koodali

Thursday, July 19, 2018

శ్రీ మద్రామాయణము..సుఖాంతము..


 ఓం..వందనములు. 

 సీతారాములకు వందనములు. 

 సువర్చలాదేవీఅంజనేయస్వామి వార్లకు వందనములు. 

.......................
  వాల్మీకిరామాయణంలో..  ఆంజనేయస్వామి లంకకు వెళ్లి సీతాదేవిని చూడటం, శ్రీ రాముడు రావణసంహారం చేసిన తరువాత సీతారాములు తిరిగి అయోధ్యకు రావటం .. శ్రీరామపట్టాభిషేకం..  కధ సుఖాంతం అయింది.

.....................
 
   గాయత్రీదేవి రామాయణం లో..   కొందరు అన్న మాటల వల్ల  సీతాదేవిని అడవులకు పంపే విషయం గురించి  శ్లోకాలు లేవు కానీ,

  వాల్మీకి ఆశ్రమంలో సీతాదేవి కవలలకు  జన్మనివ్వటం గురించి శ్లోకం 
ఉన్నదట..

........................

తులసీదాసు గారు రచించిన రామాయణంలో కుశలవులు జన్మించటం గురించి ఉంది కానీ,  సీతాదేవి  భూప్రవేశం  గురించి లేదట.

.................................

ఉత్తరకాండ  ప్రక్షిప్తం అని కొందరు భావిస్తున్నారు.
ఉత్తరకాండ ప్రక్షిప్తమో? కాదో ? కొన్ని భాగాలు ప్రక్షిప్తమో?..ఈ విషయాలు తెలియవు  కానీ..

ఈ విషయాలను గమనిస్తే.. బహుశా ఈ విధంగా కూడా జరిగిఉండవచ్చు కదా ...అనిపించింది.....
  ఇక్కడ రెండు అభిప్రాయాలను అనుకోవచ్చు..

 కొందరు అన్న మాటల వల్ల , శ్రీరాముడు సీతాదేవిని అడవులకు పంపడం కాకుండా, 

   గర్భిణి అయిన సీతాదేవి తనకు వనాలలో ఆశ్రమాలలో ఉన్న మహర్షుల దర్శనం చేసుకోవాలనే కోరిన కోరిక ప్రకారం సీతాదేవిని అడవులకు పంపి ఉండవచ్చు.

  వాల్మీకి మహర్షి   దశరధులవారి మిత్రులని తెలుస్తోంది. 

సీతాదేవి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆశ్రమంలోని స్త్రీలకోసం ఎన్నో బహుమతులను తీసుకెళ్ళటం జరిగిందట.

  స్త్రీలు మొదటి కాన్పుకు పుట్టింటికి వెళ్లినట్లు ,  సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలోనే ఉండి లవకుశులకు జన్మనిచ్చి ఉండవచ్చు.

 తరువాత,  సీతాదేవి కుశిలవులను  తీసుకుని శ్రీరాముని వద్దకు వచ్చి ఉండవచ్చని ..

 11వేల సంవత్సరాల రాజ్యపాలన తరువాత కుశలవులకు రాజ్యాలను ఏర్పరిచి సీతారాములు అవతారాలను చాలించారు...  అనేది ఒక సుఖాంతం.

.........................
 
 ఇక రెండో అభిప్రాయం ప్రకారం..ఇప్పుడు ఉత్తరకాండలో ఉన్నట్లు ..

 కొందరు వేసిన నిందల వల్ల సీతాదేవిని వనాలకు పంపటం   జరిగింది.  ..

 వాల్మీకి వారి ఆశ్రమంలో  కవలల  జననం తరువాత..

 కొంతకాలానికి వారిని వెంటబెట్టుకుని వాల్మీకి మహర్షి అయోధ్యకు రావటం..లవకుశుల రామాయణగానం..
తరువాత.. 

