koodali

Monday, November 1, 2010

సమస్యల నుంచి కూడా లాభాలు...............

 

మేము ఆ మధ్యన అమర్ నాధ్ ,వైష్ణవీ దేవి యాత్రలు చేసి వచ్చామని ఇంతకుముందు చెప్పాను కదండి. ఆ యాత్రలను మేము కేవలం భక్తి వల్ల మాత్రమే చేయలేదు.


ఆ మధ్య మాకు కొన్ని సమస్యలు వచ్చాయి లెండి. ఆ సమస్యలను తట్టుకోలేక........... ఆ దైవం ఏదైనా పరిష్కార మార్గం చూపిస్తారని , అలా యాత్ర చేయటం జరిగింది.


తెలిసిన వాళ్ళు ఆ యాత్రలు ప్రమాదకరమని భయపెట్టారు. ఆ సమయంలో మేము ఎదుర్కొంటున్న సమస్యలను భరించటం కన్నా ఆ యాత్రలు చేయటం మాకు కష్టమనిపించలేదు.


మేము ఈ యాత్ర విషయం చెప్పినప్పుడు మా పెద్దవాళ్ళు మొదట్లో భయపడ్డారు....... ( వెళ్ళవద్దని చెప్పినా మేము వినముకదా..... ) మాకూ భయం ఉన్నా, ఈ రోజుల్లో ప్రమాదం ఎక్కడ లేదు........ అని సర్దిచెప్పుకుని భయంవేసినప్పుడు దైవాన్ని తలచుకొని ధైర్యాన్ని తెచ్చుకోవటం జరిగింది.


మొత్తానికి ఆ భగవంతుని దయవల్ల క్షేమంగా యాత్ర చేసి తిరిగి వచ్చాము. మా పెద్దవాళ్ళు ఆ విషయం గురించి ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. మేము ఆ యాత్రలు చెయ్యటం గొప్పగా భావిస్తున్నారు.


అవన్నీ తలచుకొంటే ఇప్పుడు ఏమనిపిస్తుందంటేనండి, అలా సమస్యలు రావటం వల్లనే గదా ................... అంత గొప్పయాత్రలు చేయటం జరిగిందని, ............. అది మా అదృష్టమని ఇప్పుడు అనిపిస్తోంది.


ఎందుకంటే నేను ఈ జన్మలో ఎప్పుడూ ఆ యాత్రలు చేస్తానని కనీసం ఊహించలేదు. పరిస్థితులు అలా వచ్చాయి అంతే. అంతా భగవంతుని దయ.


ఈ సంఘటనల అనంతరం నేను జీవితాన్ని సరికొత్త కోణం నుంచి చూడటం నేర్చుకుంటున్నాను.

ఆ సమయంలో నాకు కష్టంగా అనిపించినా, కొన్ని నియమాలను పాటించి దైవపూజ చెయ్యటం వల్ల ఇప్పుడు రోజువారీ పనులలో ఒక క్రమశిక్షణ పాటించటాన్ని నేర్చుకుంటున్నాను. (ఇంతకూ ముందు
క్రమశిక్షణ లేదని కాదు .... మరికొంచెము పాటించటాన్ని నేర్చుకుంటున్నాను )


ఇంకా, నాలో ఎంతో మార్పు వచ్చింది.

ఈ విధంగా కష్టముల వల్ల కూడా మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి.

ఈ మధ్యన టి.వి లో పెద్దలు చెప్పినట్లు ఎప్పుడైనా కష్టములు వచ్చాయని భయపడకూడదు. భగవంతుని నమ్మి ధర్మకార్యములు చేస్తూ ఉంటే పరిష్కారమార్గం తప్పక లభిస్తుంది.

 

No comments:

Post a Comment