koodali

Monday, September 7, 2015

ఓం.. ఒక్క స్త్రీగానీ ఒక్క పురుషుడు గాని సంతానాన్ని పొందే అవకాశమూ ఉంది..

2 comments:


  1. స్త్రీలు, పురుషులు .. తమకు తామే సంతానాన్ని పొందటం సాధ్యమే అని ఆధునిక శాస్త్రవేత్తలు చెబుతున్నప్పుడు...సృష్టిలోని జీవులను సృష్టించిన బ్రహ్మదేవునికి సాధ్యం కానిది ఏముంటుంది.

    ఇవన్నీ గమనిస్తే, బ్రహ్మదేవుని బొటనవేలి నుంచి సంతానం కలిగారని గ్రంధాలలో ఉన్న విషయం గురించి ఆశ్చర్యం గానీ సందేహం గానీ అవసరం లేదు.
    .....................

    శ్రీ కృష్ణుల వారు దుర్యోధనుని ఆతిథ్యాన్ని తిరస్కరించి ..శూద్ర వనితకు జన్మించిన విదురుని ఆతిథ్యాన్ని స్వీకరించారు.

    ఈ విషయాన్ని గమనించితే , కులం కన్నా గుణం ప్రధానం ..అని పెద్దలు తెలియజేసారని తెలుసుకోవచ్చు.

    పాపాలు ఆచరించేవారి పట్ల అంటరానితనం పాటించాలని పెద్దలు తెలియజేసారని కూడా తెలుసుకోవాలి.

    శూద్రుల పట్ల అంటరానితనాన్ని పాటించాలని సనాతన ధర్మం చెప్పలేదు.

    తరువాత కాలంలో తెలిసీతెలియని వాళ్ళు మరియు స్వార్ధపరులైన కొందరి వల్ల సమాజంలో అంటరానితనం ప్రవేశించిందని తెలుసుకోవచ్చు.












    ReplyDelete
  2. భారతంలో , భీష్ముల వారు అంపశయ్యపై ఉన్నప్పుడు వారే తెలియజేసిన విషయాన్ని బట్టి .. వ్యక్తులు తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా వారి మనస్తత్వంలో మార్పులుచేర్పులు వస్తాయని తెలుస్తుంది.

    దుర్యోధనుడు గొప్ప వంశంలో జన్మించినా కూడా, అధర్మపరుడైనందువల్ల అతని నుంచి స్వీకరించిన ఆహారం వల్ల భీష్ముల వారికి కష్టాలు వచ్చాయి.

    పై విషయాలన్నీ గమనిస్తే , అధర్మంగా ప్రవర్తించేవారిపట్ల అంటరానితనాన్ని పాటించాలన్నది . పెద్దల అభిప్రాయం అనిపిస్తుంది.

    ReplyDelete