి చెప్పేస్తారా? కొన్నివిషయాలను మాత్రం చెబుతారు అంతే. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అయినా సరే పార్లమెంట్లోకి వెళ్ళి కూర్చుంటామంటే ఎప్పుడుపడితే అప్పుడు అందరినీ వెళ్ళనిస్తారా ? ఈ విషయంలో కొన్ని ఆంక్షలుంటాయి.అంతమాత్రాన వివక్ష అంటారా ?

    ReplyDelete
  6. కొన్ని విషయాల గురించి బయటకు చెప్పవచ్చుకానీ, సమాజక్షేమాన్ని దృష్టిలోఉంచుకుని కొన్నివిషయాలగురించి అందరికీ తెలియనీయరు. ఎవరుఎటువంటివారో తెలియదు కదా..

    ReplyDelete
  7. ఇంకొక విషయం..ఒక సంస్థలో పనిచేసే శాస్త్రవేత్తకు అనారోగ్యం వస్తే, ఎందరో వైద్యులను సంప్రదించినా వ్యాధి తగ్గలేదట. అప్పుడు ఆయుర్వేదవైద్యులు త్రిఫల వాడినా వ్యాధి తగ్గలేదట. త్రిఫల పాళ్ళు కొద్దిగా మార్చి వాడగా వ్యాధి పూర్తిగా నయమయిందట. రాజీవ్ దీక్షిత్ గారు ఉన్నరోజుల్లో ఈ విషయం జరిగిందని విన్నాను. త్రిఫల, అశ్వగంధ వంటివాటిని ఎవరికి తోచినట్లు వారు వాడటంకన్నా, ఆయుర్వేద వైద్యులను సంప్రదించి వాడుకుంటే మంచిది.

    Link..Arogya Rahasya 22.. fruits given by nature for our health.. Rajiv Dixit ..8.10 min.. వద్ద వినవచ్చు.

    ReplyDelete