koodali

Wednesday, June 5, 2013

సైన్స్... శాస్త్రీయత మరియు కొన్ని విషయాలు.


 పూర్వం  వాళ్ళు  ప్రతి  చిన్న  అనారోగ్యానికి  వెంటనే   హాస్పిటల్స్ కు  పరిగెత్తేవారు  కాదు. 

  ఇంట్లోని  బామ్మగారు  మొదలైన  పెద్దవాళ్ళు  వంటింట్లోని  పదార్ధాలను  కలిపి  మందుగా  ఇచ్చేవారు.  అవి  వేసుకుంటే  కడుపునొప్పి,  అజీర్ణం  వంటి  ఎన్నో  అనారోగ్యాలు  తగ్గిపోయేవి.

 బామ్మలు  పెద్ద  చదువులు   చదవకపోయినా  తరతరాలుగా  వారసత్వంగా   నేర్చుకున్న  చిట్కా  వైద్యంతో  కుటుంబసభ్యుల  రోగాలను  తగ్గించేవారు.

  ఈ  రోజుల్లో   కూడా    కొందరు  వ్యక్తులు   తాము    వారసత్వం  ద్వారా  నేర్చుకున్న  ప్రాచీన  వైద్యం  ద్వారా   ప్రజలకు    చక్కటి    వైద్య  సహాయాన్ని  అందిస్తున్నారు.

 డబ్బు  ఆశలేకుండా  సేవాదృక్పధంతో  ప్రజలకు   వైద్యాన్ని  అందించే  మంచి వాళ్ళను  అనుమానించటం సబబు కాదనిపిస్తుంది .

.....................................


 ఈ  రోజుల్లో   ప్రతిదానికి   సైన్స్,  శాస్త్రీయత  అంటున్నారు.  అలా  ఆలోచిస్తే   ఆధునిక  సైన్స్ కు  అంతుపట్టని  విషయాలెన్నో  ఉన్నాయి.

ఉదా.... కొందరు  సామాన్యులు  కేవలం  తమ  పళ్ళతో  పెద్ద  లారీని   కొంతదూరం  లాగటం,  విమానాన్ని  జుట్టుకు  కట్టి  లాగటం  చూస్తూనే  ఉన్నాము. 
ఆధునిక సైన్స్,  శాస్త్రీయత  ప్రకారం  ఆలోచిస్తే   ఈ  విధంగా  లాగటం  అసాధ్యం  కదా !  

    ఆధునిక సైన్స్,  శాస్త్రీయత  ప్రకారం  .... జుట్టుతో    లేక  పళ్ళతో  భారీ  వాహనాన్ని  లాగాలని  ప్రయత్నిస్తే  జుట్టు  లేక  పళ్ళు  కుదుళ్ళతో  సహా  ఊడి  వస్తాయి. 

అయితే  కొందరు  వ్యక్తులు  ఈ  విధంగా  లాగి  చూపిస్తున్నారు  కదా  !  వాళ్ళెలా  భారీ  వాహనాలను  లాగగలుగుతున్నారు  ?  ఈ విషయాలను ఆధునిక   సైన్స్, శాస్త్రీయత ప్రకారం  ఎలా  నిరూపించగలం ?
 
 ఇవన్నీ  గమనిస్తే    ఏమనిపిస్తుందంటే , శారీరికశక్తి  కన్నా  మానసిక  శక్తి  చాలా  గొప్పది  అనిపిస్తుంది.  


  ఇలాంటి  సాహసాలు  చేసేవారు  మనలాంటి  మామూలు  వ్యక్తులే.  కానీ,   వాళ్ళు  తమ  యొక్క  గట్టి  సంకల్పశక్తి  మరియు  పట్టుదల  వల్ల  ఇలాంటి  అసాధ్యాలను  సుసాధ్యం  చేస్తున్నారనిపిస్తుంది.  


 ఇంకా   ఏమనిపిస్తుందంటే ,   ఈ  కాలంలోని  సామాన్య  వ్యక్తులే  తమ  సంకల్పశక్తితో  కృషి  చేసి  ఇలాంటి  సాహసాలు  చేయగలుగుతున్నప్పుడు  .....  పూర్వకాలపు  మహర్షులు  గొప్ప  తపస్సులు  చేసి  పొందిన   శక్తితో  ఎన్నో  అసాధ్యాలను  సుసాధ్యాలు  చేసేవారనటంలో  ఎటువంటి  సందేహమూ  లేదు.
 

   ఆధునిక  భౌతికవాద  శాస్త్రవేత్తలు  మానవ  శరీరం  గురించి  కొన్ని  విషయాలను   తెలుసుకోగలిగారు  కానీ  మనిషి  మనస్సు  గురించి,   అది  పనిచేసే  విధానం  గురించి   ఆధునిక  భౌతికవాద  శాస్త్రవేత్తలకు  తెలిసింది  చాలాచాలా  తక్కువ.


  అందువల్ల  మనం  తెలుసుకోవలసింది  ఏమిటంటే ,   దైవం సృష్టించిన  సృష్టిలోని  సైన్స్  గురించి   మనకు  తెలిసింది  సముద్రంలో  నీటిబొట్టంత  అని...  ప్రాచీనులకు  తెలిసిన... ఆధునికులకు  తెలియని ...  సైన్స్  ఇంకా  ఎంతో  ఉంది  అని.  
....................................


ఈ  రోజు  పర్యావరణ  దినోత్సవమట. 


ఆసక్తి  ఉన్నవారు  ఈ  క్రింది  లంకెను  దయచేసి    చదువుతారని  ఆశిస్తున్నాను.
..

..... పసుపు, వేప, వంటివి తరతరాలనుంచి వాడుతున్నా కూడా...


2 comments:

  1. పసుపు కుంకుమ వాడుకునేలా లేవండి. వాటి మీద పురుగు మందుల అవశేషాలుంటున్నాయి.వాటి మూలంగా బాధ అలర్జీ కలుగుతోంది.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు.
    అవునండి. మీరన్నది నిజమే.

    ReplyDelete