koodali

Monday, February 5, 2018

మూఢాచారాల వల్ల కలిగే నష్టం కన్నా...ఆధునిక కాలంలో అభివృధ్ధి పేరుతో.....


ఆధునిక విజ్ఞానం అయినా ..ఆధ్యాత్మికత అయినా స్వార్ధ ప్రయోజనాలకు వాడకూడదు..


ఆధునిక విజ్ఞానాన్ని కొందరు తమ స్వార్ధానికి వాడుకుంటున్నట్లే ....ఆధ్యాత్మికతను కూడా కొందరు తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.


కొందరు స్వార్ధం వల్ల , మరి కొందరు  తెలిసీతెలియనితనం వల్ల ..సమాజంలో కొన్ని మూఢాచారాలను వ్యాపింపచేశారు.


.........................

అయితే, మూఢాచారాల వల్ల సమాజానికి కలిగే నష్టం కన్నా... గ్లోబల్ వార్మింగ్ వంటి   వాటి  వల్ల  ప్రపంచానికి   కలిగే  నష్టం ఎక్కువ. 

.......................
 ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా  వాతావరణపరిస్థితిలో  విపరీతంగా మార్పులు వచ్చాయి.


 విపరీతమైన ఎండ వేడి, విపరీతమైన చలి, వరదలు, తుఫాన్లు..    పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచంలో  క్లిష్టమైన పరిస్థితి  ఏర్పడవచ్చంటున్నారు.


ఆధునిక కాలంలో అభివృధ్ధి పేరుతో  ప్రపంచానికి, పర్యావరణానికి, కోట్లాది మూగజీవులకు ఎంతో హాని కలుగుతోంది.


పరిశ్రమల ద్వారా విడుదల చేస్తున్న ప్రమాదకర రసాయన వ్యర్ధాలు  నదులలో , సముద్రాలలో కలసి, భూమిలో ఇంకి,  ఆ నీటితో   పండించిన ఉత్పత్తులు తినటం వల్ల   మనుషులు, ఇతర జీవులు అనేక రోగాల బారిన పడటం జరుగుతోంది. 


   ప్లాస్టిక్  వంటి  వాటివల్ల కలిగే కొన్ని నష్టాలను అనుభవిస్తూనే ఉన్నాము.  ఇలా చాలా ఉంటాయి. 



ఇక అణు కర్మాగారాలనుంచీ విడుదలయ్యే అణువ్యర్ధాలను ఎక్కడ వదలాలన్న దానికి  సరైన  పరిష్కారం ఏమీ లేదు.

 ఆధునిక ఆవిష్కరణల వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయి.

కొన్ని విపరీత ఆవిష్కరణల వల్ల ప్రమాదాలూ కలుగుతున్నాయి.

ఆధునిక విజ్ఞానం అంటే నాకు ..వ్యతిరేకత ఏమీ లేదండి. 


ఆ విజ్ఞానం హాని చెయ్యకుండా ప్రపంచానికి ఉపయోగపడాలన్నదే నా అభిప్రాయం.

 గ్లోబల్ వార్మింగ్ వంటి  సమస్యల గురించి  అందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతో ఉంది. 




No comments:

Post a Comment