గత కొంతకాలంగా రాష్ట్రంలో అంతా అయోమయం, గందరగోళం. తెల్లవారితే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం తప్ప, ప్రజల సమస్యల పరిష్కారం గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్లు ఉంది పరిస్థితి.
రాష్ట్రంలోని ప్రజల మధ్య విభేదాలు, ఆవేశకావేషాలు రావటం అత్యంత బాధాకరం.
ప్రజల మధ్య విభేదాలు, ఆవేశకావేషాలతో పబ్బం గడుపుకునే వారికి ..... వారి కుటుంబసభ్యుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఆ బాధ తెలుస్తుందేమో ?
దేశంలో మన రాష్ట్రంలో వలె అస్థిర పరిస్థితులు రాకూడదని,
మన రాష్ట్రంలో జరుగుతున్న దిక్కుమాలిన పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ రాకూడదని,
మన రాష్ట్ర ప్రజలలా ఏ రాష్ట్ర ప్రజల మధ్య విభేదాలు రాకూడదని ,
మిగతా రాష్ట్రాల ప్రజలు అయినా అపార్ధాలు , విభేదాలు లేకుండా కష్టసుఖాలలో కలిసిమెలసి అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటూ....
No comments:
Post a Comment