koodali

Wednesday, July 19, 2017

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లి మొదలైన భవనాలకు డిజైన్లు...

  
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లి మొదలైన భవనాలకు డిజైన్లు సిద్ధం చేస్తున్నారంటూ ఈ మధ్య  వార్తలు వస్తున్నాయి. 

అసెంబ్లి భవనాలకు కోహినూర్ వజ్రం ఆకారంలో డిజైన్లు సిద్ధం చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

 కోహినూర్ వజ్రం గురించి రకరకాల కధనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ వజ్రం మగవారి వద్ద ఉంటే వారికి నష్టం కలిగిస్తుందని, స్త్రీల వద్ద ఉంటే లాభం కలిగిస్తుందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. 

స్త్రీల విషయంలో కూడా లాభమా? నష్టమా? అనేది చెప్పలేము.

 బ్రిటిష్ వారు కూడా క్రమంగా తమ ప్రపంచ ఆధిపత్యాన్ని కోల్పోయారు కదా! ఈ వజ్రం గురించి సరైన విషయాలు మనకు తెలియదు.

ఎందుకయినా మంచిది ..ఈ వజ్రం ఆకారం కాకుండా ఇంకో డిజైన్ మార్చటం మంచిదని  నాకు తెలిసినంతలో అనిపిస్తోంది.

 ఇప్పటికే డిజైన్ల మార్పులు చేర్పులతో చాలా సమయం గడిచింది. 


అయితే, కోహినూర్ వజ్రం ఆకారం అని కాకుండా ....ఒక వజ్రం ఆకారంలో కానీ, చతురస్రాకార డిజైన్లు కానీ, లేక మరేదైనా ఆకారంలో కానీ నిర్మాణం చేయవచ్చేమో..పెద్దవాళ్లు ఆలోచించటం  మంచిది.


డిజైన్లను త్వరగా సెలెక్ట్ చేసి, కట్టడం కొంత సమయం పట్టినా.. పటిష్టంగా నిర్మిస్తే బాగుంటుంది.

. అందరి సలహాలు తీసుకోవాలి అనుకుంటూ ఉంటే రకరకాల అభిప్రాయల వల్ల పరిస్థితి మరింత గందరగోళంగా అనిపించవచ్చు. 

ఏం చేయాలో తెలియనప్పుడు దైవంపై భారం వేసి నిర్ణయం తీసుకుని ముందుకువెళ్ళటం మంచిది. 


No comments:

Post a Comment