koodali

Saturday, September 19, 2015

వర్షాల కోసం పూజలు..


ఈ సంవత్సరం వర్షాలు సరిగ్గా ఉండవని వాతావరణవిభాగం వాళ్ళు తెలియజేసారు. 

అలాగే కొన్నిరోజుల క్రితం వరకూ వానలు  సరిగ్గా పడలేదు. ఇక ఈ సంవత్సరానికి సరిగ్గా వానలు  పడవనే అనుకున్నారు.

 అయితే ,  వానలు  కురవాలని పూజలు   చేసారు.  దైవం  దయ వల్ల  చక్కగా  వర్షాలు పడ్డాయి.

 వర్షాలు కురిపించినందుకు దైవానికి కృతజ్ఞతలు.
............................

సకాలంలో  వానలు  పడని  పరిస్థితికి  మనుషుల  స్వయంకృతాపరాధాలే  కారణం.  

అభివృద్ధి  పేరుతో మనుషులు  సాగిస్తున్న  విచ్చలవిడి  పర్యావరణ కాలుష్యం  వల్ల  ఉష్ణోగ్రతలు  క్రమంగా  పెరుగుతున్నాయి. 

ఒక దగ్గర  వరదలు, ఒక దగ్గర విపరీతమైన ఎండలు ఉంటూ  వాతావరణం  అస్తవ్యస్థంగా  మారుతోంది. 
...........................

వానలు  కురవకపోతే  పూజలు  చేయటం  మంచిదే  కానీ , వాతావరణ విధ్వంసాన్ని  మానుకోవాలి. 

 దైవం  దయామయులు  కనుక ..   మనుషులు  ఎన్ని  తప్పులు  చేస్తూన్నా  ఇంకా   వానలు  కురిపిస్తూనే ఉన్నారు. 
................................


మనుషులు  చేస్తున్న  విధ్వంసం  వల్ల  పర్యావరణం  పాడయ్యి  ఎన్నో  జీవజాతులు  కూడా  ఇబ్బందులు  పడుతున్నాయి. 

 మనుషులు తాము  పర్యావరణానికి   కలగజేస్తున్న  విధ్వంసాన్ని  గ్రహించాలి. లేకపోతే  ముందుముందు  ఏం  జరుగుతుందో  ఊహించటం  కష్టమే.
...........................
ఈ బ్లాగ్ ను ఆదరిస్తున్న అందరికి   కృతజ్ఞతలండి .  

No comments:

Post a Comment