koodali

Wednesday, January 1, 2014

శుభాకాంక్షలు ... మరికొన్ని విషయాలు..

ఈ  బ్లాగును  ప్రోత్సహిస్తున్న  అందరికి  అనేక  కృతజ్ఞతలు   మరియు  అందరికి  ఆంగ్ల  నూతన  సంవత్సర  శుభాకాంక్షలండి.

ఆసక్తి  ఉన్నవారు  ఈ  క్రింది  లింకులను  కూడా  చూడగలరు.



Valley of Flowers National Park - Wikipedia, the free encyclopedia  


Flowers of Himalayas.

**************

konni vishayamulu..

పొన్నగంటి కూరలో రెండు రకాలున్నాయంటూ ఈ మధ్య కొందరు చెబుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి, ఒకటి ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. రణపాల మొక్క, సరస్వతి మొక్క గురించి కూడా ఇలాగే చెప్పారు.

ఇంతకుముందు ఇవన్నీ చెప్పకముందు బయట అమ్మే పొన్నగంటికూర తెచ్చి చక్కగా తినేవాళ్ళం. ఇప్పుడు ఏది అసలైనదో? ఏది కాదో? అనే సందేహాలతో కొనాలంటే భయంగా ఉంది.

 ఇలాంటప్పుడు మొక్కలశాస్త్రం చదువుకున్న వాళ్ళు, ప్రజలకు ఏది నిజమో చెబితే బాగుంటుంది..(ఎవరైనా చెప్పారేమో నాకు తెలియదండి.)
 
 ప్రపంచంలో ఇన్ని గందరగోళాలు ఏమిటో?
***********************
marikonni vishayaalu..

ఆధునిక కాలంలో మనుషులు బిజి అయిపోయారు. తలుపులు, కిటికీలు మూసిన గదులలో కంప్యూటర్లు,ఫోన్లు చూస్తూ ఎక్కువసమయం గడుపుతున్నారు.  సహజమైన గాలి, వెలుతురు తగలటం తగ్గిపోయింది. మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం తగ్గింది.

 పాతకాలంలో స్త్రీలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కష్టసుఖాలు చెప్పుకునేవారు. పిల్లలు ఆరుబయట ఆడుకునేవారు. మగవాళ్లు రచ్చబండ వద్ద కబుర్లుచెప్పుకునేవారు.

 అప్పట్లో ఇప్పుడు ఉన్నంత కొత్తవస్తువులు, వస్తువినియోగం లేదు. ఉన్నంతలో తృప్తిగా, పొదుపుగా జీవించటానికి ప్రయత్నించేవారు. అప్పుడూ కొన్ని కష్టాలు ఉండేవి. కాని, ఇప్పటిలా పరిస్థితి కాదు.

ఈ రోజుల్లో ఎన్ని సౌకర్యాలు ఉన్నా, చాలా డబ్బు ఉన్నా కూడా, ఇంకాఏదో లేదనే అసహనం ఎక్కువయ్యింది. యంత్రాలు వచ్చి కొన్ని పనులు సులభం అయినా కూడా,చాలా పనులు పెరిగాయి. 

పాతకాలంలో సాయంకాలం 5 గంటలకు ఇంటికి వచ్చే ఉద్యోగులు, ఇప్పుడు రాత్రి వరకు ఆఫీసుల్లోనే పనిచేసే సందర్భాలూ ఉంటున్నాయి. కొన్ని చోట్ల ఉద్యోగస్తుల సంఖ్యను తగ్గించి, తక్కువమందితో ఎక్కువ సమయం చేసే పరిస్థితి కూడా ఉంది. ఉద్యోగాలు పోతాయేమోననే భయంతో కొందరు చాలా పనిచేస్తున్నారు.

* పని ఎక్కువయినా కూడా కోపం, డిప్రెషన్ పెరుగుతాయి.

 డబ్బు సరిపోవటం లేదని కొందరు, ఇరుగుపొరుగు, బంధువులు, ఫ్రెండ్స్..పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని, బోలెడు డబ్బు సంపాదిస్తున్నారని, విదేశాలకు వెళ్తున్నారని, తామూ బోలెడు డబ్బుసంపాదించాలని పోటీలుపడుతూ జీవితంలో అలసిపోతున్నారు.

జీవితంలో విశ్రాంతి సరిపోక, కోరికలు పెరగటం వల్ల డబ్బు సరిపోక ఎదో విధంగా బతుకుతున్నారు. 

