koodali

Wednesday, April 22, 2015

ప్రకృతి రక్షణ అంటే మనిషి మనుగడకు రక్షణ. ..

 
ఈ రోజు ధరిత్రీ దినోత్సమట . పర్యావరణాన్ని కాపాడుకున్నప్పుడే ధరిత్రి (భూమి ) బాగుంటుంది.

మొక్కలను బాగా నాటి చక్కగా పెంచాలి. ఇందువల్ల అధిక ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.


అడవులను రక్షించుకోవాలి. అడవులు దట్టంగా ఉంటే వర్షాలు చక్కగా కురుస్తాయి. నీటి కరువు రాకుండా ఉంటుంది. 


అడవులు అంతరించకుండా కాపాడుకోవటానికి హెలికాప్టర్లను ఉపయోగించి వర్షాకాలం ప్రారంభంలో  కొండలపై విత్తనాలను చల్లవచ్చు. 

.............

శేషాచలం అడవుల్లో నిప్పు వ్యాపించటం గురించిన వార్తలు వచ్చినప్పుడు , కేవలం చెట్లకొమ్మలను చేత్తో పట్టుకుని నిప్పును ఆర్పటానికి  ప్రయత్నించే  సిబ్బంది చిత్రాలను మీడియా ద్వారా చూసి ఉంటాము. 


 అగ్ని ప్రమాదాలను అదుపు చేయటానికి అవసరమైన సామాగ్రిని  సిబ్బందికి  అందించ వచ్చు . 


  శేషాచలం కొండలపైన  ఇంతకుముందు  ఒకసారి అగ్నిప్రమాదం జరిగినప్పుడు , హెలికాప్టర్ల సాయంతో నీటిని జల్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు గుర్తుంది.


 అగ్నిప్రమాదం చిన్నదిగా ఉన్నప్పుడు ..   ఫయర్ ట్రక్స్ సాయం కూడా తీసుకోవచ్చు. (ఫైర్ ట్రక్స్..కొండదారులలో ప్రయాణించటానికి వీలుగా డిజైన్ చేసుకోవచ్చు.)


మరికొన్ని వివరాలను ఇక్కడ చూడవచ్చు .. 

3 Ways to Fight a Forest Fire - wikiHow

.........

మడ అడవులను కూడా రక్షించుకోవాలి. వీటివల్ల సముద్ర తీరం కోతకు గురికాకుండా ఉంటుందంటారు.

............
మొక్కలు బాగా పెంచితే ఎన్నో లాభాలున్నాయి. వృక్షాల  వల్ల వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. 
................
 వృక్షాల వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుందని అంటారు. అయితే, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా ! 

వాతావరణ కాలుష్యం మరీ ఎక్కువైతే వృక్షాలు కూడా తట్టుకోలేవు.

మనుషులు తమ  అంతులేని కోరికలను తగ్గించుకోవటమే ఎన్నో సమస్యలకు పరిష్కారం.




No comments:

Post a Comment