koodali

Saturday, November 11, 2017

ఇలాంటి నీరు , పాలు, పండ్లరసాలు తో ...


స్వచ్ఛంగా లేని  నీరు , పాలు, పండ్లరసాలు తో చేసే అభిషేకాల వల్ల..   శివలింగముల రూపు మారే ప్రమాదం ఉన్నట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి.

 అభిషేకాలకు వాడే నీరు, పాలు, పండ్లరసాలు, పన్నీరు...ఇలా  ఎన్నో పదార్ధాలలో హానికారక రసాయనాలు కలిసే అవకాశం ఉంది.


కొన్ని నెలలు నిల్వ ఉండే విధంగా తయారుచేసిన పాలప్యాకెట్లను కూడా అభిషేకాలకు వాడుతున్నారు.


అన్నాభిషేకాలు కూడా చేస్తున్నారు. ఇందుకు వేడి అన్నం ఉపయోగిస్తారో లేక ఆరబెట్టిన తరువాత వాడతారో తెలియదు.


ఈ రోజుల్లో ఎన్నో పదార్ధాలు కల్తీకి గురవుతున్నాయి.
హానికారక రసాయనపదార్ధాలతో పెరుగుతున్న పంటల ఉత్పత్తుల వల్ల కూడా హాని కలుగుతుంది.


ఇవన్నీ గమనిస్తే,  గత కొద్దికాలంగా పర్యావరణం మరియు పదార్ధాలలో వచ్చిన మార్పు స్పష్టంగా తెలుస్తుంది. 


ఈ మధ్య  కాన్సర్, కిడ్నీ, లివర్..వంటి రోగాలు బాగా పెరిగాయి. కొంతకాలం క్రిందట  ఇన్ని రోగాలు లేవు. 


ఇప్పుడు ఊరూరా పార్కులలా కిడ్నీ సెంటర్లు  ఏర్పాటు చేయవలసి వస్తోంది.


ఇలాంటి ..నీరు, పాలు, పండ్లరసాలు..వంటి వాటివల్ల శివలింగాలు  రూపుమారే సూచనలు కనిపిస్తుంటే ...


ఇలాంటి  నీరు , పాలు, పండ్లరసాలు వాడే  మనుషుల్లో  కిడ్నీ వంటి అవయవాలు పాడైపోతున్నాయంటే ఆశ్చర్యం ఏమీ లేదు.

 ఇప్పటికైనా అందరూ సీరియస్ గా ఆలోచించి పర్యావరణాన్ని బాగుచేసుకునే ప్రయత్నాలు చేయవలసి ఉంది.


********************

ఆధునికకాలంలో  మనం వాడే అనేక 
హానికారక రసాయనాలు  గాలిలో, నీటిలో, భూమిలో  కలుస్తున్నాయి.

తద్వారా గాలి, నీరు, భూమిద్వారా పండే పంటలు అన్నింటిలో
హానికారక రసాయనాలు చేరిపోతున్నాయి.

 ఎన్నో జీవజాతులు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. మనుషులకు  రోగాలు ఎక్కువయ్యాయి.


ఇప్పటికైనా మనుషులు తాము చేస్తున్న తప్పులను సరిదిద్దుకోకుంటే... కనుమరుగయ్యే జీవజాతిలో మనుషులు కూడా చేరటం ఎంతో దూరంలో లేకపోవచ్చు.


పర్యావరణాన్ని కాపాడాలి. స్వచ్చమైన పదార్ధాలతో శివలింగాలకు అభిషేకాలు చేయాలి, జీవజాతులను కాపాడాలి, ఆరోగ్యాలను కాపాడుకోవాలి.


పర్యావరణాన్ని ఎంతగా పాడుచేస్తున్నామో  దైవం  హెచ్చరికలు చేస్తున్నారు. 


పర్యావరణానికి మేలు చేయటం అంటే..  దైవానికి పూజ చేయటము .

No comments:

Post a Comment