koodali

Monday, September 19, 2016

దేశరక్షణ కొరకు ప్రాణాలు సమర్పించిన సైనికులకు వందనములు..మరియు...కొన్ని విషయాలు..



దేశరక్షణ విధులను నిర్వహిస్తూ కొందరు సైనికులు మరణించటం, కొందరు గాయాలపాలవటం ఎంతో బాధాకరమైన విషయాలు. ఇవన్నీ ఇలా జరగకుండా ఉంటే ఎంత బాగుంటుంది.

దేశరక్షణ కొరకు ప్రాణాలు సమర్పించిన సైనికులకు వందనములు. .............

ఇంకో విషయం ఏమిటంటే ,ఆంధ్రప్రదేశ్లో కృష్ణా..గోదావరి బేసిన్లో చమురు లభిస్తుందని తెలిసిన తరువాత నుండి అక్కడ చమురు..సహజవాయువు వెలికితీత కార్యక్రమాలు జరుగుతున్నాయి.

 అప్పుడప్పుడు కొన్ని ప్రమాదాలు జరగటం, కొందరు మరణించటం కూడా జరిగింది. 

ఇప్పడు కూడా అప్పుడప్పుడు గ్యాస్ వెలికిరావటం ప్రజలు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకటం జరుగుతోంది. 
 ఈ వార్తలు గమనిస్తే.. బాబోయ్!ఇక మీదట ఏ ప్రదేశంలోనూ ఖనిజాలు, గ్యాస్..వంటి నిక్షేపాలు  లభించవద్దు.అని కోరుకోవాలనిపిస్తోంది.

సూర్యరశ్మి అపారంగా లభించే మన దేశంలో సోలార్ విద్యుత్ మరింతగా పెంచుకోవాలి ..

సోలార్ విద్యుతో నడిచే వాహనాలను చవకగా తయారుచేసేలా ప్రయోగాలు జరిగేలా ప్రభుత్వాలు   ప్రోత్సహిస్తే బాగుంటుంది. 

  భూగర్భ వనరులను అదేపనిగా వెలికితీయటం వలన సముద్ర నీరు పైకి చొచ్చుకు వచ్చి మంచినీరు ఉప్పునీరుగా మారటం  వంటి  దుష్ఫలితాలు వస్తాయంటున్నారు.

 ఇప్పటికే కోస్తాలో అనేక చోట్ల మంచినీరు లభించే ప్రదేశంలో  ఉప్పునీరు ఆక్రమించటం జరుగుతోంది.

ఇలాంటి త్రవ్వకాల వల్ల పరిస
ర ప్రాంతాలలో  కాలుష్యం కూడా బాగా ఉంటుంది.

పచ్చటి కోనసీమ లో ఎప్పుడు ఏం  జరుగుతుందోనని ? ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతికే ఖర్మ ఏమిటి ?

ఈ పరిస్థితి మారేలా అందరూ చర్యలు తీసుకోవాలి.


No comments:

Post a Comment