అపార్ట్మెంట్లలో పెద్దవాళ్ళు కూడా కలసి కబుర్లు చెప్పుకోవటం తగ్గిపోయింది. ఎవరింట్లో వాళ్ళు టీవీలు, ఫోన్లు చూసుకుంటూ ఉంటున్నారు. అపార్ట్మెంట్లలో అందరి ఇళ్ళలో పెద్దవాళ్ళు కలిసి  కొంతసేపయినా కబుర్లు చెప్పుకోవచ్చు.

 ప్రజలలో మానసిక, శారీరిక సమస్యలు పెరుగుతున్నాయనిపిస్తుంది. గొడవలు పెరుగుతున్నాయి. వార్తలు గమనిస్తే నేరాలు..ఘోరాలు భయానకంగా ఉన్నాయి.

 పాతకాలంలో దొంగలు వంటివారు దొంగతనాలు, హత్యలు చేసేవారంటారు. ఇప్పుడు కుటుంబసభ్యులు, తెలిసినవారి వల్లే ఇలాంటి నేరాలు..ఘోరాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి.

* కంప్యూటర్, ఫోన్లు అస్తమాను చూడటం వల్ల కోపం, డిప్రెషన్ వంటివి పెరిగే అవకాశముంది.


 
కంప్యూటర్ వాడుతూ పనిచేసే వాళ్ళు, రోజులో కొంతసేపయినా ఆరుబయట సూర్యరశ్మి,గాలి తగిలేలా గడపటం మంచిది. నచ్చిన పాటలు వినవచ్చు. 

పిల్లలను కూడా అస్తమాను హోంవర్క్ అని పేరెంట్స్ అనటం వల్ల, వాళ్ళకూ విసుగు వస్తుంది. వాళ్ళకూ ఆటలుపాటలు వినోదం అవసరమే.పెద్దవాళ్ళు పిల్లలకు సరైన పోషకారాన్ని పెట్టాలి.


అందరూ అస్తమానూ కంప్యూటర్లు, ఫోన్లతో గడపటాన్ని కొంత తగ్గించుకుని, కిటికీలు తెరిచి గాలి, వెలుతురు గదుల్లోకి వచ్చేలా కొంతసేపయినా తలుపులు తెరవాలి. 

కుటుంబసభ్యులు రోజులో కొంతసేపయినా చక్కగా మాట్లాడుకోవాలి. గొడవలు వచ్చినా 10 నిమిషాలకన్నా గొడవపడకుండా అలవాటుచేసుకోవాలి. ముఖ్యమైన పాయింట్లు చెప్పుకుని ఆపేయాలి. వారాంతంలో బయటకు పార్కులకు వెళ్ళవచ్చు.
...............

సమయం ఉంటే, స్త్రీలుకొందరు కలిసి చిన్నపరిశ్రమలు పెట్టి,ఉదయం 10 నుంచి మధ్యాహ్మ్నం 3 వరకు చేతనైనంతలో ఉపాధిపొందవచ్చు. 

సొంతవ్యాపారం కాబట్టి, సమయం తమకు అనుకూలంగా ఏర్పరుచుకుని త్వరగా ఇళ్ళకు వెళ్ళవచ్చు. తమ చంటి పిల్లల్ని తమ దగ్గరే ఉంచుకోవచ్చు.

కొందరు స్త్రీలు మహిళామండలిగా ఏర్పడి , ఇంటిపని అయ్యాక ఉదయం 10 నుంచి మధ్యాహ్మ్నం 3 వరకు సమాజానికి ఉపయోగపడే పనులు చేయవచ్చు. పేదవారికి చదువుచెప్పటం, ఆరోగ్యసలహాలు చెప్పటం, వారికి ఉపాధి లభించేలా ప్రభుత్వం పధకాల గురించి చెప్పి సాయం అందించటం..చేయవచ్చు.

ఇవన్నీ చేయకపోయినా ఫరవాలేదు, ఎవరి కుటుంబాన్ని వారు చక్కగా చూసుకుంటూ పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దినా చాలు.

ఉద్యోగాలు ఎవరైనా చేయగలరు. నైతికవిలువలతో పిల్లలను చక్కగా పెంచి పెద్దచేయటం చాలా గొప్ప విషయం. మనుషులు నైతికవిలువలను పాటిస్తే, సమాజంలో నేరాలు..ఘోరాలు ఉండవు. అశ్లీలతతో కూడిన చిత్రాలు, రచనలు చేయరు. జీవహింస చేయరు. ఇతరులను పీడించరు. మంచిగా ఉండేవారివల్ల సమాజం ప్రశాంతంగా ఉంటుంది.

 


No comments:

Post a Comment