గోళీల ఆట, కర్రబిళ్ళ, తొక్కుడుబిళ్ల ఆట, పరిగెత్తి పట్టుకునే ఆట..ఇలా ఎన్నో ఉండేవి.
పిల్లలు అందరూ చక్కటి కధలు చెప్పుకునేవారు. వెన్నెల్లో ఆడుకునేవారు.
ఈ రోజుల్లో ఎక్కువకాలం నాలుగుగోడల మధ్యే ఎక్కువ కాలం గడచిపోతోంది.
కొద్దిగా విరామం దొరికితే వీడియో గేంస్, టీవీ చూడటం వంటివి చేస్తున్నారు.
వారాంతాన షాపింగ్ మాల్స్ వెళ్ళటం , సినిమాకు వెళ్ళటం వంటివి గొప్ప కాలక్షేపంలా అయిపోయింది.
అంతేకానీ ప్రకృతి మధ్య గడపటం తక్కువగా ఉంటోంది.
ఈ రోజుల్లో వెన్నెల అంటే తెలియని వాళ్లు ఎందరో ఉన్నారు.
అపార్ట్మెంట్స్ వచ్చాక ఆరుబయట గడపటమే తక్కువగా ఉంది.
ఆరుబయట ఆకాశంలో నక్షత్రాలను చూడటం ..ఇవన్నీ గతకాలపు ముచ్చట్లు అయ్యాయి.
ఆరుబయట గాలివల్ల కలిగే లాభాలు ఏసి గాలి వల్ల రావు.
ప్రకృతిసిద్ధంగా లభించేవాటి వల్ల ఎన్నో లాభాలున్నాయి.
ప్రకృతికి దూరం కావటం మంచిది కాదు.
పాతకాలం వాళ్లలో చాలామందికి తమ బాల్యం గురించి చెప్పుకోవటానికి ఎన్నో ముచ్చట్లు ఉండేవి.
**************
ప్రపంచంలో ప్రజలు కొందరు నూరేళ్ళు ఆరోగ్యంగా చక్కగా జీవిస్తున్నారట..వారిని పరిశీలిస్తే ..వాళ్లు రోజులో చాలా భాగం ఆరుబయట పనిచేసుకుంటారట. పొల్యూషన్ లేకుండా పర్యావరణం బాగుండి, శుభ్రమైన నీరు, గాలి, ఆహారం ఉంటుంది కావచ్చు.
వారు..డబ్బు, సంపద, అధికారం కొరకు ఆరాటం లేకుండా జీవిస్తారు కావచ్చు... చక్కగా సులభంగా..హాయిగా దైవాన్ని ప్రార్ధించుకుంటారు కావచ్చు....పంతాలు, పట్టింపులు, కుల, మత, ప్రాంతీయ గొడవలు లేకుండా హాయిగా, సహజంగా జీవిస్తారు కావచ్చు....
అందరూ నా మాటే వినాలని పట్టుదలలు, అధికారం కావాలని, బోలెడు డబ్బు సంపాదించాలని, బోలెడు వస్తువులు కొనాలని, కెరీర్లో ఎక్కడికో వెళ్ళిపోవాలని..ఇలా వారు తాపత్రయపడరేమో?
************
ప్రాచీన సనాతన భారతదేశంలో నైతికవిలువలతో కూడిన చక్కటి జీవనవిధానముండేది. చాలామంది వంద సంవత్సరాల పైన ఆరోగ్యంగా, చక్కగా జీవించేవారు. ఈ మధ్య కాలంలో కూడా యోగులు కొందరు, కొన్ని వందల ఏళ్లు జీవించిన ఆధారాలున్నాయి.
No comments:
Post a Comment