koodali

Friday, January 10, 2014

.పూజలు చేయటంతో పాటు పర్యావరణం విషయంలో జాగ్రత్తలు....

  
   ఈ  మధ్య  కాలంలో  శ్రీశైలంలో   శివలింగమూర్తికి  వచ్చిన  తేడా  గురించి  వార్తలు  వస్తున్నాయి.  లోకంలో    పాపం  పెరిగితే  ఇలాంటివి  జరుగుతాయేమో ?
................................. 


  ఇంతకుముందు  కూడా  పంచారామక్షేత్రాలలో  ఒక  శివలింగము   యొక్క  మూర్తిలో  తేడాలు  కనిపించాయని ,  అప్పుడు   కొంతకాలం  అభిషేకాల  విషయంలో  జాగ్రత్తలు  తీసుకున్నారని  విన్నట్లు  గుర్తు.

కొంతమంది  ఏమంటున్నారంటే ,  అభిషేకాలకు  వాడే  పాలు,  నీళ్ళు  వంటివి   శుద్ధమైనవి  కానప్పుడు    ఇలా  జరిగే  అవకాశం  ఉంది  అంటున్నారు.

 శివలింగమూర్తి  విషయంలో  అభిషేకాల  విషయంలో   బయట  నుంచి  తెచ్చిన  పాలను  కాకుండా  దేవస్థానం  వద్ద    పెంచిన  ఆవుల  పాలనే  వినియోగిస్తే  బాగుంటుందని   టీవీ  చర్చలలో  ఒకరు    చక్కటి  సూచనను  చేసారు.

........................................ 


  ఒకప్పుడు     దేశవాళీ  ఆవుపాలను  వాడేవారు.    ఇప్పుడు   అంతా  కల్తీ  ఎక్కువయ్యింది.  నీళ్ళు  కల్తీ,  పాలు  కల్తీ,  గాలిలో  పొల్యూషన్.. 


  రసాయనాలతో  కలుషితమైన  జలాలతో  పెరిగిన  గడ్డిని  తిన్న  పశువుల  పాలను  త్రాగినా  ప్రమాదమేనని    పరిశోధకులు  హెచ్చరిస్తున్నారు.

పెరిగిన  కాలుష్యం  వల్ల   మనుషులలో  కూడా  కాన్సర్  వంటి  జబ్బులు  ఎక్కువగా  వస్తున్నాయి.  కొంతకాలం  క్రిందట  కాన్సర్  వంటి  జబ్బులు  తక్కువగా  ఉండేవి.

......................... 


పూర్వం  తలస్నానం   చేయాలంటే  కుంకుడురసం,  శీకాయ  వంటి  సహజసిద్ధమైనవి  వాడేవాళ్ళం.  ఇప్పుడు  షాంపూలు  వాడుతున్నాము. అందువల్ల  ఇప్పుడు  కొందరు   పిల్లలలో  చిన్న  వయసులోనే    వెంట్రుకలు  నెరవటం  వంటి  సమస్యలు  వస్తున్నాయి.

పాత్రలు,  ఇల్లు  శుభ్రం   చేసుకోవాలంటే  పూర్వం  ఆసిడ్లు  వాడేవారు  కాదు.  ఇప్పుడు  ఇళ్ళు  శుభ్రం  చేయాలన్నా,  బాత్రూంస్  శుభ్రం  చేయాలన్నా    రసాయనాలను ( యాసిడ్స్ )  వాడుతున్నారు.

 శుభ్రం  చేయటానికి  వాడే  ఈ  యాసిడ్స్  మురికి  నీటితో  పాటు  బయటకు  పోయి  భూమిలో   ఇంకుతాయి.   వర్షం  నీటితో  పాటు  చెరువుల్లో,   నదుల్లో  కలిసిపోతాయి.  ఆ  నీటినే   త్రాగటానికి , పంటలు  పండించటానికి   వాడుతారు.

 ఇలా  రసాయనాలతో  కలుషితమైన  భూమిలో,  నీటితో   పెరిగిన  ఆహారపదార్ధాలలో  కూడా    రసాయనాల  అవశేషాలు  ఉంటున్నాయంటున్నారు.  


 నిస్సారమైన   ఇలాంటి  ఆహారాన్ని  తీసుకోవటం   వల్ల  కాబోలు   ఇప్పటి  మనుషులు   ఎంత  తిన్నా  కూడా   నీరసంగానే  ఉంటున్నారు.

  పర్యావరణం  బాగుంటే  శుద్ధమైన  నీళ్ళు,  పాలు    లభిస్తాయి.

............................ 


ఇవన్నీ  గమనించితే  ఏమనిపిస్తుందంటే,   శివలింగము మూర్తి  విషయం    మానవులకు  హెచ్చరికగా  భావించి,  పర్యావరణాన్ని  కాపాడుకోవాలి.    


రేపు  వైకుంఠ  ఏకాదశి ..........  .పూజలు  చేయటంతో   పాటు    పర్యావరణం  విషయంలో  జాగ్రత్తలు   తీసుకుంటే   దైవకృప    లభిస్తుంది . దేవాలయాల  వద్ద  ప్లాస్టిక్   కవర్లను  ఎక్కడపడితే  అక్కడ  పడేయవద్దు.




No comments:

Post a Comment