koodali

Thursday, May 21, 2020

దైవభక్తి...


దేవాలయాలు త్వరలో  ప్రజలందరి  కొరకు తెరుచుకోనున్నాయి..

ఇంతకాలం  అందరు  ప్రజలకు దేవాలయాలలో దైవదర్శనం లేని పరిస్థితి ఏర్పడటం ఆశ్చర్యం మరియు బాధ కలిగించే విషయం.

***********
కోరోనా వల్ల ప్రపంచంలో జనజీవనం చాలావరకు   స్థంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ సమయంలో దేవాలయాలకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది.

దైవానికి ఆగ్రహం కలిగిందేమో..  అని  చెప్పాలని కాదు.. కానీ, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయో ఇప్పటికైనా ఆలోచించుకోవాలి.

చాలామంది మనుషుల అత్యాశ, అంతులేని కోరికలు,  అవినీతి,   అనేకవిషయాలలో తమకు తోచినదే సరైనదని మొండిగా ముందుకు వెళ్ళటం, పర్యావరణానికి హాని కలిగించటం..ఇలాంటివాటి  గురించి మనుషులకు కనువిప్పు కలగటం కొరకు దైవం ఒక హెచ్చరిక  చేసి  ఉండవచ్చు కదా.. అని నాకు అనిపించింది.

ఇక నుంచి అయినా సమాజంలో మంచిమార్పులు రావాలని కోరుకుందాము.

**********************
లాక్ డౌన్ సమయంలో  అనువుగాని పరిస్థితి వల్ల  దేవాలయాలకు  వెళ్లలేకపోయారు.

  దేవాలయాలకు వెళ్ళి దైవాన్ని దర్శించుకోవటం విషయంలో ....  పరిస్థితి అనుకూలించనప్పుడు మనస్సులో దైవాన్ని దర్శించుకుని, పరిస్థితి అనుకూలించిన తరువాత దేవాలయాలకు వెళ్ళవచ్చు.

************
ఇంతకాలం ప్రజలు దేవాలయ దర్శనాలకు ఎందుకు దూరమయ్యారో ? తెలియదు కానీ, కొన్ని విషయాల గురించి  ఆలోచించుకోవాలి.

వేలమంది ప్రజలు దేవాలయాలకు వెళ్తుంటారు. వీళ్ళందరూ నిజజీవితంలో ధర్మాన్ని పాటిస్తూ.. అవినీతి వంటి పనులకు దూరంగా జీవిస్తే దైవానికి ఎంతో ఇష్టులవుతారు.


 దైవపూజ దైవ ప్రీతి కొరకు చేయటం మంచిది.

మనం జీవించడానికి అవసరమైన గాలి, నీరు, ఆహారం, వాతావరణం..వంటివెన్నో ప్రసాదించిన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవటం కూడా పూజయే.

కోరికలు తీరటం కోసం, బాధలు తీరటం కోసం కూడా దేవాలయాలకు 
వెళ్ళటం తప్పు కాదు కానీ , జీవితంలో మన నడవడికలో తప్పులుండకూడదు. 

దైవకృపను పొందాలంటే ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నించాలి.


****************************
దేవాలయాలలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు   కొన్నిసార్లు ఒకరినొకరు నెట్టుకుంటూ ఉండేవారు.

అలా కాకుండా ఒక పద్ధతిలో వెళ్తే ప్రశాంతంగా దైవదర్శనం చేసుకోవచ్చు.

ఇప్పుడు కొరోనా భయంతో కొన్నాళ్ళైనా ఒకరినొకరు నెట్టుకోకుండా దైవదర్శనం చేసుకుంటారేమో?

రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే దైవం ముందు నిలబడి దర్శించుకోవటానికి కుదరదు. వెనుక చాలామంది ఉంటారని గుర్తుంచుకోవాలి.
****************
హిందువులకు ఎన్నో ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారాలలో సనాతనకాలం నుండి వచ్చినవీ ఉంటాయి. మధ్యలో  కొందరి  చేత చేర్చబడ్డవీ కూడా ఉంటాయి. వాటిని గమనించుకోవాలి.

 మూఢాచారాలను వదిలేయాలి. సమాజానికి ఉపయోగపడే ఆచారాలను పాటించాలి.సమాజానికి  నష్టం కలిగించేవాటిని వదిలేయాలి.


***************
దయచేసి ఈ లింక్ ల వద్ద కూడా క్లిక్ చేసి చదవగలరు.

 దైవం యొక్క చాకచక్యం ఎవరి అంచనాలకూ అందనిది.

కొన్ని ఆచార వ్యవహారాలు.. కొన్ని మార్పులుచేర్పులు.....

మాకు తెలిసిన ఒక కుటుంబం ఇంకో మతం ..

ఆచారవ్యవహారాలు ...మరి కొన్ని విషయములు...

భక్తి ముఖ్యం.

మూఢనమ్మకాలను , మూఢత్వాన్ని వదిలి......

**************

దైవభక్తి కలిగి, జీవితంలో నైతికవిలువలను పాటిస్తూ జీవించటానికి ప్రయత్నిస్తే   దైవానికి ఇష్టులవుతారు.  దైవకృప కలుగుతుంది. 

*******
జీవితంలో సరైన విధంగా ప్రవర్తించటానికి ప్రయత్నించాలి. 

సరైన విధంగా ప్రవర్తించే శక్తిని అనుగ్రహించమని దైవాన్ని ప్రార్ధించుకోవాలి.

మంచిగా అందరూ దైవకృపను పొందాలి.



No comments:

Post a Comment