koodali

Monday, July 30, 2012

లోక రక్షణ కోసం.....


* శ్రీ  సాయిబాబా  జీవిత  చరిత్రము  గ్రంధము  లోని  కొన్ని  విషయములు.  (  షిరిడి  సాయి  ).

   ఖాపర్డే  కుర్రవాని  ప్లేగు  జాడ్యము

* బాబా  విచిత్ర  లీలలలో  నింకొకదానిని  వర్ణించెదను.  అమరావతి  నివాసియగు  దాదాసాహెబు ఖాపర్డే  భార్య  తన  చిన్న  కొడుకుతో  శిరిడిలో  మకాం  చేసెను.  కొడుకుకు  జ్వరము  వచ్చెను.  అది  ప్లేగు  జ్వరము  క్రింద  మారెను.  తల్లి  మిక్కిలి  భయపడెను. 

 

 శిరిడి  విడచి  అమరావతి  పోవలెననుకొని  సాయంకాలము  బాబా  బుట్టీవాడా  వద్దకు  వచ్చుచున్నప్పుడు  వారి  సెలవు  నడుగబోయెను.  వణుకుచున్న  గొంతుతో  తన  చిన్న  కొడుకు  ప్లేగుతో  పడియున్నాడని  బాబాకు  చెప్పెను. 

 

 బాబా  యామెతో  కారుణ్యముతో ,  నెమ్మదిగా  మాట్లాడదొడగెను.  ప్రస్తుతము  ఆకాశము  మేఘములచే   కప్పబడియున్నది  గాని  యవి  చెదరిపోయి  కొద్దిసేపట్లో  నాకాశమంతయు  మామూలు  రీతిగా   నగునని    బాబా  యోదార్చెను.  

 

అట్లనుచు తన  కఫనీని  పై కెత్తి  చంకలో  కోడిగ్రుడ్లంత  పెద్దవి  నాలుగు  ప్లేగు  పొక్కులను  అచటివారికి  చూపెను.  "  చూచితిరా  !  నా  భక్తుల  కొరకు  నే  నెట్లు  బాధపడెదనో  !  వారి  కష్టములన్నియు  నావిగనే   భావించెదను.  " 


 ఈ మహాద్భుతలీలను  జూచి  యోగీశ్వరులు  భక్తులకొర  కెట్లు   బాధ  లనుభవింతురో  జనులకు  విశ్వాసము  కుదిరెను. 


 యోగీశ్వరుల  మనస్సు  మైనము కన్న  మెత్తనిది,  వెన్నెలవలె  మృదువైనది.  వారు  భక్తులను  ప్రత్యుపకారము  కోరకయే   ప్రేమించెదరు.  భక్తులను   తమ  బంధువులవలె   జూచెదరు.

 
................ఇంకా,

* లోక  రక్షణ  కోసం    పరమశివుడు   హాలాహలమును  స్వీకరించారు.  అందుకు  పార్వతీదేవి  కూడా  అభ్యంతరం  చెప్పలేదు. 

 

* విష్ణుమూర్తి  కూడా  లోక  రక్షణ    కోసం  ఎన్నో  అవతారములను  ధరించి ,  రాక్షసులను  సంహరించారు..... అందుకోసం  వారు    జంతుజన్మలను  కూడా  ధరించవలసి  వచ్చింది.



* లోకరక్షణ  కోసం  వారు  అందరూ  అలా  చేసారు.

 
* తమ   పిల్లలు  కష్టాలు  పడకూడదని  ,  వారి  బదులు  తాము   కష్టాలను    అనుభవించటానికి  సిద్ధపడే  పెద్దవాళ్ళు  ఉంటారు కదా !

 

* అందుకే ,  వ్యక్తులు  తమ   సత్ప్రవర్తనతో  భగవంతుని  ,  గురువులను,  పెద్దలను   మెప్పించాలి.

..................................

 ఈ  బ్లాగ్ ను ఆదరించి  ,  ప్రోత్సహిస్తున్న  అందరికి  అనేక  కృతజ్ఞతలండి.
 

No comments:

Post a Comment