koodali

Friday, May 21, 2010

అందరికి ఆహారం మన మొదటి కర్తవ్యమ్ .........

 

  అసలు ప్రజలకు ప్రాధమిక అవసరాలు ఇవే కదండి 1. ఆహారం, 2. ఇల్లు, 3. విద్య, 4. వైద్యం, 5.రక్షణ. ఇలా... వీటన్నింటికి చాలా ప్రణాలికలే ఉన్నాయి కానీ అండి వాటిని చిత్తశుద్ధిగా అమలుపరచ గలిగితే మన దేశం అభివ్రుద్ధిలో ఉండేది చాలా. 

 

 అసలు ఒక ఆశ్చర్యకరమయిన విషయమేమిటంటేనండి ... ఆహారం లేక మనుష్యులు చనిపోవటం. ఆ భగవంతుడు మనకు ఎంతో ఆహారాన్ని కల్పించాడు. 

 

ఒక చిన్న విత్తనాన్ని గాని, కొమ్మని గాని నాటితే చాలు అలా అలా ఎన్నెన్నో మొక్కలు, చెట్లు వచ్చే విధానాన్ని స్రుష్టించాడు.అయినా మనకు ఆహార కొరత ఉందంటే అది మనకు సరీయిన ప్రణాలిక లేకపోవటం వల్లే అని నా అభిప్రాయం.

 

  కొన్ని విషయాలు సామాన్యులకు అర్ధం కావు. ఇప్పుడు చూడండి....ప్రబుత్వ గోడవున్స్ లో చాలా ధాన్యం ఫుల్ గా ఉందని, పేపర్స్ లో చదువుతున్నాము. కొత్తగా వచ్చే ధాన్యానికి గోదాములు సరిపడ లేవు అని కూడా చెప్తున్నారు.ఫ్యూచర్ కోసం ఆ ధాన్యం నిలువ చేస్తున్నారంట. 

 

ఎప్పుడో సంగతి తరువాత ఇప్పుడు అందులో సగం ధాన్యాన్ని పేదలకు రేషన్ షాప్స్ ద్వారా ఇస్తే వారికి ఉపయోగపడతాయి గదండి. . 

 

  ఇప్పుడు మనకు రకరకాల కొత్త కార్లు, కొత్త రకాల నగలు, కొత్తా కొత్త రకాల వస్తువులతో పొంగిపొర్లుతున్న ఇళ్ళు, వాడి పారేసిన వస్తువులతో నిండిపోతున్న భూగోళం ఇవన్నీ మన అభివ్రుద్ధికి సూచికలు.

  భూమిని ఇలా ఉద్ధరించినాక మన కన్ను చంద్రుని మీద పడింది. 

 

 ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆహారమో అనే వారి సంఖ్య మాత్రం పెరిగి పోతూనే...... ఇక అడవులు ,చెట్లు కొట్టటం వల్ల వరదల ముప్పు పెరుగుతోందని మీడియాలో పాపం చాలామంది బాధ పడుతూనే ఉన్నారు. 

 

నేను కూడా నాబాధ ఇలా పైకి చెప్పుకుంటే కాస్త మనశ్శాంతిగా ఉంటుందని ఇలా రాశాను.ఇవి అన్నీ అందరికి తెలిసిన విషయాలే లెండి ..ఎవరికయినా బాధ కలిగితే క్షమించాలి.

 

No comments:

Post a Comment