koodali

Friday, October 20, 2017

కొన్ని సంఘటనలను రాస్తాను. ..

 కొందరు పేరెంట్స్ పిల్లలపై మోయలేని భారాన్ని వేస్తున్నారనేది నిజం. ఇలా అనటం వల్ల కొందరికి బాధ కలగవచ్చు. 

కొన్ని సంఘటనలను రాస్తాను. 


మా పిల్లల చిన్నతనంలో పేరెంట్స్ మీటింగ్ కు వెళ్ళినప్పుడు ఒక సంఘటన జరిగింది. 


ఒక బాబుకు 90 కన్నా కొంచెం ఎక్కువ మార్కులే వచ్చాయి.


 అయితే, 99 శాతం వరకు రాలేదని ఆగ్రహించిన బాబు తల్లి, పిల్లవాడిని అందరిముందు చెంప దెబ్బ కొట్టింది. 


పేరెంట్స్  ఇలా చేయటం సరైనది కాదు. చిన్న పిల్లలకు మార్కుల ప్రాముఖ్యత గురించి ఏం తెలుస్తుంది.


 పిల్లలను మందలించటం,  కొట్టడం  పిల్లల మంచి కొరకే, వారికీ బాధ్యత నేర్పటం కొరకే  .. అని కొందరు పెద్దవాళ్ళు అంటారు. 


పెద్దవాళ్ళను  తిట్టి,  కొడితే తేలిగ్గా తీసుకుంటారా?  


బాధ్యతలు నేర్పటానికి  ఒక పద్ధతి ఉంటుంది. 


అంతేకానీ, పిల్లల పట్ల నిరంకుశత్వంగా ప్రవర్తించటం సరైనది కాదు.

1.ఉదా.. ఇంట్లో ఏదైనా పని బాధ్యతగా చేయలేదని భర్త భార్యను మందలించి, ఒక చెంపదెబ్బ కొడితే భార్యకు చాలా బాధ కలుగుతుంది. 


భర్తపై కోపం కూడా వస్తుంది. విషయం మహిళా హక్కుల గురించి మాట్లాడే వరకూ వెళ్ళే అవకాశం కూడా ఉంది. 


భార్యను మందలించటం ఆమె మంచికొరకే , ఆమెకు మరింతగా బాధ్యత మరియు పనిలో మెళకువలు  నేర్పటం కోసమే..అని భర్త అంటే ఊరుకుంటారా?


బలహీనులను బలవంతులు అణచివేయకూడదంటూ మాట్లాడతారు.


2.ఉదా.. ఆఫీసులో ఏదైనా పని బాధ్యతగా చేయలేదని మగవారిని పై ఆఫీసర్ మందలించి , చెంపదెబ్బ కొడితే అతనికి చాలా బాధకలుగుతుంది.


 పై ఆఫీసర్ పై కోపం కూడా వస్తుంది. విషయం హక్కుల గురించి మాట్లాడే వరకూ వెళ్ళే అవకాశం కూడా ఉంది.


  ఆఫీసులో మగవారిని మందలించటం అతని మంచికొరకే ,  అతనికి మరింతగా 
బాధ్యత మరియు పనిలో మెళకువలు నేర్పటం కోసమే..అని పై ఆఫీసర్ అంటే ఊరుకుంటారా?

మరి, లోకజ్ఞానం తెలిసిన పెద్దవాళ్లు తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించకపోయినా.. గట్టిగా నిలదీసే హక్కు ఎవరికీ లేదంటున్నప్పుడు, 


. లోకజ్ఞానం సరిగ్గా తెలియని పిల్లల పట్ల నిరంకుశత్వంగా ప్రవర్తించటం ఎంతవరకు సమంజసం? 


బలహీనులను బలవంతులు అణచివేయకూడదన్నప్పుడు,   పిల్లల పట్ల కూడా కఠినంగా ప్రవర్తించకూడదు కదా! 


****************

 మరి కొందరు తల్లితండ్రులు ఎలా ప్రవర్తిస్తారంటే, పిల్లల పట్ల భేదభావాన్ని చూపిస్తారు. 


ఉదా..తల్లికి తన పిల్లలలో ఒకరంటే ఎక్కువ ఇష్టం, మరొకరంటే కొంత తక్కువ ఇష్టం , తండ్రికి తన పిల్లలలో ఒకరంటే ఎక్కువ ఇష్టం, మరొకరంటే కొంత తక్కువ ఇష్టం అన్నట్లు ప్రవర్తిస్తారు. 


కొందరు తాతబామ్మలు కూడా పిల్లల పట్ల వ్యత్యాసాలను చూపిస్తుంటారు.


 ఇలాంటి విషయాలు పిల్లలను చాలా బాధకు గురి చేస్తాయి.


 ఒక పిల్ల పుట్టిన తరువాతే నాకు బాగా కలిసివచ్చిందని .. కొందరు పేరెంట్స్ ఇతరులతో చెపుతుంటే వింటున్న  మిగిలిన పిల్లలకు మనస్సు చాలా బాధగా ఉంటుంది. 


తనంటే తన పేరెంట్స్ కు అంత ఇష్టం లేదు కాబోలు అనుకుంటారు.


పిల్లల పట్ల పక్షపాతంగా ప్రవర్తించకూడదు.

..................................
 mari konni vishayalu///
 
మహాభారతయుద్ధంలో అర్జునునికి ఏంచేయాలో తెలియని సంకటపరిస్థితి ఏర్పడింది. చిన్నతనం నుంచి తనను ఆప్యాయంగా చూసిన తాతగారైన బీష్మునికి, తనకు విద్య నేర్పించిన గురువుకు, మరికొందరు బంధువులకు..   ఎదురుగా యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది.

తాను యుద్ధం చేయలేనని అన్న అర్జునుని దగ్గరుండి నడిపించారు శ్రీకృష్ణుల వారు. సమాజంలో ధర్మం కోసం పనిచేయక తప్పదని తెలియచేసారు.భీష్ములవారు..మొదలై
న పెద్దలకు పాండవులంటే ఎంతో ఇష్టం. అయినా ఎందుకో పాండవులకు ఎదురుగా యుద్ధరంగంలో నిలబడ్డారు. అందుకు వారి కారణాలు వారికి ఉండవచ్చు.


జీవితంలో చాలామందికి కొన్నిసార్లు పరీక్షా సమయాలు ఎదురవుతాయి. తమ గురువులకు, పెద్దవాళ్ళకు, బంధువులకు, స్నేహితులకు.. వ్యతిరేకంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏం చేయాలో దిక్కు తోచదు.

శ్రీకృష్ణులవారు అర్జునునిగా తోడుగా ఉన్నట్లు, మనుషులు కూడా తమకు తోడుగా ఉండి నడిపించమని దైవాన్ని ప్రార్ధించుకోవాలి.జీవితంలో సరైన విధంగా ప్రవర్తించేలా సాయం చేయమని దైవాన్ని ప్రార్ధించుకోవాలి.
 

No comments:

Post a Comment