koodali

Friday, September 23, 2016

అందరికీ మంచి బుద్ది......


ఈ మధ్య జరిగిన సంఘటనలో కొందరు సైనికులు మరణించటం అత్యంత బాధాకరం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి వందనములు.

ఈ సంఘటనల వల్ల భారతదేశంలోని ప్రజలు కొందరు పొరుగుదేశంతో యుద్ధం చేయాలంటున్నారు.

యుద్ధం వస్తే ముందు కష్టపడేది సైనికులే. 

ఇంతకుముందు జరిగిన యుద్ధాలలో భారతదేశం గెలిచినా కూడా.. ఎందరో సైనికులను కోల్పోవటం జరిగింది.

అత్యంత ప్రమాదకరమైన ఆధునిక మారణాయుధాలు ఉన్న ఈ రోజులలో యుద్ధం వస్తే ఇరుదేశాలూ తీవ్రంగా  నష్టపోయే అవకాశం ఉంది.

పోనీ,  యుద్ధం వల్ల సమస్య పరిష్కారమై పోతుందని చెప్పలేం.అందువల్ల యుద్ధం అనేది ఇప్పుడు సరైనది కాదు.

ఇంతకుముందు కూడా భారతదేశం తనకుతానుగా పొరుగుదేశంపై ముందుగా యుద్ధం ప్రకటించలేదు.

 ఇక పొరుగుదేశమే యుద్ధానికి సిద్ధమైతే అప్పుడు ఎటూ యుద్ధం తప్పదు.

కొంతకాలం క్రిందట మేము అమరనాధ్, వైష్ణవీదేవి..యాత్ర కొరకు జమ్మూ..కశ్మీర్ వెళ్లి వచ్చాము.అద్భుతమైన ప్రదేశమది.


అక్కడి  సైనికులు మరియు ప్రజలు మాకు ఎంతో సహాయసహకారాలు అందించారు.

 స్వార్ధపరులు, నిస్వార్ధపరులు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఎక్కడైనా ఉంటారు.
....................


ఆ మధ్య కశ్మీర్లో వచ్చిన వరదలు వచ్చిన సమయంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న సహాయచర్యల వల్ల అక్కడి వారు బీజేపీకి కూడా ఓట్లు వేసారు..   అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.

తద్వారా అక్కడ  సంకీర్ణప్రభుత్వం ఏర్పడింది.
 ఆ తరువాత ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం గట్టి కృషి చేస్తే ప్రజల ఆదరణ పొంది  బాగుండేది.

ఇంకో విషయం ఏమిటంటే, కొన్ని సమస్యలకు పరిష్కారం అంత సులువుగా ఉండదు.


కశ్మీర్ సమస్య పూర్తిగా పరిష్కారం జరగటం అనేది అంత సులభం కాదు.

నష్టతీవ్రత వీలయినంత తక్కువగా ఉండటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ప్రస్తుతానికి చేయగలం.

 కొన్ని సమస్యలను కాలమే పరిష్కరించాలి.  

ఈ మధ్య ప్రధానమంత్రి గారు బలూచిస్థాన్ గురించి ప్రస్తావించటం.. తద్వారా అక్కడి వాళ్ళ సమస్యను ప్రపంచదేశాల దృష్టికి తేవటమనేది చక్కటి ఆలోచనే.

  అయితే,  బలూచిస్తాన్ పోరాటనాయకులకు  భారతదేశంలో స్థానం కల్పించటం అనే ఆలోచన, అలా ప్రకటించటం . . అనేవి మాత్రం అంత సరైనది కాదనిపిస్తుంది . 

ఈ చర్య వల్ల పొరుగుదేశం రెచ్చిపోవటం జరిగితే భారత్ కు మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందనిపిస్తుంది. 

 ప్రపంచదేశాలకు పాక్ దుశ్చర్యలను తెలియజేస్తూ ..  భారత్ కు మద్దతు కూడగట్టడం, పాక్ ను ఒంటరి చేసే ప్రయత్నాలు చేయటం మంచిదే.

అయితే కొన్నిదేశాలు తమ అవసరాల దృష్ట్యా ఎప్పుడు ఎటు ప్లేట్ ఫిరాయిస్తాయో తెలియదు కాబట్టి భారత్ జాగ్రత్తగా ఉండాలి. 
..............

  స్వార్ధపరులు, నిస్వార్ధపరులు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఎక్కడైనా ఉంటారు.

ఎవరు ఎటు పోయినా సరే..మా అవసరాలే మాకు ముఖ్యం..  అంటూ స్వార్ధంగా ప్రవర్తిస్తూన్న వారు దేశంలో ఎందరో ఉన్నారు.

భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలే నీటివిషయంలో సర్దుబాట్లు చేసుకోవటంలో పట్టువిడుపు లేకుండా ప్రవర్తిస్తూ గొడవలు పడటం జరిగింది.

*********
 ఇలా గొడవలు పడకుండా  ఇరుదేశాలు అభివృద్ధిపై దృష్టిపెడితే ఎంతో బాగుంటుంది.

ఇరుదేశాల ప్రజలూ సుఖంగా ఉంటారు.

భజరంగి భాయ్ జాన్  సినిమా చాలా బాగుంది.
 
అందరికీ మంచి బుద్ది ఉండాలని  దైవాన్ని కోరుకుందాము.



No comments:

Post a Comment