koodali

Saturday, September 16, 2017

దేవుడు అన్యాయం చేసారంటూ ..మాట్లాడటం మహాపరాధం. ..

 
కొందరు ఆచారవ్యవహారాలను పాటిస్తూ పూజలు చేస్తారు. 

అయితే, ఎప్పుడైనా కష్టాలు వస్తే మాత్రం,  ఏమంటారంటే, నేను ఎన్నో పూజలు చేసాను. భగవంతుడు అన్యాయం చేసాడంటూ మాట్లాడతారు.

 ఇక్కడ ఒక విషయమేమిటంటే, దైవం ఎప్పుడూ, ఎవరికీ అన్యాయం చేయరు. 

ఎవరు చేసిన కర్మలను బట్టి వారికి సుఖాలు కానీ, కష్టాలు కానీ వస్తాయి. 

అంతేకానీ, విధి చిన్నచూపు చూసింది, దేవుడు అన్యాయం చేసారంటూ ..మాట్లాడటం మహాపరాధం. 

ఇప్పుడు పూజలు, మంచిపనులు..చేస్తున్నా కష్టాలు వచ్చాయంటే అర్ధం ..గతంలో ఎప్పుడో చెడ్దపనులు చేసుంటారు. అందుకే ప్రస్తుతం కష్టాలు వచ్చాయి.

 ఇప్పుడు చేస్తున్న మంచిపనులకు తగ్గ మంచి ఫలితాలు కూడా తప్పక అనుభవంలోకి వస్తాయి. 

కొన్నిమంచిపనులు, కొన్ని చెడ్దపనులు చేస్తే.. కొన్ని సుఖాలు, కొన్ని కష్టాలు కలిసి లభిస్తాయి. 
..............
కొందరు ప్రజలు పాపాలు చేసి తరువాత చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి, ఇకమీదట చెడు పనులు  చేయకుండా తగిన శక్తిని ఇమ్మని దైవాన్ని ప్రార్ధిస్తూ..మంచికర్మలను చేస్తూ పూజలు చేస్తుంటే.. 

.అప్పుడు దైవం వారి పట్ల దయచూడటం , వారు చేసిన పాపాలకు పడే శిక్షను తగ్గించే అవకాశం ఉన్నాయి.
**************

చెడ్డపనులు చేసి , ఫలితంగా కలిగే కష్టాలను తట్టుకోలేక బాధలు పడేకంటే ముందే మనస్సును అదుపులో పెట్టుకోవటం మంచిది. 
**********

 సరైన మార్గంలో ప్రవర్తించే శక్తిని ఇమ్మని దైవాన్ని ప్రార్ధిస్తూ ధర్మమార్గంలో జీవించే ప్రయత్నం చేయాలి.



No comments:

Post a Comment