koodali

Wednesday, October 31, 2012

కశ్మీరం ....



కొంతకాలం  క్రిందట  మేము  బాబా అమర్‌నాధ్ ,   మాతా వైష్ణవి దేవి  యాత్రలకు   వెళ్ళివచ్చాము..  అక్కడ   చెప్పలేనంత  అద్భుతంగా  ఉంది.  భగవంతుని దయవలన మావంటి సామాన్యులకు కూడా ఇంత అదృష్టము దక్కింది.


 మేము అమర్‌నాధ్ వెళ్ళినప్పుడు   ముస్లిం  సోదరులు  మాకు బాగా సహాయము చేశారు.   అదంతా  చూసి  మాకు   చాలా ఆశ్చర్యము  కలిగింది. 

  మేము అమర్‌నాధ్  వెళ్ళినప్పుడు   సైనికులు  కూడా  మాకు బాగా సహాయము చేశారు.  సైనికులను  చూస్తే ,  ఎన్నో  రాష్ట్రాల  నుంచి  వచ్చి  దేశం  కోసం  ఎంతో  క్లిష్టతరమైన   విధులను  నిర్వర్తిస్తున్నారు   కదా  !  అనిపించింది.

  మా యాత్రకు సహాయము అందించిన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు.
.....................................................
అమర్నాధ్  గుహ  గురించిన   ప్రస్తావన   ప్రాచీన  గ్రంధాలలో  ఉందట.  అయితే,  ఈ  కాలంలో   ఒక ముస్లిము సోదరుడు   అమరనాధ్   గుహను  మరల  కనిపెట్టి    అందరికీ  తెలియజేయటం  జరిగింది.  


  అమర్నాధ్ గుహను ఒక ముస్లిము సోదరుడు కనిపెట్టడము చూస్తే , అన్ని మతముల  వారు మంచిగా కలసి మెలిసి   ఉండాలని   దైవం  సందేశము   ఇచ్చారేమో ...  అనిపిస్తుంది.


 అక్కడ గుడి దగ్గర  షాప్స్ లో   పూజా సామాగ్రిని  ముస్లిం సోదరులు   కూడా అమ్ముతారు.  


అయ్యప్పస్వామికి    వావర్ అనే పేరున్న ముస్లిం మిత్రుడు ఉన్నట్లు, వారి యొక్క గుడి శబరిమలలో ఉందంటారు.
 


షిరిడి  సాయిబాబా కూడా    మతసామరస్యాన్ని  గురించి  చెప్పారు. .

" ఒక  యోగి  ఆత్మ  కధ " గ్రంధం లో  కూడా   పెద్దలు  మతసామరస్యత  గురించి  తెలియజేసారు.  మహావతార్  బాబాజీ  ,   ఏసుక్రీస్తు....  వీరి    గురించిన  విషయాలు  గ్రంధంలో  ఉన్నాయి.


   రామకృష్ణ  పరమహంస  కూడా  మతసామరస్యాన్ని  ప్రోత్సహించారు.  రామకృష్ణమఠంలో  అన్ని  మతముల  వారికి  ప్రవేశం  ఉంది.

మతసామరస్యం   గురించి   పెద్దవాళ్ళు   ఇంతలా   చెప్తుంటే   మనము ఎందుకు   గొడవలు  పడాలి  ? మతమేదయినా భగవంతుడనే  మహాపవర్ ను అందరు ఆరాధించొచ్చు.

..........................


కాశ్మీర్  ఎంతో  అందమైన  ప్రాంతం. అందుకే   కాశ్మీరుని   భూతల  స్వర్గం  అంటారు  కదా  ! 

ప్రాచీన  కాలంలో  కాశ్మీరుని   ఎందరో  గొప్ప  రాజవంశాల  వారు  పాలించారట.

 Kashmir was one of the major centre of Sanskrit scholars. According to the Mahabharata,[3] the Kambojas ruled Kashmir during the epic period with a Republican system of government[4]............ ఇలా  కాశ్మీర్  చరిత్ర  గురించి  అంతర్జాలంలో  వివరాలున్నాయి.  


ఆ  ప్రాంతం   చదువుల  తల్లి  సరస్వతీ  దేవికి  నిలయమట. 

అష్టాదశ  శక్తి  పీఠాలలో  చెప్పే  సరస్వతీ దేవి  ఆలయం  జమ్ముకాశ్మీరులో  ఉందట.  ఈ  ఆలయం  ఎక్కడ  ఉందనే  విషయం   గురించి  రకరకాల  అభిప్రాయాలు  ప్రచారంలో  ఉన్నాయి.


   ధృతరాష్ట్రుని  భార్య  అయిన   గాంధారి  పుట్టిన  ప్రాంతం  ఇప్పుడు  విదేశాల్లో  ఉందట. 

అయితే,  కశ్మీరంలో  స్థానికులైన కొందరు హిందువులను అక్కడనుంచి  వెళ్ళగొట్టటం జరిగిందట..ఇలాజరగటం మాత్రం అత్యంత బాధాకరం.

  భారతదేశం    మళ్ళీ   ఎప్పటికీ   విభజించబడకూడదనీ,   దేశంలోని  అందరు  ప్రజలు  సంతోషంగా ,  సామరస్యంగా   కలిసిమెలిసి     జీవించాలనీ  దైవాన్ని   కోరుకుంటున్నాను. 
..........................................

 మతము విషయానికి వస్తే,    ఒకే మతములో వాళ్ళు కూడా   గొడవలు    పడతారు.

 ఈ ప్రపంచములో అంతా  ఒకే మతము  ఉండటము అనేది 
ప్రస్తుతానికి  జరగని  పని.
 మతము  అనేది    అసలు   లేకుండా పోవటము   అనేది  ఎప్పటికీ  జరగనిపని.

అందుకని   అందరము   ఆనందముగా ఉండాలంటే,   అన్ని  మతముల  వారు   ఒకరినొకరు   గౌరవించుకోవటము ఒకటే మార్గము.

సృష్టిలో   రకరకాల మనుష్యులు ఉన్నట్లే ,   ఎన్నిమతములు ఉన్నా,   అందరూ ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి.

దైవం  అందరికి మంచి  బుద్ధిని  కలిగించాలి.


అంతా  దైవం  దయ.

.......................

వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  కోరుకుంటున్నాను.
 
 

No comments:

Post a Comment