మానవులు లిపిని కనిపెట్టటానికి ముందు కాలాన్ని చరిత్రకు ముందు కాలం అని , లిపిని కనిపెట్టిన తరువాతి కాలాన్ని చారిత్రిక యుగమనీ ఆధునిక చరిత్రకారులు....వర్గీకరించారు.
( సింధు నాగరికతకు ముందు కాలంలో ప్రపంచంలో లిపి అనేది లేదని ఆధునిక చరిత్రకారుల అభిప్రాయం.
ఇండస్ స్క్రిప్ట్ ( సింధు లిపి ) అర్ధం చేసుకోవాలని ఎంతో ప్రయత్నించినా , ఇప్పటికి వరకు ఎవరూ అర్ధం చేసుకోలేకపోయారు. )
వేదవ్యాసుడు మహాభారతాన్ని గ్రంధస్థం చేయటానికి పూనుకున్నప్పుడు గణపతిని సాయమడిగారనీ కొన్ని షరతులతో గణపతి ఒప్పుకున్నారనీ అంటారు.
వినాయకుడు మహాభారతాన్ని వ్రాయటం చిత్రాలలో కూడా ఉంటుంది. వ్రాయటం అంటే లిపి ఉన్నదనే అర్ధం కదా !
( లిపి ఎప్పుడూ ఉంది.)
భారతకాలానికి ముందే రామాయణకాలంలో సేతువు నిర్మించటానికి రాళ్ళను సముద్రంలో వేస్తుంటే అవి మునిగిపోతుంటే ...కొన్ని రాళ్ళపై రామనామాన్ని లిఖించగా అవి మునగకుండా నీటిపై తేలాయనీ అంటారు.
రాళ్ళపై రామనామాన్ని లిఖించటం అంటే అప్పటి వాళ్ళకు లిపి తెలుసనే అర్ధం కదా !
........................
ఇక ఇనుము గురించి ప్రాచీనులకు తెలియదని ఆధునిక చరిత్రకారులు అంటారు.
శ్రీ దేవీ భాగవతములో మణిద్వీప వర్ణనలో ఇనుము గురించిన ప్రస్తావన ఉన్నది.
..ఒక మహా ప్రాకారం. ( కోటగోడ ). అది అయోధాతు నిర్మితం. ఇనుముతో ధాతు శిలలతో ధృఢంగా నిర్మించిన ప్రాకారం. దాని ఎత్తు సప్త యోజనాలు...
.. నానావిధ శస్త్రప్రహారణాలు ధరించి నానావిధ యుద్ధ విశారదులైన రక్షకభటులు ఆ ప్రాకారం మీద అంతటా కావలి తిరుగుతుంతారు. విధినిర్వహణలో ఆనందిస్తుంటారు...
......................
( అయః ప్రాకారం అంటే ఇనుముతో చెయ్యబడ్డది అని అర్ధమట.)
అయః అంటే ఇనుము కాదు .. కంచు, ఇత్తడి, రాగి ... అని కొందరి అభిప్రాయం.
అయితే, మణిద్వీప వర్ణన లో అయః ప్రాకారము తో పాటు కంచు, ఇత్తడి , రాగి.. ప్రాకారముల గురించి కూడా వర్ణించారు.
అలాంటప్పుడు అయః అంటే కంచు, ఇత్తడి, రాగి.. కాదనే కదా !
.....................
గ్రహాలకు సంబంధించిన లోహలలో ఇనుము కూడా ఉందని అంటారు.
శనిదేవునికి సంబంధించిన లోహము ఇనుము అని అనుకుంటున్నాను. ( నాకు తెలిసినంతలో.. ) .
ఇవన్నీ గమనిస్తే , ఇనుము గురించి మనవాళ్లకు ఎప్పుడో తెలుసని తెలుస్తోంది.
.........................
చరిత్ర గురించి ఆధునిక చరిత్రకారుల మధ్య అనేక భేదాభిప్రాయములు ఉన్నవి.
క్రీస్తుకు పూర్వం 1600 లేక 1000 సంవత్సరాల సమీప కాలం మాత్రమే రామాయణము, భారతము జరిగిన కాలము .... అని కొందరి అభిప్రాయం .
కానీ, మన్వంతరముల లెక్క ప్రకారం గమనిస్తే, క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలకు పూర్వమే రామాయణము, భారతము జరిగిన కాలము .... అని ఎక్కువమంది అభిప్రాయం.
...............................
శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము గ్రంధము ద్వారా ఎన్నో విషయములను తెలుసుకోవచ్చు.
..........................
ఈ మధ్యనే రామసేతు గురించి, సముద్రంలో మునిగిన ద్వారకా నగర శిధిలాలను గుర్తించామని ఆధునికులు చెబుతున్నారు కదా !
.............................
పై విషయాలను గమనించితే ఎన్నో విషయాలు తెలుస్తాయి.
..................................
ఇక్కడ కొన్ని లింక్స్ ఇస్తున్నాను.
Timeline of MAHABHARATA 3139 B.C | तमसो मा ...
No comments:
Post a Comment