 వాల్మీకి మహర్షి   అంతటి మహిమాన్వితులు, గొప్ప తపస్సంపన్నులు .. సీతాదేవి  ఉత్తమురాలు, మహాపతివ్రత..   అని సభాసదులందరి ముందు ప్రకటించటం జరిగినప్పుడు..

ఆ  విషయాన్ని విన్న ప్రజలు , సీతాదేవి  రాముని వద్ద  ఉండాలని ప్రజలు వేడుకోవలసి ఉంటుంది.   

 రాములవారికి సీతాదేవి గురించి ఎప్పుడూ సమస్య లేదు. కొందరు ప్రజలతో  సమస్య.

  వాల్మీకి వారి మాటలతో ప్రజలకు సందేహం  తీరాలి.

 ఇక, సీతాదేవి భూప్రవేశం సంఘటన ఉండదు. సీతారాములు తమ ఇంట్లో ఉంటారు.

  11వేల రామరాజ్యపాలన తరువాత రాజ్యాలను పిల్లలకు అప్పగించి సీతారాములు అవతారాలను చాలించటం..  అనేది ఇంకో సుఖాంతం.

 ఇక్కడ కధ మధ్యలో  సీత భూప్రవేశం అనేది ప్రక్షిప్తం కావచ్చని నేను భావించాను.

.................................

వాల్మీకిరామాయణంలో..   ఆంజనేయస్వామి లంకకు వెళ్లి సీతాదేవిని చూడటం, శ్రీ రాముడు రావణసంహారం చేసిన తరువాత సీతారాములు తిరిగి అయోధ్యకు రావటం .. శ్రీరామపట్టాభిషేకం..  కధ సుఖాంతం అయింది.

.............................
 ఉత్తరకాండ నిజమని కొందరు, ప్రక్షిప్తమని కొందరు అంటున్నారు. 

 వ్యాసులవారు 24 వేలు శ్లోకాలు వ్రాసారు.

  అయితే, ఎవరైనా మూలగ్రంధంలోని  శ్లోకాలలోని కొన్ని విషయాలలో కొన్ని మార్పులుచేర్పులు చేసి ఉండవచ్చు కదా?

వాల్మీకి మహర్షి వ్రాసిన రామాయణం పట్టాభిషేకంతో ముగిసిందని.. ఉత్తరరామాయణం ప్రక్షిప్తం అని.. కాదని.. కొన్ని భాగాలు ప్రక్షిప్తాలు కావచ్చని ..లోకంలో రకరకాల  అభిప్రాయాలున్నాయి.

  వివిధరకాల అభిప్రాయాలు  ఉండటానికి కొన్ని కారణాలు ఉండవచ్చు. 

  లోకంలోని స్త్రీలు, పురుషులను గమనిస్తే, రకరకాల మనస్తత్వాలు కలవారు ఉంటారు.  వివిధరకాల సంఘటనలు కూడా ఉంటాయి.

ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని..భవిష్యత్తులో ప్రజలు తమ జీవితాలలో జరిగే సంఘటనల యొక్క పరిస్థితిని బట్టి  నిర్ణయం తీసుకోవటానికి ..వివిధరకాల అభిప్రాయాలు  వచ్చి ఉండవచ్చు.
.......................
 
 నాకు తెలిసిన విషయాలు తక్కువ.

 అసలు విషయం దైవానికి తెలియాలి.

 అంతా దైవం దయ.
.........................
 
 వ్రాసిన విషయాలలో  ఏమైనా పొరపాట్లు ఉంటే, అవి నేను చేసినవి గాను, ఒప్పులను భగవంతుని దయగాను పాఠకులు గ్రహించవలెనని నా మనవి.

 వ్రాసిన  విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయ చేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 


1 comment:

  1. నాకు తోచిన విషయాలను వ్రాసుకున్నాను. ఇప్పుడు ఈ విషయాలపై చర్చించాలని అనుకోవటం లేదు. దయచేసి కామెంట్స్ వ్రాయవద్దని కోరుతున్నానండి.

    ReplyDelete